ఆన్‌లైన్‌ గేమింగ్‌కు మనీ లాండరింగ్‌ ముప్పు | Money laundering big threat to online gaming and digital economy | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు మనీ లాండరింగ్‌ ముప్పు

Published Fri, Oct 25 2024 6:29 AM | Last Updated on Fri, Oct 25 2024 8:01 AM

Money laundering big threat to online gaming and digital economy

కట్టడికి తక్షణ చర్యలు తీసుకోవాలి 

ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలి 

డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ నివేదిక 

న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్‌లైన్‌ గేమింగ్‌ రంగానికి మనీలాండరింగ్‌ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్‌ ఇండియా ఫౌండేషన్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్‌ ఎకానమీని, ఆన్‌లైన్‌ గేమింగ్‌ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. 

చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్‌లిస్ట్‌ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్‌ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. 

అయిదేళ్లలో 7.5 బిలియన్‌ డాలర్లకు పరిశ్రమ.. 
నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్‌ మనీ గేమింగ్‌ (ఆర్‌ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్‌ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్‌టెక్, క్లౌడ్‌ సర్వీసెస్, సైబర్‌–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. 

నివేదికలోని మరిన్ని విశేషాలు.. 
→ యూజర్‌కు భద్రత, సైబర్‌ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌ మార్కెట్లో ఏటా 100 బిలియన్‌ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల 
తీవ్రతకు నిదర్శనం.  
→ చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్‌ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్‌ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని 
ఇది తెలియజేస్తోంది.  
→ దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్‌లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్‌లైన్‌ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్‌ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా  ఉంటున్నాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement