order
-
మస్క్కు మరింత పవర్ ఇచ్చిన ట్రంప్.. ఉద్యోగులే టార్గెట్
వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై వేటు వేసే బాధ్యతను ఎలోన్ మస్క్ చేతికి అప్పగించారు. ఫెడరల్ వర్క్ ఫోర్స్ను మరింతగా కుదించేందుకు ఎలోన్ మస్క్ నేతృత్వంలోని ప్రభుత్వ సామర్థ్య శాఖ (డోజ్)కు అధికారాలు కల్పించారు. దీనికి సంబంధించిన కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఓవల్ కార్యాలయంలో టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్తో పాటు అతని నాలుగేళ్ల కుమారుని సమక్షంలో ఈ సంతకాల కార్యక్రమం జరిగింది. PRESIDENT TRUMP: "I can't imagine a judge saying you got elected to look over the country and make America great again, but you don't have the right to look and see whether or not things are right that they are paying or that things are honest." pic.twitter.com/gUBlUJ0FLY— Rapid Response 47 (@RapidResponse47) February 11, 2025వైట్ హౌస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు.. ఫెడరల్ వర్క్ ఫోర్స్ను పరిమితం చేసేందుకు ఉద్దేశించినది. ఈ విషయంలో డోజ్ ప్రభుత్వ ఉద్యోగులతో సంప్రదింపులు జరపాలని, పెద్ద ఎత్తున ఉద్యోగుల తగ్గింపునకు ప్రణాళికలు చేపట్టాలని, అవసరమైన స్థానాలలోని సిబ్బందిని మాత్రమే పరిమితం చేయాలని దానిలో ఆదేశించారు.ఈ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ డోజ్ పని తీరును ప్రశంసించారు. ఇది చట్టం పరిధిలో పనిచేస్తుందా లేదా అనే విషయంలో పలు విమర్శలు ఉన్నప్పటికీ టెస్లా సీఈఓ మస్క్ ప్రభుత్వానికి సంబంధించిన మరిన్ని పనులు చేయాలని తాను కోరుకుంటున్నానన్నారు. దేశాభివృద్ధికి బాధ్యత వహించే వ్యక్తి , తనకు అన్ని విషయాలు నివేదించే వ్యక్తి ఈ పని చేసేందుకు సమర్థులని భావిస్తున్నానని అన్నారు. అమెరికాను అభివృద్ధి పథాన తీసుకువెళ్లేందుకే తాను ఎంపికయ్యాయని ఒక న్యాయమూర్తి చెప్పడం ఎన్నటికీ మరువలేనిదని ట్రంప్ పేర్కొన్నారు.‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే అక్షరాలు కలిగిన టోపీని ధరించిన మస్క్ మాట్లాడుతూ ప్రభుత్వానికి స్వయంప్రతిపత్తి కలిగిన సమాఖ్య బ్యూరోక్రసీ లేదని, అందుకే ప్రజల తరపున ప్రతిస్పందించే వ్యక్తి అండగా ఉండాలన్నారు. ప్రజలచేత ఎన్నిక కాని అధికారిగా తన పాత్రను సమర్థించుకున్న మస్క్ అమెరికా ప్రభుత్వంలోని వివిధ విభాగాలను తగ్గించే అధికారాన్ని అధ్యక్షుడు తనకు మంజూరు చేశారన్నారు. బ్యూరోక్రసీలో లక్షల డాలర్ల జీతం కలిగిన సిబ్బంది ఉండటం వింతగా ఉందని మస్క్ వ్యాఖ్యానించారు.That was one of the most incredible political press conferences I’ve ever seen.Trump + Elon standing in the Oval Office, telling the American people directly what they are doing… basic financial management of our out of control spending.“This isn’t optional, it’s essential.” pic.twitter.com/DDSGVjnQtW— Geiger Capital (@Geiger_Capital) February 11, 2025తాను ట్రంప్తో దాదాపు ప్రతిరోజూ మాట్లాడుతుంటానని ప్రభుత్వంలోని అవినీతిని గుర్తించి, అనవసరఖర్చులకు తగ్గించేందుకు ప్రయత్నిస్తానన్నారు. కాగా మస్క్ విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అతని కుమారుడు లిటిల్ ఎక్స్ తండ్రి చేయి పట్టుకుని, అతనికి కాస్త ఇబ్బంది కలిగించాడు. గతంలో లిటిల్ ఎక్స్కు సంబంధించిన పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇది కూడా చదవండి: నేడు రాష్ట్రపతి భవన్లో తొలి పెళ్లి బాజాలు.. వివాహం ఎవరికంటే.. -
కాలాహరిధాన్ ట్రెండ్జ్పై సెబీ కొరడా
న్యూఢిల్లీ: ఇటీవలే ఎన్ఎస్ఈ ఎస్ఎంఈ(NSE SME) ప్లాట్ఫాం ఎమర్జ్లో లిస్టయిన కాలాహరిధాన్ ట్రెండ్జ్పై (KTL) నిబంధనల ఉల్లంఘనకుగాను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టాక్ మార్కెట్ కార్యకలాపాల్లో పాల్గొనరాదంటూ కంపెనీతో పాటు ప్రమోటర్లు నిరంజన్ డి అగర్వాల్, ఆదిత్య ఎన్ అగర్వాల్, సునీత నిరంజన్ అగర్వాల్ను ఆదేశించింది. అలాగే వారిని పూర్తిగా నిషేధిస్తూ ఎందుకు ఉత్తర్వులు ఇవ్వరాదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేసింది.క్రెడిట్ కార్డు బకాయిలను చెల్లించడంలో విఫలమైందంటూ కేటీఎల్పై హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి ఫిర్యాదు రావడంతో సెబీ ఈ వ్యవహారంపై విచారణ జరిపింది. 2024 ఫిబ్రవరి నుంచి డిసెంబర్ 15 వరకు సాగిన విచారణలో.. ఈ డిఫాల్ట్ వివరాలను కంపెనీ వెల్లడించకుండా డిస్క్లోజర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించింది. పైగా బంగ్లాదేశ్లోని ఒక కల్పిత సంస్థ నుంచి భారీ ఆర్డరు వచ్చిందని, పెద్ద ఎత్తున కార్యకలాపాలు విస్తరిస్తున్నామని తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేసిందని మధ్యంతర ఉత్తర్వుల్లో సెబీ పేర్కొంది. దీన్ని కప్పి పుచ్చేందుకు ఈమెయిల్స్ సృష్టించినట్లు వివరించింది.ఇదీ చదవండి: మార్కెట్లోకి కొత్త ఐపీవోలుమొత్తం మీద కంపెనీపై సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరచి షేర్లలో ట్రేడ్ చేసేలా ఇన్వెస్టర్లను పురిగొల్పి, షేర్లను అమ్ముకుని లబ్ధి పొందేందుకే కేటీఎల్ నిర్దిష్ట కార్పొరేట్ ప్రకటనలను చేసినట్లు సెబీ పేర్కొంది. పైపెచ్చు రైట్స్ ఇష్యూ ద్వారా మరో విడత నిధుల సమీకరణ కూడా కంపెనీ తలపెట్టింది. ఈ నేపథ్యంలోనే సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. గతేడాది ఫిబ్రవరి 23న ఇష్యూ ధర రూ.45తో పోలిస్తే రూ.47.15 వద్ద లిస్టయిన కేటీఎల్ షేరు ప్రస్తుతం రూ.20 స్థాయిలో ఉంది. -
Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
అమెరికాలో గ్రీన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ టెకీలు, ఇతరులకు భారీ ఉపశమనం లభించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ అమలు చేయాలని చూస్తున్న పుట్టుకతో పౌరసత్వం (Birthright Citizenship) రద్దుకు సంబంధించిన ఆదేశాలకు మరో సారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మేరీల్యాండ్లోని ఒక ఫెడరల్ న్యాయమూర్తి ఆటోమేటిక్ జన్మహక్కు పౌరసత్వాన్ని నిరవధికంగా పరిమితం చేయాలనే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యను అడ్డుకున్నారు. అమెరికా పౌరసత్వం జీవితం.. స్వేచ్ఛ కంటే తక్కువ విలువైన హక్కు కాదు అంటూ జన్మతః పౌరసత్వాన్ని పరిమితం చేయాలన్న ఆర్డర్ను నిరవధికంగా నిలిపివేశారు. ఈ ఆదేశాల అమలుపై దేశవ్యాప్తంగా నిషేధం విధించారు. ఈ ఉత్తర్వు ఫిబ్రవరి 19 నుండి అమలులోకి రానుంది.ట్రంప్ బాధ్యతలు చేపట్టి, తొలి రోజున సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయని అమెరికా జిల్లా న్యాయమూర్తి డెబోరా బోర్డ్మన్ బుధవారం తీర్పు ఇచ్చారు. 14వ సవరణపై ట్రంప్ పరిపాలన అందిస్తున్న వివరణను అమెరికాలోని ఏ కోర్టు కూడా ఆమోదించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ఆదేశం దేశవ్యాప్తంగా వర్తిస్తుందనీ కేసు కొనసాగే వరకు అమలులో ఉంటుందని ఈ ఆర్డర్ స్పష్టంగా రాజ్యాంగ విరుద్ధమని అభివర్ణించారు. అమెరికా పౌరసత్వాన్ని ఆ నేలపై పుట్టిన వారికి అందించటం అత్యంత విలువైన హక్కుగా పేర్కొన్నారు. దీంతో వలసలను అడ్డుకోవాలనే ఆలోచనలో భాగంగా 125 ఏళ్ల నుంచి అమల్లో ఉన్న చట్టాన్ని రద్దు చేయాలన్న ట్రంప్ ప్రణాళికలకు ఈ తీర్పు మరొక చట్టపరమైన దెబ్బ.కాగా బర్త్రేట్ సిటిజిన్ షిప్ ఆర్డర్ జారీ చేసిన నాటి నుంచి, ఎన్ఆర్ఐలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా అక్రమ వలసదారులను సైనిక విమానాల్లో సంకెళ్లతో తరలించడం లాంటి అనేక కఠిన నిర్ణయాలు సగటు భారతీయుడికి నిద్రలేకుండా చేస్తున్నాయి. అంతేకాదు అమెరికాలో చదువుకోవటానికి వెళ్లిన విద్యార్థులు సైతం తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్లిపోనున్నారనే భయాలు వెంటాడుతున్నాయి.Birthright Citizenship అంటే ఏంటి?అంతర్యుద్ధం తరువాత మాజీ బానిసలు, ఆఫ్రికన్ అమెరికన్లకు పౌరసత్వం కల్పించడానికి 14వ సవరణ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం అమెరికా గడ్డపై పుట్టిన ప్రతీ బిడ్డకు ఆటోమెటిక్గా యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ తల్లిదండ్రులకు అమెరికాలో జన్మించిన వారు సైతం ఈ నిబంధన కింద జన్మహక్కు పౌరసత్వాన్ని పొందుతారని రాజ్యాంగ సవరణ వెల్లడిస్తుంది. అయితే దీన్ని రద్దు చేస్తే ట్రంప్ జారీ చేసిన ఆర్డర్ ప్రకారం అమెరికా పౌరులు కాని వ్యక్తులు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసితులు కాని తల్లిదండ్రులకు జన్మించిన పిల్లలను ఇకపై పుట్టుకతోనే అమెరికా పౌరులుగా పరిగణించరు. ఈ నిర్ణయం ప్రధానంగా భారత్ నుంచి అమెరికా వలస వెళ్లిన కుటుంబాలపై ప్రభావం చూపుతుందని భావించారు. ముఖ్యంగా H-1B వీసా హోల్డర్లు వంటి చట్టబద్ధమైన తాత్కాలిక నివాసితులు కూడా తమ పిల్లలకు ఆటోమేటిక్ పౌరసత్వం కోల్పోతారనే ఆందోళనలో పడిపోయారు. ప్రస్తుతానికి దీనికి బ్రేక్లు పడినట్టే.ఈ ఉత్తర్వుల ద్వారా భారీ ఊరట లభించేది వీరికేH-1B (వర్క్ వీసాలు)H-4 (డిపెండెంట్ వీసాలు)L (ఇంట్రా-కంపెనీ బదిలీలు)F (స్టూడెంట్ వీసాలు) ఇదీ చదవండి: నీతా అంబానీకి ముఖేష్ అంబానీ సర్ప్రైజ్ గిప్ట్ -
New Year 2025: మనీ ఆర్డర్ పుట్టిన వేళ.. గ్రామగ్రామాన సంబరాలు
‘ట్రింగ్.. ట్రింగ్ ’ అని బెల్ మోగిస్తూ ఒక పోస్ట్మ్యాన్ ఆ కుగ్రామంలోనికి సైకిల్ మీద వచ్చాడు. ఒక ఇంటి ముందు ఆగిన ఆయన.. ‘కమలా.. పట్నం నుంచి నీ భర్త మనీ ఆర్డర్ పంపించాడు’ అని పెద్దగా చెప్పాడు. వెంటనే ఆమె ఇంటిలో నుంచి బయటకు వచ్చి.. ‘సారూ మా ఆయన ఎంత పంపించాడు?’ అని అడిగింది. దీనికి ఆయన 250 రూపాయలు అని చెబుతూ, ఆ మెత్తాన్ని ఆమె చేతిలో పెట్టి, తన దగ్గరున్న రిజిస్ట్రర్లో ఆమె చేత వేలిముద్ర వేయించుకున్నాడు’ఇది ఒకప్పటి కథ. నాటి తరం వారికి గుర్తుండే ఉంటుంది. పాత సినిమాల్లోనూ ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తాయి. నాడు పట్టణంలో ఉద్యోగం చేసే భర్త ప్రతినెలా పంపే డబ్బు కోసం భార్య ఎదురు చూసేది. ‘మనీ ఆర్టర్’ తీసుకుని పోస్ట్మ్యాన్ ఎప్పడు వస్తాడా అని మహిళలు ఇళ్ల ముందు కాపలా కాసేవారు.నేటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(Information Technology), ఇంటర్నెట్ యుగంలో ప్రపంచమంతా మన చేతుల్లోకి వచ్చిచేరింది. డబ్బుతో లావాదేవీలు చేసేందుకు ఈ-బ్యాంకింగ్తో పాటు, పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే మొదలైన యాప్లు మన మొబైల్లో అందుబాటులో ఉంటున్నాయి. నేడు మనం ఈ యాప్ల సాయంతో ప్రపంచంలోని ఏ మూలకైనా ఇన్స్టంట్గా డబ్బును పంపవచ్చు. అయితే మునుపటి కాలంలో డబ్బును పంపేందుకు మనీఆర్డర్ ఆధారంగా ఉండేది.ఉత్తరాల బట్వాడా కోసం భారత ప్రభుత్వం 1854లో పోస్టల్ శాఖను నెలకొల్పింది. ఇది జరిగిన 25 ఏళ్ల తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్ 1880, జనవరి ఒకటిన మనీ ఆర్డర్(Money order) సేవలను ప్రారంభించింది. దీని ద్వారా ఎవరైనా సరే తమ సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి డబ్బు జమ చేసి, వారు పంపించాలనుకుంటున్న చోటుకు నగదును పంపించవచ్చు. ఆ నగదు చేరాల్సిన పోస్టాఫీసు రాగానే, అక్కడి పోస్ట్మ్యాన్స్ సంబంధిత చిరునామాకు ఆ మొత్తాన్ని అందజేసేవాడు. నాటి కాలంలో పోస్టల్శాఖలో ఇదొక విప్లవం అని చెబుతుంటారు.మనీ ఆర్డర్ ద్వారా ఉత్తరాల మాదిరిగానే డబ్బును కూడా పంపగలగడం నాటి ప్రజలకు ఎంతో సౌకర్యంగా అనిపించింది. ఉపాధి కోసం నగరాల్లో ఉన్నవారికి.. గ్రామాల్లో ఉంటున్న వారి సంబంధీకులకు ఇదొక వారధిలా మారింది. అంతకుముందు వరకూ ఇతరులకు డబ్బు పంపడం అనేది పెద్ద సమస్యగా ఉండేది. అయితే మనీ ఆర్డర్ రాకతో ఈ సమస్యకు చెక్ పడింది. తొలినాళ్లలో పెళ్లి వేడుకలకు వెళ్లే అవకాశం లేనివారు నూతన దంపతులకు కానుకల రూపంలో మనీ ఆర్డర్ ద్వారా డబ్బును పంపేవారట.పోస్టల్శాఖ(Postal Department)లో మనీ ఆర్డర్ సేవ దశాబ్దాల కాలం పాటు సాగింది. ప్రజల నుంచి ఎంతో ఆదరణను కూడా పొందింది. అయితే కాలానుగుణంగా ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఇన్స్టంట్ పేమెంట్ యాప్లు రావడంతో మనీ ఆర్డర్కు ప్రాధాన్యత తగ్గింది. ఈ పరిణామాల దరిమిలా 2015లో ఇండియన్ పోస్ట్ మనీ ఆర్డర్ సేవలను నిలిపివేసింది. అయితే ఆ తరువాత పోస్టల్ శాఖ ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ (ఈఎంఓ), ఇన్స్టంట్ మనీ ఆర్డర్ (ఐఎంఓ)సేవలను ప్రారంభించింది. త్వరిత గతిన డబ్బును అందించేందుకు ఈ సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టంట్ మనీ ఆర్డర్ సర్వీస్ కింద రూ.1,000 నుండి రూ.50,000 వరకు నగదు బదిలీ చేసే సదుపాయం ఉంది. ఐఎంవో సదుపాయం కలిగిన ఏదైనా పోస్టాఫీసు నుండి, ఒక గుర్తింపు రుజువుతో పాటుగా ఇ-ఫారమ్ను పూరించి, ఇంటర్నెట్ ఆధారిత తక్షణ సేవ ద్వారా డబ్బును పంపవచ్చు. ఈ విధంగా నిర్దిష్ట పోస్టాఫీసుల నుండి మాత్రమే డబ్బును పంపేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా మనం ఎంతో ముందుకెళ్లినప్పటికీ, గతానికి సంబంధించిన అనేక విషయాలు మన మదిలో జ్ఞాపకాలుగా తారాడుతుంటాయి. మన ఇంట్లోని పెద్దలను అడిగితే, మనీ ఆర్డర్కు సంబంధించి వారికున్న అనుభవాలను చెబుతారు. ఇది కూడా చదవండి: ‘సరిహద్దులు’ దాటిన మరో ప్రేమకథ.. నూతన సంవత్సరంలో ఏమవునో.. -
టాటా మోటార్స్కు భారీ ఆర్డర్
వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్టీసీ) నుండి భారీ ఆర్డర్ను దక్కించుకుంది. ఇందులో భాగంగా యూపీఎస్ఆర్టీసీకి 1,297 బస్ ఛాసిస్లను కంపెనీ సరఫరా చేయనుంది. ఒక ఏడాదిలో యూపీఎస్ఆర్టీసీ నుండి ఆర్డర్ అందుకోవడం టాటా మోటార్స్కు ఇది మూడవది.మొత్తం ఆర్డర్ పరిమాణం 3,500 యూనిట్లకుపైమాటే. పోటీ ఈ–బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ఆర్డర్ గెలుచుకున్నట్టు టాటా మోటార్స్ తెలిపింది. పరస్పరం అంగీకరించిన నిబంధనల ప్రకారం బస్ ఛాసిస్లను దశలవారీగా డెలివరీ చేస్తామని వివరించింది. టాటా ఎల్పీవో 1618 డీజిల్ బస్ ఛాసిస్ నగరాల మధ్య, సుదూర ప్రయాణాల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేశారు.‘ఈ ఆర్డర్ మెరుగైన మొబిలిటీ పరిష్కారాలను అందించడంలో సంస్థ నిబద్ధతకు శక్తివంతమైన ధృవీకరణ. స్థిర పనితీరు, అభివృద్ధి చెందుతున్న యూపీఎస్ఆర్టీసీ రవాణా అవసరాలను తీర్చగల సామర్థ్యం.. ప్రజా రవాణా పర్యావరణ వ్యవస్థలో కంపెనీ సాంకేతిక నైపుణ్యం, విశ్వసనీయతను ప్రదర్శిస్తాయి’ అని టాటా మోటార్స్ వైస్ ప్రెసిడెంట్, కమర్షియల్ ప్యాసింజర్ వెహికల్స్ బిజినెస్ హెడ్ ఎస్.ఆనంద్ తెలిపారు.టాటా ఎల్పీవో 1618 బస్టాటా ఎల్పీవో 1618 డీజిల్ బస్సు బీఎస్-6 నిబంధనలకు అనుగుణంగా తయారైంది. ఇందులోని కమ్మిన్స్ 5.6L ఇంజన్ 180 బీహెచ్పీ, 675 ఎన్ఎం గరిష్ట టార్క్ను అందిస్తుంది. ఇది 6 ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఫేస్ కౌల్ రకం ఛాసిస్ 10,700 కిలోల వరకు మోయగలదు. -
ఎయిర్ ఇండియాలోకి మరో 100 ఎయిర్బస్ విమానాలు
టాటా గ్రూప్ యాజమాన్యంలోని 'ఎయిర్ ఇండియా' (Air India) మరో వంద కొత్త విమానాలను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఇందులో 10 ఏ350 వైడ్బాడీ, మరో 90 ఏ320 ఫ్యామిలీ ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి.ఎయిర్ ఇండియా గతేడాది ఎయిర్బస్కు 250 విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 40 ఏ350 విమానాలు, 210 ఏ320 విమానాలు ఉన్నాయి. కొత్తగా చేరనున్న విమానాలతో కలిపి ఎయిర్బస్కు ఇచ్చిన ఆర్డర్ల సంఖ్య 350కి చేరింది.కొత్త విమానాల కోసం ఆర్డర్ చేయడం మాత్రమే కాకుండా.. ఎయిర్ ఇండియా ఏ350 విమానాలను సంబంధించిన విడి భాగాలు, నిర్వహణ కోసం ఎయిర్బస్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఎయిర్బస్తో 250 విమానాల కోసం గతంలో ఆర్డర్ చేసినప్పుడే.. 220 విమానాల కోసం బోయింగ్తోనూ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో కంపెనీ ఆర్డర్ చేసిన మొత్తం కొత్త ఎయిర్క్రాఫ్ట్ల సంఖ్య 570కి పెరిగింది.కొత్త విమానాలకు ఆర్డర్ చేసిన సందర్భంగా టాటా సన్స్ అండ్ ఎయిర్ ఇండియా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. మన దేశంలో మౌలిక సదుపాయాలు క్రమంగా పెరుగుతున్నాయి. చదువుకోవడానికి లేదా ఉద్యోగం కోసం చాలామంది యువత ఇతర దేశాలకు వెళ్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎయిర్ ఇండియాలో విమానాల సంఖ్యను పెంచుతున్నట్లు, సేవలను ప్రపంచ నలుమూలలకు విస్తరిస్తున్నట్లు పేర్కొన్నారు.100 more @Airbus aircraft! ✈️We are happy to announce new orders for 10 A350s and 90 A320 Family aircraft, adding 100 more aircraft to our firm orders for 250 Airbus aircraft placed last year.With this, the total number of new aircraft we have ordered rises to 570, of which… pic.twitter.com/OmfSWbJwbi— Air India (@airindia) December 9, 2024 -
రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వాలి
సాక్షి, అమరావతి: ఏదైనా కేసులో తనకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పుడు అందుకు గల కారణాలతో కూడిన రిమాండ్ ఆర్డర్ను తనకు అందజేయాలని నిందితుడు కోరితే, ఆ ఆర్డర్ను నిందితునికి సత్వరమే అందజేయాల్సి ఉంటుందని హైకోర్టు ప్రాథమికంగా అభిప్రాయపడింది. పౌరుల హక్కులు ముడిపడి ఉన్న కేసుల్లో కింది కోర్టులు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని హైకోర్టు సూచించింది. సోషల్ మీడియా యాక్టివిస్ట్ పప్పుల వెంకటరామిరెడ్డి అరెస్టు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్రావు, జస్టిస్ కుంచం మహేశ్వరరావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రిమాండ్ ఆర్డర్ కోసం వెంకటరామిరెడ్డి సంబంధిత కోర్టులో దరఖాస్తు చేశారో తెలుసుకోవాలని ఆయన తరఫు న్యాయవాదులకు ధర్మాసనం సూచించింది. రిమాండ్ ఆర్డర్ నిందితునికి ఇవ్వకపోతే అది చెల్లదు..తన కుమారుడు పప్పుల వెంకటరామిరెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, కోర్టు అతనికి విధించిన రిమాండ్ చెల్లదంటూ పప్పుల చెలమారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా చెలమారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎస్. శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ, రిమాండ్కు గల కారణాలను నిందితుడైన వెంకటరామిరెడ్డికి అందచేయలేదన్నారు. రిమాండ్ ఆర్డర్ను నిందితునికి అందచేయడం తప్పనిసరని, అలా ఇవ్వని పక్షంలో ఆ రిమాండ్ చెల్లదన్నారు. ఇందుకు సంబంధించి పలు తీర్పులున్నాయన్నారు. అంతకుముందు.. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, వెంకటరామిరెడ్డిని అరెస్టుచేసి కోర్టు ముందు హాజరుపరిచామన్నారు. అందువల్ల ఈ హెబియస్ కార్పస్ పిటిషన్కు విచారణార్హత లేదన్నారు. నిందితుడు కింది కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేశారని, అందువల్ల ఈ వ్యాజ్యంపై ఎలాంటి విచారణ అవసరంలేదన్నారు. అరెస్టుకు గల కారణాలను కూడా అతనికి తెలియజేశామన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కింది కోర్టులు నిందితులకు వారి రిమాండ్ ఆర్డర్ను సత్వరమే అందజేయాలని అభిప్రాయపడింది. ఈ కేసులో నిందితుడు రిమాండ్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేయలేదని తెలిపింది. ఈ సమయంలో శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ విషయాన్ని తాము మరోసారి పరిశీలన చేస్తామన్నారు. దీంతో ధర్మాసనం ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను 29కి వాయిదా వేసింది. -
గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్లో భారీ ఆర్డర్
దేశంలో అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ను ఏర్పాటు చేస్తున్న ఏఎం గ్రీన్ సంస్థ ఇందులో భాగంగా ఎలక్ట్రోలైజర్ల కోసం కోసం జాన్ కాకెరిల్ హైడ్రోజన్ కంపెనీతో భారీ ఒప్పందం చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత భారీ ఎలక్ట్రోలైజర్ ఆర్డర్.1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లతో ఉత్పత్తి చేసే తొలి మిలియన్-టన్నుల గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్ట్ ఇది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ప్లాంట్లో ఏర్పాటు చేస్తున్న దీని కోసం ఏఎం గ్రీన్ గత ఆగస్ట్లో తుది పెట్టుబడి నిర్ణయాన్ని (FID) సాధించింది. ఈ ప్లాంట్ 2026 ద్వితీయార్థంలో ఉత్పత్తిని ప్రారంభించనుంది. రెండు దశల్లో సరఫరా అయ్యే 1.3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్లతో గ్రీన్ హైడ్రోజన్ను ఉత్పత్తి చేసి గ్రీన్ అమ్మోనియాగా మారుస్తారు.ఒప్పందంలో భాగంగా జాన్ కాకెరిల్ హైడ్రోజన్ సంస్థ మొదటి దశలో 640 మెగా వాట్ల సామర్థ్యం గల అధునాతన ఒత్తిడితో కూడిన ఆల్కలీన్ ఎలక్ట్రోలైజర్లను సరఫరా చేస్తుంది. అలాగే ఇరు సంస్థలు కాకినాడలో దేశపు అతిపెద్ద ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని (ఏటా 2 గిగావాట్ల ఉత్పత్తి) అభివృద్ధి చేయనున్నాయి. తద్వారా జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కింద దేశ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యానికి దోహదపడనున్నాయి. ఈ ప్లాంట్ రెండో దశలొ 640మెగా వాట్ల ఎలక్ట్రోలైజర్లను ఏఎం గ్రీన్ కాకినాడ ప్రాజెక్టుకు సరఫరా చేస్తుంది. ఏఎం గ్రీన్ గురించి.. హైదరాబాద్కు చెందిన గ్రీన్కో గ్రూప్ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేష్ కొల్లి ఏఎం గ్రీన్ సంస్థను ఏర్పాటు చేశారు. ఇది ఇంధన మార్పిడి పరిష్కారాలను అందించే దేశంలోని ప్రముఖ సంస్థలలో ఒకటి. ఇంధన భవిష్యత్తును రూపుదిద్దడంలో సరికొత్త సాంకేతికతలు, మార్గాలను అన్వేషించడంలో కృషి చేస్తోంది. -
క్విక్ విస్తరణ!
క్విక్ కామర్స్ కంపెనీలకు దండిగా నిధులు లభిస్తుండటంతో విస్తరణ జోరు పెంచాయి. నగరాల్లో ఈ మోడల్ మంచి సక్సెస్ సాధించడంతో జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్ బాస్కెట్ తదితర సంస్థలు డార్క్ స్టోర్ల సంఖ్యను భారీగా పెంచడంపై దృష్టి పెడుతున్నాయి. కిరాణాతో మొదలు పెట్టిన కంపెనీలు ఇప్పుడు నెమ్మదిగా ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, మేకప్, టాయ్స్ వంటి ఇతర ప్రొడక్టులను కూడా కార్ట్లోకి చేర్చుతున్నాయి. అయితే, బడా నగరాల్లో ఈ మైక్రో వేర్హౌస్ల కోసం స్థలాల వేట కష్టతరంగా మారుతోందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.సమీపంలోని ప్రాంతాలకు 30 నిమిషాల్లోపే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వీలుగా ఏర్పాటు చేసే చిన్న స్థాయి గోడౌన్లను డార్క్ స్టోర్లుగా పేర్కొంటారు. కిక్కిరిసిన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడిన వ్యవహరం. అయినప్పటికీ కంపెనీలు తగ్గేదేలే అంటున్నాయి. మరోపక్క, రోజువారీ కార్యకలాపాల నిర్వహణ, క్విక్ డెలివరీ విషయంలో లోటుపాట్లు లేకుండా చూసేందుకు భారీ స్థాయిలో సిబ్బంది నియామకాలతో ఈ రంగంలో హైరింగ్ కళకళలాడుతోంది. చిన్న నగరాల్లో స్పీడ్... నగరాల్లోని కిక్కిరిసిన ప్రాంతాల్లో డార్క్ స్టోర్ల ఏర్పాటు సవాలుగా మారుతోందని జెప్టో సీఈఓ ఆదిత్ పలీచా చెబుతున్నారు. గత రెండు నెలల్లోనే బిలియన్ డాలర్లను (దాదాపు రూ.8,400 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా, చండీగఢ్, భువనేశ్వర్ వంటి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో వేగంగా స్థలాలు దొరుకుతుండటంతో అక్కడ విస్తరణ స్పీడ్ పెంచుతున్నామని పలీచా పేర్కొన్నారు. ‘ఈ రంగంలోకి నిధులు పుష్కలంగా వస్తున్నాయని పసిగట్టిన స్థిరాస్తి యజమానులు అద్దెలు భారీగా పెంచేస్తున్నారు.కొన్నిచోట్ల పోటీ కారణంగా బిడ్డింగ్లో పాల్గొనాల్సి వస్తోంది’ అని పలీచా వివరించారు. జొమాటో బ్లింకిట్ సైతం భటిండా, హరిద్వార్, విజయవాడ వంటి నగరాల్లో అడుగుపెట్టింది. కస్టమర్లకు వేగంగా సేవలదించేలా డార్క్ స్టోర్ల సైజును కంపెనీలు పెంచుతున్నాయి. గతంలో సగటున 2,500 చదరపు అడుగులున్న ఈ స్టోర్ సైజు 4,000–5,000 చ.అ.కు పెరిగింది. కొన్నిచోట్ల 10,000 చ.అ., మరికొన్ని చోట్ల ఏకంగా 25,000 చ.అ. డార్క్ స్టోర్లు కూడా ఏర్పాటవుతుండటం ఈ రంగంలో జోరుకు నిదర్శనం.‘అమ్మతోడు అరగంటలోపే డెలివరీ చేసేస్తాం’ క్విక్ కామర్స్ దిగ్గజం జెప్టో స్లోగన్ ఇది! ఇందుకు తగ్గట్టుగానే శరవేగంగా దూసుకెళ్తున్న క్విక్ కామర్స్ రంగంలో కంపెనీలు నువ్వానేనా అనేలా తలపడుతున్నాయి. బంపర్ వేల్యుయేషన్లతో ఈ రంగంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతుండటంతో సేవలను ‘క్విక్’గా విస్తరించేందుకు పోటీ పడుతున్నాయి. సిబ్బంది నియామకాలతో పాటు డార్క్ స్టోర్ల సంఖ్య, సైజును కూడా భారీగా పెంచుకుంటున్నాయి. దీంతో కస్టమర్లకు మరిన్ని ఉత్పత్తులు లభించడంతో పాటు మరింత వేగంగా సేవలు లభించేందుకు దోహదం చేస్తోంది.రూ. 300-500 : సగటు ఆర్డర్ విలువ (గతంలో ఇది 200–250గా ఉండేది)4,000 చ. అ. : డార్క్ స్టోర్ ప్రస్తుత సగటు సైజు (అంతక్రితం 2,500 స్థాయిలో ఉండేది). కొన్ని ఏరియాల్లో 10,000 చ. అ. స్టోర్లు కూడా ఉన్నాయి.హైరింగ్.. ఫుల్ స్వింగ్ ‘క్విక్’ విస్తరణ నేపథ్యంలో సిబ్బంది డిమాండ్ తారస్థాయికి చేరుకుంది. ‘ఈ రంగంలో అన్ని విభాగాల్లోనూ హైరింగ్ ఫుల్ స్వింగ్లో నడుస్తోంది. ఐదు ప్రధాన కంపెనీలు అగ్ర స్థానం కోసం పోటీ పడుతుండటమే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా లాజిస్టిక్స్ ఇక్కడ అత్యంత కీలక పాత్ర పోషిస్తుండటంతో ఇతర కంపెనీల్లోని నిపుణులైన ఉద్యోగులకు గాలం వేస్తున్నాయి’ అని ఒక క్విక్ కామర్స్ సంస్థ చీఫ్ వెల్లడించారు. ‘మినిట్స్’ పేరుతో లేటుగా ఈ విభాగంలోకి అడుగుపెట్టిన ఫ్లిప్కార్ట్ కార్యకలాపాల వేగం పెంచేందుకు బిగ్బాస్కెట్ వంటి ఇతర కంపెనీల నుంచి చాలా విభాగాల్లో సిబ్బందిని భర్తీ చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మరోపక్క, బిగ్బాస్కెట్ సైతం పూర్తి స్థాయి క్విక్ కామర్స్ మోడల్లోకి మారే ప్రయత్నాల్లో ఉండటం విశేషం. ఫ్లిప్కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేశ్ ఝా ఇటీవలే స్విగ్గీ ఇన్స్టామార్ట్ సీఈఓగా చేరారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్లతో పాటు మధ్య స్థాయి మేనేజర్లకు డిమాండ్ నెలకొంది. క్యూ–కామర్స్లోని మార్కెటింగ్, ఆపరేషన్స్, సప్లయ్ చైన్, ఫైనాన్స్ ఇలా అన్ని విభాగాల్లోనూ వలసలు జోరందుకోవడం గమనార్హం. జెప్టో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్లీ, ఓలా, అర్బన్ కంపెనీ తదితర కంపెనీల నుంచి కీలక సిబ్బందిని భారీగా నియమించుకుంటోంది. కంపెనీ ప్రధాన కేంద్రాన్ని బెంగళూరు నుంచి మంబైకి మార్చే సన్నాహాల్లో ఉన్న జెప్టో.. 500 మంది ఎగ్జిక్యూటివ్ల వేటలో ఉన్నట్లు పలీచా తెలిపారు. -
భూమికి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి: చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా రోడ్డు విస్తరణ కోసం భూమి తీసేసుకున్న అధికారులు, తీసుకున్న ఆ భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని బాధిత కుటుంబానికి వాగ్దానం చేసి ఆ తరువాత పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాన్ని అనవసరంగా కోర్టుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు రెవెన్యూ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులకు, పురపాలక శాఖ డైరెక్టర్, అనంతపురం మునిసిపల్ కమిషనర్లకు రూ.50వేలను ఖర్చులు కింద జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని నాలుగు వారాల్లో పిటిషనర్లకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు.ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా... ప్రత్యామ్నాయ భూమి ఇవ్వని అధికారులుఅనంతపురం పట్టణంలోని సర్వే నంబర్ 1940/4లో టి.నిజాముద్దీన్కు చెందిన 0.02 సెంట్ల భూమిని 1996లో మునిసిపల్ అధికారులు రోడ్డు విస్తరణ కోసం తీసుకున్నారు. చట్ట ప్రకారం భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకున్న అధికారులు, తీసుకున్న భూమికి ప్రత్యామ్నాయంగా మరో చోట భూమి ఇస్తామని చెప్పారు. నిజాముద్దీన్ ప్రత్యామ్నాయ భూమి కోసం పలుమార్లు అధికారుల చుట్టూ తిరిగారు. దీంతో చివరకు మునిసిపల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ భూమి ఇచ్చేందుకు తీర్మానం చేసింది. ఈ తీర్మానానికి ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ éనిజాముద్దీన్కు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలంటూ 2001లో జీవో జారీ చేసింది. అయినప్పటికీ పలు కారణాలరీత్యా అధికారులు ఆ భూమిని నిజాముద్దీన్కు కేటాయించలేదు. ఈ లోపు ఆయన మరణించారు. వారి హక్కులను హరించడమే.. ఆయన వారసులు న్యాయ పోరాటం ప్రారంభించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య ఇటీవల తీర్పు వెలువరించారు. పరిహారం ఇవ్వకుండా భూమి తీసుకోవడమే కాకుండా, ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని ప్రభుత్వం జీవో జారీ చేసిన తరువాత పిటిషనర్లకు భూమి ఇవ్వకపోవడం వారి హక్కులను హరించడమేనని తేల్చి చెప్పారు. అంతేకాక అలా చేయడం రాజ్యాంగ విరుద్ధం కూడానని స్పష్టం చేశారు. ప్రభుత్వం సానుకూల జీవో జారీ చేసినా కూడా నిజాముద్దీన్ తన జీవిత కాలంలో ప్రత్యామ్నాయ భూమిని పొందలేకపోయారని తెలిపారు.భూ సేకరణ చేయకుండా భూమిని తీసుకోవడాన్ని దోపిడీగా అభివర్ణించిన న్యాయమూర్తి..అధికారుల తీరు కోర్టుని షాక్కు గురిచేసిందని తన తీర్పులో పేర్కొన్నారు. తీసుకున్న 0.02 సెంట్ల భూమికి 2013 భూ సేకరణ చట్టం కింద పిటిషనర్లకు గరిష్టంగా 8 వారాల్లోపు పరిహారం చెల్లించాలని, పిటిషనర్లకు రూ.50వేలను ఖర్చుల కింద చెల్లించాలని అధికారులను ఆదేశించారు. -
డార్క్ వెబ్లో హెరాయిన్ ఆర్డర్.. స్పీడ్ పోస్ట్లో డెలివరీ!
ఖమ్మం క్రైం: సాధారణంగా మానవ కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతుంటుందన్న విషయం తెలిసిందే. కానీ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణా, సరఫరాపై ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపుతుండటంతో డ్రగ్స్ బానిసలు కొత్తదారులను ఆశ్రయిస్తున్నారు. తాజా గా ఓ యువకుడు డార్క్ వెబ్లో ఆర్డర్ పెట్టి స్పీడ్ పోస్ట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకున్న ఉదంతం ఖమ్మంలో వెలుగుచూసింది.అస్సాం నుంచి: ఖమ్మం టూటౌన్ ప్రాంతానికి చెందిన ఓ సాప్ట్వేర్ ఇంజనీర్ మత్తుపదార్థాలకు అలవాటు పడ్డాడు. హైదరాబాద్లో పనిచేస్తున్న అతను అక్కడ పోలీసు నిఘా ఎక్కువగా ఉండటంతో ఖమ్మంకు తెప్పించుకుంటే ఎవరికీ అనుమానం రాదని భావించాడు. ఇందుకోసం హ్యాకర్లు, మాఫియా, విమెన్ ట్రాఫికింగ్, ఆయుధాల స్మగ్లింగ్ చేసేవారు ఉపయోగించే డార్క్ వెబ్ (తమ గుర్తింపు, జాడను ఇతరులకు తెలియనివ్వకుండా ఇంటర్నెట్లోని హిడెన్ వెబ్సైట్లను ఉపయోగించేందుకు అవకాశం కల్పిస్తుంది) ఎంచుకున్నట్లు సమాచారం. ఆపై తన క్రెడిట్ కార్డు, ఇతర యాప్లు వాడకుండా క్రిప్టో కరెన్సీ ద్వారా చెల్లింపులు చేసి హెరాయిన్ను అస్సాంలోని సిల్పుకురి నుంచి బుక్ చేసుకున్నాడు.యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నిఘాతో..: డ్రగ్స్ ఆన్లైన్లో విక్రయిస్తుండగా కొందరు తెప్పించుకుంటున్నారనే అను మానంతో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు చెందిన సాంకేతిక బృందం కొన్నాళ్లుగా నిఘా వేసింది. ఇందులో భాగంగా గ త నెల 31న ఖమ్మం యువకుడు డ్రగ్స్ బు క్ చేసుకున్నట్లు పసి గట్టింది. స్పీడ్ పోస్ట్ పార్సిల్ నంబర్ను హెరాయిన్ సరఫరా దారు ఖమ్మం యువ కుడికి పంపడంతో అస్సాంలో పార్సిల్ మొదలైనప్పటి నుంచి నిఘా వేసింది. ఈ నెల 8న ఖమ్మం చేరుకున్న పార్సిల్ను 9న ఆ యువకుడికి డెలివరీ చేస్తుండగా యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులతోపాటు ఖమ్మం టూటౌన్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.ఆ పార్సిల్లో మ్యాగజైన్ మాత్రమే ఉండటంతో తొలుత యువకుడు బుకాయించాడు. అనంతరం అధికారులు మ్యాగజైన్లోని ఒక్కో పేజీని పరిశీలిస్తుండగా మధ్యలో ఓ కాగితానికి టేప్ వేసి ప్లాస్టిక్ కవర్లో ఉంచిన 2 గ్రా ముల హెరాయిన్ బయటపడింది. దీంతో హెరాయిన్ను స్వాధీనం చేసుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. దాన్ని సరఫరా చేసిందెవరు? రాష్ట్రంలో ఇంకా ఎవరెవరు తెప్పించుకున్నారనే కోణంలో ప్రశ్నించారు. యువకుడి కెరీర్ దృష్ట్యా కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, ఇతర మత్తుపదార్థాల విక్రయం జరి గినట్లు తెలిస్తే 87126 71111 లేదా 1908 నంబర్లకు ఫోన్ చేయాలని అధికారులు సూచించారు. -
రిజిస్ట్రేషన్ ఆఫీస్లో జనరల్ డైరీ పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాల యాల్లో జనరల్ డైరీ పెట్టాలి.. అందులో రిజిస్ట్రేషన్కు వచ్చే ప్రజలు(కక్షిదారులు) వివరాలన్నీ పేర్కొనాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఎందుకు వచ్చారు.. ఎప్పుడు వచ్చారు.. లాంటి వివరాలు నమోదు చేయాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ సమయంలో వస్తున్న అవాంతరాలను తగ్గించేందుకు అధికారులు, ప్రజలకు హైకోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రిజిస్ట్రేషన్ అధికారులు ఈ మార్గదర్శకాలు అమలు చేసేలా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ చర్యలు తీసుకోవాలి. ఈ ఆర్డర్ కాపీని సంబంధిత అధికారులకు చేరేలా చూడాలని రిజిస్ట్రీని ఆదేశించింది. కోర్టు వివాదం పరిష్కారమైన తర్వాత కూడా రిజిస్ట్రేషన్ను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్కు చెందిన అనంత రామేశ్వరిదేవితోపాటు మరికొందరు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ.శ్రవణ్కుమార్ విచారణ చేపట్టి తీర్పు వెలువరించారు. ఒకరిద్దరు అధికారులు కాదు.. అసలు రెవెన్యూ వ్యవస్థలోనే లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు.కోర్టులో విచారణ ముగిసినా మళ్లీ ఆదేశాలు తీసుకురావాలంటూ వేధించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదవారు కొద్దోగొప్పో భూమి కొనుగోలు చేద్దామని అనుకుంటే రిజిస్ట్రేషన్, జీఎస్టీ, స్టాంపు డ్యూటీ వసూలు చేస్తున్నారని.. ఇప్పుడు బాధితులకు కోర్టు ఫీజులు అదనంగా మారాయని స్పష్టం చేసింది. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకున్నా పిటిషనర్లకు ఎందుకు రిజిస్ట్రేషన్ చేయలేదని పెద్ద అంబర్పేట్ సబ్ రిజిస్ట్రార్పై అసంతృప్తి వ్యక్తం చేసింది. అధికారులకు మార్గదర్శకాలు ⇒ ఏదైనా ఆస్తి రిజిస్ట్రేషన్ కోసం అధికారులను ప్రజలు సంప్రదించినప్పుడు రిజిస్ట్రేషన్ చట్టం–1908, ఇండియన్ స్టాంప్ ప్రకారం అన్ని చట్టప్రకారం ఉంటే వారంలోగా రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేయాలి. లేనిపక్షంలో తిరస్కరించాలి. ఇదే విషయాన్ని వారికి తెలియజేయాలి. తిరస్కరణ మౌఖికంగా ఉండకూడదు. లిఖితపూర్వక పత్రం ఇవ్వాలి. ⇒ ఒకవేళ రిజిస్ట్రేషన్ పత్రాలు తిరస్కరిస్తే అప్పటికే చెల్లించిన స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల వాపసు ప్రక్రియ సరళీకృతం చేయాలి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను చెల్లించే ముందు ప్రజలు వాపసు విధానాన్ని కూడా తెలుసుకోవాలి. ⇒ కోర్టు ఆదేశాలు లేనప్పుడు, ఉత్తర్వులు ఎత్తివేసినప్పుడు, అప్పీల్ పెండింగ్ లేనప్పుడు.. మళ్లీ దానిపై న్యాయస్థానం ఆదేశాలు కావాలని ప్రజలను ఒత్తిడి చేయకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సర్క్యులర్లు, నోటిఫికేషన్లు జారీ చేయాలి. ∙తీర్పు వెల్లడించిన, కొట్టివేసిన పిటిషన్లలోని ఆస్తుల రిజిస్ట్రేషన్లను రిజిస్టరింగ్ అథారిటీలు తిరస్కరించకూడదు.⇒ ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక వాచ్ రిజిస్టర్/జనరల్ డైరీ నిర్వహించాలి. ప్రజల తమ పత్రాల రిజిస్ట్రేషన్కు వచి్చన తేదీ, సమయాన్ని అందులో పేర్కొనాలి. వారు ఎందుకు వచ్చారో కూడా నమోదు చేయాలి. అవకతవకలు, మధ్యవర్తుల జోక్యం, తప్పులు జరగకుండా ఇది తోడ్పడుతుంది. ⇒ కోర్టు ఉత్తర్వుల కోసం పట్టుబట్టకుండా సబ్ రిజిస్ట్రార్, మండల్ రెవెన్యూ అధికారి ఉత్తర్వులు జారీ చేయాలి. ∙వింజమూరి రాజగోపాలాచారి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసుల్లో న్యాయస్థానాలు ఇచి్చన మార్గదర్శకాలను రిజిస్టరింగ్ అధికారులు పాటించాలి. ప్రజల(కక్షిదారులు)కు సూచనలు.. ⇒ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండే వాచ్ రిజిస్ట్రర్ లేదా జనరల్ డైరీలో తమ వివరాలు నమోదు చేయాలి. అసలు కక్షిదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయానికే రాలేదు.. రిజిస్ట్రేషన్ కోసం పత్రాలు సమర్పించలేదని భవిష్యత్లో అధికారులు తప్పించుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ⇒ రిజిస్ట్రర్ కార్యాలయాన్ని సంప్రదించే ముందు పార్టీలు ప్రతిపాదిత ఆస్తి నిషేధిత జాబితాలో లేదని నిర్ధారించుకోవాలి. ∙ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే చట్టం ప్రకారం ఆ జాబితా నుంచి ఆస్తిని తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలి. నిషేధిత జాబితాలో ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ నేరుగా కోర్టును ఆశ్రయించకూడదు. ⇒ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమరి్పంచిన పత్రాలు ఆ చట్టంలోని నిబంధనల మేరకు ఉండేలా చూసుకోవాలి. -
TG: పవర్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్
సాక్షి,న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లపై విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన విద్యుత్ కమిషన్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కమిషన్ను రద్దు చేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 16) విచారణ జరిపింది. పిటిషన్ను విచారించిన సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డి తీరుపై సీజేఐ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రెస్మీట్ పెట్టి విచారణకు సంబంధించిన విషయాలపై ఓపెన్గా ఎలా మాట్లాడతారని సీజేఐ ప్రశ్నించారు.న్యాయమూర్తి విచారణ చేయడమే కాకుండా నిష్పక్షపాతంగా ఉన్నట్లు కనిపించాలని వ్యాఖ్యానించారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చైర్మన్ను మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్లు తెలిసింది. లంచ్ తర్వాత కొత్త చైర్మన్ ఎవరనేది చెబుతామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో పిటిషన్ విచారణను లంచ్ తర్వాతకు కోర్టు వాయిదా వేసింది. విచారణలో కేసీఆర్ తరపున సీనియర్న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించగా తెలంగాణ ప్రభుత్వం తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అడ్వకేట్ జనరల్తో సీఎం రేవంత్ మంతనాలు .. కొత్త చైర్మన్ ఎవరనేదానిపై చర్చ పవర్ కమిషన్ చైర్మన్ ఎల్.నర్సింహారెడ్డిని మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సమయంలో సీఎం రేవంత్రెడ్డి హైదరాబాద్ సచివాలయంలో కలెక్టర్ల సమావేశంలో ఉన్నారు. ఆదేశాల గురించి తెలియగానే కలెక్టర్ల సమావేశ హాల్ నుంచి వెళ్లి అడ్వకేట్ జనరల్(ఏజీ) సుదర్శన్రెడ్డితో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త చైర్మన్గా ఎవరిని నియమించాలన్నదానిపై సీఎం ఏజీతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
ఆరేళ్లుగా అందని డెలివరీ.. ఇన్నాళ్లకు స్పందించిన ఫ్లిప్కార్ట్
ఏదైనా ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే.. రెండు మూడు రోజులు లేదా ఓ పది రోజులలో డెలివరీ అయిపోతుంది. అయితే ఓ వ్యక్తికి మాత్రమే వింత అనుభవం ఎదురైంది. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన ఆరేళ్లకు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. దీంతో యూజర్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు.ముంబైకి చెందిన అహ్సన్ ఖర్బాయి 2018 మే 16న ఫ్లిప్కార్ట్లో ఓ జత చెప్పులు ఆర్డర్ చేశారు. వీటి ధర 485 రూపాయలు. ఆర్డర్ చేసిన తరువాత మూడు రోజుల్లో షిప్పింగ్ అని స్టేటస్లో కనిపించింది. 20వ తేదీన డెలివరీ చేస్తామని వెబ్సైట్లో కనిపించింది. అయితే యూజర్ ఇప్పటి వరకు డెలివరీ పొందలేదు. ప్రతో రోజూ అరైవింగ్ టుడే అని మాత్రం కనిపించేది. మొత్తానికి ఇలా ఆరేళ్ళు గడిచిపోయింది.After 6 yrs @Flipkart called me for this order 😂Asking me what issue I was facing pic.twitter.com/WLHFrFW8FV— Ahsan (@AHSANKHARBAI) June 25, 2024ఆర్డర్ పెట్టిన ఆరు సంవత్సరాలకు అహ్సన్ ఖర్బాయికు కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ వచ్చింది. సమస్య ఏంటని ఆరా తీసింది. తనకు ఎదురైనా ఈ అనుభవాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఇది వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.అహ్సన్ ఖర్బాయి ఆర్డర్ పెట్టినప్పుడే క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నారు. కాబట్టి డెలివరీ గురించి అతను పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఆలస్యమైందని క్యాన్సిల్ కూడా చేయలేదు. దీనికి ఫ్లిప్కార్ట్ రిప్లై ఇస్తూ.. మీకు ఎదురైన ఈ అనుభవానికి క్షమించండి, ఇన్ని రోజులు ఎదురు చూటడం గొప్ప విషయం అని పేర్కొంది.I'm really sorry for this experience. Our team has already gotten in touch with you on this and they are looking into your concern related to the recent order. Please be assured that you'll hear from us. Appreciate your patience.— FlipkartSupport (@flipkartsupport) June 26, 2024 -
1000 ట్రక్కుల భారీ ఆర్డర్.. దక్కించుకున్న బెంగళూరు స్టార్టప్
ఎలక్ట్రిక్ ట్రక్కులు తయారు చేసే బెంగళూరు ఆధారిత స్టార్టప్ ట్రెసా మోటార్స్ లాజిస్టిక్స్ కంపెనీ భారీ ఆర్డర్ దక్కించుకుంది. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ నుండి 1,000 ట్రక్కుల కోసం ప్రీ-ఆర్డర్ను పొందింది. ఈ కంపెనీ మోడల్ V0.1ని అందిస్తోంది. దీన్ని గతేడాది జూలైలో ఆవిష్కరించింది. ట్రెసా కంపెనీ 18T-55T స్థూల వాహన బరువు విభాగంలోనూ ఎలక్ట్రిక్ ట్రక్కులను అభివృద్ధి చేస్తోంది. ట్రెసా ట్రక్కులు ప్రస్తుతం 300kWh బ్యాటరీ ప్యాక్, 24,000Nm మోటరును కలిగి ఉన్నాయి. ఇవి 15 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం ఛార్జీకి సపోర్ట్ చేస్తాయి. 120kmph గరిష్ట వేగాన్ని ఇస్తాయి. ఈ ఎలక్ట్రిక్ ట్రక్కులు ఒక్కసారి పూర్తి ఛార్జ్తో ఎంత రేంజ్ ఇస్తాయన్నది కంపెనీ వెల్లడించలేదు."మేము ఈ స్థితికి చేరుకోవడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డాం. ఇంకా ఇది ప్రారంభం మాత్రమే. జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ వంటి ప్రముఖ లాజిస్టిక్స్ కంపెనీలు ముందుకు రావడం మరియు మాపై విశ్వాసం ఉంచడం మాకు చాలా ఆనందంగా ఉంది" అని ట్రెసా మోటర్స్ సీఈవో రోహణ్ శ్రవణ్ పేర్కొన్నారు. ట్రెసా మోటార్స్ అధునాతన ఎలక్ట్రిక్ ట్రక్కులను తమ ఫ్లీట్లో చేర్చడం ద్వారా కార్బన్ ఫుట్ప్రింట్ను తగ్గించే తమ లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వేస్తున్నామని జేఎఫ్కే ట్రాన్స్పోర్టర్స్ ఎండీ ఆదిల్ కొత్వాల్ అన్నారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది?
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అసలు ప్రైవేటీకరణ ఏ దశలో ఉంది? స్టీల్ ప్లాంట్ భూములను ఏమైనా విక్రయించారా? విక్రయిస్తే ఎంత మేర విక్రయించారు? తదితర వివరాలను తమ ముందుంచాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అలాగే భూములను ఇతరులకు విక్రయించారని ఆరోపిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఆధారాలను కోర్టు ముందుంచాలని పిటిషనర్ కేఏ పాల్ను ఆదేశించింది. ఏది పడితే అది ఆరోపిస్తే సరిపోదని.. ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని పాల్కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ గుహనాథన్ నరేందర్, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేఏ పాల్, మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ తదితరులు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిని జస్టిస్ నరేందర్ ధర్మాసనం గురువారం విచారించింది. ఈ సందర్భంగా కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపిస్తూ.. విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా? అన్న విషయాన్ని తేల్చేందుకు హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు. వాస్తవానికి స్టీల్ ప్లాంట్ లాభాల్లోనే నడుస్తోందని చెప్పారు. ఒకవేళ నష్టాల్లో ఉంటే.. ఆ మొత్తాన్ని భరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. స్టీల్ ప్లాంట్కు చెందిన 2 వేల ఎకరాల భూములను ఇప్పటికే విక్రయించారని ఆరోపించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఆరోపణలు చేస్తే సరిపోదని.. భూములు విక్రయించినట్లు ఆధారాలు చూపాలని పాల్కు స్పష్టం చేసింది. ప్రైవేటీకరణకు మేం వ్యతిరేకం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. దీనిపై కేంద్రానికి సీఎం జగన్ లేఖ కూడా రాశారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి బయటపడేసేందుకు ఏం చేయాలో కూడా కేంద్రానికి సూచనలు చేశామన్నారు. భూములిచ్చిన వారు నష్టపోకూడదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. స్టీల్ ప్లాంట్ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే అవకాశం ఉందా? అని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని శ్రీరామ్ తెలిపారు. కేంద్రం తరఫు న్యాయవాది స్పందిస్తూ, ప్లాంట్ భూములను విక్రయించామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. -
ఒరిజినల్ ఆధార్ పీవీసీ కార్డు.. ఇంటికే కావాలంటే ఇలా చేయండి..
Aadhar PVC Card: ఆధార్ కార్డ్ అనేది ఒక ముఖ్యమైన డాక్యుమెంట్. ఇటువంటి మీ ఆధార్ కార్డ్ పోయినా లేదా పాడైనా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో ఆధార్ పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. కేవలం రూ. 50 రుసుము చెల్లించి యూఐడీఏఐ (UIDAI) అధికారిక వెబ్సైట్ ద్వారా ఈ కార్డ్ని ఆర్డర్ చేయవచ్చు. పీవీసీ కార్డ్లను పాలీ వినైల్ క్లోరైడ్తో తయారు చేస్తారు. అందుకే వీటిని పీవీసీ కార్డ్లు అంటారు. ఇది ఒక రకమైన ప్లాస్టిక్ కార్డ్. దీనిపై ఆధార్ కార్డ్ సమాచారంతా ముద్రిస్తారు. యూఐడీఏఐ ప్రకారం.. ఈ కార్డ్ సురక్షిత క్యూఆర్ కోడ్, హోలోగ్రామ్, మైక్రో టెక్స్ట్, జారీ చేసిన తేదీ, కార్డ్ ప్రింటింగ్ తేదీ తదితర సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఆధార్ పీవీసీ కార్డ్ని ఆర్డర్ చేయండిలా.. యూఐడీఏఐ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్సైట్లో, మీ 12-అంకెల ఆధార్ నంబర్ను నమోదు చేయండి తర్వాత సెక్యూరిటీ కోడ్ లేదా క్యాప్చాను ఎంటర్ చేయండి ఓటీపీ కోసం ‘Send OTP’పై క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ చేయండి అనంతరం 'మై ఆధార్' విభాగానికి వెళ్లి, 'ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్'పై క్లిక్ చేయాలి. తర్వాత మీ ఆధార్ వివరాలు కనిపిస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. అనంతరం పేమెంట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. క్రెడిట్/డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ఆప్షన్లు వస్తాయి. దీని తర్వాత పేమెంట్ పేజీకి వెళ్తారు. అక్కడ రూ. 50 రుసుము డిపాజిట్ చేయాలి. చెల్లింపును పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ పీవీసీ కార్డ్ కోసం ఆర్డర్ ప్రక్రియ పూర్తవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత యూఐడీఏఐ ఆధార్ను ప్రింట్ చేసి ఐదు రోజుల్లోగా ఇండియా పోస్ట్కి అందజేస్తుంది. పోస్టల్ శాఖ స్పీడ్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి ఆధార్ పీవీసీ కార్డును డెలివరీ చేస్తుంది. -
మణిపూర్: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు
ఇంఫాల్: మణిపూర్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది. రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్ మణిపూర్ ట్రైబల్ యూనియన్ గతేడాది అక్టోబర్ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. . గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది. మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. -
బర్త్ ఆర్డర్ కూడా వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తుంది!
‘మా పెద్దోడు చాలా బాధ్యతగా ఉంటాడు. కానీ చిన్నోడికే అస్సలు బాధ్యత లేదు. ఏం చెప్పినా పట్టించుకోడు. వాడిని ఎలా మార్చాలో అర్థం కావట్లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారని వచ్చాను’ అన్నారు సుబ్బారావు. ‘మా పెద్దపాప ఇంట్లో అన్ని పనులూ అందుకుంటుంది. కానీ చిన్నపాప మాత్రం ఎప్పుడూ డాన్స్, స్పోర్ట్స్ అంటూంటుంది. దాన్ని ఎలా దారిలో పెట్టాలో అర్థం కావడంలేదు’ చెప్పారు కోమలి. ఇంటికి పెద్ద బిడ్డ యజమాని లాంటి వాడు, బాధ్యతగా ఉంటాడు. రెండో బిడ్డ ప్రశాంతంగా ఉంటాడు. చివరివాడు బాధ్యతలేకుండా అల్లరిచిల్లరగా తిరుగుతుంటాడు.. ఇలాంటి మాటలు మీరు వినే ఉంటారు. ఇది నిజమేనని నమ్మేవాళ్లూ ఉంటారు.. ఇదంతా ట్రాష్ అని కొట్టేసేవాళ్లూ ఉంటారు. దీనిపై సైకాలజిస్టులు కూడా అధ్యయనం చేశారు. ప్రముఖ ఆస్ట్రియన్ సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ అడ్లర్ 20వ శతాబ్దం ప్రారంభంలో బర్త్ ఆర్డర్ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. కుటుంబంలో జన్మించిన క్రమం బిడ్డ ప్రవర్తన, భావోద్వేగాలు, ఇతర వ్యక్తులతో సంబంధాలపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. మొదటి బిడ్డలు ఎక్కువ శ్రద్ధ (బాధ్యత), మధ్యస్థ శిశువులు తక్కువ శ్రద్ధ (ఎక్కువ స్వాతంత్య్రం)ను పొందుతారనే ఆలోచనలో కొంత నిజం ఉండవచ్చు. చివరి బిడ్డలకు ఎక్కువ స్వేచ్ఛ (తక్కువ క్రమశిక్షణ) లభిస్తాయి. అయితే బర్త్ ఆర్డర్ ఒక ఫ్యాక్టర్ మాత్రమే. తల్లిదండ్రులు, తోబుట్టువులతో సంబంధాలు, జన్యువులు, పర్యావరణం, సామాజిక.. ఆర్థిక స్థితి వంటి అంశాలు కూడా పిల్లల వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. పేరెంటింగ్ స్టైల్ అనేది పిల్లల వ్యక్తిత్వాన్ని అమితంగా ప్రభావితం చేస్తుందనేది అనేక పరిశోధనల సారాంశం. అడ్లర్ సిద్ధాంతం ప్రకారం ఏ పిల్లలు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మొదటి బిడ్డ అడ్లర్ బర్త్ ఆర్డర్ సిద్ధాంతం ప్రకారం, తొలి సంతానం.. వారి తల్లిదండ్రుల నుంచి ఎక్కువ శ్రద్ధ, సమయాన్ని పొందుతారు. కొత్త తల్లిదండ్రులు అప్పుడే పిల్లల పెంపకం గురించి నేర్చుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా, కొన్నిసార్లు కఠినంగా, కొన్నిసార్లు న్యూరోటిక్గా కూడా ఉండవచ్చు. మొదటి సంతానం టైప్ A వ్యక్తిత్వాలతో బాధ్యతాయుతమైన నాయకులుగా ఉంటారు. కుటుంబంలోకి రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకు కేటాయించే సమయం తగ్గడంవల్ల రెండో బిడ్డను చూసి అసూయపడతారు. ఆ తర్వాత తన తోబుట్టువుల పోషణ బాధ్యత తీసుకోవాల్సి రావడం వల్ల ఆదర్శంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. మొదట జన్మించిన పిల్లలు అధునాతన అభిజ్ఞాభివృద్ధిని కలిగి ఉంటారని పరిశోధన కనుగొంది, ఇది చదువులో మంచి ఫలితాలను సాధించేందుకు ఉపయోగపడుతుంది. మిడిల్ చైల్డ్ తనకన్నా పెద్ద బిడ్డకు, చిన్న బిడ్డకు మధ్య విభేదాలకు మధ్యవర్తిత్వం వహించాల్సిన అవసరం ఉన్నందున, మధ్య పిల్లలు కుటుంబంలో శాంతిని కలిగించేవారుగా ఉంటారని అడ్లర్ సూచించాడు. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల వారి దృష్టిని ఆకర్షించేందుకు, ఆదరణ పొందేందుకు వారిని ఆహ్లాదపరచేలా ప్రవర్తిస్తారు. తోబుట్టువులతో నిరంతరం పోటీలో ఉన్నట్లు అనిపించవచ్చు. వీరిలో అభద్రతా భావం, తిరస్కరణ భయం, బలహీనమైన ఆత్మవిశ్వాసం ఉండవచ్చు. తిరస్కరణ పట్ల సున్నితంగా ఉంటారు. తోబుట్టువులకు భిన్నంగా నిలబడాలనుకున్నప్పుడు తిరుగుబాటు లక్షణాలను కలిగి ఉంటారు. మధ్య పిల్లలు తమ తల్లులతో సన్నిహితంగా ఉండే అవకాశం తక్కువగా ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆఖరి బిడ్డ చివరి బిడ్డ పుట్టే కాలానికి తల్లిదండ్రులకు పిల్లల పెంపకంలో అనుభవం ఉండటం వల్ల కొన్నిసార్లు తక్కువ కఠినంగా ఉంటారు. చివరి బిడ్డ అని గారాబంగా పెంచడంవల్ల, మిగతావారితో పోల్చినప్పుడు చెడిపోయినట్లు కనిపిస్తారు. చిన్నపిల్లలుగా దొరికే స్వేచ్ఛవల్ల కలివిడిగా, స్నేహంగా, చార్మింగ్గా ఉంటారు. అయితే ఈ పిల్లలు తక్కువ స్వీయ–నియంత్రణ నైపుణ్యాలను కలిగి ఉండవచ్చు. ఇతరులపై ఎక్కువ ఆధారపడవచ్చు. మేనిప్యులేటివ్గా, అపరిపక్వంగా, సెల్ఫ్ సెంటర్డ్గా కనిపిస్తారు. ఏకైక సంతానం కుటుంబంలో ఏకైక సంతానంగా ఉన్నవారు తల్లిదండ్రుల దృష్టిని, వనరులను తోబుట్టువులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలతో ఎక్కువగా సంభాషిస్తారు కాబట్టి, వయసుకు మించి పరిణతి చెందినట్లు కనిపిస్తారు. క్రియేటివ్ ఆలోచనలతో ఏకాంత సమయాన్ని ఆస్వాదిస్తారు. తన ప్రవర్తనపై నియంత్రణ కలిగి ఉంటారు. తల్లిదండ్రుల అధిక అంచనాల కారణంగా అన్నీ ఫర్ఫెక్ట్గా ఉండాలనే ధోరణి కలిగి ఉంటారు. జీవితంలో ఉన్నతమైనదాన్ని సాధించాలనే కోరిక ఉంటుంది. సాధిస్తారు. స్వావలంబన, ఊహాత్మక ధోరణి ఉంటుంది. సెన్సిటివ్గా ఉంటారు. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
నియోజకవర్గానికి రూ.కోటి
సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో తాగునీటి నిర్వహణ బాధ్యతను పూర్తిగా సర్పంచ్లకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ఆదేశించారు. అయితే సర్పంచ్ల పదవీకాలం నెలాఖరుతో ముగుస్తున్నందున అధికారులు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. రోడ్లు–భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్కతో కలసి సచివాలయంలో మంగళవారం ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ సమీక్షించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్డీఎఫ్) కింద కేటాయించిన రూ.10 కోట్లలోంచి రూ. కోటి చొప్పున తాగునీటి అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్ లాంటి కొత్త రిజర్వాయర్లన్నింటినీ తాగునీటి అవసరాలకు ఉపయోగించుకోవాలని.. తద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటి సరఫరా సులభమవుతుందని సీఎం తెలిపారు. గ్రామాల వరకు రక్షిత మంచినీటిని సరఫరా చేసే బాధ్యతను మిషన్ భగీరథ విభాగమే తీసుకోవాలని, ఇంటింటికీ నీళ్లను అందించే బాధ్యతను సర్పంచ్లకు అప్పగించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి నిర్వహణ, నల్లాలు, పైపులైన్ల మెయింటెనెన్స్ను సర్పంచులకే అప్పగించాలన్నారు. నీరురాని గ్రామాల సర్వే.. రాష్ట్రంలో ఏయే ప్రాంతాలకు తాగునీరు అందట్లేదో సమగ్ర సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. సంబంధిత ఇంజనీర్లు అన్ని గ్రామాలకు వెళ్లి నిజ నిర్ధారణ బృందం చేసినట్లుగానే పక్కాగా తాగునీరు అందని ఆవాసాల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్ నిధులు రాబట్టుకొనేలా కొత్త ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి పంపించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు... స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేయాలని, వాళ్లకు ఆర్థికంగా చేయాతను అందించే కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్ల విద్యార్థిని విద్యార్థులు, పోలీసులకు అందించే యూనిఫామ్లను కుట్టించే పనిని ఈ సంఘాల మహిళలకు అప్పగించాలని సూచించారు. రహదారులు లేని గ్రామాలకు తారురోడ్లు... రోడ్డు సౌకర్యంలేని గ్రామాల్లో రోడ్లను నిర్మించాలని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 422 గ్రామ పంచాయతీలు, 3,177 ఆవాసాలకు ఇప్పటికీ రోడ్డు కనెక్టివిటీ లేదని అధికారులు సీఎంకు నివేదించగా వాటన్నింటికీ తారురోడ్లు వేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే ఉపాధి హామీ నిధులను అనుసంధానించి వాటిని పూర్తి చేయా లని చెప్పారు. ఈ బడ్జెట్లోనే అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. గత ప్రభుత్వ నిర్వాకంతో కేంద్ర నిధులు రాలేదు.. తెలంగాణలో ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచి్చనట్లు గత ప్రభుత్వం చెప్పుకోవడంతో రాష్ట్రానికి నష్టమే తప్ప లాభం జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ ప్రకటనలతో కేంద్రం నుంచి జలజీవన్ మిషన్ నిధులు రాకుండా పోయాయన్నారు. ఇకపై వాస్తవాలను దాచిపెట్టి గొప్పలకు పోవాల్సిన అవసరం లేదని అధికారులకు సూచించారు. -
విభజన హామీలపై నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేటీ రామారావు, హరీశ్రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్హెచ్ఏఐ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్ నిమ్జ్కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు. త్వరలో అన్ని కార్యక్రమాలకు..! ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. లోక్సభ ఎన్నికలపై దిశా నిర్దేశం లోక్సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. -
ఒకేసారి 150 విమానాలు.. హైదరాబాద్ వేదికగా ఆర్డర్
WingsIndia2024: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్లైన్స్ ఏకంగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఆకాశ ఎయిర్ భారతదేశపు సరికొత్త విమానయాన సంస్థ అయినప్పటికీ.. 2022లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి నాలుగు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ గతంలో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 22 విమానాలను డెలివరీ చేసుకుని నిర్వహణలో ఉంచింది. అంతర్జాతీయ విస్తరణ వైపు అడుగులు వేస్తున్న ఆకాశ ఎయిర్ ప్రణాళికలో భాగంగానే ఈ కొత్త ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. భారత్ నుంచి ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ సహా సమీప విదేశీ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బోయింగ్ విమానాలను ఉపయోగిస్తారు. ఇదీ చదవండి: టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే? గత ఏడాది మరో ఎయిర్లైన్స్లో చేరటానికి ఎలాంటి నోటీసు లేకుండానే సుమారు 40 మంది పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సంస్థ సంక్షోభంలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆకాశ ఎయిర్ తన కార్య కలాపాలను నిలిపివేసే అవకాశం ఉందని చాలామంది భావించారు. ఆ తరువాత కొత్త ఫైలెట్లను నియమించుకుని ముందుకు సాగుతోంది. Thank you, Hon’ble @JM_Scindia for your constant support and encouragement. We are proud to be a part of the India growth story and are committed to create an inclusive travel environment by connecting people, places, and cultures. #AkasaAir #ItsYourSky #WingsIndia2024 https://t.co/5AhlZ30z1j — Akasa Air (@AkasaAir) January 18, 2024 -
రూ. 1,127 కోట్ల ఆర్డర్.. పెద్ద ప్రయత్నమే చేస్తున్న బీఎస్ఎన్ఎల్
ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికామ్ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ప్రయత్నమే చేస్తోంది. తమ ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ (OTN) ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా మార్చేయబోతోంది. ఇందుకోసం హెచ్ఎఫ్సీఎల్ లిమిటెడ్ (HFCL) అనే కంపెనీకి భారీ ఆర్డర్ ఇచ్చింది. ఆప్టికల్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ మార్పు కోసం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నుంచి రూ. 1,127 కోట్ల ఆర్డర్ను పొందినట్లు హెచ్ఎఫ్సీఎల్ తాజాగా తెలిపింది. ఈ సంస్థ చేపట్టే సమగ్ర నెట్వర్క్ అప్గ్రేడ్ కేవలం కంపెనీ బ్రాడ్బ్యాండ్ సేవల అవసరాలను తీర్చడమే కాకుండా రాబోయే సంవత్సరాల్లో మెరుగైన 4జీ సేవలను అందించడంతోపాటు 5జీ సర్వీస్పైనా దృష్టి పెట్టే స్థాయిలో బీఎస్ఎన్ఎల్ను నిలుపుతుందని భావిస్తున్నారు. సంక్లిష్ట వ్యవస్థలను ఏకీకృతం చేయడంలో తమ అసమానమైన నైపుణ్యంతో అత్యాధునిక ఆప్టికల్ టెక్నాలజీని అమలు చేయడానికి నోకియా (NOKIA) నెట్వర్క్తో వ్యూహాత్మకంగా భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు హెచ్ఎఫ్సీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. -
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్: 51 టెంకాయలు ఆర్డర్.. ‘ఎక్స్’ పోస్ట్ వైరల్!
అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగింది. భారత్ విజయం కోసం కోట్లాది మంది భారతీయులు ఎంతో ఆతృతంగా ఎదురు చూశారు.. అన్ని వర్గాల వారు ఆకాంక్షించారు.. ప్రార్థనలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వరల్డ్ కప్లో భారత్ విజయం సాధించి కప్ గెలిస్తే కొట్టడానికి 51 టెంకాయలను థానేకు చెందిన ఓ వ్యక్తి ఫుడ్డెలివరీ యాప్ స్విగ్గీలో ఆర్డర్ చేశారు. ఈ సమాచారాన్ని స్విగ్గీ సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. థానే నుంచి ఎవరో ఇప్పుడే 51 టెంకాయలు ఆర్డర్ చేశారు. బహుశా వరల్డ్ కప్ ఫైనల్ గెలుపు కోసమే అయిఉండచ్చు. అదే నిజమై భారత్కు కప్ రావాలని ఆకాంక్షించింది. కాగా స్విగ్గీ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ఆర్డర్ చేసింది తానే అంటూ ఓ వ్యక్తి స్విగ్గీ పోస్ట్ను రీట్వీట్ చేశారు. భారత్ వరల్డ్ కప్ గెలిస్తే కొట్టడానికే టెంకాయలు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. టీవీ ముందు టెంకాయలు ఉంచిన దృశ్యాన్ని ఈ ట్వీట్కు జత చేశారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. లక్షల్లో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. కాగా ఇదే వ్యక్తి భారత్ విజయాన్ని వ్యక్తీకరించడానికి 240 అగరబత్తులను ఆర్డర్ చేశారు. haan bhay yeh someone from thane bhi mai hi hoon, 51 nariyal for unreal manifestation✨ https://t.co/aNa3WACNOp pic.twitter.com/kVuQ6WjCjH — gordon (@gordonramashray) November 19, 2023 -
వ్యభిచారాన్ని మళ్లీ నేరంగా పరిగణించాలి: ఎంపీ ప్యానెల్
ఢిల్లీ: కొత్త నేర న్యాయ బిల్లులపై సమీక్ష చేపట్టిన పార్లమెంటరీ ప్యానెల్.. కీలక సవరణలు చేసింది. సుప్రీంకోర్టు కొట్టేసిన సెక్షన్ 497(వ్యభిచారం)ని మళ్లీ నేరంగా పరిగణించాలని అంటోంది. వివాహ వ్వవస్థ పవిత్రమైనది దానిని పరిరక్షించాలని పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిల్లులపై తన రిపోర్టును కేంద్రానికి సమర్ఫించింది. ప్రతిపాదిత సవరణలో లింగ-తటస్థ (gender-neutral ) నేరంగా పరిగణించాలని నివేదికలో పేర్కొంది. ఈ కేసుల్లో పురుషుడు, మహిళ సమాన బాధ్యత వహించాలని పిలుపునిచ్చింది. భారతీయ న్యాయ సంహితపై తదుపరి పరిశీలన కోసం బీజేపీ ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదికను ఒక వేళ పార్లమెంట్ ఆమోదం తెలిపితే.. వివాహేతర సంబంధాలపై 2018 నాటి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పును పక్కకు పెట్టినట్లవుతుంది. బ్రిటిష్ కాలం నాటి చట్టాలు.. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల స్థానంలో.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023 లను కేంద్రం తేనుంది. వీటిని పార్లమెంట్లో ప్రవేశపెట్టి.. తదుపరి పరిశీలన కోసం బీజెపి ఎంపీ బ్రిజ్ లాల్ నేతృత్వంలోని హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి ఆగస్టులో పంపారు. సుప్రీం తీర్పు.. వివాహేతర సంబంధం నేరం కాదంటూ 2018 సెప్టెంబర్లో తీర్పు ఇచ్చింది సర్వోన్నత న్యాయస్థానం. ఓ ప్రవాస భారతీయుడు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. వ్యభిచారం నేరంగా పేర్కొంటున్న ఐపీసీ సెక్షన్ 497 రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. ‘‘మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్న సెక్షన్ 497కు కాలం చెల్లింది, అది రాజ్యాంగ విరుద్ధం’’ అని ప్రకటించింది. ఇదీ చదవండి: 377, 497 సెక్షన్లు మళ్లీనా?.. భారతీయ న్యాయ సంహిత బిల్లులో సవరణలతో చేర్చే ప్రతిపాదన! -
పేదల ఇళ్లకు పావలా వడ్డీకే రుణాలు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను సొంతంగా నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే ఇళ్ల లబ్ధిదారుల్లో 79 శాతం మందికి పావలా వడ్డీకే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.80 లక్షలు ఇస్తుండగా.. ఈ మొత్తానికి అదనంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.35 వేల చొప్పున పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయిస్తోంది. లబ్ధిదారులకు ఉచితంగానే ఇసుక సరఫరా చేస్తున్న ప్రభుత్వం ఇంటికి అవసరమైన ఇతర సామగ్రిని తక్కువ ధరకే సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 16,06,301 మంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా.. ఇందులో 12,61,203 మందికి పావలా వడ్డీకి రూ.4,443.13 కోట్ల రుణాన్ని బ్యాంకులు మంజూరు చేశాయి. ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు మంజూరు మహిళల పేరుతో చేసినందున పావలా వడ్డీ రుణాలు మహిళల పేరుమీదే ఇస్తున్నారు. నిర్మాణాలపై సీఎస్ సమీక్ష ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పేదల ఇళ్ల నిర్మాణాల పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి సమీక్షించారు. వర్షాకాలం ముగిసిన దృష్ట్యా ఇళ్ల నిర్మాణాలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి వారం ఎన్ని ఇళ్లు పూర్తి చేయాలనేది లక్ష్యంగా నిర్ణయించుకుని.. ఆ లక్ష్యాలను సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు తరచూ ఇళ్ల నిర్మాణాల పురోగతిని సమీక్షించాలని సూచించారు. పావలా వడ్డీ రుణాలు మంజూరు చేయించడంపై శ్రీకాకుళం, ఎన్టీఆర్, చిత్తూరు, నెల్లూరు, విశాఖ జిల్లా కలెక్టర్లు మరింత దృష్టి సారించాలని సీఎస్ ఆదేశించారు. వెనుకబడిన జిల్లాల్లో మరింత దృష్టి లబ్ధిదారులకు మరింత ఆర్థిక వెసులుబాటు కల్పించేలా బ్యాంకుల ద్వారా పావలా వడ్డీకే రుణాలు మంజూరు చేస్తున్నామని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్జైన్ చెప్పారు. ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ప్రత్యేక సూచనలు ఇచ్చారన్నారు. పావలా వడ్డీ రుణాలు మంజూరులో నాలుగైదు జిల్లాలు వెనుకబడగా.. ఆయా కలెక్టర్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారన్నారు. ఇప్పటికే ఐదు లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసినందున అదే స్ఫూర్తితో రెండో దశలో మరో ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు వారం వారం లక్ష్యాలను నిర్థేశించుకోవాలని జైన్ పేర్కొన్నారు. -
అధికారుల నిర్లక్ష్యం.. బెయిల్ వచ్చినా మూడేళ్లు జైళ్లోనే..
అహ్మదాబాద్: గుజరాత్లో విస్తుపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. జైలు అధికారుల నిర్లక్ష్యం ఓ దోషి పాలిట శాపంగా మారింది. బెయిల్ వచ్చినప్పటికీ మూడేళ్లపాటు జైలులోనే ఉండాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు.. లక్ష రూపాయల జరిమానా విధించింది. చందన్ జీ ఠాకూర్(27)కు ఓ కేసులో జీవితఖైదు శిక్ష పడింది. సెప్టెంబర్ 29, 2020న హైకోర్టు అతని శిక్షను నిలిపివేసింది. అందుకు సంబంధించిన ఆర్డర్ పత్రాలను హైకోర్టు రిజిస్ట్రీ మెయిల్ ద్వారా పంపించింది. ఆ మెయిల్ అటాచ్మెంట్ను జైలు అధికారులు ఓపెన్ చేయలేదు. దీంతో చందన్ ఠాకూర్ ఇప్పటివరకు జైలులోనే ఉండాల్సి వచ్చింది. బెయిల్ కోసం మళ్లీ కోర్టును సంప్రదించగా.. విషయం వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు కోర్టు పంపిన ఆర్డర్ కాపీలను మెయిల్లో ఓపెన్ చేయలేదనే విషయం ఈ వ్యవహారంలో బయటపడింది. దీనికారణంగా చందన్ ఠాకూర్కు శిక్ష నుంచి విముక్తి కలిగినా.. ప్రయోజనం లభించలేదు. ఈ విషయాన్ని కోర్టు సీరియస్గా తీసుకుంది. జైలు అధికారుల నిర్లక్ష్యానికి రూ.లక్ష రూపాయల జరిమానా విధించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఇదీ చదవండి: జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక -
ఆర్టీసీకి 910 కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: మూడునెలల్లో ఆర్టీసీకి 910 కొత్త బస్సులు సమకూరబోతున్నాయి. చాలా కాలంగా పాతబడ్డ బస్సులతో లాక్కొస్తుండగా, వాటిల్లోంచి కొన్నింటిని తుక్కుగా మార్చేసి.. కొత్త బస్సులు అందుబాటులోకి తేవాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే టెండర్లు పిలవగా టాటా, అశోక్ లేలాండ్ కంపెనీలు తక్కువ కొటే షన్తో ముందుకొచ్చాయి. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నెగోషియేషన్స్ ద్వారా వాటి కొటేషన్ మొత్తాన్ని కొంతమేర తగ్గించేందుకు ఆర్టీసీ అధి కారులు చర్చలు జరుపుతున్నారు. మరికొద్ది రో జుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, రెండు కంపెనీలు ఒకే ధరకు ముందుకొచ్చేలా చేసి, వాటికే ఆర్డర్ ఇవ్వాలని చూస్తున్నారు. ఈ నెలలోనే కంపెనీ లకు బస్సులు ఆర్డర్ ఇస్తే...బస్ బాడీల నిర్మా ణానికి మూడు నెలల సమయం పడుతుంది. ఎక్స్ప్రెస్ బస్సులు 540 ఆర్టీసీలో బాగా డిమాండ్ ఉన్న ఎక్స్ప్రెస్ కేటగిరీని బలోపేతం చేయాలని సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం అద్దె బస్సులుపోను సొంతంగా 1,800 వరకు ఎక్స్ప్రెస్ బస్సులున్నాయి. ఇవి ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తూ ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. దూర ప్రాంత పట్టణాల మధ్య ఇవి తిరుగుతున్నాయి. కొన్ని ఇతర రాష్ట్రాలకు కూడా వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో 540 కొత్త ఎక్స్ప్రెస్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ అనుకుంటోంది. వాటి రాకతో డొక్కు ఎక్స్ప్రెస్ బస్సులు అదే సంఖ్యలో తొలగిస్తారు. వాటిల్లో కొన్నింటిని సిటీ బస్సులుగా, మరికొన్నింటిని పల్లెవెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. అంతమేర సిటీ, పల్లెవెలుగు పాత డొక్కు బస్సులను తుక్కుగా మారుస్తారు. స్లీపర్ కమ్ సీటర్ రాజధాని బస్సులు 50 లేదా 60 ఇక దూరప్రాంత పట్టణాల మధ్య తిరుగుతున్న రాజధాని (ఏసీ) బస్సులకు కూడా మంచి ఆదరణ ఉంది. ప్రస్తుతం ఉన్న బస్సులు బాగా పాతబడిపోయాయి. వాటిల్లోంచి మరీ పాత బస్సులను తొలగించి కొన్ని కొత్తవి సమకూ ర్చాలన్న ఉద్దేశంతో 50 లేదా 60 బస్సులు కొంటున్నారు. ప్రస్తుతం రాజధాని కేటగిరీ బస్సు లన్నీ సీటర్ బస్సులే. తొలిసారి ఆ కేటగిరీలో స్లీపర్ బస్సులు సమకూర్చనున్నారు. పైన కొన్ని బెర్తులు, దిగువ సీట్లు ఉండే స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తీసుకోవాలని నిర్ణయించారు. ఎట్టకేలకు పల్లెవెలుగుకు కొత్త బస్సులు సాధారణంగా ఎక్స్ప్రెస్, రాజధాని బస్సులు పాతబడ్డాక వాటిని తొలగించి సిటీ ఆర్డినరీ, పల్లె వెలుగు బస్సులుగా కన్వర్ట్ చేస్తారు. దీంతో ఆ బస్సులు చాలా పాతబడి ఉంటున్నాయి. అయితే కొత్తగా ఇప్పుడు 100 నుంచి 120 మధ్యలో కొత్త బస్సులు సమకూర్చాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం చాలా ఊళ్లకు అద్దె బస్సులే నడుస్తున్నాయి. మరో 200 కొత్త బస్సులు హైదరాబాద్ సిటీకి కేటాయిస్తారు. -
కస్టోడియల్ మరణంపై సీసీటీవీ ఫుటేజీ అందజేయండి
సాక్షి, హైదరాబాద్: కస్టోడియల్ మరణం చోటుచేసుకున్న హైదరా బాద్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లోని జూలై 7వ తేదీ నాటి సీసీటీవీ ఫుటేజీని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆ ఫుటేజీని చాంబర్లోగానీ, లేదా వీలైతే కోర్టుహాల్లోగానీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్స్టేషన్లలో ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.. ఎన్నిచోట్ల పనిచేస్తున్నాయి.. ఎన్నిచోట్ల పనిచేయడంలేదు.. లాంటి వివరాలతో నివేదిక అందజేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో భవన నిర్మాణకార్మికుడు గత నెల 7న అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. బిహార్కు చెందిన నితీశ్ నానక్రాంగూడలో భవన నిర్మాణకార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడి భద్రతాసిబ్బంది, కార్మికులు రెండువర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నితీశ్ని అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీస్స్టేషన్కు తరలించగా అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. పత్రికల్లో వచ్చిన నితీశ్ మృతి వార్తపై న్యాయవాది రాపోలు భాస్కర్ స్పందించి కస్టోడియల్ మరణంపై న్యాయ విచారణ జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 15 రోజులు గడువు కావాలి.. ‘మద్యం సేవించేందుకు అర్థరాత్రి భవన నిర్మాణకార్మికులు బయటకు వెళ్లకుండా ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో గొడవ జరిగింది. ఈ వివాదంలో నితీశ్ను పోలీసుస్టేషన్కు తీసుకువెళ్లిన పోలీసులు మూడు రోజులపాటు లాకప్లో ఉంచి విచారణ చేశారు. తీవ్ర అస్వస్థతకు గురైన నితీశ్ను ఆస్పత్రికి తరలించగా మృతిచెందాడు. పోలీసుల చిత్రహింసల వల్లే అతడు చనిపోయా డని పత్రికల్లో వచ్చింది. అయితే ఆయన గుండెపోటుతోనే చని పోయాడని పోలీసులు పేర్కొంటున్నారు’అని న్యాయవాది లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను సుమోటో రిట్ పిటిషన్గా హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం గురువా రం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్రావు వాదనలు వినిపిస్తూ.. గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని, ఫుటేజీ సమర్పిస్తామని చెప్పారు. దీనికి 15 రోజుల గడువు కావాలని కోరారు. గుండెపోటు కారణంగానే బాధితుడు మృతి చెందాడన్నారు. సీసీటీవీ ఫుటేజీని సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న ధర్మాసనం ఆ ఫుటేజీని సమర్పించాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. -
Nuh violence: బుల్డోజర్ యాక్షన్కు హైకోర్టు బ్రేక్..
చండీగఢ్: హర్యానాలోని నుహ్ జిల్లాలో అల్లర్లు చెలరేగిన తర్వాత అక్కడి ప్రభుత్వం బుల్డోజర్ యాక్షన్కు దిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ఈ చర్యలను నిలిపివేయాలని హర్యానా, పంజాబ్ హైకోర్టులు తాజాగా ఆదేశాలు జారీ చేశాయి. దీంతో బుల్డోజర్తో బవనాల కూల్చివేత చర్యలను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు కూల్చివేత చర్యలను నిలిపివేయాలని రాష్ట్ర డిప్యూటీ కమిషనర్ ధీరేంద్ర ఖడ్కట సంబంధిత అధికారులను ఆదేశించారు. హర్యానాలో మతపరమైన ఘర్షణలు చెలరేగిన అనంతరం ఈ వ్యవహారాన్ని కోర్టు సుమోటుగా తీసుకుని విచారణ చేపట్టింది. బుల్డోజర్ యాక్షన్లో ఇప్పటివరకు 350 గుడిసెలు, 50 సిమెంట్ నిర్మాణాలను ప్రభుత్వం కూల్చివేసింది. అయితే.. ప్రభుత్వ చర్య రాజకీయంగా విమర్శలకు దారితీసింది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు జరుగుతున్నాయని ప్రతిపక్ష నాయకులు ఆరోపించారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండానే కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తాము అక్రమ నిర్మాణాలను మాత్రమే కూల్చివేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. నూహ్ జిల్లాలో అల్లర్లకు కారణమైన సహారా హోటల్ను ఆదివారం బుల్డోజర్లు కూల్చివేశాయి. ఇదే భవనం పైనుండి అల్లరిమూకలు మతపరమైన ఊరేగింపుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఇప్పటికే నాలుగు రోజులుగా కొనసాగుతోన్న ఈ ప్రక్రియలో సుమారు 50-60 ఇళ్ళు నేలమట్టమయ్యాయి. సంఘటనా స్థలానికి 20కి.మీ దూరంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారి ఇళ్లతో పాటు సుమారు డజను దుకాణాలు, మందుల షాపులు ధ్వంసం చేసినట్లు తెలిపాయి పోలీసు వర్గాలు. విశ్వ హిందూ పరిషత్ రథయాత్రపై కొందరు అల్లరి మూకలు రాళ్ల దాడి చేయడంతో హర్యానాలో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు వాహనాలకు నిప్పంటించారు. ఊరేగింపులో పాల్గొన్న 2500 మంది భయంతో స్థానిక దేవాలయంలో ప్రాణాలు కాపాడుకున్నారు. అదే రోజు రాత్రి స్థానికంగా మసీదు దగ్దం కావడం అల్లర్ల తీవ్రతను మరింత పెంచింది. ఇదీ చదవండి: శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే నివాసంలో అలజడి.. వీడియో వైరల్.. -
కఠిన చర్యలు తప్పవు
సాక్షి, అమరావతి: పుంగనూరు ఘటనపై విచారణకు ఆదేశించామని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారందరిపై కఠిన చర్యలు తప్పవని డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. ఘటన పూర్వాపరాలపై విచారణ జరపాలని డీఐజీ అమ్మిరెడ్డి, ఎస్పీ రిషాంత్లను ఆదేశించామన్నారు. ఈ విషయమై శనివారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. చంద్రబాబు పర్యటన సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో పోలీసులు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. అక్కడ వాహనాలను సైతం టీడీపీ కార్యకర్తలు ఉద్దేశపూర్వకంగా తగులబెట్టారని చెప్పారు. రాళ్లు రువ్విన, నిప్పు పెట్టిన వారందరినీ గుర్తించామన్నారు. ఘటన స్థలిలో సీసీ కెమెరా పుటేజీలను విశ్లేషస్తున్నామని, ఇప్పటికే పలువురిని గుర్తించామని.. మరికొందరు అనుమానితుల కదలికలపై నిఘా పెట్టామన్నారు. చంద్రబాబు రూట్ ప్లాన్ మార్పు వ్యవహారం కూడా విచారణలో తేలుతుందన్నారు. చంద్రబాబు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలపై కూడా దృష్టి పెట్టామని చెప్పారు. -
ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా..ఏం చర్యలు తీసుకున్నారు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ‘రాష్ట్రంలో వరద కారణంగా ఇంతవరకు ఎంతమంది చనిపోయారు? డిజాస్టర్ చట్టం ప్రకారం ఎంతమందిని రక్షించారు? గోదావరి తీర ప్రాంత గ్రామాల రక్షణకు ఏం చర్యలు చేపట్టారు? బాధితులకు కనీస సౌకర్యాలు అందిస్తున్నారా? వరదలపై వార్రూమ్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? ఎన్నికలప్పుడు ఏర్పాటు చేస్తారు కానీ.. వరదలు లాంటి అత్యవసర సమయంలో ఏర్పాటు చేయరా?..’అని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఓ నివేదికను సోమవారం అందజేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొద్ది రోజులుగా వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వెల్లడించడం లేదని, రక్షణ చర్యలు తీసుకునేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్కుమార్ ధర్మాసనం శుక్రవారం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పడం లేదు.. ‘వర్షాలు, వరదలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం హెచ్చరించింది. ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో వరదల కారణంగా 19 మంది మృతి చెందారని పత్రికల్లో వస్తున్న వార్తలు తెలియజేస్తున్నాయి. వరదలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని కేంద్రం మరోసారి తెలియజేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వరదల నుంచి ప్రజలను రక్షించడానికి ఏం చర్యలు తీసుకున్నారు? ఎంత మంది మరణించారు? లాంటి వివరాలను వెల్లడించడం లేదు. కడెం ప్రాజెక్టు వద్ద తీవ్ర భయానక పరిస్థితి కొనసాగుతోంది. ప్రాజెక్టు తెగితే వందల గ్రామాలు నీట మునగడంతో పాటు లక్షల మంది నిరాశ్రయులుగా మారే అవకాశం ఉంది..’అంటూ న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, పల్లె ప్రదీప్కుమార్ కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో ‘వరద బాధితులకు తక్షణమే కనీస సౌకర్యాలు అందేలా ఏర్పాట్లు చేయాలి. కడెం ప్రాజెక్టు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని భద్రతా చట్ట ప్రకారం చర్యలు చేపట్టి వెంటనే రక్షించాలి. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకుండా చూడాలి..’అని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. తదు పరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. -
బిర్యానీపై హైదరాబాదీలకు తరగని మోజు.. కోటిన్నర బిర్యానీల ఆర్డర్!
గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72 లక్షలకు పైగా బిర్యానీ ఆర్డర్లను గత 12 నెలల్లో 150 లక్షల బిర్యానీ ఆర్డర్లను అందుకున్నారు. బిర్యానీపై తరగని మోజుకు, నగరానికి బిర్యానీకి మధ్య ఉన్న అనుబంధానికి అద్దం పడుతుంది. ధమ్ బిర్యానీ చాంపియన్... గత ఐదున్నర నెలల్లో, 2022 ఇదే కాలంతో పోలిస్తే నగరంలో బిర్యానీ ఆర్డర్లలో 8.39% వృద్ధి నమోదైంది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్లతో తిరుగులేని చాంపియన్గా నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్లతో సువాసనగల ఫ్లేవర్డ్ బిర్యానీ తన సత్తా చాట గా, బ్యాచిలర్స్, సింగిల్స్కి అలవాటైన మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్లను అందుకుంది. బిర్యానీ ప్రియత్వం ఓ రేంజ్లో ఉండటంతో నగరంలో దాదాపు 15,000 పైగా రెస్టారెంట్లు తమ మెనూలో బిర్యానీని తప్పనిసరి డిష్గా అందజేస్తున్నాయి. బిర్యానీలు అందించే రెస్టారెంట్స్ అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లో కూకట్పల్లి, మాదాపూర్, అమీర్పేట్, బంజారాహిల్స్, కొత్తపేట్ – దిల్సుఖ్నగర్ ఉన్నాయి, కూకట్పల్లి టాప్... హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో ఆర్డర్ పరిమాణం పరంగా అత్యధిక బిర్యానీ వినియోగం జరిగింది. వీటిలో. కూకట్పల్లి నెంబర్ వన్ కిరీటం అందుకుంటోంది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి. నగరవాసులు వేలూ లక్షల బిర్యానీలు హాంఫట్ మనిపిస్తున్నారు. ఏ యేటికాయేడు బిర్యానీ పై తమ ఇష్టాన్ని పెంచుకుంటూనే ఉన్నారు. ఆదివారం ప్రపంచ బిర్యానీ దినోత్సవం సందర్భంగా, ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గి నిర్వహించిన ఓ అధ్యయనం ఒక్క ఏడాదిలో.. కోటిన్నర బిర్యానీలు నగరం ఆరగించేసిందని తేల్చింది. – సాక్షి, సిటీబ్యూరో బిర్యానీ ఓ అనుభవం... నగరంలో బిర్యానీ ప్రియులతో మా ప్రయా ణం చాలా సుదీర్ఘమైనది. నగరవాసులకు బిర్యానీ అనేది కేవలం ఒక తినే వంటకం మాత్రమే కాదు అంతకు మించిన ఒక సంతోషకరమైన అనుభవం. ఈ ప్రపంచ బిర్యానీ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని రూ.199 నుంచే ప్రారంభం అవుతున్న మా బిర్యానీ వైరెటీలను నగరవాసులకు ఆస్వాదించవచ్చు. – కుశాగ్ర గుప్తా, వైస్ప్రెసిడెంట్, ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ -
శాకాహారంలో ‘ముక్క’..‘గతిమాన్’లో గగ్గోలు!
ఆ రైలులోని ప్రయాణికులు వెజ్ ఆర్డర్ చేశారు. అయితే వారికి నాన్ వెజ్ సర్వ్ అయ్యింది. దీంతోవారు క్యాటరింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. దానికి వారు ఇచ్చిన సమాధానం విని కంగుతినడం ప్రయాణికుల వంతయ్యింది. గతిమాన్ ఎక్స్ప్రెస్లో వీరాంగన లక్ష్మీబాయి రైల్వేస్టేషన్(జాన్సీ, ఉత్తరప్రదేశ్) నుంచి హజ్రత్ నిజాముద్దీన్కు వెళుతున్న ప్రయాణికులకు అందించిన వెజ్ ఆహారంలో మాంసపు ముక్క రావడంతో కలకలం చెలరేగింది. ఈ ఘటన శనివారం గతిమాన్ ఎక్స్ప్రెస్(12049)లో చోటుచేసుకుంది. ప్రయాణికులలో ఒకరైన రాజేష్ కుమార్ తివారి తన భార్య ప్రీతి తివారితో పాటు కోచ్ నం.సీ7లో ప్రయాణిస్తున్నారు. రైలు జాన్సీ దాటిన తరువాత క్యాటరింగ్ స్టాప్ తివారితో.. ‘మీరు ఛోలే-కుల్ఛే తింటారా లేక పాస్తా తింటారా’ అని అడిగారు. దీనికి మనోజ్ తివారి తమకు ఛోలె-కుల్ఛే కావాలని అడిగారు. తరువాత వారికి వారు కోరిన ఆహారం అందించారు. లంచ్ చేసే సమయంలో రాజేష్ తివారి తమకు అందించిన ఆహారంలో మాంసపు ముక్క ఉండటాన్ని గమనించారు. వెంటనే ఈ విషయాన్ని కేటరింగ్ స్టాఫ్కు తెలియజేశారు. తనకు ఎదురైన అనుభవం గురించి రాజేష్ తివారి మీడియాతో మాట్లాడుతూ తాను ఆహారంలో మాంసం వచ్చిన విషయాన్ని అక్కడికి స్టాఫ్కు తెలియజేయగా వారు తమ సూపర్వైజర్ను పిలిచారన్నారు. ఆయన ఆ ఆహారాన్ని గమనించి, మాంసం ఉన్న సంగతిని అంగీకరించారన్నారు. అయితే ఈ ఆహారం తాము ప్యాక్ చేయలేదన్నారు. ఆహారం కిచెన్ నుంచి ప్యాక్ అయి వస్తుందని, తాము కేవలం సర్వ్ చేస్తామని సమాధానమిచ్చారన్నారు. ఇదే రైలులో గ్వాలియర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ప్రయాణికురాలు కృతికా మోదీ మాట్లాడుతూ తాను ఆహారంలో ఛోలె-కుల్ఛే ఆర్డర్ చేయగా, తనకు పాస్తా ఇచ్చారని ఆరోపించారు. మరోమార్గం లేక దానినే తినవలసి వచ్చిందని ఆమె తెలిపారు. దానిలో చికెన్ ఉన్న విషయాన్ని గమనించానని అన్నారు. తాను దీనిపై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! -
ఆన్లైన్ ఆర్డర్లలో ఈ ఆర్డర్ వేరయా! రోజులు కాదు నాలుగేళ్లకు వచ్చి చేరింది
ఇప్పుడంతా ఆన్లైన్ మయమైంది. ఏం కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తున్నారు. ఎలాంటి కష్టం లేకుండా కావాల్సిన వస్తువులు ఇంటికి తెచ్చేసుకుంటున్నారు. ఐతే ఏదైనా వస్తువు ఆర్డర్ పెడితే.. మహా అయితే ఐదు నుంచి పది రోజుల్లో వచ్చేస్తుంది. అది కూడా ఆ వస్తువు వచ్చే ప్లేస్ని బట్టి కూడా డెలివరీ టైం అనేది ఉంటుంది. అంతేగాని సంవత్సరాలు పట్టదు. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం తాను ఆర్డర్ చేసిన వస్తువును అందుకోవడానికి రోజులు కాదు.. ఏకంగా నాలుగు సంవత్సరాలు పట్టింది. ఢిల్లీకి చెందిన నితిన్ అగర్వాల్ అనే వ్యక్తి 2019లో చైనా వెబ్సైట్ అలీబాబాకు చెందిన అలీ ఎక్స్ప్రెస్లో ఓ ఆర్డర్ పెట్టాడు. ఐతే ఆ పార్శిల్ సరిగ్గా జూన్ 23, 2023కి అతని వద్దకు చేరుకుంది. అంటే ఆ పార్శిల్ చేరడానికే నాలుగేళ్లు పట్టింది. ప్రస్తుతం ఈ వెబ్సైట్ని ఇండియాలో బ్యాన్ చేశారు. కాగా, ఒక్కసారిగా సదరు వ్యక్తి నితిన్ అగర్వాల్ ఆ పార్శిల్ని చూసి షాక్ అయ్యాడట! పైగా ఆ పార్శిల్పై ఆర్డర్ చేసిన టైం డెలివరి అయ్యిన తేది రెండు కూడా ఉన్నాయి. దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్లో నెటిజన్లతో ఈ విషయాన్ని పంచుకుంటూ.. ‘చివరి వరకు ఆశను వదులుకోకండి. ఆలస్యం కానిదే ఏ పని కాదు’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో నెటిజన్లు మీరు చాలా లక్కీ అని ఒకరూ, తాను ఆర్డర్ చేసింది కూడా ఏదో ఒక రోజు ఇలానే తన వద్దకు వస్తుందన్న హోప్ వచ్చిందని మరొకరూ ట్వీట్ లు చేశారు. Never lose hope! So, I ordered this from Ali Express (now banned in India) back in 2019 and the parcel was delivered today. pic.twitter.com/xRa5JADonK — Tech Bharat (Nitin Agarwal) (@techbharatco) June 21, 2023 (చదవండి: స్నానం అంటే ఏమిటి? ఎన్ని రకాలు..నీరు లేకుండా స్నానం చేయొచ్చు అని తెలుసా!) -
బిగ్ డీల్: బీఈఎల్కు రూ.5,900 కోట్ల ఆర్డర్లు
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ ఎల్రక్టానిక్స్ (బీఈఎల్) తాజాగా రూ.5,900 కోట్ల ఆర్డర్లకు చేజిక్కించుకుంది. ఇందులో ఆకాశ్ ప్రైమ్ వెపన్ సిస్టమ్ నుంచి రూ.3,914 కోట్ల ఆర్డర్ కూడా ఉంది. ఆర్డర్లలో భాగంగా శక్తి ఈడబ్లు్య, సాంకేత్, ఎంకే–3 (నావల్ సిస్టమ్స్), జామర్ సిస్టమ్స్, ఎంకేబీటీ సిస్టమ్స్, ఎంకే–12 క్రిప్టో మాడ్యూల్స్ తయారీ, రోహిణి రాడార్స్ ఎస్డీపీ డిస్ప్లే ఆధునీకరణ చేపడుతుంది. ఇవీ చదవండి: హైదరాబాద్లో కోరమ్ ‘డిస్ట్రిక్ట్150’: అయిదేళ్లలో 8కి పైగా వెంచర్లు WhatsApp Latest Features: స్పాం కాల్స్తో విసుగొస్తోందా? ఇదిగో వాట్సాప్ కొత్త ఫీచర్ -
మేఘా కంపెనీకి రూ.500 కోట్ల ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మేఘ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) అనుబంధ కంపెనీ ఐకామ్ టెలి తాజాగా భారత రక్షణ శాఖ నుంచి రూ. 500 కోట్ల ఆర్డర్ చేజిక్కించుకుంది. ఇందులో భాగంగా 5/7.5 టన్నుల రేడియో రిలే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ కంటైనర్స్ 1,035 యూనిట్లు సరఫరా చేయనుంది. రక్షణ శాఖతో ఈ మేరకు ఒప్పందం కుదిరిందని ఐకామ్ టెలి గురువారం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే డెలివరీలు ప్రారంభం అవుతాయని వివరించింది. -
రియల్ వార్ డ్రిల్కు ఆదేశించిన కిమ్!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ శుక్రవారం తన సైన్యాన్ని రియల్ వార్ కోసం కసరత్తులను మరింత తీవ్రతరం చేయమని ఆదేశించారు. ఈ సైనికి డ్రిల్ను ఆయన తన కుమార్తెతో కలిసి పర్యవేక్షించారు. కిమ్ ఆయన కుమార్తె ఇద్దరు నల్లటి జాకెట్లు ధరించి అధికారులతో కలిసి ఫిరంగి యూనిట్ క్షిపణుల మాస్ ఫైరింగ్ను వీక్షించారు. అయితే దక్షిణ కొరియా ఆ ప్రదేశం నుంచి ఉత్తరకొరియా ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపినట్లు గుర్తించామని, అక్కడ నుంచి మరిన్ని క్షిపణి ప్రయోగాలు జరిగే అవకాశం కూడా ఉందని పేర్కొంది. అంతేగాక అదికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) శుక్రవారం విడుదల చేసిన ఛాయచిత్రల ప్రకారం.. ఉత్తర కొరియా ఆరు క్షిపణులను ఒకేసారి పేల్చినట్లు చూపించాయి. ఇది స్ట్రైక్ మిషన్ల కోసం శిక్షణ పొందిందని కేసీఎన్ఏ తెలిపింది. ఉత్తర కొరియా పశ్చిమ జలాలే లక్ష్యంగా శక్తిమంతమైన దాడులు జరిగినట్లు కేసీఎన్ఏ పేర్కొంది. ఇదిలా ఉండగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు రెండు వ్యూహాత్మక మిషన్లను సిద్ధం చేశాడని.. ఒకటి యుద్ధాన్ని నిరోధించడానికి, రెండోది యుద్ధానికి సిద్ధం కావడం అని కిమ్ సైనికులు చెప్పారు. నిజమైన యుద్ధం కోసం వివిధ పరిస్థితుల్లో, విబిన్న రీతిలో ఎదర్కొనేలా కరత్తులను మరింత తీవ్రతరం చేయమని సైనికులను కిమ్ ఆదేశించాడు. దక్షిణ కొరియా, అమెరికా తోకలిసి సోమవారం అతిపెద్ద ఉమ్మడి సైనిక విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో ఉత్తర కొరియా ఈ డ్రిల్ నిర్వహించింది. కాగా, రెండు కొరియాల మధ్య దశాబ్దాలుగా సంబంధాలు మరింత క్షీణిస్తుండగా..మరోవైపు ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో దక్షిణ కొరియా ప్రతిస్పందనగా.. వాషింగ్టన్తో భద్రతా సహకారాన్ని పెంచుకుంటోంది. (చదవండి: చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్పింగ్! ముచ్చటగా మూడోసారి) -
ఇంటి పనికే పరిమితమైన భార్యకు కోటి రూపాయాలు చెల్లించమన్న కోర్టు!
ఇటీవల కాలంలో జంటలు పలు కారణాల రీత్యా విడిపోతుండటం చూస్తున్నాం. ఐతే విడిపోయేటప్పుడూ భర్త మాత్రం పెద్ద మొత్తంలో భార్యకు భరణం చెల్లించాల్సిందే. అది అందరికీ తెలిసిందే. ఇక్కడమ మాత్రం కోర్టు చాలా విచిత్రమైన అంశం లేవనెత్తి..గొప్ప తీర్పు ఇచ్చింది. ఇక్కడొక జంట ఏవో కారణాల రీత్యా విడాకుల కోసం కోర్టు మెట్లేక్కారు. అయితే ఆ కోర్టు భర్తకు ఊహించని షాక్ ఇచ్చింది. అలా ఇలాకాదు ఇన్నాళ్లు తనకు జీతభత్యం లేకుండా ఇంటి పనిచేసి, కుటుంబాన్ని చూసినందుకు కోటీ రూపాయాలు చెల్లాంచమంటూ ఆదేశించింది. ఈఘటన స్పెయిన్లో చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే...ఓ జంట విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. పెళ్లై ఇన్నేళ్లైనా.. ఆమె ఎలాంటి జీతం భత్యంలేని కుటుంబ సేవకు అంకితమైంది కాబట్టి ఆమెకు వివాహం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓ కార్మికుడు ఇచ్చే కనీస వేతనం ప్రకారం ఇవ్వాల్సిన మొత్తం కోటి రూపాయాల లెక్కించింది. ఈ జంటకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇన్నేళ్ల భాగస్వామ్యంలో ఆమెకంటూ ఎలాంటి సంపాదన లేదు. ముఖ్యంగా ఇంటి పనుల్లోనే నిమగ్నమైంది. ఇంటిని, కుటుంబాన్ని చూసుకోవడమే సరిపోయింది. పిల్లలకు నెలవారి భత్యంతో సహా ఆమె వివాహం జరిగిన సంవత్సరం 1995 నుంచి 2020 వరకు ఆమెకు రోజువారి కూలికి చెల్లించే వేతనం చట్టం ప్రకారం అయినా ఆమెకు చెల్లించాల్సిన మొత్తం లెక్కించి ఇవ్వాల్సిందిగా కోర్టు ఆ భర్తను ఆదేశించింది. ఈ మేరకు సదరు మహిళ మాట్లాడుతూ.. "నా భర్త బయట ఉద్యోగం చేసేందుకు అనుమతించ లేదు. ఇంటికే పరిమితం చేయడమే గాక తమ స్వంత జిమ్లోనే పనిచేసేందుకు అనుమతించేవాడు. తనను కుంటుంబం, ఇల్లు వాటికే పరిమితం అయ్యేలా చేశాడు. నిజంగా నన్ను ఇంకేమి చేయలేని స్థితిలోకి తీసుకొచ్చేశాడు. నిజంగా ఈ తీర్పు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది సరైనదే అని ఆనందంగా చెబుతోందామే". (చదవండి: తీవ్ర విషాదం.. పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు) -
ఒకేసారి అన్ని విమానాలు కొంటుందా? ఇండిగో భారీ డీల్..
దేశీయ దిగ్గజ ఏవియేషన్ సంస్థలు భారీ ఎత్తున విమానాల కొనుగోళ్లకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఎయిరిండియా కోసం టాటా సన్స్ 500 విమానాల్ని కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకుంది. తాజాగా ఇండిగో సైతం బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల 500 అంతకంటే ఎక్కువ విమానాల కోసం ఆర్డర్ ఇవ్వనున్నట్లు రాయిటర్స్ కథనం పేర్కొంది. ప్రస్తుతం విమానాల కొనుగోళ్ల నేపథ్యంలో విమానాల తయారీ సంస్థలతో ఇండిగో చర్చలు జరుపుతుందని, ఆ చర్చలు సఫలమైతే ఎయిరిండియా తర్వాత మరో అతిపెద్ద ఒప్పొందం అవుతుందని రాయిటర్స్ తెలిపింది. బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో గత నెలలో న్యారో బాడీ ప్లైట్ల కోసం ఎయిర్ బస్, ఫ్రెంచ్ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయని, ఆ చర్చలు కొలిక్కి రావడంతో వందల విమానాల కొనుగోలుకు సిద్ధపడినట్లు రాయిటర్స్ రిపోర్ట్ హైలెట్ చేసింది. ఇక మరో పదేళ్లలో ఇండిగో సంస్థ మిడ్ సైజ్ వైడ్ బాడీ జెట్స్ విమానాల సంఖ్యను పెంచే ప్రణాళికల్లో ఉండగా అందుకు అనుగుణంగా విమానాల ఆర్డర్ ఉండనుంది ఇప్పటికే ఎయిరిండియా ఎయిరిండియా బ్రాండ్కు కొత్త గుర్తింపును తీసుకొచ్చేందుకు మాతృ సంస్థ టాటా సన్స్ ప్రణాళికలు రచిస్తుంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల్ని అందుకునేలా 100 బిలియన్ డాలర్లతో 500 విమానాల్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఒప్పందంలో భాగంగా విమాన తయారీ సంస్థలు ఈ 500 ఎయిర్ క్రాప్ట్లను 8 ఏళ్లలో డెలివరీ చేయనున్నట్లు రాయిటర్స్ కథనం వెలువరించింది. -
ఆన్లైన్ షాపింగ్: లడ్డూ కావాలా నాయనా..కస్టమర్కి దిమ్మతిరిగిందంతే!
సాక్షి,ముంబై: ఆన్లైన్ షాకింగ్కు సంబంధించిన మరో విచిత్రమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా వేర్వేరు వస్తువులను రావడం, ఖరీదైన వస్తువులకు బదులుగా చీప్ వస్తువులు, ఒక్కోసారి రాళ్లు, రప్పలు లాంటివి ఆన్లైన్ షాపింగ్లో తరచూ జరిగే చోద్యాలే. తాజాగా అమెజాన్లో తన కిష్టమైన బుక్ ఆర్డర్ చేసిన కస్టమర్కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. ఈ విషయాన్ని యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అమెజాన్లో ఆన్లైన్ ద్వారా ఒక పుస్తకాన్ని ఆర్డర్ చేస్తే 'లుకింగ్ ఫర్ లడ్డూ' అనేక పిల్లల పుస్తకాన్ని డెలివరీ చేశారంటూ తన అనుభవాన్ని ట్వీట్ చేశాడు. అంతేకాదు నెగిటివ్ రివ్యూ, నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వొద్దని కూడా మొరపెట్టుకోవడం మరింత విడ్డూరంగా నిలిచింది. ఏమి జరుగుతోంది భయ్యా అంటూ @kashflyy అనే యూజర్ ఆవేదన వెలిబుచ్చారు. (వోల్వో అభిమానులకు షాకిచ్చిందిగా!) బాధితుడికి అందిన ఆ నోట్లో ఇలా ఉంది. ''ప్రియమైన కస్టమర్, క్షమాపణలు సార్, మీరు ఈ పుస్తకాన్ని ఆర్డర్ చేసారు.. మా దగ్గర స్టాక్ ఉంది, కానీ అది పాడైంది. అందుకే మీకు మరో పుస్తకాన్ని పంపుతున్నాం. ఆర్డర్ని క్యాన్సిల్ చేసి...దయచేసి ఆ పుస్తకాన్ని తిరిగివ్వండి. నెగెటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వకండి ప్లీజ్ ధన్యవాదాలండి.'' దీంతో నెటిజనులు విభిన్నంగా స్పందించారు. పోనీలే, ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోమని కొందరన్నారు. సారీ చెప్పి.. నోట్ పెడితే సరిపోతుందా..ఆ బుక్ వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు కదా అని మరొకరు కామెంట్ చేశారు. మరోవైపు అసౌకర్యానికి క్షమాపణలు చెపుతూ అమెజాన్ హెల్ప్ ట్విటర్ హ్యాండిల్ స్పందించింది. I ordered a certain book from Amazon but they sent me this random book called looking for laddoo along with this letter like bhai what is going on 😭😭😭 pic.twitter.com/90D19KIl9k — Kashish (@kashflyy) February 21, 2023 -
దర్యాప్తు సమాచారం సీఎంకు చేరడం ఏంటి?: హైకోర్టు అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో రాష్ట్ర ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోలు, ఆధారాలు బయటికి రావడం, ముఖ్యమంత్రే నేరుగా ప్రెస్మీట్ పెట్టి నిందితులే కుట్రదారులని చెప్పడం సరికాదని న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి తన తీర్పులో స్పష్టం చేశారు. ఇలాంటివి కేసు దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని.. అందువల్ల నిందితుల విజ్ఞప్తి మేరకు కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు గతంలో వెలువరించిన 26 కేసుల తీర్పులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఈ మేరకు బుధవారం విడుదలైన తీర్పు ప్రతిలో కీలక కామెంట్లు చేశారు. హైకోర్టు తీర్పు కాపీలోని ప్రధాన అంశాలివీ.. ఈ తీరుతో కేసు దర్యాప్తుపై ప్రభావం ‘‘ముఖ్యమంత్రే నేరుగా మీడియా సమావేశం నిర్వహించి.. ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితులతోపాటు పలువురిని కుట్రదారులని ముద్రవేశారు. వారే వ్యవస్థీకృత నేరానికి పాల్పడినట్టు ప్రకటించారు. ఇలాంటి ఘటనలు ఒక్కోసారి కేసు దర్యాప్తును తీవ్రంగా ప్రభావితం చేయడంతోపాటు మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులను కాదని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. అంతేగాకుండా నిందితులు ఈ కేసు విచారణను మరో ఏజెన్సీకి బదిలీ చేయాలని మాత్రమే కోరారు. కేసును కొట్టివేయాలని ఏమీ విజ్ఞప్తి చేయలేదు. ఇక జీవో నంబర్ 268 ప్రకారం.. ఇలాంటి కేసులో ఏసీబీ విభాగంలోని పోలీసు అధికారే దర్యాప్తు చేయాలి తప్ప సాధారణ పోలీసులు కాదు. సాధారణ పోలీసులు కేసు నమోదు చేసినా ఏసీబీ విభాగానికి బదిలీ చేయాల్సి ఉంది. ఈ కేసులో అలా జరగలేదు. అసలు సీఎంకు మెటీరియల్ ఎలా వెళ్లింది? ముఖ్యమంత్రికి రాజేంద్రనగర్ ఏసీపీయే వీడియోలు, పెన్డ్రైవ్లు ఇచ్చారని పిటిషనర్లు (వారి న్యాయవాదులు) ఆరోపించారు. మరి ఏసీపీ ఇవ్వలేదని సిట్గానీ, పోలీసులుగానీ ఖండించలేదు. కౌంటర్లో ఎక్కడా పేర్కొనలేదు. కేసు మెటీరియల్ను ఇతరులకు ఇవ్వడం తీవ్ర ఆక్షేపణీయం. అసలు సీఎంకు మెటీరియల్ ఎలా వెళ్లిందనే విషయంలో పోలీసులు, సిట్ అధికారులు మౌనం వహించారు. ప్రెస్మీట్ పెట్టడం, మీడియాకు వీడియోలు ఇవ్వడం, తెలంగాణ సీజేతోపాటు ఇతర రాష్ట్రాల సీజేలకు ముఖ్యమంత్రి మెటీరియల్ పంపడంపై ప్రభుత్వ (సిట్) తరఫు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే కూడా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను అనుమతిస్తున్నాం. సిట్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 63ను కొట్టివేస్తున్నాం. ఎమ్మెల్యే పైలట్ రోహిత్రెడ్డి ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసు నంబర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేస్తున్నాం. నిందితులు వేసిన పిటిషన్లను అనుమతిస్తున్నాం. ఇదే సమయంలో బీజేపీ వేసిన పిటిషన్ను కొట్టివేస్తున్నాం’’ అని తీర్పు ప్రతిలో న్యాయమూర్తి పేర్కొన్నారు. తీర్పు పూర్తి కాపీలో.. ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్ విచారణపై నమ్మకం లేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వాటిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్రెడ్డి సోమవారమే (ఈ నెల 26న) తీర్పు వెలువరించారు. ‘ఎర’ కేసును సీబీఐకి అప్పగిస్తున్నామని.. సిట్ వెంటనే దర్యాప్తు ఆపేసి, పూర్తి వివరాలు, మెటీరియల్ను సీబీఐకి అప్పగించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీని కోర్టు బుధవారం విడుదల చేసింది. నేడు రాష్ట్ర సర్కారు అప్పీల్! ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలుకు సిద్ధమైంది. గురువారమే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. ఈ కేసులో తీర్పు ప్రతి విడుదలయ్యే వరకు అమలును ఆపాలంటూ ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్ ప్రసాద్ 26న విజ్ఞప్తి చేయడం, దానికి న్యాయమూర్తి అంగీకరించడం తెలిసిందే. తీర్పు ప్రతి అధికారికంగా విడుదలకావడంతో సీబీఐ ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తును తమ పరిధిలోకి తీసుకునే అవకాశం ఉంది. అందువల్ల వీలైనంత త్వరగా అప్పీల్కు వెళ్లాలని సర్కారు నిర్ణయించినట్టు తెలిసింది. జీవో 63 ద్వారా ఏర్పాటు చేసిన సిట్ రద్దు చేస్తూ.. ఎఫ్ ఐ ఆర్ 455/2022ను సీబీఐకి బదిలీ చేయడంతో పాటు సిట్ చేసిన దర్యాప్తును సైతం రద్దు చేస్తున్నట్లు ఆ ఆర్డర్ కాపీలో న్యాయమూర్తి జస్టిస్ విజయ్సేన్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో 26 కేసుల జడ్జిమెంట్లను అందులో ప్రస్తావించారు. -
టాటా మోటార్స్కు భారీ ఆర్డర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన రంగ సంస్థ టాటా మోటార్స్ తాజాగా ముంబైకి చెందిన ఎవరెస్ట్ ఫ్లీట్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా 5,000 యూనిట్ల ఎక్స్ప్రెస్–టి ఎలక్ట్రిక్ వాహనాలను ఎవరెస్ట్కు సరఫరా చేయనుంది. తొలి విడతగా 100 కార్లను అందించినట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. దేశంలో ఈవీల వాడకం పెరిగేందుకు ఇటువంటి ఒప్పందాలు దోహదం చేస్తాయని టాటా మోటార్స్ తెలిపింది. ఎక్స్ప్రెస్–టి సెడాన్ శ్రేణిలో 213 కిలోమీటర్లు, 165 కిలోమీటర్లు ప్రయాణించే వేరియంట్లు ఉన్నాయి. చదవండి: Flipkart Big Saving Days Sale: ఇవి కదా ఆఫర్లు..ఫ్లిప్ కార్ట్ బంపర్ సేల్..వీటిపై 80 శాతం డిస్కౌంట్! -
చపాతీ కాదు.. చీటింగ్
బనశంకరి: ఆకలితో ఉన్నవారిని సైబర్ నేరగాళ్లు ఇట్టే దోచుకుంటున్నారు. ఇందులో నిరక్షరాస్యులకంటే విద్యావంతులే ఎక్కువగా నష్టపోతున్నారు. నగరంలో సాధారణ పోలీస్ స్టేషన్లలో ఏడాదికి 250 నుంచి 300 క్రైం కేసులు నమోదు అవుతుంటే, సైబర్ పోలీస్స్టేషన్లులో నమోదు అవుతున్న నేరాల సంఖ్య 1000 కి పైగా ఉంటోంది. ఇప్పటి వరకు ఉద్యోగం, బిల్లులు చెల్లింపు, బ్యాంకింగ్, షేర్లు, బిట్కాయిన్ పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బు కాజేస్తున్నారు. ఇప్పుడు ఆహార పంపిణీలోకి వంచకులు చొరబడ్డారు. లింక్ పంపి నకిలీ యాప్ల ద్వారా దందా ఫుడ్ ఆర్డర్లలో మోసం ఇలా జరుగుతుంది. బెంగళూరు ఎక్కువగా గిరాకీ ఉన్న హోటల్స్ పేరుతో మోసగాళ్లు నకిలీ యాప్లను సృష్టిస్తారు. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా తదితరాల్లో ఆకర్షణీయంగా ప్రచారం చేసుకుంటారు. సోషల్ మీడియా చూసేవారు ఈ ప్రకటనల ప్రలోభపడి ఆర్డర్లు బుక్ చేస్తారు. అక్కడ సూచించిన కొన్ని నంబర్లకు ఫోన్ చేయగా బుకింగ్ స్వీకరించాము. నగదు చెల్లించండి అని సూచన వస్తుంది. దానిని నమ్మి కస్టమర్లు గూగుల్పే, ఫోన్పే తదితరాలతో నగదు చెల్లిస్తారు. ఇంకా కొందరు క్రెడిట్ కార్డు, డెబిట్కార్డు వినియోగిస్తారు. మోసగాళ్లు మళ్లీ కాల్ చేసి మీ డబ్బు జమ కాలేదని, తమ హోటల్ యాప్ లింక్ పంపిస్తాము. దానిని ఇన్స్టాల్ చేసుకుంటే పుడ్ ఆర్డర్, చెల్లింపు సులభమవుతుందని, పైగా డిస్కౌంట్ లభిస్తుందని నమ్మిస్తారు. సరేనని వారు పంపిన లింక్ పై క్లిక్ చేస్తే అంతే సంగతులు. బాధితుల ఫోన్ను హ్యాక్ చేసి నగదు దోచేస్తారు. అంతేగాక మెయిల్, వాట్సాప్ చాటింగ్తో పాటు అనేక వ్యక్తిగత సమాచారం మొత్తం నేరగాళ్ల పాలవుతుంది. తద్వారా బాధితులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటారు. రెండు పెద్ద మోసాలు ఆన్లైన్ పుడ్ ఆర్డర్ చేయడానికి వెళ్లిన ఇంజనీర్, మరొకరు భారీగా వంచనకు గురయ్యారు. బెంగళూరుకు చెందిన దీపికా అనే ఇంజనీర్ ఫేస్బుక్లో ఆహార ప్రకటనను చూసి చపాతీ– చికెన్ కర్రీని ఆర్డర్ చేయడానికి ఫోన్ చేసింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఖాందాని రాజధాని రెస్టారెంట్ అని పరిచయం చేసుకున్నాడు. తాము పంపే లింక్లో ఉన్న రుచిసాగర్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సలహా ఇచ్చాడు. దీపిక సరేనని ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని క్రెడిట్కార్డు సమాచారం తెలిపి ఆర్డర్ చేసింది. ఇక అంతే.. దశలవారీగా ఆమె అకౌంట్ నుంచి రూ.61 వేలు కట్ అయ్యాయి. మరొకరికి రూ.2.23 లక్షలు టోపీ మరో కేసులో ఇమ్రానుల్లాబేగ్ ఆన్లైన్లో నంబరు చూసి ఫుడ్ ఆర్డర్ చేసి రూ.250 చెల్లించాడు. కానీ అవతలి వ్యక్తి తమకు నగదు జమ కాలేదని, ఫలానా లింక్ ద్వారా యాప్ నుంచి డబ్బు పంపాలని సూచించాడు. ఆకలితో ఉన్న బాధితుడు మరో ఆలోచన లేకుండా ఆ యాప్ను ఇన్స్టాల్ చేసుకున్నాడు. వెంటనే అతని క్రెడిట్ కార్డు నుంచి రూ.2,23,858 పోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఈ రెండు కేసుల్లో మోసగాళ్లు ఒకే మొబైల్ నంబరును వినియోగించారు. (చదవండి: చెరువు వద్ద మిస్టరీ...పాపను పాఠశాల వద్ద వదిలివస్తానని చెప్పి...) -
ఫ్లిప్కార్ట్లో ల్యాప్టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే షాక్..!
బెంగళూరు: కర్ణాటక మంగళూరుకు చెందిన ఓ వ్యక్తి దివాళీ సేల్ సందర్భంగా అక్టోబర్ 15న ఫ్లిప్కార్ట్లో 'ఏసస్ టఫ్' గేమింగ్ ల్యాప్టాప్ ఆర్డర్ చేశాడు. అక్టోబర్ 20న ఇంటికి పార్సిల్ వచ్చింది. అయితే అది ఓపెన్ చేసిన అతనికి షాక్ తగిలింది. పార్సిల్ బాక్స్లో ల్యాప్టాప్కు బదులు పెద్ద రాయి, ఈ-వేస్ట్ వచ్చింది. దీంతో అతడు ఫ్లిప్కార్డ్ కస్టమర్ కేర్ను సంప్రదించాడు. దాన్ని రిటర్న్ తీసుకునేందుకు వారు నిరాకరించారు. ల్యాప్ ఆర్డర్ చేసిన వ్యక్తి చిన్మయ రమణ ఈ విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశాడు. తనకు వచ్చిన పార్సిల్లో ల్యాప్టాప్ బాక్స్పై ప్రోడక్ట్ డీటేయిల్స్ను చింపేశారని, అది ఓపెన్ చేసి చూస్తే రాయి, కంప్యూటర్ వేస్టేజ్ ఉందని వాపోయాడు. ఈ విషయంపై ఫ్లిప్కార్ట్ను సంప్రదించినా సరైన స్పందన లేదని, ఈ-మెయిల్ స్క్రీన్షాట్ను కూడా షేర్ చేశాడు. తాను సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. మూడు రోజుల తర్వాత వారు స్పందించారని రమణ వాపోయాడు. రీఫండ్ ఇచ్చేందుకు సెల్లర్ నిరాకరించాడని, పార్సిల్ డెలీవరీ సమయంలో ఎలాంటి డ్యామేజీ కూడా జరగలేదని చెప్పారని తెలిపాడు. ఫ్లిప్కార్ట్ సర్వీసు అస్సలు బాగాలేదని రమణ ఆరోపించాడు. తన ఫిర్యాదు అనంతరం మళ్లీ అప్డేట్ ఇస్తామని చెప్పారని, కానీ ఆ తర్వాత ఎన్నిసార్లు ఈమెయిల్ పంపినా ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నాడు. తాను చెప్పేది అబద్దమని ఎవరికైనా అన్పిస్తే, తన ఖాతా పాత ఆర్డర్లు చెక్చేసుకోవచ్చని చెప్పాడు. 2015 నుంచి తాను ఫ్లిప్కార్ట్ కస్టమర్గా ఉన్నానని, చాలా ఆర్డర్లు పెట్టానని వివరించాడు. Ordered for laptop and recived a big stone and E-waste ! During Diwali sale on Flipkart!@VicPranav @geekyranjit @ChinmayDhumal @GyanTherapy @Dhananjay_Tech @technolobeYT @AmreliaRuhez @munchyzmunch @naman_nan @C4ETech @r3dash @gizmoddict @KaroulSahil @yabhishekhd @C4EAsh pic.twitter.com/XKZVMVd4HK — Chinmaya Ramana (@Chinmaya_ramana) October 23, 2022 చదవండి: ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్ -
జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది కాలంగా జమ్ము రీజియన్ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట. అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. గులాం నబీ ఆజాద్.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటర్ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్ లోకల్స్ను సైతం ఓటర్ లిస్ట్లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంచనా వేస్తున్నారు. -
‘జ్ఞానవాపి’ కేసు విచారణ వాయిదా
వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో బయటపడిన శివలింగ ఆకృతికి కార్బన్–డేటింగ్ పరీక్ష నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్పై లిఖితపూర్వకంగా స్పందించాలని అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీకి సూచించింది. మసీదు కాంప్లెక్స్లోని వజూఖానాలో ఈ ఏడాది మే 16న నిర్వహించిన సర్వేలో శివలింగం బయటపడిందని, ఇది ఎప్పటిదో నిర్ధారించేందుకు పరీక్ష నిర్వహించాలని విన్నవిస్తూ హిందూ మహిళ ఒకరు వారణాసి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. సివిల్ ప్రొసీజర్ కోడ్(సీపీసీ) ఆర్డర్ 26 రూల్ 10 కింద ఈ శివలింగంపై శాస్త్రీయ పరిశోధన చేయడానికి ఒక కమిషన్ను ఏర్పాటు చేయాలని కోర్టును కోరామని పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. చదవండి: థాక్రే వర్గానికి ఎన్నికల సంఘం డెడ్లైన్ -
కోటక్ మహీంద్రా బ్యాంక్కు భారీ ఊరట!
న్యూఢిల్లీ: ఆర్కాడియా షేర్, స్టాక్ బ్రోకర్లకు సంబంధించిన షేర్ తనఖా కేసులో కోటక్ మహీంద్రా బ్యాంక్కు సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)లో ఊరట లభించింది. ఈ వ్యవహారంలో స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ డిపాజిటరీ సీడీఎస్ఎల్ (సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్–ఇండియా) జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. నాన్-ట్రేడింగ్ సభ్యునికి ఆదేశాలు జారీ చేసే అధికారాలు ఎన్ఎస్ఈ, సీడీఎస్ఎల్కు ఉండబోవని అప్పీలేట్ అథారిటీ స్పష్టం చేసింది. (ఢిల్లీ టూ సిమ్లా: విమాన టికెట్ ధర కేవలం రూ. 2480) కేసు వివరాలు ఇవీ... మార్చి 2008లో, ఆర్కాడియా తన షేర్ల తాకట్టు ఆధారంగా కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి రుణాన్ని పొందింది. తనఖా షేర్ల చట్టపరమైన, ప్రయోజనం పొందిన యజమాని ఆర్కాడియా మాత్రమేనని, సెక్యూరిటీ స్వాధీన చర్యలను బ్యాంక్ చేపట్టకూడదని ఈ మేరకు జరిగిన ఒప్పందం పేర్కొంది. అయితే డిసెంబర్ 2020 నాటికి, ఆర్కాడియా తన రీపేమెంట్ బాధ్యతల విషయంలో విఫలం అవడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను తమ స్వాధీనంలోకి తీసుకునే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆర్కాడియాకు బ్యాంక్ 2021 ఫిబ్రవరి 15వ తేదీన తెలియ జేసింది. దీనితో ఆర్కాడియా ఈ వ్యవహారంపై ఎన్ఎస్ఈ న్యాయ విభాగాన్ని ఆశ్రయించింది. తనఖా పెట్టిన ఆర్కాడియా అనుమతి లేకుండా షేర్ల స్వాధీనం కుదరదని ఎన్ఎస్ఈ బ్యాంక్కు స్పష్టం చేసింది. ఎన్ఎస్ఈ ఆదేశాల నేపథ్యంలో ఆర్కాడియా డీమ్యాట్ అకౌంట్ను సీడీఎస్ఎల్ స్తంభింపజేసింది. దీనితో ఆర్కాడియా తనఖా పెట్టిన షేర్లను బ్యాంక్ తన స్వాధీనంలోకి తీసుకోలేకపోయింది. ఈ వివాదంపై అప్పీలేట్ ట్రిబ్యునల్ను కోటక్ బ్యాంక్ ఆశ్రయించింది. (Vivo Y35: స్లిమ్ ఫోన్ ‘వై35’ ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?) రూలింగ్ ఇలా... స్టాక్ ఎక్స్చేంజ్గా ప్రతివాది (ఎన్ఎస్ఈ) దాని ట్రేడింగ్ సభ్యులపై మాత్రమే అధికార పరిధిని కలిగి ఉంటుందని శాట్ స్పష్టం చేసింది. ట్రేడింగ్ సభ్యుడు కాని అప్పీలుదారు (కోటక్ మహీంద్రా బ్యాంక్)తో సహా మరే ఇతర సంస్థకు ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని పేర్కొంది. అదేవిధంగా, డిపాజిటరీ కూడా తన అధికార పరిధిలో లేని ఏ ఇతర సంస్థకు వ్యతిరేకంగా ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేదని, లేదా అప్పీలుదారుకు అనుకూలంగా తాకట్టు పెట్టిన సెక్యూరిటీలను స్తంభింపజేయ జాలదని స్పష్టం చేసింది.ఆర్కాడియా తనఖా షేర్లపై -
ఎయిర్ ఇండియా చరిత్రలో అతిపెద్ద ఎయిర్క్రాప్ట్ డీల్
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా లిమిటెడ్ దాదాపు 300 నారోబాడీ జెట్లను ఆర్డర్ చేసేందుకు సిద్ధమైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది విమానాయన చరిత్రలో అతి పెద్ద ఆర్డర్లలో ఒకటి అని స్పష్టం చేశాయి. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచిన ఎయిర్లైన్ కొత్త యాజమాన్యం ఆధ్వర్యంలో తన విమానాలను సరిదిద్దాలని చూస్తోంది. ఈ మేరకు క్యారియర్ ఎయిర్బస్ A320neo ఫ్యామిలీ జెట్లు లేదా బోయింగ్ 737 మ్యాక్స్ మోడల్ లేక రెండింటిని మిక్స్ చేసి సరికొత్త మోడల్స్ని ఆర్డర్ చేయవచ్చునని అధికారులు అంటున్నారు. దేశంలో ఎయిర్బస్ ఆధిపత్యం చెలాయిస్తున్నందున భారత్ ఈ నారోబాడీ జెట్ ఆర్డర్ని గెలుచుకోవడం బోయింగ్ విమానాలను తిరుగుబాటుగా అయ్యింది. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న ఇండిగో అత్యధికంగా అమ్ముడై నారోబాడీల కోసం యూరోపియన్ తయారీదారులకు ప్రపంచంలోనే అతిపెద్ద కస్టమర్గా మారింది. పైగా సుమారు 700 నారోబాడీలను ఆర్డర్ చేస్తోంది. గో ఎయిర్లైన్స్ ఇండియా లిమిటెడ్, ఎయిర్ఏషియా ఇండియా లిమిటెడ్తో సహా ఇతర సంస్థలు ఒకేతరహా విమానాలను నడుపుతున్నాయి. సుమారు 300 విమానాల ఉత్పత్తికి, డెలివరీకి సంవత్సరాలు లేదా ఒక దశాబ్దం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చునని అధికారుల చెబుతున్నారు. ఎయిర్బస్ ఒక నెలలో దాదాపు 50 నారోబాడీ జెట్లను నిర్మిస్తుంది, 2023 కల్లా వాటిని 65కి, 2025 నాటికి 75కి పెంచాలని యోచిస్తోంది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హయాంలో ప్రైవేటీకరణలో భాగంగా ఈ ఏడాది ప్రారంభంలోనే టాటా ఎయిర్లైన్ను కొనుగోలు చేసింది. ఇది నాలుగు ఎయిర్లైన్ బ్రాండ్లతో సహా దాని విమానయాన వ్యాపారాలను ఏకీకృతం చేయాలని భావిస్తోంది. కొత్త విమానాల కోసం చేస్తున్న ఆర్డర్ డీల్ ముఖ్యంగా దీర్ఘకాలిక నిర్వహణపై అనుకూలమైన నిబంధనలతో ఖర్చులను తగ్గించుకోవడం తోపాటు చాలా చౌక ధరల్లో కొనుగోలు చేసి..ప్రత్యర్థులతో మెరుగ్గా పోటీ పడడంలో సహాయపడుతుంది. (చదవండి: అగ్నివీరులకు స్వాగతమంటున్న ఆనంద్ మహీంద్రా) -
ఎన్టీసీపై దివాలా చర్యలు షురూ! ఎన్సీఎల్టీ ఆమోదం!
న్యూఢిల్లీ: నేషనల్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ (ఎన్టీసీ)పై దివాలా చర్యలు చేపట్టడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్ ఆమోదముద్ర వేసింది. దాదాపు రూ. 14 లక్షలను డిఫాల్ట్గా క్లెయిమ్ చేస్తూ ఎన్టీసీపై ఆపరేషనల్ క్రెడిటార్స్లో ఒకరైన హీరో సోలార్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్పై ఎన్సీఎల్టీ ఈ చర్యలకు ఆదేశించిం ది. ఐఆర్పీగా (ఇంటిర్మ్ రిజల్యూషన్ ప్రొఫె షనల్) అమిత్ తల్వార్ నియమించిన ట్రిబ్యున ల్, ఎన్టీసీ బోర్డ్ను సస్పెండ్ చేసింది. సంస్థపై మారటోరియం ప్రకటించింది. కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధీనం లోని ప్రభుత్వ రంగ సంస్థపై (పీఎస్యూ)పై దివాలా చర్యలు ప్రారంభించడం బహుశా ఇదే మొదటిసారి. జౌళి మంత్రిత్వశాఖ ఆధీనంలో ఎన్టీసీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. -
ఐపీఎల్ ఎఫెక్ట్.. వీటికి ఫుల్ డిమాండ్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన తర్వాత ఫుడ్టెక్ కంపెనీలు మంచి రోజులు వచ్చాయి. రెండున్నర నెలల పాటు జరగనున్న ఈ టోర్నీ స్టార్టప్ కంపెనీలకు బూస్టింగ్ ఇస్తోంది. మ్యాచ్ జరిగే సమయంలో స్క్రీన్లకు కళ్లప్పగించేస్తున్న క్రికెట్ లవర్స్ ఫుడ్ కోసం కిచెన్, డైనింగ్ టేబుల్ వైపు చూడటం లేదు. సింపుల్గా ఫుడ్ టెక్ యాప్లను ఆశ్రయిస్తున్నారు. జోమాటో, స్విగ్గీలకే కాదు క్యూర్ఫుడ్, ఈట్క్లబ్, బిర్యానీ బై కిలో వంటి ఫుడ్టెక్ కంపెనీల ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఏప్రిల్లో 14 నుంచి 16 శాతం ఆర్డర్లు పెరిగినట్టు ఈ కంపెనీల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైన తర్వాత ఆర్డర్లు జోరందుకుంటున్నాయి. ఇక రెండు మ్యాచ్లు ఉండే శని,ఆదివారాల్లో అయితే ఆర్డర్లు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, చపాతీలు, రోటీలు వంటి రెగ్యులర్ ఫుడ్ కాకుండా మల్టీ గ్రెయిన్ పిజ్జా, కుల్చా బర్గర్ వంటి వాటిని ఫుడ్ టెక్ కంపెనీలు ఎంటర్టైన్మెంట్ ఫుడ్స్గా పరిగణిస్తుంటాయి. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఈ తరహా ఫుడ్స్కి ఫుల్ డిమాండ్ ఉందంటున్నాయి ఫుడ్ టెక్ కంపెనీలు. ముఖ్యంగా ఐపీఎల్ మ్యాచ్ల టైమ్లో ఎక్కువగా ఆర్డర్లు వస్తున్న నగరాల జాబితాలో బెంగళూరు, హైదరాబాద్, గుర్గ్రామ్ వంటి టెక్ ఎంప్లాయిస్ ఎక్కువగా ఉండే సిటీలు ఉండటం గమనార్హం. చదవండి: మన పిల్లలేమీ శాండ్విచ్లు కాదు - రతన్టాటా -
Viral Video: ఆర్డర్ ఆలస్యమైందని మరీ ఇంత దారుణంగా కొట్టాలా!
కొన్ని సంఘటనలను చూస్తే మనుషులకు సహనం తక్కువవుతుందని చెప్పలా? లేదా కోపానికి బానిసైపోతున్నారని అనాలో కూడా తెలియదు. పోనీ మనకు నచ్చకపోతే కాస్త గట్టిగా చెప్పడం లాంటివి చేయోచ్చు లేదా ఒకవేళ కాస్త కోపం వస్తే తిట్టి వదిలేయాలిగానీ మరీ వాళ్లని కొట్టి హింసచడం వంటివి చేయకూడదు. కానీ, ఇటీవల అబ్బాయిలు/అమ్మాయిలు కూడా సిల్లీ సిల్లీ కారణాలకే కోపం తెచ్చుకోవడం, దాడులకు దిగడం వంటివి చేస్తున్నారు. న్యూయర్క్ నగర్లో ఇద్దరు వ్యక్తులు ఆర్డర్ ఆలస్యమైందని దారుణంగా ప్రవర్తించారు. (చదవండి: భయంకరమైన భారీ పీత!.. గోల్ఫ్ స్టిక్ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది!) అసలు విషయంలోకెళ్లితే.. న్యూయార్క్ నగరంలో న్యూయార్క్ నగరంలో బ్రూక్లిన్లోని బర్గర్ కింగ్స్ లిండెన్ బౌలేవార్డ్లో ఇద్దరు వ్యక్తుల బర్గర్లు ఆర్డర్ చేశారు. అయితే ఆర్డర్ కాస్త ఆలస్యమైంది. అంతే ఇద్దరు కోపంతో ఆర్డర్ కౌంటర్ వద్దకు వచ్చారు. వారిలో ఒక వ్యక్తి కౌంటర్లోకి దూసుకువచ్చి అక్కడ ఉన్న సదరు ఉద్యోగిపై దాడి చేశాడు. సదరు వ్యక్తి సహచరుడు సైతం ఆ ఉద్యోగిని దారుణంగా కొట్టాడు. అయితే ఇంతలో సహచర ఉద్యోగులు జోక్యం చేసుకోవడంతో ఆ భాదితుడు సురక్షితంగా బయటపడ్డాడు. ఈ మేరకు ఆ ఉద్యోగిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమీపంలో ఉన్న సీసీటీవీలో రికార్డైయ్యింది. దీంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీఫుటేజ్ని ట్విట్టర్లో పోస్ట్ చేయడమే కాక ఆ నిందుతులు ఆచూకి తెలిసినవాళ్లు ముందుకు వచ్చి సమాచారం ఇవ్వాలని అభ్యర్థించింది. అయితే ఆ సీసీఫుటేజ్లో నిందితులు ముసుగు ధరించి ఉండటం కారణంగా గుర్తుపట్టడం కష్టమవ్వడంతో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విధంగా ప్రకటించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. (చదవండి: 40 రోజుల్లో 700 మైళ్లు.. ప్రీత్ చాందీ ఒంటరి సాహసం..!) 🚨WANTED for ASSAULT: Do you know these guys? On 12/4/21 at approx 6:14 PM, inside of 1661 Linden Blvd in Brooklyn, the suspects engaged in a dispute with a 22-year-old male, then punched him multiple times while displaying a knife. Any info? DM @NYPDTips or call 800-577-TIPS. pic.twitter.com/Y843eiAWkU — NYPD NEWS (@NYPDnews) January 4, 2022 -
ఒక్క ఫోన్ కాల్.. హిజ్రా ద్రాక్షాయణికి ఉద్యోగం
సాక్షి, తిరువళ్లూరు(తమిళనాడు): హిజ్రాగా మారాడన్న కారణంతో బాధ్యతలు అప్పగించకుండా నిర్లక్ష్యానికి గురైన అభ్యర్థి సమస్యకు మంత్రి చొరవతో గంటలో పరిష్కారం లభించింది. తిరువళ్లూరు జిల్లా పూందమల్లికి చెందిన సంతానరాజ్ (42) 2010లో గ్రామ కార్యదర్శిగా ఉద్యోగం పొందాడు. 2016 వరకు కొడువేళి గ్రామంలో విధులు నిర్వహించాడు. అనంతరం సంతానరాజ్ హిజ్రాగా మారి ద్రాక్షాయణిగా పేరు మార్చుకున్నాడు. దీంతో కొడువేళి గ్రామాం బాధ్యతలను మరొకరికి అప్పగించి సంతానరాజ్ను పక్కన పెట్టారు. అప్పటి నుంచి అతనికి బాధ్యతలు అప్పగించలేదు. తనకు న్యాయం చేయాలని బాధితుడు మంత్రి నాజర్ను శుక్రవారం కలిశాడు. గంటలో అతనికి పునః నియామక పత్రం సిద్ధం చేయాలని మంత్రి పీడీని ఫోన్లో ఆదేశించారు. ఆవడిలోని మంత్రి నివాసానికి పీడీ పరుగులు పెట్టారు. సంబంధిత ఉత్తర్వులను మంత్రి నాజర్ చేతుల మీదుగా సంతానరాజ్ అందుకుని కొడువేళి గ్రామంలో విధుల్లో చేరారు. మంత్రి చర్యలకు పలువురు సోషల్ మీడియాలో ప్రశంసలు తెలుపుతున్నారు. -
భారీ వర్షాలు: 15 జిల్లాలకు రెడ్ అలెర్ట్..
చెన్నై(తమిళనాడు): తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే.. అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో రాష్ట్రప్రభుత్వం.. చెన్నై తో పాటు 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ను ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుకోట్టై, తిరువారురు,తేన్ కాశీ, తిరు నల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాధపురం, శివ గంగై జిల్లాలో వర్షం ముప్పు పొంచిఉన్నట్లు వాతావరణ అధికారులు పేర్కొన్నారు. దీంతో.. చెన్నై నగరంలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదే విధంగా.. కన్యాకుమారి, చెన్నై ప్రాంతాలలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాలకు కావేరి నది, వైగై, థెన్- పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. -
కరోనా వెల్లడికి ముందే చైనా అప్రమత్తం !
వాషింగ్టన్: ప్రపంచానికి కరోనా మహమ్మారిని పరిచయం చేయడానికంటే చాలా నెలలకు ముందే చైనా ఈ విషయంపై సీరియస్గా దృష్టిపెట్టిందనే బలమైన ఆధారాలు తాజాగా బహిర్గతమయ్యాయి. తమ దేశంలో ఎంత మందికి కరోనా సోకిందో, ఎంతగా దేశవ్యాప్తంగా విస్తరించిందో తెల్సుకునేందుకు పీసీఆర్ టెస్ట్ కిట్లను ముందుగా ఆర్డర్ చేసిందని ‘ఇంటర్నెట్ 2.0’ అనే సైబర్ సెక్యూరిటీ పరిశోధన సంస్థ తాజా నివేదికలో వెల్లడైంది. డిజిటల్ ఫోరెన్సిక్, నిఘా ఫలితాల విశ్లేషణలో ‘ఇంటర్నెట్’ అనే ఈ అమెరికా–ఆస్ట్రేలియా సంస్థకు అపార అనుభవం ఉంది. చదవండి: (అంతరిక్షంలో సినిమా షూటింగ్) తమ దేశంలో కరోనా అనే కొత్త వైరస్ విజృంభిస్తోందని తొలిసారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు చైనా 2019 డిసెంబర్ 31న అధికారికంగా తెలియజేసింది. అయితే, ఆ తేదీకి చాలా నెలల ముందే, అంటే మే నెలలోనే చైనా కోవిడ్ కట్టడికి భారీ స్థాయిలో ఏర్పాట్లు మొదలుపెట్టిందని ‘ఇంటర్నెట్ 2.0’ సంస్థ వాదిస్తోంది. ఇందుకు.. చైనాలో ఒక్కసారిగా పెరిగిన పీసీఆర్(పాలిమర్ చైన్ రియాక్షన్) టెస్టింగ్ కిట్ల కొనుగోలు పరిమాణాలను ఆధారంగా చూపుతోంది. వూహాన్ సిటీ ఉన్న హూబే ప్రావిన్స్లో 2019 ఏడాది ద్వితీయార్ధంలో ఈ కిట్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగాయి. చైనా ప్రభుత్వ వెబ్సైట్లోని కొనుగోళ్ల వివరాల ఆధారంగానే ఈ నివేదికను రూపొందించామని సంస్థ సహ సీఈవో, ఆస్ట్రేలియా సైనిక నిఘా మాజీ ఉన్నతాధికారి రాబిన్సన్ చెబుతున్నారు. ఈ వాదనలను చైనా తేలిగ్గా కొట్టిపారేసింది. చదవండి: (ఆ ఇంట్లో కనకవర్షం.. రూ.5,215 కోట్ల లాటరీ) అయితే, ఇంత భారీగా కొన్న కిట్లను ఏ వ్యాధి నిర్ధారణకు వినియోగించారనే విషయాన్ని చైనా బహిర్గతం చేయకపోవడం గమనార్హం. అయితే, తమ తదుపరి నివేదికలో మరిన్ని కొత్త విషయాలు బయటపెడతామని ఇంటర్నెట్ 2.0 సహ సీఈఓ ఒకరు చెప్పారు. అయితే, ముందే చైనాకు అంతా తెలుసు అనే వాదనను ఇంటర్నెట్ 2.0 నివేదిక ఆధారంగా బలపరచలేమని కొందరు వైద్య నిపుణులు వ్యాఖ్యానించారు. నివేదికలోని అంశాలు అందుకు సరిపోవన్నారు. కరోనా కాకుండా ఇతర వైరస్ సంక్రమిత వ్యాధుల నిర్ధారణకూ పీసీఆర్ టెస్ట్ కిట్లను దశాబ్దాలుగా వాడుతున్నారని వారు ఉదహరించారు. -
హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా?.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. వినాయక నిమజ్జనంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నిమజ్జనం సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది అంటూ వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని, లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇవీ చదవండి: వీడని మిస్టరీ: జయశీల్రెడ్డి ఏమయ్యారు? తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా.. -
అధికారిక ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
అతిపెద్ద ఆర్డర్- ఎల్అండ్టీ జూమ్
ముంబై, సాక్షి: మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ నుంచి అతిపెద్ద ఆర్డర్ లభించినట్లు డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్అండ్టీ తాజాగా వెల్లడించింది. కాంట్రాక్టులో భాగంగా నిర్మాణం, మైనింగ్ సంబంధ ఎక్విప్మెంట్ను సపఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. టాటా స్టీల్కు ఒడిషా, జార్ఖండ్లోగల మైన్స్కు మొత్తం 46 యూనిట్ల పరికరాలను సరఫరా చేయవలసి ఉన్నట్లు తెలియజేసింది. ఆర్డర్లో భాగంగా 100 టన్నుల కోమత్సు డంప్ ట్రక్కులు 41తోపాటు.. 3 వీల్ లోడర్లు, 2 క్రాలర్ డోజర్లు అందించవలసి ఉన్నట్లు పేర్కొంది. మొత్తం ఆర్డర్ విలువను వెల్లడించనప్పటికీ కంపెనీ చరిత్రలో లభించిన అతిపెద్ద ఆర్డర్లలో ఇది ఒకటని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ఎల్అండ్టీ షేరు ఎన్ఎస్ఈలో 6.5 శాతం జంప్చేసి రూ. 1154ను తాకింది. -
చైనాకు ఇస్కాన్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా ఉద్రిక్తతల మధ్య చైనాకు మరో షాక్ తగిలింది. ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షస్నెస్(ఇస్కాన్) కూడా చైనా కంపెనీతో చేసుకున్న కోట్ల రూపాయల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. రెండువందల కోట్ల రూపాయలతో చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కురుక్షేత్రలో కృష్ణార్జున దేవాలయానికి అవసరమైన గుర్రాలను చైనానుంచి కాకుండా ఇండోనేషియా నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. కృష్ణార్జున మందిరానికి అవసరమైన 4గుర్రాలను చైనానుంచి కొనుగోలుకు చర్చలు దాదాపు ఖరారయ్యాయి. కానీ దేశంలో చైనా వ్యతిరేక పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆలోచనను విరమించుకుంది. ఈ పరిణామాన్నిఇస్కాన్ అధ్యక్షుడు గోపాల్ దాస్ ధృవీకరించారు. నాలుగు గుర్రాల కోసం చైనా కంపెనీతో చర్చలు జరిపామనీ, అయితే చైనా వ్యతిరేకత కారణంగా ఆర్డర్ ఇవ్వకూడదని నిర్ణయించామని తెలిపారు. ఇండోనేషియాలోని ఒక సంస్థతో చర్చలు జరుగుతున్నామని త్వరలోనే ఖరారు చేయనున్నామని వెల్లడించారు. గోపాల్ దాస్ అందించిన సమాచారం ప్రకారం 34 అడుగులఎత్తు 41 మీటర్ల పొడవుతో పాలరాయితో నాలుగు గుర్రాలను రూపొందించనున్నారు. ఒక్కోదానికి 80-90లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఆలయ సముదాయం నిర్మాణం 2018లో ప్రారంభం కాగా 2022 లో పూర్తి కానుంది. ఆరు ఎకరాలలో 23,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తులు, 165 అడుగుల ఎత్తుతో దీన్ని నిర్మించనున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భగవద్గీతను కలిగి ఉంటుంది. అన్ని గ్రంథాలతో లైబ్రరీ, గోవింద రెస్టారెంట్, 75 గదుల గెస్ట్ హౌస్, ఆర్ట్ గ్యాలరీ, ఆధ్యాత్మిక గిప్ట్స్ షాప్, సూపర్ మార్కెట్, కేఫ్ సౌకర్యాలను కూడా ఇందులో ఏర్పాటు చేస్తారు. 60 శాతం నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసుకుంది. -
ఉపశమనం కల్పించండి : అమెజాన్
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. కాంపిటీషన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలను నిలిపి వేయాలని తన పిటిషన్లో కోరింది. ఈమేరకు సోమవారం కర్నాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలని విన్నవించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించింది. ఈ కామర్స్ సంస్థలు ఫ్లిప్కార్ట్, అమెజాన్ సంస్థలు తమ వ్యాపారంలో పోటీ చట్టాల నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయంటూ పలు సంఘాలు ఇదివరకే తీవ్ర ఆరోపణలు చేశాయి. ఫలితంగా రిటైలర్లకు అన్యాయం జరుగుతోందని ఆరోపించాయి. కొన్ని కంపెనీలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటూ మొబైల్ఫోన్ వంటి ఉత్పత్తులను డిస్కౌంట్ ధరలకు అందజేస్తున్నాయని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో రిటైలర్లు, చిన్న వ్యాపారాలు భారీగా నష్టపోతున్నాయని పేర్కొంటూ వ్యాపారుల సంఘం ఇటీవల సీసీఐకి ఫిర్యాదులు చేసింది. ఈ నేపథ్యంలో సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతోపాటు భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్కు పెద్ద ఉపకారమేమీ చేయడం లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ఇటీవల వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే ఈ వార్తలపై అమెజాన్ ఇండియా స్పందించాల్సి వుంది. చదవండి : ఫ్లిప్కార్ట్, అమెజాన్లపై సీసీఐ దర్యాప్తు భారత్కు ఉపకారమేమీ చేయడం లేదు.. -
ఆదివారం కదా అని పిజ్జా ఆర్డర్ చేస్తే..
సాక్షి, బెంగళూరు: ఆన్లైన్ పుడ్ డెలివరీ యాప్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేసిన టెకీకి చుక్కలు కనిపించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం కదా అని..పిజ్జా తిందామని ఆశపడి ఆన్లైన్లో ఆర్డర్ చేసిన ఓ ఐటీ ఉద్యోగి ఏకంగా రూ.95వేలు పోగొట్టుకున్నాడు. రెండు బ్యాంక్ అకౌంట్ల నుంచి అక్రమార్కులు ఈ మొత్తాన్ని కొట్టేశారు. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని కోరమంగళ 1వ బ్లాక్లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి షేక్ డిసెంబర్ 1వ తేదీన మధ్యాహ్నం ఓ ఫుడ్ డెలివరీ యాప్లో పిజ్జా ఆర్డర్ చేశాడు. అయితే ఎంత సేపటికీ పిజ్జా రాకపోవడంతో ఆ యాప్కు చెందిన కస్టమర్ కేర్ నంబర్కు ఫోన్ చేశాడు. అంతే అదే ఆయన చేసిన తప్పయిపోయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన అవతలి వైపు తాము పిజ్జాలను ఆన్లైన్లో డెలివరీ చేయడం లేదని, కావాలంటే ఆ మొత్తాన్ని రీఫండ్ చేస్తామని నమ్మబలికాడు. ఇందుకు ఒక లింక్ను కూడా షేర్ చేశాడు. సదరు లింక్ను ఓపెన్ చేసి ఫోన్పే, బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయమని చెప్పాడు. ఆ మోసగాడి వలలో పడిన షేక్ తూ.చ తప్పకుండా అతడు చెప్పినట్టే చేశారు. సరిగ్గా ఈ అదనుకోసం చూస్తున్న కేటుగాళ్లు షేక్కు చెందిన హెచ్డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.45వేలు, ఆంధ్రా బ్యాంక్ నుంచి రూ.50వేలు మొత్తం రూ.95వేలను కాజేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన షేక్ స్థానిక మడివాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అంతేకాదు ఇలాంటి కేసులు తమ వద్దకు చాలా వస్తున్నాయనీ, నకిలీలింక్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని మడివాలా పోలీసులు సూచించారు. -
300 విమానాలకు ఇండిగో ఆర్డరు
ముంబై: భారీ వృద్ధి ప్రణాళికల అమల్లో భాగంగా విమానయాన రంగ సంస్థ ఇండిగో తాజాగా ’ఎయిర్బస్ 320 నియో’ రకానికి చెందిన 300 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఒక్కో విమానం రేటు వివరాలు వెల్లడించనప్పటికీ.. 2018లో ప్రచురించిన ధర ప్రకారం ఈ ఆర్డరు విలువ సుమారు 33 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో విమానాల కోసం ఎయిర్బస్కు ఆర్డరిచ్చిన ఏకైక సంస్థ తమదేనని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. తాజా కాంట్రాక్టుతో ఇండిగో మొత్తం 730 విమానాలకు(ఏ320 నియో) ఆర్డరిచ్చినట్లవుతుంది. ప్రస్తుతం 247 విమానాలతో ప్రతిరోజూ 1,500 ఫ్లయిట్స్ నడుపుతోంది. -
ప్రైవేట్ వ్యక్తి శిక్షణకు అడ్వాన్స్ రూ.11 లక్షలు
సాక్షి, అమరావతి: అఖిల భారత స్థాయి అధికారి విదేశీ పర్యటనకు వెళ్లాలంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ స్క్రూటినీ చేసి సిఫార్సు చేయాల్సి ఉంది. ఏ అధికారినైనా విదేశీ పర్యటనకు పంపాలంటే అందుకు సంబంధించి ఏదైనా ప్రయోజనం ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఉంటుందా, ఉండదా.. అనే కోణంలో సీఎస్ నేతృత్వంలోని కమిటీ పరిశీలించాకే నిర్ణయం తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తిని అమెరికాలో శిక్షణకు పంపేందుకు ఎటువంటి స్క్రూటినీ లేకుండా ఏకంగా రూ.11 లక్షలను అడ్వాన్స్గా మంజూరు చేస్తూ ఆర్థికశాఖ కార్యదర్శి రవిచంద్ర నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబుతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడికి సంబంధం ఉన్న కొండేపాటి రాజేందర్ కోసం ఆర్థికశాఖలో ఫైనాన్షియల్ ఎకనమిక్ అనాలసిస్ డివిజన్ను ఏర్పాటు చేసి.. దానికి డైరెక్టర్గా రాజేందర్ను నియమించారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా రాజేందర్ అనే ప్రైవేట్ వ్యక్తిని శిక్షణకు పంపాలని ఆర్థికశాఖ కార్యదర్శి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆ శిక్షణ కోసం రాజేందర్కు అడ్వాన్స్గా రూ.11 లక్షలు మంజూరు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా ఉత్తర్వులు జారీచేశారు. రవిచంద్ర శుక్రవారం నుంచి సెలవులో వెళ్తుండగా గురువారం హడావిడిగా నగదు మంజూరు చేస్తూ.. జీవో ఇవ్వకుండా ఆఫీస్ ఆర్డర్ జారీచేశారు. ఆఫీస్ ఆర్డర్ అయితే ఎవ్వరికీ తెలియదనే భావనతో రవిచంద్ర ఇచ్చారు. ఆ శిక్షణ కూడా అమెరికాలో వచ్చే నెల 12 నుంచి 24 వరకు ఉంది. వచ్చే నెల ఉన్న శిక్షణ కోసం.. హడావిడిగా సెలవుపై వెళ్తున్న ఒక రోజు ముందు ఆఫీస్ ఆర్డర్ జారీ చేయడాన్ని సచివాలయ వర్గాలు తప్పుపడుతున్నాయి. ఒక పక్క రవిచంద్ర 26 రోజుల పాటు.. అంటే వచ్చే నెల 19వ తేదీ వరకు వ్యక్తిగత కారణాలపై ఆర్జిత సెలవుపై వెళ్లేందుకు అనుమతిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి లేకుండా ఎలా? రాజేందర్ శిక్షణ పూర్తి చేసుకుని వచ్చాక బిల్లులు పెట్టుకుంటారని, అప్పుడు మరో రూ.11 లక్షలు చెల్లించనున్నారని ఆర్థికశాఖ వర్గాలు పేర్కొన్నాయి. హార్వర్డ్ కెనెడీ స్కూల్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్–ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఎ మార్కెట్ ఎకానమీ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఇన్ ఎ ఛేంజింగ్ వరల్డ్ అనే అంశంపై శిక్షణ కోసం రాజేందర్ను పంపిస్తున్నట్లు ఆఫీస్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ఎటువంటి అనుమతి తీసుకోకుండానే రవిచంద్ర ఆఫీస్ ఆర్డర్ ఎలా జారీ చేస్తారని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తి శిక్షణ కోసం ప్రజాధనాన్ని ఎలా ఇస్తారని కూడా ఆర్థికశాఖ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యం చేసుకోవాల్సి ఉందని ఆర్థిక శాఖ వర్గాలు కోరుతున్నాయి. -
తొలి ప్రతిపాదన ‘పేట’లో డ్రెయినేజీ వ్యవస్థ
సాక్షి, నారాయణపేట: జిల్లా ఆవిర్భావం అనంతరం ‘పేట’ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. తొలి ప్రయత్నంగా పారిశుద్ధ్య వ్యవస్థపై అధికారులు దృష్టి సారించారు. వందశాతం మంచినీటి సౌకర్యం ఉన్న మున్సిపాలిటీల్లో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసి పంపించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అందులో భాగంగా హైదరాబాద్ జోన్లోని 19 మున్సిపాలిటీలకు పబ్లిక్హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కమిషనర్ ఉత్తర్వులను జారీ చేశారు. అందులో నారాయణపేట గ్రేడ్–2 మున్సిపాలిటీకి అవకాశం వచ్చింది. రూ. 55 కోట్ల నిధులకు ప్రతిపాదనలు పట్టణంలో ప్రస్తుతం 70 కిలో మీటర్ల మేర ఓపెన్ డ్రెయినేజీలు ఉన్నాయి. అయితే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం దాదాపు 100 కిలో మీటర్లు చేపట్టేందుకు ఆర్వీ కన్సల్టెన్సీవారు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పట్టణంలోని 23 వార్డుల్లో ఉన్న ఓపెన్ డ్రెయినేజీలను పరిశీలించి ఎక్కడెక్కడ ఇంకా ఓపెన్ డ్రెయినేజీలు అవసరమని గుర్తించారు. దాంతో పాటు అండర్గ్రౌండ్ డ్రెయినేజీ 1.5 మీటర్ల లోతులో నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలను రూపొందించారు. ఈ డ్రెయినేజీల నిర్మాణం కోసం రూ.55 కోట్ల నిధులు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేశారు. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పట్టణంలో చేపట్టే అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణంతో వీధుల నుంచి పారే మురుగునీరంతా ఒక చోట చేరేందుకు ప్లాంట్ను ఏర్పాటు చేస్తారు. దానినే సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. పట్టణంలో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి పళ్ల ఏరియాలోని బీబీ దర్గా సమీపంలో, మరోటి పగిడిమారి రోడ్లో ఏర్పాటు చేసేందుకు స్థలాలను పరిశీలించారు. ఒక్కో ప్లాంట్కు దాదాపు ఎకరా స్థలం కావాల్సి ఉంది. వర్షపునీరు పారేందుకు.. ఇళ్లనుంచి విడుదలైన నీటితో పాటు వర్షపు నీరు పారే నీటిని మాత్రమే ఓపెన్ డ్రెయినేజీల్లో పారేందుకు చర్యలు చేపట్టనున్నారు. మలమూత్ర విసర్జన, మురుగునీరు, బాత్రూం వాటర్ పైప్లైన్లను అండర్గ్రౌండ్ డ్రెయినేజీలకు అనుసంధానం చేస్తారు. ఈ నీరంతా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కు చేరి ఫిల్టర్ అయి మళ్లీ బయటికి నాలాల ద్వారా పంపిస్తారు. ప్రభుత్వ ఆమోదమే తరువాయి.. ఆర్వీ కన్సల్టెన్సీ వారు తయారు చేసిన అండర్గ్రౌండ్ డ్రెయినేజీ ప్రతిపాదనలు (ప్రిమిలరీ డిటెల్ ప్రాజెక్ట్ రిపోర్ట్)ను స్థానిక మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు ఇటీవలే హైదరాబాద్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కమిషనర్కు పంపించారు. ఆ శాఖ పరిశీలన తర్వాత ఫైనల్ డిజైన్ను రూపొందిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వస్తే పనులు ప్రారంభం కావడమే తరువాయి. ప్రతిపాదనలు పంపించాం నారాయణపేట పట్టణంలో అండర్గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం కోసం ఆర్వీ ద్వారా సర్వే చేయించాం. రూ.55 కోట్ల మేర నిధులు కావాలని డీపీఆర్ రూపొందించి ప్రతిపాదనలు తయారు చేసి సీడీఎంఏకు పంపించాం. ప్రభుత్వ అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. – ఖాజాహుసేన్, ఇంజనీయర్, మున్సిపాలిటీ నారాయణపేట -
ఇదేం వింత.. హెడ్ఫోన్ ఆర్డర్ చేస్తే..?
కోలకతా: ఆన్లైన్ కొనుగోళ్లలో మోసానికి సంబంధించి మరో షాకింగ్ ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్ వస్తువులను ఆర్డర్ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం చూశాం. కానీ కోలకతాకు చెందిన వినియోగదారుడికి మాత్రం మరో వింత అనుభవం ఎదురైంది. ఒక ప్రముఖ ఆన్లైన్ కంపెనీకి హెడ్ఫోన్స్ కోసం ఆర్డర్ చేసిన కస్టమర్ అనంతరం పరిణామాలకు గందరగోళంలో పడిపోయాడు. ఫుట్బాల్ పట్ల అమితమైన ప్రేమ ఉన్న ఓ అభిమాని అటు కుటుంబానికి, ఇటు తనకు ఏఇబ్బందీ లేకుండా మ్యాచ్లనుఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఇందుకు రెండుటీవీ హెడ్సెట్లను ప్రముఖ ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేశాడు. ఈ ప్యాకేజీ శుక్రవారం ఇంటికి చేరింది. అయితే ఆ సమయానికి ఇంట్లో లేకపోవడంతో అతడు శనివారం ఆ ప్యాక్ విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్ఫోన్కోసం ఎదురు చూసిన అతగాడు బాక్స్లో ఉన్నది చూసి బిత్తరపోయాడు. ఇక్కడే ఈయనకు మరో షాక్ తగిలింది. హెడ్ఫోన్కు బమదులుగా ఒక హెయిర్ ఆయిల్ డబ్బా దర్శనమిచ్చింది. దీంతో బాధితుడు బాక్స్మీద ఉన్న టోల్ ఫ్రీకి (1800) ఫోన్ చేశాడు. ఫోన్ రింగ్ ఒకసారి మ్రోగి.. డిస్ కనెక్ట్ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్కు మళ్లీ డయల్ చేశాడు. సేమ్ ఎస్ఎంఎస్ రిపీట్. ఇక ఈ విషయాన్ని వాళ్ల స్నేహితులతో షేర్ చేస్తే.. వాళ్లు ఇదే అనుభవాన్ని పంచుకున్నారు. అయితే వారి సలహా మేరకు కంపెనీకి చెందిన అసలైన టోల్ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన ఫిర్యాదు నమోదు చేశాడు. ఇక్కడ ఇంకో గమ్మత్తేమిటంటే..ఆయిల్ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్ఫోన్ సెట్ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్ చేస్తామంటూ సోమవారం ఉదయం షాపింగ్ పోర్టల్ నుండి కాల్ రావడం. దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్లైన్ పోర్టల్ వాళ్లు వచ్చి ఆదే బాటిల్ వాపస్ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి... ఫుల్బాల్ మ్యాచ్లను మ్యూట్లోనే వీక్షిస్తున్నాడుట. మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్లైన్ పోర్టల్ కస్టమర్ కేర్ ప్రతినిధి ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్ చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. -
మారన్ బ్రదర్స్కు సీబీఐ షాక్
సాక్షి,ముంబై: అక్రమ టెలిఫోన కనెక్షన్ల స్కాం లో మాజీ టెలికాం మంత్రి దయానిధి మారన్, అతని సోదరుడు కళానిధి మారన్లకు ఎదురు దెబ్బ తగిలింది. అక్రమ టెలిఫోన్ కనెక్షన్ల స్కాంకు సంబంధించి మారన్ బ్రదర్స్ కళానిధి మారన్, దయానిధి మారన్లను స్పెషల్ కోర్టు నిర్దోషులుగా విడుదల చేయడాన్ని సీబీఐ సవాల్ చేసింది. మారన్ బ్రదర్స్కు విముక్తి కల్పిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఈ స్కామ్లో మారన్ బ్రదర్స్ సహా మరో ఏడుగురిని విడుదల చేసిన మూడు నెలల్లో (మార్చి, 14) సీబీఐ ఈ చర్య చేపట్టింది. ఈ పిటిషన్ను స్వీకరించిన జస్టిస్ జి జయచంద్రన్ జూన్20న విచారణకు హాజరుకావాల్సిందిగా ఏడుగురు నిందితులకు నోటీసులు జారీ చేశారు. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కేంద్ర టెలికాం మంత్రిగా దయానిధి మారన్ ఉన్న సమయంలో తన అన్న కళానిధి మారన్ సారథ్యంలోని సంస్థలకు చట్టవిరుద్ధంగా వందల సంఖ్యలో టెలిఫోన్ కనెక్షన్లు కేటాయించినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి .దయానిధి మారన్ తన ఇంట్లో ఓ ప్రైవేట్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు చేసినట్లు సీబీఐ ఆరోపించింది. 764 టెలిఫోన్ లైన్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సన్ టీవీ డేటాను చట్టవిరుద్ధంగా అప్లింక్ చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేయడం వల్ల చెన్నైలోని బీఎస్ఎన్ఎల్, ఢిల్లీలోని ఎంటీఎన్ఎల్లకు రూ.1.78 కోట్లు నష్టం వాట్లినట్టు సీబీఐ ఆరోపించింది. బీఎస్ఎన్ఎల్ మాజీ జీఎం బ్రహ్మనాథన్, మాజీ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంపీ వేలు స్వామి, దయానిధి వ్యక్తిగత కార్యదర్శి గౌతం ఇతర నిందితులుగా ఉన్నారు. అయితే, ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు.. ఇందులో వారిద్దరి పాత్రకు సంబంధించి సరైన ఆధారాలు లేవని పేర్కొంటూ మారన్ సోదరులకు విముక్తి కల్పించిన సంగతి విదితమే. -
నెలలోగా ఉద్యోగ విభజన చేయండి
సాక్షి, హైదరాబాద్: ఉద్యాన విశ్వవిద్యాలయాల్లోని ఉద్యోగుల విభజన చేయకుండా ఇంట్లోనే కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం ఏమిటని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు నిలదీసింది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగుల విభజన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, నెలరోజుల్లోగా ఆయా రాష్ట్రాలకు ఉద్యోగుల తుది కేటాయింపులు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు తేల్చి చెప్పింది. ఈ మేరకు తెలంగాణలోని కొండా లక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర ఉద్యా న విశ్వవిద్యాలయం, ఏపీలో డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, రిజిస్ట్రార్లకు ఆదేశాలిచ్చింది. తెలంగాణ ఉద్యాన వర్సిటీ నుంచి వైఎస్సార్ ఉద్యాన వర్సిటీకి కేటాయింపుల్లో జాప్యాన్ని సవాల్ చేస్తూ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మనోహర్ ప్రసాద్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనం సోమవారం విచారించింది. వాదనల అనంతరం నెలరోజుల్లోగా ఉద్యోగుల తుది కేటాయింపు పూర్తి చేయాలని ధర్మాసనం రెండు రాష్ట్రాలను ఆదేశించింది. -
పూలపాన్పు
పాదుషా గారికి పూలపాన్పులో తప్ప నిద్రపట్టదు. అందుకోసం తన శయన మందిరంలోని మంచాన్ని రోజూ పలు రకాల పూలతో అలంకరించేందుకు ఓ సేవకురాలిని నియమించుకున్నారు. అలా చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఒకరోజు పాదుషా గారు వేటకు వెళ్లి రావడం ఆలస్యమయ్యింది. సేవకురాలు రోజూ లాగే రాజుగారి మంచాన్ని పూలతో అలంకరించింది. ‘ఇన్నేళ్లుగా పాదుషా గారి మంచాన్ని పూలతో ముస్తాబు చేస్తున్నాను కదా, ఒక్కసారి ఈ పూలపాన్పుపై కాసేపు సేదతీరితే’ అనే తలంపు ఆమెకు కలిగింది. వెంటనే పూలపాన్పుపై కాసేపు మేను వాల్చింది. క్షణాల్లోనే గాఢనిద్రలోకి జారుకుంది. అంతలోనే పాదుషా గారు వేటనుంచి తన శయన మందిరానికి వచ్చారు. తన పూలపాన్పుపై పడుకుని ఉన్న సేవకురాలిని చూసి ‘నా పూల పాన్పుపైనే పడుకుంటావా! ఎంత ధైర్యం’ అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. తలారిని పిలిపించి ‘పాదుషా గారి మందిరం విలువేంటో ఇతర సేవకులకు తెలిసొచ్చేలా ఈమెను తల్లకిందులుగా వేలాడదీసి ప్రాణాలొదిలే వరకూ కొరడా దెబ్బలు కొట్టాలని’ ఆజ్ఞాపించారు. ఆజ్ఞ మేరకు కొరడా దెబ్బల శిక్ష అమలు చేశారు. కొరడా దెబ్బలకు ఆ సేవకురాలు పెడబొబ్బలు పెట్టసాగింది. అంతలోనే పకపకా నవ్వడం మొదలెట్టింది! దీన్ని గమనించిన పాదుషాగారు నీ ఏడుపుకు, అంతలోనే నీ నవ్వుకు కారణమేమిటని అడిగారు. దానికా సేవకురాలు ‘కొరడా దెబ్బల నొప్పి భరించలేక ఏడ్చాను. కాని, కేవలం కొన్ని నిమిషాలపాటు మీ పూలపాన్పుపై నిద్రపోయినందుకే నన్నింతగా హింసిస్తున్నారే, మరి జీవితాంతం పూలపాన్పుపై నిద్రపోయేవారి పరిస్థితి పైలోకంలో ఎలా ఉంటుందో ఊహించుకొని నవ్వుకుంటున్నాను’ అని జవాబిచ్చింది. పాదుషాగారి కళ్లు తెరుచుకున్నాయి. ఆ సేవకురాలిని క్షమించి వదిలి వేశారు. పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. తాను అనుభవిస్తున్న అనుగ్రహాలపట్ల అల్లాహ్ లెక్క తీసుకుంటాడన్న గుణపాఠం తెలియజేసిన ఆ సేవకురాలిని బహుమతులతో సత్కరించారు. – నాఫియా -
అన్నదమ్ములు
స్కూలు టీచర్ బార్డ్. అతని తమ్ముడు ఆండర్స్. ఒకరంటే ఒకరికి ప్రాణం. పుట్టినప్పటి నుంచి అన్ని పనులూ కలిసే చేశారు. ఒక్కరోజు కూడా దూరంగా ఉండలేదు. ఇద్దరూ ఒకేరోజు సైన్యంలో చేరారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. ఇద్దరికీ ఒకేరోజు కార్పొరల్గా ప్రమోషన్ వచ్చింది. ఒకేరోజు రిటైరయ్యారు. ఇంతవరకు వాళ్లనెవరూ విడివిడిగా చూడలేదు. కొంతకాలానికి వాళ్ల తండ్రి కాలం చేశాడు. ఆస్తి బాగానే సంక్రమించింది సోదరులకు. కానీ అది పంచుకుని విడిపోవడం వాళ్లకిష్టం లేదు. అందువల్ల ఉన్నదంతా వేలం వేసి ఎవరిక్కావల్సింది వాళ్లు కొనుక్కోవడం మేలనుకున్నారు. అలాగే చేశారు. అయితే, తండ్రికో ఖరీదైన గోల్డ్ వాచ్ ఉంది. ఆ రోజుల్లో అలాంటి వాచ్ ఆ ప్రాంతంలో మరెవరి దగ్గరా లేదు. అది వేలానికి వచ్చినప్పుడు చాలామంది ధనికులు పాట పాడటానికి ముందుకువచ్చారు. అయితే సోదరులిద్దరూ పోటీ పడి పాట పెంచటంతో మిగతావాళ్లు వెనక్కు తగ్గారు. తమ్ముడు తనకు వదిలేస్తాడని అన్నా, అన్న తనకు వదిలేస్తాడని తమ్ముడూ ఆశించారు. కానీ అది జరగకపోగా పాటలో ఎవరూ ఆగలేదు. ధర అనూహ్యంగా పెరిగింది. ఒకరివైపొకరు చిరాకుగా, కోపంగా చూసుకున్నారు. చివరికి ఇరవై డాలర్లకు చేరుకుంది పాట. తమ్ముడలా పట్టుపడతాడని అనుకోలేదు బార్డ్. ఇంక వెనక్కు తగ్గడమెందుకనుకుంటూ ముప్ఫై డాలర్లకు పెంచాడు. అయినా ఆండర్స్ ఆగలేదు. ‘తను చూపిన ప్రేమ, ఆప్యాయత, అనురాగమంతా మరచిపోయాడా తమ్ముడు?’ అనుకున్నాడు బార్డ్. పైగా తను పెద్దవాడు. పాట నలభైకి చేరుకుంది. ఇప్పుడొకరినొకరు చూస్కోడానికి కూడా ఇష్టపడలేదిద్దరూ. ఆక్షన్ హాల్లో టెన్షన్ పెరిగింది. ‘అన్న ఎందుకిలా పట్టుపడుతున్నాడు, అడిగితే తను నామమాత్రపు ధరకే వదులుకునేవాడే. అతని కోరికను తిరస్కరించటం, ఆజ్ఞను ధిక్కరించటం ఇంతవరకూ జరగలేదే’ అనుకున్నాడు ఆండర్స్. అవును మరి పెంచక తప్పదు. ఓడిపోతే అందరి ముందరా తనకెంత అవమానం? ధర మరింత పెరిగింది. బార్డ్కు వశం తప్పింది. ‘‘వంద డాలర్లు. మన సంబంధానిక్కూడా ఇదే చివరిరోజు’’ అన్నాడు ఉద్రేకంతో ఊగిపోతూ. హాలు నిండా నిశ్శబ్దం. ఇక అక్కడ నిల్చోలేక గుర్రమెక్కి ఇంటికి ప్రయాణమయ్యాడు. వెనక నుంచి ఆక్షన్ డీలర్ వచ్చి ‘‘ఆండర్స్ పాట నీకే వదిలేశాడు. వాచీ నువ్వు కొనుక్కో’’ అన్నాడు. అప్పుడు కానీ అతడిలో పశ్చాత్తాపం ప్రారంభం కాలేదు. తమ్ముడి మీద ప్రేమ పొంగి పొర్లింది. తనెంత మూర్ఖంగా ప్రవర్తించాడు. ఒక వాచీ కోసం తన ప్రాణంలో ప్రాణమైన తమ్ముణ్ని వదులుకోవటమా? హాలు నుండి జనమంతా వెలుపలికొచ్చారు. ఆ గుంపులో ఆండర్స్ కూడా ఉన్నాడు. అన్న మనసులో ఘర్షణ అతడికి తెలియదు.‘‘నీ ప్రేమకు చాలా థ్యాంక్యూ అన్నయ్యా. నువ్వన్నట్టు మన సంబంధానికిదే చివరి రోజు. ఇక నీ ఇంటి గడప తొక్కితే ఒట్టు’’ అన్నాడు నిష్టూరంగా. ‘‘ఈ ఊరికారు అంతే దూరం. గుడ్బై’’ అన్నాడు బార్డ్ రుద్దకంఠంతో, ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకోవడానికి విఫలయత్నం చేస్తూ. ఆనాటి నుండి పుట్టిపెరిగిన ఇంటికి ఇద్దరూ దూరమయ్యారు. కొన్నాళ్లకు ఆండర్స్ పెళ్లి చేసుకున్నాడు. కానీ అన్నను రమ్మని కూడా పిలవలేదు. ఎంత తమ్ముడైనా ఆహ్వానించకపోతే బార్డ్ మాత్రం ఎందుకు పోతాడు. ఆండర్స్ పెంచుకున్న ఆవు చచ్చిపోయింది. కారణం ఎవరూ చెప్పలేకపోయారు. రోజులు బాగా లేనట్టుంది. కష్టాలు కట్టకట్టుకుని వచ్చాయి. అతడి పరిస్థితి దిగజారిపోయింది. ఒకనాడు ఇల్లు కూడా కాలి బూడిదైంది. ‘‘ఎవరో నామీద చేతబడి చేసుంటారు. నేను చావాలని కోరుకుంటున్నారు’’ అంటూ భోరున ఏడ్చాడు ఆండర్స్. ఉన్నదంతా పోయింది. బికారిగా మారాడు. పని చేసి సంపాదించాలనే కోరిక కూడా లేదు. అగ్ని ప్రమాదం జరిగిన మరుసటి రోజు బార్డ్ తమ్ముణ్ని పరామర్శించటానికి వచ్చాడు. అప్పటిదాకా మంచం మీద ముడుచుకుని పడుకున్న ఆండర్స్ దిగ్గున లేచి కూర్చున్నాడు.‘‘ఎందుకొచ్చినట్టు? ఇక్కడ నీకేం పని!’’ అంటూ కటువుగా ప్రశ్నించాడు.‘‘నీకు సహాయం చెయ్యడానికి వచ్చాను ఆండర్స్’’ అన్నాడు బార్డ్ అనునయంగా.‘‘నా కష్టాలతో నీకేం పని? ఇంకా ఎందుకు చావలేదా అని చూడ్డానికొచ్చావా? నా తిప్పలు నేను పడతానులే, వెళ్లు వెళ్లు!’’‘‘నువ్వు అపార్థం చేసుకున్నావు’’‘‘వెళ్లు ముందు’’ అంటూ ఉరిమాడు ఆండర్స్. బార్డ్ ఒకడుగు వెనక్కు వేశాడు.‘‘వాచ్ కావాలంటే నువ్వే తీసుకో’’ అన్నాడు బార్డ్, తమ్ముణ్ని సముదాయించటానికి.‘‘వెళ్తావా? వెళ్లవా??’’ అంటూ ముందుకడుగు వేశాడు ఆండర్స్ ఆగ్రహంగా. బాధను అణుచుకుంటూ బార్డ్ వెనుదిరిగాడు. తమ్ముణ్ని ఎలాగైనా ఆదుకోవాలని మనసు పీకుతోంది. జరిగిందేదో జరిగింది. క్షణిక కోపంలో చేసిన పొరపాటుకు ఎన్నాళ్లు కుమిలిపోవటం? వాడన్ని కష్టాల్లో కూరుకుపోయుంటే తనకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? కానీ తనకై తాను మళ్లీ వెళ్లాలంటే అభిమానం అడ్డు వచ్చింది. పైగా పెద్దవాణ్ని అనైనా చూడకుండా తనను అవమానించి పంపాడు. తను స్నేహ హస్తం చాచినా జనం తననే చులకనగా చూస్తారు. ఆదివారం నాడు చర్చ్కి వెళ్లినప్పుడు అక్కడ ఆండర్స్ కనిపించాడు. మరింత చిక్కిపోయాడు. ఎముకలు తేలాయి. మొహం పీక్కుపోయింది. ఒంటిమీద చిరిగిన దుస్తులు మాటువేసి తొడుక్కున్నాడు. బార్డ్ ఉనికినైనా గమనించలేదు. శిలువ మీది ప్రభువువైపే భక్తి పారవశ్యంతో చూస్తూ మోకరిల్లాడు. బార్డ్కు బాల్యం జ్ఞాపకం వచ్చింది. ‘చిన్నప్పుడు ఆండర్స్ ఎంత చురుగ్గా ఉండేవాడు..? తమ్ముణ్ని వదిలి ఉండలేనిక, పాత రోజులు మళ్లీ రావాల’ని దేవుణ్ని మనసారా ప్రార్థించాడు. ఆ కోరిక రావడమేమిటి, తక్షణమే వెళ్లి ఆండర్స్ పక్కన కూర్చోవాలనుకున్నాడు. కానీ ఎవరో అడ్డొచ్చారు. పైగా వాడు తనవైపు చూడ్డానికి కూడా ఇష్టపడటంలేదు. పక్కన వాడి భార్య కూడా ఉంది. ఇక్కడెందుకు ఇంటికెళ్లడమే శ్రేయస్కరం అనుకున్నాడు. సాయంత్రమైంది. తమ్ముడి ఇంటిముందు నిలిచాడు. తలుపు తట్టడానికి భయంగా ఉంది. లోపల భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. ‘‘చర్చిలో మీ అన్నగారు కనిపించారు. నీ గురించే ఆలోచిస్తున్నాడేమో!’’‘‘లేదులే. అతడిది మరొకరి గురించి ఆలోచించే స్వభావం కాదు. ఎంతసేపూ తన గొడవే’’తమ్ముడి మాటలకు బార్డుకు చెమట పట్టింది. చలిగా ఉంది. అయినా చాలాసేపు అక్కడే నిలుచున్నాడు. లోపల కెటిల్లో నీళ్లు మరుగుతున్నట్టుంది. ఆవిరి చప్పుడు వినిపిస్తోంది. చిన్నపిల్ల ఏడ్చింది.‘‘ఒప్పుకోవుగానీ నువ్వు కూడా అస్తమానూ మీ అన్నగారి గురించే ఆలోచిస్తుంటావులే. నాకు తెలియవా మీ స్వభావాలు’’ అంది భార్య.‘‘ఇంకేదన్నా మాట్లాడు’’ అంటూ విసుక్కున్నాడు ఆండర్స్.బార్డ్ ఇంక తిరిగి పోదామనుకున్నాడు. కానీ అంతలోనే తలుపు తెరుచుకుంది. చలి మంటకు కట్టెల కోసం ఆండర్స్ కొట్టం వైపుకు వచ్చాడు. ఇంట్లో వేసుకునే పైజమా, షర్ట్కు బదులు సైనిక యూనిఫాం వేసుకున్నాడు. ‘‘ఇది ఇక తొడుక్కోవద్దు. పిల్లలకు జ్ఞాపకంగా దాచిపెట్టాలి’’ అని సైన్యం నుంచి బయటకు వచ్చిన రోజున వాగ్ధానం చేసుకున్న మాటలు గుర్తుకొచ్చాయి బార్డ్కి. పైగా ఆండర్స్ దానిని రోజూ వాడటం వల్ల చిరిగినట్టుంది. అదే సమయంలో బార్డ్ జేబులోని గోల్డ్ వాచ్ టిక్టిక్మంటూ శబ్దం చేసింది. ఆండర్స్ కట్టెలు తీసుకుని వెళ్లటానికి బదులు ఆకాశం వైపు దీనంగా చూస్తూ ‘‘ఇంకెన్నాళ్లు ప్రభూ ఈ కష్టాలు’’ అంటూ చేతులెత్తి ప్రార్థించాడు. ఆ మాటల్ని చివరి రోజుదాకా మర్చిపోలేడు బార్డ్. ఆ క్షణానే వెళ్లి తమ్ముణ్ని గుండెలకు హత్తుకోవాలనుకున్నాడు. కానీ ధైర్యం చాలలేదు. జబ్బు మనిషిలాగా దగ్గుతూ ఆండర్స్ కట్టెలు తీసుకుని వెళ్లాడు. మరో పది నిమిషాలదాకా అక్కణ్నుంచి కదల్లేదు బార్డ్. బహుశా రాత్రంతా అక్కడే ఉండేవాడేమో. కానీ చలి తీవ్రమైంది. అలా ఆరుబైట నిల్చుంటే మంచులో కూరుకుపోయేవాడే. తమ్ముణ్ని ఆ పరిస్థితిలో చూడటం కలచివేస్తోంది. చివరికి కట్టెల కొట్టంలో లాంతరు వెలిగించి కొక్కానికి తన గోల్డ్ వాచ్ తగిలించి, తన బాధ్యత నిర్వర్తించానన్న తృప్తితో చిన్నపిల్లాడిలా ఇంటికి పరిగెత్తాడు. ఆ రాత్రి కొట్టానికి నిప్పంటుకుంది. లాంతరు నుంచి నిప్పు రవ్వలు లేచి ఉంటాయి. పైనున్న గడ్డికప్పు కూడా కాలింది. బార్డ్ కుమిలి కుమిలి ఏడ్చాడు. ఈ ఘోర పాపానికి నిష్మృతి లేదు అనుకుంటూ రోజంతా మోకరిల్లి, ప్రార్థనా గ్రంథాలు చదువుతూ దైవస్మరణలో గడిపాడు. తెలియక చేసినా నేరం నేరమే. ఆ రాత్రి మసక వెన్నెల వెలుగులో తమ్ముడింటి పాక దగ్గరకెళ్లి వాచ్ కోసం వెతికాడు. గోళికాయంత బంగారం ముద్ద దొరికింది. కరిగి మిగిలిందదే. అది పట్టుకుని వెళ్లి తమ్ముడికి జరిగిందంతా చెప్పి గుండె బరువు దించుకుందామనుకున్నాడు. కానీ మొహమాటం, బెరుకు, భయం. బార్డ్ బూడిదలో వెతుకుతున్నప్పుడు ఓ చిన్న పిల్ల చూసింది. క్రితం రోజు కూడా అతడక్కడికి రావటం చూశారు అక్కడే ఆడుకుంటున్న మరికొంత మంది పిల్లలు. అన్నదమ్ములిద్దరూ బద్ధశత్రువులని ఊరంతా తెలుసు. ఇరుగుపొరుగు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభమైంది. ఎవరూ ఏం నిరూపించలేదు. కానీ అందరి అనుమానం బార్డ్ మీదే. ఏ ముఖం పెట్టుకుని పలకరించగలడిప్పుడు? అన్న దొంగ చాటుగా తనింటికి వచ్చాడని ఆండర్స్కి తెలిసింది. కానీ అతడు నోరు మెదపలేదు. ఇంటిని తగలపెట్టినందుకు పశ్చాత్తాపంతో ఏడ్చాడని కూడా చెప్పారు జనం. కానీ ఇంత నీచమైన పనికి దేవుడు కూడా క్షమించడు. నేరం రుజువు కాలేదు కానీ ఇంత దారుణానికి ఒడిగట్టింది బార్డేనని ఊరంతా అనుకుంది. దర్యాప్తు సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ఎదురుపడ్డారు. ఖరీదైన కొత్త దుస్తుల్లో బార్డ్, చింకిపోయిన పాత దుస్తుల్లో ఆండర్స్. అన్న మొహంలోని దైన్యం ఆండర్స్ గమనించకపోలేదు. ‘‘బహుశా తనకు వ్యతిరేకంగా చెప్పవద్దని వేడుకుంటున్నట్టుంది’’ అనుకున్నాడు. అందువల్ల దర్యాప్తు అధికారి ‘‘మీ అన్నమీద నీకు అనుమానముందా?’’ అని అడిగినప్పుడు లేదన్నాడు ఆండర్స్. మిగిలిన ఒకే ఒక్క పాక కూడా అగ్నికి ఆహుతి కావటంతో ఆండర్స్కు నిలువ నీడ లేకుండా పోయింది. అన్నీ ఉన్నా బార్డ్ పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా మారింది. పశ్చాత్తాపాగ్ని అతణ్ని ప్రతిక్షణం దహించివేస్తోంది. నిద్రాహారాలు మాని నిరంతర దుఃఖంలో మునిగిపోయాడు.ఇప్పుడతణ్ని ఎవరూ గుర్తుపట్టలేరు. ఒక సాయంత్రం పేదరాలెవరో వచ్చి వెంటరమ్మంది. కాసేపటికి కానీ పోల్చుకోలేకపోయాడు. ఆవిడ ఆండర్స్ భార్య అని. సిగ్గుతో, అవమానంతో మరింత కుంగిపోయాడు. ఆమె ఎందుకు పిలిచిందో కూడా గ్రహించగలడు. ఆండర్స్ పూరిపాకలో దీపం వెలుగు కనిపించింది. అంతా ముళ్ల బాట. ఆ వెలుగే లేకపోతే అక్కడ నడవటం అసాధ్యం. చాలాసార్లు మంచులో దిగబడిపోయాయి కాళ్లు. పాక తలుపు వద్ద ఏదో వాసనేసింది. కడుపులో తిప్పినటై్టంది. లోపల పసి పిల్లాడు బొగ్గు తింటున్నాడు. మొహం కూడా నల్లబారింది. పళ్లు మాత్రం తెల్లగా మెరిశాయి. వాడు ఆండర్స్ కొడుకు. కుక్కి మంచం మీద ముడుచుకుని పడుకున్నాడు ఆండర్స్. చిరుగుపాత బొంతలు కప్పుకున్నాడు. కళ్లు పీక్కుపోయాయి. ఆస్తిపంజ రాన్ని చూసినట్టుగా ఉంది. తమ్ముడి మంచం మీద పడి వెక్కివెక్కి ఏడ్చాడు బార్డ్. కాసేపటికి బైటికి పొమ్మని భార్యకు సైగ చేశాడు ఆండర్స్. బార్డ్ ఆమెను ఉండమని అర్థించాడు. అన్నదమ్ముల మధ్య జరిగిన విషయాలన్నీ వివరంగా మాట్లాడుకున్నారు. వేలంపాట నుంచి ఆనాటి దాకా. బార్డ్ జేబులోంచి బంగారు ముద్ద బైటికి తీసి చూపించాడు. తాము విడిపోయిన నాటి నుంచి ఏ ఒక్కరూ ఏ ఒక్క రోజు కూడా సుఖంగా గడపలేదు. ఆండర్స్ బాగా బలహీనంగా ఉన్నాడు. తమ్ముడి ఆరోగ్యం కుదుట పడిందాకా మంచం పక్కనుంచి కదల్లేదు బార్డ్. ‘‘ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. ఇంక మనమెప్పుడూ విడిపోకూడదు అన్నయ్యా!’’ అంటూ కౌగిలించుకున్నాడు ఆండర్స్. కానీ ఆ రోజే అతడు మరణించాడు. అతడి భార్యనూ, కొడుకునూ వెంట తీసుకెళ్లాడు బార్డ్. వాళ్ల సంరక్షణ, పోషణ బాధ్యత తనే తీసుకున్నాడు. ఆనాడు అన్నదమ్ములు మాట్లాడుకున్న విషయాలు క్రమంగా ఊరంతా తెలిశాయి. నిప్పుల్లో కాలిన బంగారం లాంటిదే బార్డ్ మనసు. అన్నదమ్ముల బంధమంటే అలాగే ఉండాలనుకున్నారందరూ. అందరి గౌరవాన్ని, ప్రేమాభిమానాల్ని అందుకున్న బార్డ్ స్కూల్ టీచర్గా మారి పిల్లలకు పాఠాలు చెబుతూ చిరకాలం జీవించాడు. అతడు నిజంగా అందరికీ బోధించింది సాటి మనుషుల పట్ల ప్రేమ చూపటం గురించి... సర్వ మానవ సౌభ్రాతృత్వమే నిజమైన నాగరికత అని. పిల్లలకు అతడు టీచర్ కాడు, తమలో ఒకడు. వృద్ధబాలుడు. నార్వేజియన్ మూలం : బ్యోర్న్స్టెర్న్ బ్యోర్న్సన్ అనువాదం : ముక్తవరం పార్థసారథి -
అశోక లేలాండ్ చేతికి భారీ ఆర్డర్
సాక్షి,చెన్నై: భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ ఆర్డ్ర్ను తన ఖాతాలో వేసుకుంది. తమిళనాడు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థనుంచి ఈ ఆర్డర్ను సాధించింది. బస్సుల రూపకల్పనకుగాను రూ. 321 కోట్ల విలువైన ఆర్డర్ను పొందింది. తమిళనాడులో 2,100 బస్సుల సరఫరా కోసం ఈ ఆర్డర్నుసాధించామని హిందూజ గ్రూప్ ఫ్లాగ్షిప్ సంస్థ అశోక్ లేలాండ్ బీఎస్ఈ ఫైలింగ్లో వెల్లడించింది. 2వేల పాసింజర్ వాహనాలకు ఆధారమైన లోహపు చట్రాలను, పూర్తిగా నిర్మించిన 100 చిన్న బస్సులను సరఫరా చేయనున్నా మని చెప్పింది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం నాటికి సరఫరా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దీంతో అశోక్ లేలాండ్ షేర్లు 1.54 శాతం లాభాలను నమోదు చేశాయి. -
భారీ ఆర్డర్ దక్కించుకున్న రామ్కో సిస్టమ్స్
సాక్షి, ముంబై: ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ రామ్కో సిస్టమ్స్ లిమిటెడ్ భారీ ఆర్డర్ను దక్కించుకుంది. క్లౌడ్ ప్లాట్ఫారమ్లో ఉత్పత్తులు మరియు సేవలందిస్తున్న ప్రముఖ సంస్థ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న రామ్కో సిస్టమ్స్ బ్రిటీష్ మల్టీనేషనల్ బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ కంపెనీనుంచి మల్టీ మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ను సాధించింది. యూరోపియన్ బ్యాంకింగ్ దిగ్గజ సంస్థ నుంచి మల్టీ మిలియన్ డాలర్ల పేరోల్ ట్రాన్స్ఫార్మేషన్ ఆర్డర్ లభించినట్లు రెగ్యురేటరీ ఫైలింగ్ లో రామ్ కో తెలిపింది. దీంతో మిడ్ కాప్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాక్ రామ్కో సిస్టమ్స్ జోరందుకుంది. 11శాతం లాభాలతో కొనసాగుతోంది. ఒకదశలో దాదాపు 15 శాతానికిపైగా ఎగిసింది. ఆర్డర్లో భాగంగా యూరోపియన్ సంస్థ కార్యకలాపాలు విస్తరించిన 14 దేశాలలో యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ద్వారా మేనేజ్డ్ పేరోల్ సర్వీసులను నిర్వహించనున్నట్లు రామ్కో సిస్టమ్స్ పేర్కొంది. పేరోల్స్, పన్నులు, అటెండెన్స్, లీవులు, లోన్లు, రీఇంబర్స్మెంట్ తదితరాల నిర్వహణను గ్లోబల్ ప్లాట్ఫామ్ ద్వారా చేపట్టనున్నట్లు వివరించింది. ఇటీవలే, గ్లోబల్ పేరోల్ అసోసియేషన్ ద్వారా 2017 సం.రంలో హైలీ రికమెండెడ్ పేరోల్ సాఫ్ట్వేర్ సరఫరాదారు రివార్డును కూడా సొంతం చేసుకుంది. -
ఫేస్బుక్లో కొత్త ఫీచర్
శాన్ఫ్రాన్సిస్కో: కొత్త, కొత్త ఆప్షన్లతో యూజర్లను ఆకర్షిస్తున్న సోషల్మీడియా దిగ్గజం ఫేస్బుక్ తాజాగా మరో సరికొత్త ఆప్షన్ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే అనేక రకాల ఆప్షన్లు తీసుకొచ్చిన ఫేస్బుక్ ఇపుడు ఆహారం కోసం 'ఆర్డర్ ఫుడ్' ఫీచను లాంచ్ చేసింది. గత ఏడాది కాలంగా పరీక్షలు నిర్వహిస్తున్న సంస్థ ఇకపై ఇంటర్నెట్ యూజర్లు ఫేస్బుక్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐఓఎస్, ఆండ్రాయిడ్, డెస్క్టాప్ యూజర్లు నేరుగా ఫుడ్ ఆర్డర్ చేయవచ్చు. ముందుగా అమెరికా ఈ సేవలను ప్రారంభించింది. ఇకపై మీరు అధికారికంగా ఫుడ్ పికప్ లేదా డెలివరీ కోసం నేరుగా ఆర్డర్ చేసుకోవచ్చని ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అలెక్స్ హిమెల్, బ్లాగ్లో శుక్రవారం ప్రకటించారు. మెనులో 'ఆర్డర్ ఫుడ్' విభాగాన్ని సందర్శించడం ద్వారా సమీపంలోని రెస్టారెంట్లు బ్రౌజ్ చేసి, స్టార్ట్ ఆర్డర్ బటన్ క్లిక్ తో ఇష్టమైన ఫుడ్ను ఎంచుకోవచ్చని తెలిపారు. దీంతో ఇష్టమైన ఆహారాన్ని పొందాలంటే సమీపంలో ఉన్న రెస్టారెంట్స్ లేదా హోటల్స్కు వెళ్లడమో లేదంటే రెస్టారెంట్ల వెబ్సైట్లు కానీ,వివిధ యాప్లు కానీ ఓపెన్ చేయాల్సిన పనిలేకుండా నేరుగా ఫేస్బుక్ ద్వారా ఉన్న చోటు నుంచే ఫుడ్ ఆర్డర్లు చేయవచ్చు. -
సేవల్లో లోపాలు ఉండకూడదు
నరసాపురం : పేదలకు అందించే విద్య, వైద్య సేవల్లో ఎలాంటి లోపాలు ఉండకూడదని జాతీయ మానవహక్కుల కమిషన్ ప్రత్యేక అధికారి పీజీ కామత్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలోని టేలర్ హైసూ్కల్, శారద టాకీస్ వద్ద ఉన్న మున్సిపల్ హైసూ్కల్ను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. రోగుల పట్ల మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని వైద్యులకు సూచించారు. సబ్ కలెక్టర్ సుమిత్కుమార్ గాంధీ, జిల్లా ఉపవిద్యాశాఖ అధికారి ఎం.సూర్యనారాయణ, ఇన్చార్జ్ డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సురేష్ ఆయన వెంట ఉన్నారు. -
పశుగణనకు ఏర్పాట్లు చేసుకోండి
పశుశాఖ డైరెక్టర్ సోమశేఖరన్ ఆదేశం అనంతపురం అగ్రికల్చర్ : జూలై నుంచి పశుగణన కార్యక్రమం చేపడుతుండటంతో అందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకోవాలని పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సోమశేఖరన్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన గుంటూరు నుంచి జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి కచ్చితమైన లెక్కలు సేకరించాల్సి కుండటంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని సర్వే చేయాలన్నారు. పశువులు, ఎద్దులు, గేదెలు, కోళ్లు, పందులు, గాడిదలతో పాటు అన్ని రకాల జంతుజాలం వివరాలు పక్కాగా ఉండాలని సూచించారు. అందుకోసం బృందాలు, షెడ్యూల్ ఏర్పాటు చేయాలన్నారు. ఇక ఈనెల 26 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు 45 లక్షల జీవాలకు ఉచితంగా నట్టలనివారణ (డీవార్మింగ్) కార్యక్రమం చేపట్టాలన్నారు. వర్షాలు, పశుగ్రాసం తదితర వాటిపై ఆయన ఆరాతీశారు. సీజన్లో ఇప్పటివరకు 8,200 మెట్రిక్ టన్నులు సైలేజ్ బేల్స్, 12 వేల మెట్రిక్ టన్నులు పశుదాణా, 800 మెట్రిక్ టన్నులు దాణామృతం (టీఎంఆర్) గడ్డి రైతులకు సరఫరా చేశామని ఆ శాఖ జేడీ డాక్టర్ జి.సన్యాసిరావు తెలిపారు. ఇంకా 250 మెట్రిక్ టన్నులు బేల్స్, 2 వేల మెట్రిక్ టన్నులు దాణాకు ఇండింట్ ఉందన్నారు. బేల్స్ స్థానంలో కత్తిరించిన మొక్కజొన్న, జొన్నతో తయారు చేసిన ఎండుగడ్డిని కిలో రూ.3 ప్రకారం అందించేందుకు వీలుగా పది రోజుల్లో ప్రకటిస్తామని డైరెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జేడీతో పాటు ఆ శాఖ అధికారులు శ్రీనాథాచార్, ప్రకాష్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ట్రంప్ కొత్త ఆర్డర్: దేశీయ ఐటీ సంస్థలపై ప్రభావం
-
ట్రంప్ కొత్త ఆర్డర్: దేశీయ ఐటీ సంస్థలపై ప్రభావం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ఆర్డర్పై చేసిన సంతకం దేశీయ ఐటీ సంస్థల్లో గుబులు రేపింది. భారత ఐటీ రంగానికి మరోసారి భారీ షాకిస్తూ హైర్ అమెరికన్స్ అంటూ మొదటనుంచి చెబుతున్న ట్రంప్ దేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే హెచ్1బీ వీసా నిబంధనల మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ సంతకం చేశారు. ఉద్యోగాల్లో అమెకరిన్లనే నియమించుకోవాలన్న ట్రంప్ ఆదేశాలు దేశీయ ప్రముఖ ఐటీ సంస్థలపై భారీగా పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ లాంటి ఇతర ఐటీ సంస్థలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. అలాగే భారతీయ వృత్తి నిపుణుల(టెక్కీల)ను కూడా ఇది ప్రభావితం చేయనుంది. అమెరికాలో ఐటీ సేవలందిస్తున్న ఈ సంస్థలకు చెందిన విదేశీ ఇంజనీర్లు ప్రోగ్రామర్లు ప్రభావితం కానున్నారు. వీటిని ప్రత్యేక విధులకే మాత్రమే కేటాయిస్తారు. వీటిల్లో కూడా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి. అధ్యక్షుడిగా పదవీబాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే బై అమెరికన్, హైర్ అమెరికన్ నినాదాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయంతో ఫెడరల్ కాంట్రాక్ట్లు కూడా అమెరికా సంస్థలకే వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్వవస్థకు కూడా ఊతం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. తమ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ విస్తృతంగా దుర్వినియోగమైందని, ఇక హైర్ అమెరికన్స్ నినాదానికే ప్రాధాన్యత అని డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. లాటరీ విధానం ద్వాఆరా హెచ్1 బీసా ఎంపిక విధానం సరియైందికాదని ఆర్డర్పై సంతకం చేసు ముందు విస్కాన్సిన్ లో చెప్పారు. దీని స్థానంలో అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్ చెప్పారు. దీంతో ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం దేశీయ ఐటీ కంపెనీలపై భారీగా పడనుంది. దేశంలోని అతిపెద్ద ఐటి సేవల సంస్థ ఇన్ఫోసిస్ వీసా నియంత్రణ మార్పులను పరిశీలిస్తున్నామని ప్రకటించింది. అమెరికాలో లోకల్ టాలెంట్ గుర్తించిన శిక్షణ ఇప్పించే దిశగా కృషి చేస్తున్నట్టు గతంలో చెప్పింది. అటు టీసీఎస్ కూడా దీనికనుగుణంగా చర్యలుచేపడతామని ప్రకటించింది. యాక్సెంచర్, ఐబీఎం, గూగుల్ లాంటి ఇతర టెక్ సంస్థలు ఇప్పటికే అమెరిక్లను నియమించుకునే ప్రక్రియ మొదలు పెట్టాయి. మరోవైపు ఈ సంవత్సరం హెచ్1బీ వీసాల దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయిన సంగతి తెలిసిందే. -
మద్యం వ్యాపారుల మీమాంస
జంగారెడ్డిగూడెం : లాటరీలో మద్యం దుకాణాలు దక్కినా ఎక్కడ ఏర్పాటు చేయాలనే సందిగ్ధంలో వ్యాపారులు ఉన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాష్ట్ర, జాతీయ ప్రధాన రహదారులకు 500 మీటర్లకు పైబడి మద్యం దుకాణాలు ఏర్పాటుచేయాల్సి ఉంది. అలాగే మద్యం దుకాణాలను సూచి స్తూ బోర్డులు పెట్టకూడదు. ఈ నేపథ్యంలో దుకాణాలు ఎక్కడ పెట్టాలో తెలియక మద్యం వ్యాపారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో ఎక్కువ సంఖ్యలో దుకాణాలు రాష్ట్ర, జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నాయి. కొత్త నిబంధనలతో జనావాసాల మధ్య లేదా ఒకే ప్రాంతంలో నాలుగైదు దుకాణాలు పెట్టాల్సి ఉంది. ఇది వ్యాపారులకు మింగుడు పడటం లే దు. జనావాసాల మధ్య పెట్టాల్సి వస్తే గుడి, బడికి దూరంగా ఉండాలి. ఆ ప్రాంతంలో మహిళల నుంచి ప్రతిఘటన ఎదురుకాకుండా చూసుకోవాలి. ఒకే ప్రాంతంలో నాలుగైదు దుకాణాలు గతంలో ప్రాంతాల వారీగా షాపులను కేటాయించి లాటరీ నిర్వహించేవారు. అయితే మారిన నిబంధనల నేపథ్యం లో ఓ పట్టణంలో సుమారు 10 దుకా ణాలు ఉంటే వారు పట్టణ పరిధిలో ఎక్కడైనా నిబంధనలు ధిక్కరించకుం డా ఏర్పాటుచేసుకోవచ్చు. దీంతో ఒకే ప్రాంతంలో నాలుగైదు షాపులు పోటీ పడీ మరీ పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఏ ప్రాంతంలో వ్యాపారం అధికంగా ఉంటుందో అక్కడ ఎక్కువ దుకాణాలు ఏర్పాటుచేసే అవకాశం ఉంది. దీంతో ఉన్న వ్యాపారం తగ్గుతుందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. ఈ నిబంధనలతో గతంలో మద్యం దుకాణాలు నిర్వహించే వారికి తలబొప్పి కడుతుంటే కొత్త వారికి దిక్కుతోచని స్థితిలోకి నెడుతున్నాయి. అత్యుత్సాహంతో టెండర్లు వేసి మద్యం షాపులు లాటరీలో తగిలినా ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. లాటరీ లో తగిలినా అమ్మేసుకుందామంటే నిబంధనలు కఠినంగా ఉండటంతో మద్యం సిండికేట్లు సైతం కొనుగోలు కు ముందుకు రావడం లేదు. విధిగా ఎమ్మార్పీకే.. లైసెన్స్ ఫీజులు గణనీయంగా తగ్గించిన ప్రభుత్వం అదే క్రమంలో మార్జిన్ను 8 శాతానికి పరిమితం చేసిం ది. విధిగా ఎమ్మార్పీకే విక్రయించాలనే నిబంధన విధించింది. దీనిని అత్రికవిు స్తే రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు అపరాధ రుసుం విధించే అవకాశం ఉంది. ఇక మామూళ్ల సంగతి సరేసరి. ఈ నేపథ్యంలో మద్యం వ్యాపారం లాభించేనా అని వ్యాపారులంతా సందిగ్ధంలో ఉన్నారు. ఉదాహరణకు.. ఉదాహరణకు జంగారెడ్డిగూడెం పట్ట ణాన్ని తీసుకుంటే ఏలూరు రోడ్డు నుంచి బుట్టాయగూడెం బైపాస్ రోడ్డు వరకు, కాకర్ల జంక్షన్ నుంచి బైపాస్ వరకు, పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి వారపు సంత వరకు, రాష్ట్ర రహదారి (బైపాస్)లో షాపులు పెట్టేందుకు అవకాశం లేదు. వాస్తవానికి ఈ ప్రాంతంలోనే సుమారు 5 దుకాణాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం వేరే ప్రాంతానికి తరలించాల్సి ఉంటుంది. పట్టణంలో ఏడు షాపులకు అనుమతి ఉంది. దీని ప్రకారం చూస్తే ఒక కొవ్వూరు రోడ్డు, అశ్వారావుపేట రోడ్డు మినహా ఏ ప్రాంతంలోనూ షాపులు పెట్టుకునే అవకాశం లేదు. దీంతో షాపులన్నీ ఈ రెండు రోడ్డుల్లోనే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. జనా వాసాల మధ్య పెడదామన్నా ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనిపిస్తోంది. -
పదోన్నతి పొందిన ఏఎస్సైలకు పోస్టింగ్లు
ఏలూరు అర్బన్ : జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో హెడ్ కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారికి ఇటీవల ఏఎస్సైలుగా పదోన్నతి లభించిన విషయం తెలిసిందే. పదోన్నతి పొందిన వారికి స్టేషన్లు కేటాయిస్తూ జిల్లా పోలీస్ కేంద్ర కార్యాలయం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వారి వివరాలు ఇలా.. పేరు పనిచేస్తున్న స్టేషన్ పోస్టింగ్ పి.త్రినాథరావు కొయ్యలగూడెం ద్వారకాతిరుమల ఎంవిఆర్ చంద్రరావు జెఆర్ గూడెం జెఆర్ గూడెం బీవీ ప్రసాదరావు దెందులూరు డీఎస్బీ ఏలూరు కె.శ్రీమన్నారాయణ చేబ్రోలు నరసాపురం ఎ. విజయకుమార్ పెదపాడు తడికలపూడి వైఆర్డీ సింగ్బాబు పెరవలి తణుకు ట్రాఫిక్ డి.సంజీవరావు ఉండి ఆకివీడు కె.సాల్మన్ రాజు చేబ్రోలు ఏలూరు ట్రాఫిక్ డీకే వరంబాబు ఏలూరు దెందులూరు కె.సూరపరాజు పెంటపాడు పెంటపాడు ఎ.పద్మావతి yì సీఆర్బీ ఐటీ కోర్టీమ్ బి.జ్యోతిరాణి లక్కవరం లక్కవరం ఎం.హనుమంతరావు నిడదవోలు సవిుశ్రగూడెం జె.పాపారావు దేవరపలి్ల దేవరపల్లి ఎం.నాగేశ్వరరావు ఏలూరు రూరల్ ఏలూరు టూటౌన్ వైడీ.కృపావరం ఏలూరు సీసీఎస్ ఉమెన్ పీఎస్ సయ్యద్ అహ్మద్ ఏలూరు సీసీఎస్ ఉమెన్ పీఎస్ బి.తాతారావు పెనుగొండ పెరవలి ఎన్వీవీ నాగేశ్వరరావు భీమవరం గణపవరం జేవీఎస్ సాయిబాబు నిడమర్రు అత్తిలి జి.వీరస్వాములు టీ.పీ.గూడెం చేబ్రోలు ఎం.పాపాయ్య పోడూరు జీలుగుమిల్లి జీఎస్.నారాయణ భీమవరం–2 భీమవరం ట్రాఫిక్ వై.కృపాదానం భీమడోలు ద్వారకాతిరుమల వి.వెంకటేశ్వర్లు కొవ్వూరు తణుకు ఐ.భాస్కర్ జీలుగువిులి్ల బుట్టాయిగూడెం కె.సాంబశివరావు పెంటపాడు టీపీగూడెం వి.వరప్రసాద్ డీసీఆర్బీ ఏలూరు డీసీఆర్బీ ఏలూరు ఎస్బీవీజీ కుమార్ భీమవరం–2 పాలకోడేరు వి.లూముంబా జేఆర్ గూడెం జీలుగుమిల్లి పి.కుమారస్వామి దెందులూరు దెందులూరు ఎం.రాజ్యలక్షి్మ ఇరగవరం ఉండ్రాజవరం సీహెచ్.రమేష్బాబు పాలకోడేరు తణుకు రూరల్ ఎ.శ్రీనివాసరావు ఆకివీడు మొగల్తూరు -
ఇన్చార్జీ డీఈఓగా తాహెరా సుల్తానా
కర్నూలు సిటీ: డీఈఓగా ఇన్చార్జ్ బాధ్యతలను తాత్కాలికంగా డిప్యూటీ ఈఓ తహేరా సుల్తానాకు అప్పగిస్తూ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్గా పని చేస్తున్న కె.రవీంద్రనాథ్రెడ్డికి అనూహ్య పరిణామాల మధ్య 2015లో డీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న పదోన్నతులు చేపట్టి ఉపాధ్యాయ వర్గాల్లో రవీంద్రనాథ్రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా ఏడాదికిపైగా పని చేసిన డీఈఓగా కూడా గుర్తింపు పొందినట్లు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. మరో 40 రోజుల్లో 10వ తరగతి పరీక్షలు జరుగనున్న సమయంలో డీఈఓకు జేడీగా పదోన్నతి వరించింది. దీంతో ఆయన ప్రభుత్వ బీఎడ్ కాలేజీ ప్రిన్సిపల్, డీఈఓ పూర్తి అదనపు బాధ్యతల నుంచి రీలివ్ అయ్యారు. ఈ క్రమంలో రెగ్యులర్ డీఈఓ వచ్చేంత వరకు ఈ రెండు స్థానాల ఇన్చార్జ్ బాధ్యతలను డిప్యూటీ ఈఓగా తాహెరా సుల్తానా తీసుకున్నారు. ఈ మేరకు ఆమె మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. పదోన్నతి వరిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలో కేవలం 2 జిల్లాలకు మాత్రమే రెగ్యులర్ డీఈఓలున్నారు. మిగిలిన 11 జిల్లాలకు ఇన్చార్జీలే పని చేస్తున్న క్రమంలో డిప్యూటీ ఈఓలకు పదోన్నతులు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే మహిళా కోటాలో సీనియార్టీ పరంగా తహేరా సుల్తానాకు ముందు వరుసలో డీఈఓ పదవి వరించే అవకాశం ఉంది. అయితే డీఈఓగా కొత్త అధికారిని తెచ్చుకునే ప్రయత్నంలో కలెక్టర్ ఉన్నట్లు తెలిసింది. లేనిపక్షంలో జేడీ హోదాలో డీఈఓగా విద్యా సంవత్సరం చివరి వరకు రవీంద్రనాథ్రెడ్డిని పని చేయించుకునేందుకు ప్రభుత్వ నుంచి అనుమతి తెచ్చుకుంటానని చెబుతున్నట్లు సమాచారం. -
మున్సిపాలిటీలకు నిధులు మంజూరు
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి మడకశిర : మున్సిపల్ రీజనల్ పరిధిలోని కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న 38 మున్సిపాలిటీలకు నిధులు మంజూరైనట్లు మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. 2016 - 17వ ఆర్థిక సంవత్సరంలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.148.79 కోట్లు, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద మరో రూ.137.28 కోట్లు మున్సిపాలిటీలకు మంజూరయ్యాయన్నారు. ఆమె సోమవారం మడకశిరకు వచ్చిన సందర్భంగా స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సబ్ప్లాన్ నిధుల్లో ఎస్సీల అభివృద్ధికి రూ.77.65 కోట్లు, ఎస్టీల అభివృద్ధికి రూ.59.63 కోట్లు కేటాయించారన్నారు. 2015 - 16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.101.60 కోట్లు, సబ్ప్లాన్ నిధులు రూ.333.36 కోట్లు కూడా మున్సిపాలిటీలకు వచ్చాయన్నారు. ఈ నాలుగు జిల్లాల పరిధిలో గత డిసెంబరుకు రూ.212.35 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉండగా, రూ.109.84 కోట్లు(52శాతం) మాత్రమే వసూలైనట్లు తెలిపారు. పన్ను వసూళ్లను 75శాతానికి పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రీజనల్ పరిధిలోని కర్నూలు, తాడిపత్రి, కడప, ప్రొద్దుటూరు, శ్రీకాళహస్తి, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలకు మొదటి విడతలో ఏహెచ్పీ కింద రూ.27,900 ఇళ్లు మంజూరైనట్లు తెలిపారు. అదే విధంగా హౌసింగ్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలకు బీఎల్సీ కింద 17,470 ఇళ్లు మంజూరయ్యాయన్నారు. 38 మున్సిపాలిటీల పరిధిలో స్వచ్ఛభారత్ కింద 56,333 మరుగుదొడ్లను నిర్మించామన్నారు. 162 కమ్యూనిటీ మరుగుదొడ్లను మంజూరు చేశామని, ఇందులో 68 పూర్తి చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల పరిధిలో 84,677 కుక్కలు ఉంటే అందులో 42,247 కుక్కలకు ఆపరేషన్లు చేయించామన్నారు. మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఈ - ఆఫీస్కు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఇంతవరకు రీజనల్ పరిధిలో 3,485 ఫైళ్లను ఈ - ఆఫీస్ ద్వారా నిర్వహించామన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రవేశపెట్టిన ‘పురసేవ’ యాప్ద్వారా 5,200 ఫిర్యాదులు వచ్చాయని, ఇందులో 4,500 పరిష్కరించామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో నగదు రహిత లావాదేవీలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. స్వైపింగ్ మిషన్ల కోసం 3,700 దరఖాస్తులు రాగా 960 మిషన్లను సరఫరా చేశామన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, కమిషనర్ నయీద్అహమ్మద్ పాల్గొన్నారు.