Digital India
-
డిజిటల్ ఇండియాకు బ్లాక్చెయిన్ దన్ను
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్లాక్చెయిన్ టెక్నాలజీ సంస్థ అల్గోరాండ్ భారత్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తమ సాంకేతికత ఊతమివ్వగలదని సంస్థ వైస్ ప్రెసిడెంట్, ఇండియా కంట్రీ హెడ్ అనిల్ కాకాని సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఫైనాన్స్, ఆరోగ్య సంరక్షణ తదితర రంగాల్లో బ్లాక్చెయిన్ టెక్నాలజీతో గణనీయంగా ప్రయోజనాలు చేకూరగలవని వివరించారు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే.. దేశీయంగా వివిధ రంగాల్లో పలు సవాళ్లను పరిష్కరించేందుకు అల్గోరాండ్ బ్లాక్చెయిన్ టెక్నాలజీ వాడుతున్నారు. ఉదాహరణకు మహిళల సారథ్యంలోని ఎంఎస్ఎంఈలకు కొత్త ఆర్థిక వనరులను అందుబాటులోకి తెచ్చేందుకు ఒక పెద్ద సహకార బ్యాంకు ప్రత్యామ్నాయ క్రెడిట్ స్కోరుకార్డ్ను రూపొందిస్తోంది. అలాగే, సెల్ఫ్ ఎంప్లాయ్డ్ ఉమెన్స్ అసోసియేషన్ (సేవా) తమ సభ్యుల కోసం డిజిటల్ హెల్త్ స్కోర్కార్డును ప్రయోగాత్మకంగా పరీక్షిస్తోంది. ఇలాంటివి అందరికీ ఆరి్థక సేవలను, ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉపయోగపడేవే. ఇక సప్లై చెయిన్లో పారదర్శకత సాధించేందుకు, పర్యావరణహిత ప్రాజెక్టులకు ఫైనాన్స్ చేసేందుకు, ఇతరత్రా ప్రజలకు మేలు చేకూర్చే పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ఉపయోగపడగలదు. బ్లాక్చెయిన్ ఆధారిత గుర్తింపు ధృవీకరణ సొల్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ మొదలైన వాటిపై మేము ప్రధానంగా దృష్టి పెడుతున్నాం. రోడ్ టు ఇంపాక్ట్, స్టార్టప్ ల్యాబ్లాంటి కార్యక్రమాలు స్థానికంగా ప్రతిభావంతులను, ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. ఇవన్నీ డిజిటల్ ఇండియా లక్ష్య సాకారానికి తోడ్పడతాయి. అల్గోరాండ్ టెక్నాలజీతో ప్రధానంగా ఫైనాన్స్, సప్లై చెయిన్, హెల్త్కేర్, సస్టైనబిలిటీ వంటి కీలక రంగాలు లబ్ధి పొందగలవు. ఫైనాన్స్ విషయానికొస్తే అల్గోరాండ్ బ్లాక్చెయిన్ టెక్నాలజీవల్ల లావాదేవీలను వేగవంతంగా, సురక్షితంగా నిర్వహించవచ్చు. పారదర్శకత వల్ల సినిమాల నిర్మాణానికి, సీమాంతర వాణిజ్యానికి అవసరమయ్యే నిర్వహణ మూలధనాన్ని సమకూర్చుకునేందుకు మరిన్ని వనరులు అందుబాటులోకి రాగలవు. సప్లై చెయిన్ మేనేజ్మెంట్ను చూస్తే ఏఆర్వీవో, ఎల్డబ్ల్యూ3 లాంటి కంపెనీలు మా టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. హెల్త్కేర్ విభాగంలో ప్రభుత్వ పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేర్చడంలో సేవా వంటి సంస్థల కార్యకలాపాలకు ఇది తోడ్పడుతోంది. టెరానోలాంటి సస్టైనబిలిటీ ప్రాజెక్టుల్లో దీన్ని ఉపయోగిస్తున్నారు. టెక్నాలజీ దన్నుతో సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా టీ–హబ్, మన్ దేశీ ఫౌండేషన్ తదితర సంస్థలతో కలిసి పని చేస్తున్నాం. భారత్లో ప్రాజెక్టులు.. టీ–హబ్లో మా స్టార్టప్ ల్యాబ్ అనేది టెరానో, ఆ్రస్టిక్స్, ఫిల్మ్ఫైనాన్స్, ఎల్డబ్ల్యూ3లాంటి బ్లాక్చెయిన్ అంకుర సంస్థలకు తోడ్పాటు అందిస్తోంది. 2024 స్టార్టప్ ల్యాబ్లో తొలి బ్యాచ్ కంపెనీల్లో ఇప్పటికే అయిందింటిలో ఇన్వెస్ట్ చేసింది. 2025లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. బ్లాక్చెయిన్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు నాస్కామ్వంటి సంస్థలతో కూడా కలిసి పని చేస్తున్నాం.ప్రణాళికలు.. స్టార్టప్ ల్యాబ్లలో మరిన్ని కొత్త బ్యాచ్లు ప్రారంభించడం, ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమ దిగ్గజాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం తదితర ప్రయత్నాల ద్వారా భారత్లో కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు అల్గోరాండ్ కట్టుబడి ఉంది. రోడ్ టు ఇంపాక్ట్ వంటి కార్యక్రమాలను విస్తరించడం, భారతదేశపు విశిష్టమైన సవాళ్లను పరిష్కరించేందుకు మరిన్ని బ్లాక్చెయిన్ ఆధారిత ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్ను ఆవిష్కరించండంపైనా దృష్టి పెడుతున్నాం. డెవలపర్లకు తోడ్పాటు.. రోడ్ టు ఇంపాక్ట్ లాంటి కార్యక్రమాలతో డెవలపర్లు, ఎంట్రప్రెన్యూర్లకు తోడ్పాటు అందించడంపై అల్గోరాండ్ ఇన్వెస్ట్ చేస్తోంది. 2024లో హైదరాబాద్లోని తొలి అల్గోరాండ్ స్టార్టప్ ల్యాబ్లో 21 అంకుర సంస్థలు పాల్గొన్నాయి. మరో ఇరవై అంకుర సంస్థలు 2025 నాటికి ప్రోడక్ట్, మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ అంశాలకు సంబంధించి సన్నద్ధంగా ఉంటాయి. దేశవ్యాప్తంగా యూనివర్సిటీ క్యాంపస్లలో సుమారు 70 అల్గోరాండ్ బ్లాక్చెయిన్ క్లబ్లతో యువ డెవలపర్లకు అవసరమైన వనరులు, మెంటార్íÙప్, పోటీపడే అవకాశాలను అందిస్తున్నాం. -
డిజిటల్ విప్లవంలో భారత్ ముందంజ
జైపూర్: డిజిటల్ విప్లవంలో భారతదేశం ముందంజలో ఉందని రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర తెలిపారు.ఆర్థిక సాంకేతికత డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఈ–మార్కెట్లు పురోగమిస్తున్నాయి. వాటి పరిధి విస్తరిస్తోంది. డిజిటల్ ఎకానమీ ప్రస్తుతం భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో పదో వంతుగా అంచనా. గత దశాబ్దంలో గమనించిన వృద్ధి రేటు ప్రకారం, 2026 నాటికి జీడీపీలో ఐదవ వంతుకు డిజిటల్ ఎకానమీ చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి’’ అని ఈ అంశంపై జరిగిన డీఈపీఆర్ సదస్సులో డిప్యూటీ గవర్నర్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ⇒ కొత్త వృద్ధి మార్గాలను అన్వేíÙంచడానికి, ఇప్పటికే ఉన్న మార్గాలను పటిష్టం చేసుకోడానికి భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ)ని పటిష్టం చేసుకుంటోంది. శక్తివంతమైన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం, యువత అధికంగా ఉండడం, అతిపెద్ద ఆరి్టఫిషీయల్ ఇంటిలిజెన్స్ టాలెంట్ బేస్ భారత్కు సానుకూల అంశం. ⇒ ఫైనాన్స్ రంగాన్ని డిజిటలైజేషన్ చేయడంపై దేశం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. దేశంలో బ్యాంకులు మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ను పటిష్టంగా అమ లుచేస్తున్నాయి. ఆన్లైన్ ఖాతా తెరవడం, డిజిటల్ కేవైసీ, ఇంటి వద్దేకే డిజిటల్ అనుసంధాన బ్యాకింగ్ సేవలు వంటి అంశాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. సాంకేతికత అనుసంధానంలో బ్యాంకింగ్ పురోగమిస్తోంది. ⇒ ఐదు ప్రధాన అంశాలపై ఆర్బీఐ ప్రధానంగా దృష్టి సారిస్తోంది. అందరికీ డిజిటల్ ఫైనాన్షియల్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకురావడం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్టర్ పురోగతి, సైబర్ సెక్యూరిటీ, సుస్థిర ఫైనాన్స్, అంతర్జాతీయ సహకారం, సమన్వయం ఇందులో ఉన్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు కీలకమైనవి: ఆర్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్లను 2024కు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి దేశీయ వ్యవస్థాత్మకంగా ముఖ్యమైన బ్యాంకులు (డీ–ఎస్ఐబీలు)గా పేర్కొంది. బ్యాంకుల నుండి సేకరించిన డేటా ఆధారంగా 2024 వరకూ ఈ వర్గీకరణ అమల్లో ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ మొదట 2014లో డీ–ఎస్ఐబీలకు సంబంధించిన ఫ్రేమ్వర్క్ను ప్రకటించింది. 2015, 2016 జాబితాలో ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్లను చేర్చింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను 2017లో ఈ లిస్ట్లో చేర్చింది. డీ–ఎస్ఐబీ ఫ్రేమ్వర్క్ ప్రకారం, ఈ జాబితాలోని బ్యాంకులు ఎకానమీ పురోగతిలో కీలకపాత్ర పోషిస్తాయి. అందరికీ ఆర్థిక ఫలాలు అందడంలో ఈ బ్యాంకుల సేవల కీలకమైనవి. మున్సిపల్ కార్పొరేషన్ల ఆదాయాలు పెరగాలి... ఇదిలావుండగా, ఆస్తిపన్ను సంస్కరణలు, వినియోగదారు చార్జీల హేతుబద్ధికరణ, మెరుగైన వసూళ్ల విధానాల ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లు తమ ఆదాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ నివేదిక సూచించింది. పెరుగుతున్న పట్టణ జనాభాతో పట్టణ ప్రాంతాల్లో అధిక–నాణ్యత ప్రజా సేవలకు డిమాండ్ వేగంగా పెరుగుతోందని ‘ము నిసిపల్ ఫైనాన్సెస్’ పేరుతో విడుదలైన ఈ నివేదికలో ఆర్బీఐ తెలిపింది. స్థానిక పన్నుల సంస్కరణలు, ఈ విషయంలో మెరుగైన అమలు విధానాలు, సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, పారదర్శక ఆర్థిక నిర్వహణ ద్వారా మునిసిపల్ కార్పొరేషన్ల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నివేదిక పేర్కొంది. ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్దిష్ట వ్యూహాలు అవలంభించాలని పేర్కొంది. -
ఆన్లైన్ గేమింగ్కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
డిజిటల్ ఇండియా కల సాకారమవుతోంది - విజయసాయి రెడ్డి
యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గణనీయమైన పురోగతి చెందినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే గత నెలలో (2023 ఆగష్టు) యూపీఐ లావాదేవీలు 10.24 బిలియన్లు దాటినట్లు సమాచారం. అంటే దీని విలువ సుమారు రూ. 15.18 లక్షల కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. జులై (9.88 బిలియన్స్) నెల కంటే ఆగష్టు (10.24 బిలియన్స్) నెలలో యూపీఐ లావాదేవీలు ఎక్కువగా జరిగినట్లు స్పష్టమవుతోంది. రానున్న రోజుల్లో రోజుకి ఒక బిలియన్ లావాదేవీలు జరగనున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు 'విజయసాయి రెడ్డి' ట్వీట్ చేస్తూ.. 2023 ఆగష్టు నెలలో యూపీఐ ట్రాన్సక్షన్స్ 10 బిలియన్ మార్కుని దాటాయి. ఇది గొప్ప విజయమనే చెప్పాలి. ఇండియాలో యూపీఐ లావాదేవీలు పెరుగుతున్నాయని ఈ డేటా స్పష్టం చేస్తోంది. డిజిటల్ ఇండియా కల సాకారమయ్యేలా కనిపిస్తోందన్నారు. डिजिटल इंडिया का सपना साकार होता नजर आ रहा है। अगस्त 2023 में यूपीआई लेनदेन 10 बिलियन के आँकड़े को पार कर गया। यह बहुत बड़ी उपलब्धि है। इस आँकड़े से साफ है कि भारत में यूपीआई लेनदेन बढ़ रहा है। pic.twitter.com/2JKr4L112Z — Vijayasai Reddy V (@VSReddy_MP) September 4, 2023 -
డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపు
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్రాజెక్టును పొడిగించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇందు కోసం 2021–22 నుంచి 2025–26 మధ్య కాలానికి రూ. 14,903 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీని కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణులకు కొత్త నైపుణ్యాల్లోను, 2.64 లక్షల మందికి ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలోనూ శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పొడిగించిన డిజిటల్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా మరో తొమ్మిది సూపర్ కంప్యూటర్లను నేషనల్ సూపర్కంప్యూటింగ్ మిషన్కు (ఎన్సీఎం) జోడించనున్నట్లు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఎన్సీఎం కింద 18 సూపర్ కంప్యూటర్స్ ఉన్నట్లు వివరించారు. డిజిటల్ ఇండియా పథకం 2015లో ప్రారంభమైనప్పుడు రూ. 4,500 కోట్లతో 2022 నాటికి ఎన్సీఎం కింద 70 సూపర్కంప్యూటర్స్ను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. వాటికి అదనంగా మరో తొమ్మిది సూపర్కంప్యూటర్లకు తాజాగా ఆమోదముద్ర వేసిందని మంత్రి చెప్పారు. 12 కోట్ల మంది విద్యార్థులకు కోర్సులు.. డిజిటల్ ఇండియా కార్యక్రమం కింద 12 కోట్ల మంది కాలేజీ విద్యార్థుల కోసం సైబర్ అవగాహన కోర్సులను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని 1,200 స్టార్టప్లకు ఆరి్థక తోడ్పాటు అందించే వెసులుబాటు కూడా ఉందని వైష్ణవ్ చెప్పారు. 1,787 యూనివర్సిటీలు, పరిశోధన సంస్థల నెట్వర్క్ అయిన నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ను డిజిటల్ ఇండియా ఇన్ఫోవేస్గా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆరోగ్యం తదితర రంగాల్లో కృత్రిమ మేధ ను వినియోగించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి చెప్పా రు. డిజిలాకర్ యాప్ను లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకూ అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. -
మళ్లీ నేనే!
2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్ అనే కలను సాకారం చేసుకునే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుంది. మరో ఐదేళ్లలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ప్రజలకు ఇది ‘మోదీ కీ గ్యారంటీ’. దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్్కఫోర్స్ ఏర్పాటు చేశాం. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. –ప్రధాని మోదీ న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేస్తానని, దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తానని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో నెగ్గి, మళ్లీ తానే ప్రధానమంత్రి అవుతానని పరోక్షంగా తేల్చిచెప్పారు. ‘2047 నాటికి సౌభాగ్యవంతమైన భారత్’ అనే కలను సాకారం చేసుకొనే దిశగా రాబోయే ఐదేళ్ల కాలం ఒక స్వర్ణయుగమే అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం ఎర్రకోటపై నుంచి జాతినుద్దేశించి 90 నిమిషాలపాటు ప్రసంగించారు. 2024 లోక్సభ ఎన్నికలకు సమరశంఖం పూరించారు. రెండోసారి ప్రధానిగా మోదీకి ఇదే చివరి పంద్రాగస్టు ప్రసంగం కావడం విశేషం. ఎర్రకోటపై ప్రసంగించడం ఇది వరుసగా పదోసారి. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... దుష్ట రాజకీయాలపై యుద్ధమే వారసత్వ పార్టీలను ప్రజలంతా వ్యతిరేకించాలి. బుజ్జగింపు రాజకీయాలు సామాజిక న్యాయానికి చాలా హాని కలిగించాయి. అవినీతి, వారసత్వ, బుజ్జగింపు రాజకీయాలు కొన్ని దశాబ్దాలుగా మన వ్యవస్థలో ఒక భాగంగా మారిపోయాయి. దుష్ట రాజకీయాలపై ప్రజలు యుద్ధం ప్రకటించాలి. రాబోయే ఐదేళ్లు చాలా కీలకం. ఈ ఐదేళ్ల కాలంలో మనం చేసే పనులు మరో 1,000 సంవత్సరాలపాటు ప్రభావం చూపుతాయి. మనకు సమర్థవంతమైన యువ జనాభా ఉంది, గొప్ప ప్రజాస్వామ్యం ఉంది, వైవిధ్యం ఉంది. మన ప్రతి కల నెరవేరడానికి ఈ మూడు అంశాలు(త్రివేణి) చాలు. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ అవినీతి పార్టీలతో నిండిపోయింది. బుజ్జగింపు రాజకీయాలకు, కుటుంబ పాలనకు పెద్దపీట వేసే పార్టీలు ‘ఇండియా’ పేరిట ఒక్కటయ్యాయి. ఎన్డీయే పాలనలో ‘న్యూ ఇండియా’ ఆత్మవిశ్వాసంతో ప్రకాశిస్తోంది. ‘బంగారు పక్షి’గా భారత్ మనం గత 1,000 సంవత్సరాల బానిసత్వం, 1,000 సంవత్సరాల భవ్యమైన భవిష్యత్తు మధ్య మైలురాయి వద్ద ఉన్నాం. పరుగు ఆపొద్దు. కోల్పోయిన వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలి. రాబోయే వెయ్యేళ్ల దిశగా మన అడుగులను నిర్దేశించుకోవాలి. 2047 నాటికి మనదేశం అభివృద్ది చెందిన దేశంగా మారుతుంది. ఇది కేవలం ఒక కల కాదు, 140 కోట్ల మంది సంకల్పం. మనలో ప్రతిభా పాటవాలకు, శక్తి సామర్థ్యాలకు కొదవ లేదని 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశ చరిత్ర నిరూపించింది. ‘బంగారు పక్షి’గా మన దేశం మళ్లీ మారడం ఖాయం. మణిపూర్లో శాంతి నెలకొంటుంది. ధరల నియంత్రణకు మరిన్ని చర్యలు ధరల పెరుగుదలను అడ్డుకోవడానికి చర్యలు తీసుకుంటాం. ఉక్రెయిన్–రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. 6జీ టెక్నాలజీకి దేశం సన్నద్ధం దేశంలో 5జీ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తోంది. ఇక 6జీ టెక్నాలజీ కోసం భారత్ సన్నద్ధమవుతోంది. ఈ విషయంలో ఇప్పటికే టాస్్కఫోర్స్ ఏర్పాటు చేశాం. దేశంలో ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్ చేరుకుంది. క్వాంటమ్ కంపూటర్ల రాక కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆధునిక ప్రపంచాన్ని సాంకేతికత ప్రభావితం చేస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ విజయగాథలను తెలుసుకోవడానికి అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అవినీతి అరికట్టడానికి ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. మన దేశంలో సెమీకండక్టర్లను ఉత్పత్తి చేయబోతున్నాం. గతంతో పోలిస్తే డేటా చార్జీలు భారీగా తగ్గాయి. దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవుతోంది. శక్తివంతమైన జి–20 కూటమికి ఈసారి మనమే సారథ్యం వహిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలకు అగ్రి–డ్రోన్లు వ్యవసాయ రంగంలో టెక్నాలజీని ప్రవేశపెట్టడానికి కొత్త పథకం రూపొందిస్తున్నాం. ఇందులో భాగంగా వేలాది మహిళా స్వయం సహాయక సంఘాలకు డ్రోన్ల వాడకంలో, మరమ్మతుల్లో శిక్షణ ఇస్తాం. తొలుత 15,000 స్వయం సహాయక సంఘాలతో ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాం. వారికి అగ్రి–డ్రోన్లు అందజేస్తాం. మహిళల సారథ్యంలోనే దేశాభివృద్ది జరగాలని కోరుకుంటున్నాం, ఆ దిశగా కృషి చేస్తున్నాం. 2 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలన్నదే నా లక్ష్యం. రైతాంగ ప్రయోజనం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2.5 లక్షల కోట్లకుపైగా సొమ్మును రైతుల ఖాతాల్లో జమచేశాం. ఎరువులపై భారీగా రాయితీలు ఇస్తున్నాం. అలాగే చౌక ధరలకే ఔషధాలు విక్రయించే ‘జన ఔషధి కేంద్రాల’ సంఖ్యను 25,000కు పెంచుతాం. నగరాల్లో సొంత ఇల్లు సమకూర్చుకోవాలని భావించే మధ్యతరగతి ప్రజలకు బ్యాంకు రుణాల వడ్డీల నుంచి ఉపశమనం కలిగించడానికి పథకం ప్రారంభిస్తాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం గత తొమ్మిదేళ్లలో సంక్షేమ పథకాలను ప్రక్షాళన చేశాం. పారదర్శకత తీసుకొచ్చాం. 9 కోట్ల మంది అనర్హులను ఏరిపారేశాం. అవినీతిపరుల ఆస్తుల స్వాదీనం తొమ్మిదేళ్లలో 20 రెట్లు పెరిగింది. అవినీతిపరులకు కోర్టుల నుంచి బెయిల్ దొరకడం కష్టంగా మారింది. ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. పునాదిరాళ్లు వేశాం. వాటిని నేనే ప్రారంభిస్తానన్న విశ్వాసం ఉంది. పార్లమెంట్ నూతన భవన నిర్మాణాన్ని గడువు కంటే ముందే పూర్తిచేశాం. 2014లో మనది ప్రపంచంలో పదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. 140 కోట్ల మంది శ్రమతో ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగాం. ఇదంతా సులభంగా జరగలేదు. అవినీతిని అరికట్టాం. బలమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించాం. గ్లోబల్ సప్లై చైన్లో భారత్ ఇప్పుడు ముఖ్యమైన భాగస్వామి. మన దేశం సాధించిన విజయాలు ప్రపంచ స్థిరత్వానికి ఒక హామీగా నిలుస్తాయి. భారత్కు ఇక తిరుగులేదని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. శషభిషలకు ఇక తావులేదు. మన పట్ల ప్రపంచానికి నమ్మకం పెరిగింది. బంతి మన కోర్టులోనే ఉంది. ఈ అవకాశం జారవిడుచుకోవద్దు. మన స్టార్టప్లు భేష్ ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థ మనదేశంలోనే ఉంది. మన యువత కృషితోపాటు ప్రభుత్వం అందించిన ప్రోత్సాహమే ఇందుకు కారణం. యువ శక్తిపై నాకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి 98,119 స్టార్టప్లను ప్రభుత్వం గుర్తించింది. వాటికి నిధులతోపాటు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మనం ముందంజలో ఉన్నాం. నిర్దేశిత హరిత లక్ష్యాలను గడువు కంటే ముందే సాధించాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. మన సైనిక దళాలను ఆధునీకరించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. గతంలో బాంబుపేలుళ్ల గురించి వినేవాళ్లం. ఇప్పుడు దేశం భద్రంగా ఉంది. శాంతి భద్రతలు ఉన్నప్పుడే అభివృద్ధిపై దృష్టి పెట్టగలుగుతాం. స్పేస్ టెక్నాలజీలో అభివృద్ధి సాధిస్తున్నాం. వందే భారత్ రైళ్లు ప్రారంభించుకుంటున్నాం. బుల్లెట్ రైళ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. నా ప్రతి కల జనం కోసమే ప్రజలంతా నా వాళ్లే. నేను ప్రజల నుంచే వచ్చా. ప్రజల కోసమే జీవిస్తా. నేను ఏదైనా కల కన్నానంటే అది జనం కోసమే. వారి కోసం కష్టపడి పని చేస్తున్నా. ఇదంతా కేవలం ఒక బాధ్యత అప్పగించారు కాబట్టి చేయట్లేదు, ప్రజలను నా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాను కాబట్టి చేస్తున్నా. ప్రజల్లో ఒకడిగా ఆ ప్రజల బాధలను, కష్టాలను సహించలేను. ప్రజల కలలు విచ్ఛిన్నమైపోవడాన్ని అనుమతించను. ‘దేశమే ప్రథమం’ అనే స్ఫూర్తితో జనం కోసం పని చేస్తున్నా. విశ్వకర్మ యోజన రూ.13,000 కోట్ల నుంచి రూ.15,000 కోట్లతో విశ్వకర్మ యోజన అమలు చేస్తాం. వడ్రంగులు, స్వర్ణకారుల వంటి సంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి జీవనోపాధి అవకాశాలు పెంచడమే ఈ పథకం లక్ష్యం. దీంతో ప్రధానంగా ఓబీసీలు ప్రయోజనం పొందుతారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా సెపె్టంబర్ 17న ఈ పథకాన్ని ప్రారంభిస్తాం. పేదరికం తగ్గితే మధ్య తరగతి ప్రజల బలం పెరుగుతుంది. దేశంలో గత ఐదేళ్లలో 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ఇంతకంటే జీవితంలో సంతృప్తి ఇంకేమీ ఉండదు. -
కొత్త డిజిటల్ ఇండియా చట్టంలో తగిన రక్షణలు
న్యూఢిల్లీ: కొత్తగా తీసుకురాబోయే డిజిటల్ ఇండియా చట్టంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తరహా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీల నుంచి తగిన రక్షణలతో ప్రత్యేక చాప్టర్ ఉంటుందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. భారత్ సరైన విధానాన్నే అనుసరిస్తుందంటూ.. ఇంటర్నెట్ను భద్రంగా, యూజర్లకు విశ్వసనీయమైనదిగా ఉండేలా చూస్తామన్నారు. డిజిటల్ ఇండియా చట్టం రూపకల్పన విషయంలో భాగస్వాములతో రాజీవ్ చంద్రశేఖర్ విస్తృతమైన సంప్రదింపులు నిర్వహించడం గమనార్హం. రెండు దశాబ్దాల క్రితం నాటి ఐటీ చట్టం స్థానంలో కొత్తది తీసుకురానున్నారు. ఏఐ ఆధారిత చాట్ జీపీటీ సంచలనాలు సృష్టిస్తున్న తరుణంతో తగిన రక్షణలు ఏర్పాటు చేస్తామంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాదు చాట్ జీపీటీని సృష్టించిన ఓపెన్ఏఐ సంస్థ సీఈవో శామ్ ఆల్ట్మన్ సైతం ఏఐ టెక్నాలజీ నియంత్రణకు అంతర్జాతీయంగా నియంత్రణ సంస్థ అవసరమని పేర్కొనడం గమనార్హం. శామ్ ఆల్ట్మన్ వ్యాఖ్యలను మంత్రి వద్ద ప్రస్తావించగా.. ఆయనో స్మార్ట్ మ్యాన్ అని పేర్కొన్నారు. ఏఐని ఎలా నియంత్రించాలో ఆయనకంటూ స్వీయ అభిప్రాయాలు ఉండొచ్చన్నారు. కానీ, భారత్లోనూ స్మార్ట్ బుర్రలకు కొదవ లేదంటూ, ఏఐ నుంచి ఎలా రక్షణలు ఏర్పాటు చేయాలనే విషయమై తమకు అభిప్రాయాలు ఉన్నట్టు చెప్పారు. దీనిపై ఇప్పటికే సంప్రదింపులు కూడా మొదలైనట్టు తెలిపారు. డేటా బిల్లుతో దుర్వినియోగానికి అడ్డుకట్ట ప్రతిపాదిత డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ బిల్లుతో డేటా దుర్వినియోగానికి అడ్డుకట్ట పడగలదని కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. సుదీర్ఘకాలంగా దోపిడీ చేసిన ప్లాట్ఫాంల ధోరణుల్లో మార్పులు రాగలవని ఆయన చెప్పారు. ఫ్యాక్ట్–చెక్ విభాగం ఏర్పాటుపై నెలకొన్న ఊహాగానాలకు తెరదించారు. వాస్తవాలతో పోలిస్తే తప్పుడు సమాచారం 10–15 రెట్లు వేగంతో ప్రయాణిస్తుందని, 20–50 రెట్లు ఎక్కువ మందికి చేరే ప్రమాదముందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టడానికి ప్రభు త్వానికి వ్యతిరేకంగా ఎవరైనా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే.. అది తప్పు అని స్పష్టత ఇచ్చేందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం ఉండాలని మంత్రి చెప్పారు. అందుకోసమే ఫ్యాక్ట్ చెక్ విభాగం పని చేస్తుందే తప్ప దాని వెనుక సెన్సార్షిప్ ఉద్దేశమేమీ లేదని పేర్కొన్నారు. -
డిజిటల్ అగ్రగామిగా భారత్!
ఆధార్, ఏకీకృత చెల్లింపు వ్యవస్థలు, డేటా పంపిణీ... ఈ మూడూ కలిసి భారత్ను ‘ప్రపంచ డిజిటల్ అగ్రగామి’గా నిలబెట్టాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో తాజాగా విడుదల చేసిన కార్యాచరణ పత్రంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వెల్లడించింది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారానే భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందివ్వగలిగిందని, డిజిటల్ అకౌంట్ అగ్రిగేటర్ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్నింకా వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం ప్రశంసించింది. అదే సమయంలో భారత్లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడటానికి డేటా ఉల్లంఘనలకు పాల్పడిన వారిని జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్టం రూపకల్పన తప్పనిసరి అని సూచించింది. మానవ జీవితాలను, ఆర్థిక వ్యవస్థను మార్చి వేస్తున్న ప్రపంచ స్థాయి డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్ర క్చర్ని భారతదేశం నిర్మించిందని, ఇది అనేక దేశాలు అనుసరించాల్సిన పాఠం అవుతుందని తాజా ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. ‘ఇండియా స్టాక్’ అనేది భారత్లో సాధారణంగా ఉపయోగిస్తున్న డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐలు) సెట్కి సామూహిక పేరు. దీంట్లో మూడు విభిన్నమైన పొరలు ఉంటున్నాయి. అవి, 1. ప్రత్యేక గుర్తింపు (ఆధార్), 2. కాంప్లిమెంటరీ చెల్లింపు వ్యవస్థలు (ఏకీకృత చెల్లింపు ఇంటర్ఫేస్, ఆధార్ పేమెంట్స్ బ్రిడ్జ్, ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీస్), 3. డేటా పంపిణీ (డిజీలాకర్, అకౌంట్ అగ్రిగేటర్). ఇవన్నీ కలిసి అనేక పబ్లిక్, ప్రైవేట్ సేవలకు.. ఆన్ లైన్, కాగిత రహిత, నగదు రహిత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చే డిజిటల్ సంప్రాప్య తను కల్పించాయని ‘స్టాకింగ్ ఆఫ్ ది బెనిఫిట్స్ : లెసన్స్ ఫ్రమ్ ఇండియాస్ డిజటల్ జర్నీ’ అనే శీర్షికతో కూడిన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కార్యాచరణ పత్రం తెలిపింది. ఈ మదుపు ప్రయో జనం భారత్ వ్యాప్తంగా అనుభవంలోకి రావడమే కాకుండా కోవిడ్ 19 మహమ్మారి కాలంలో దేశానికి ఎంతో సేవచేసిందని ఆ పత్రం వెల్లడించింది. ప్రభుత్వ ఖజానా నుంచి లబ్ధిదారుల బ్యాంక్ అకౌంటుకు నేరుగా సామాజిక భద్రతా చెల్లింపుల పంపిణీని సులభతరం చేయడంలో ఆధార్ సహక రించిందని అది పేర్కొంది. దీనివల్ల లీకేజీలను తగ్గించడం, అవినీతిని అరికట్టడం, విస్తృతిని పెంచడం, సమర్థంగా కుటుంబాల వద్దకు చేరు కోవడానికి ఒక సాధనాన్ని అందించడంలో ఇది సహకరించింది అని వ్యాఖ్యానించింది. విస్తృతంగా డిజిటల్ చెల్లింపులు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇతర ప్రభుత్వ సంస్కరణల కారణంగా 2021 మార్చి వరకు జీడీపీలో 1.1 శాతం వ్యయాన్ని ఆదా చేసినట్లు భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించడం ద్వారా భారత్ మహమ్మారి కాలంలో నిరుపేద కుటుంబాలకు చెప్పుకోదగిన వాటాతో మద్దతును వేగంగా అందించగలిగింది. మహమ్మారి ఆవహించిన తొలి నెలల కాలంలో నిరుపేద కుటుంబాల్లో 87 శాతం కనీసం ఒక లబ్ధి పథకాన్నయినా అందుకున్నారు. సృజనాత్మక ఆవిష్కరణను, పోటీని పెంచడానికి, మార్కెట్లను విస్తరించడానికి, ప్రభుత్వ ఆదాయ సేకరణను పెంచుకోవడానికి, ప్రభుత్వ వ్యయ సమర్థతను మెరుగుపర్చుకోవడానికి ఇండియా స్టాక్ ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది. డిజిటల్ చెల్లింపులు ఇప్పుడు సర్వవ్యాప్తమయ్యాయి. దేశంలో అన్ని చెల్లింపుల లావాదేవీల్లో యూపీఐ చెల్లింపులు 68 శాతంగా ఉన్నాయి. డిజిటల్ చెల్లింపుల ఉపయోగం చిన్న వర్తకుల కస్టమర్ పునాదిని విస్తరించింది, వారి నగదు ప్రవాహాన్ని నమోదు చేసి, ద్రవ్య సంప్రాప్యతను మెరుగుపర్చింది. పెరిగిన ప్రభుత్వ రాబడి 2021 ఆగస్టులో మొదటిసారి ప్రారంభించి నది మొదలు ‘అకౌంట్ అగ్రిగేటర్’ ద్వారా ఆర్థిక సేవల సులభ సంప్రాప్యత నుంచి దాదాపు 45 లక్షల మంది వ్యక్తులు, కంపెనీలు లబ్ధి పొందారని, దీన్ని వేగంగా తమ సొంతం చేసుకుంటున్నారని ఆ పత్రం తెలిపింది. డిజిటలీకరణ అనేది ఆర్థిక వ్యవస్థ అధికారికీకరణను కూడా బలపర్చింది. 2017 జూలై నుంచి 2022 మార్చి మధ్యలో జీఎస్టీ కోసం 88 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వ రాబడులు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ సర్వీస్ ప్రొవిజన్ను కూడా క్రమబద్ధీకరించారు. ఉదాహరణకు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన డాక్యుమెంట్లను ఒకే ప్లాట్ ఫామ్ ద్వారా పౌరులు పొందవచ్చు. అదేవిధంగా, ఇండియా స్టాక్ ‘నో యువర్ కస్టమర్’ నిబంధ నలను డిజిటలీకరించి, సులభతరం చేసింది. ఖర్చు లను తగ్గించింది. ఇ–కేవైసీని ఉపయోగిస్తున్న బ్యాంకులు సమ్మతి ఖర్చును 12 అమెరికా డాలర్ల నుంచి 6 అమెరికన్ సెంట్లకు తగ్గించుకున్నాయి. మహిళలే లక్ష్యంగా జన్ధన్ ఖర్చుల్లో ఈ తగ్గుదల తక్కువ ఆదాయం ఉన్న క్లయింట్లు కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం సేవలను మరింతగా ఆకర్షిస్తూ, లాభాలు ఆర్జించడానికి వీలు కల్పించింది. ఆర్థిక అభివృద్ధిలో అందర్నీ భాగస్వామ్యం చేయడానికి సంబంధించి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తూ ఆ పత్రం ఇలా చెప్పింది. ‘‘తక్కువ ఖర్చుతో కూడిన బ్యాంక్ ఖాతాకు అవకాశం కల్పించడం వల్ల బ్యాంక్ ఖాతా లతో వ్యక్తుల కవరేజీ రెట్టింపు అయింది. జన్ ధన్ పథకం ఆర్థికంగా అర్హత లేనివారిని, ప్రత్యేకించి గ్రామీణ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకం కింద 2022 ఆగస్టు నాటికి 46 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తెరిచారు. డిజిటల్ బ్యాక్బోన్ ను ఉపయోగించడం వల్ల భారత్ తన వ్యాక్సిన్ పంపిణీని శరవేగంగా చేయగలడమే కాదు... భారీస్థాయి అంతర్గత వలసలు వంటి సవాళ్లను అధిగమించింది’’ అని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. కో–విన్ లో పొందుపర్చిన టెక్నాలజీని ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, శ్రీలంక, జమైకాలలో కూడా అమలు పర్చారు. ఇది ఆయా దేశాల వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను సులభతరం చేసింది. డేటా పరిరక్షణ తప్పనిసరి సవాళ్ల విషయానికి వస్తే, భారత్లో సమగ్ర డేటా రక్షణ చట్టం ఇప్పటికీ లేదని ఐఎమ్ఎఫ్ పత్రం పేర్కొంది. పౌరుల గోప్యతను కాపాడ టానికి; కంపెనీలు, ప్రభుత్వాలు విచక్షణారహితంగా డేటా సేకరించడాన్ని నిరోధించడానికి; డేటా ఉల్లంఘనలకు పాల్పడిన కంపెనీలు, ప్రభు త్వాలను జవాబుదారీగా చేయడానికి దృఢమైన డేటా పరిరక్షణ చట్ట రూపకల్పన తప్పనిసరి. సముచితమైన రీతిలో డేటా నిర్వహణకు, సైబర్ భద్రత రంగంలో తగిన మదుపులు పెట్టడానికి ఇది చాలా అవసరం. సామాజిక సహాయం మరింత దృఢంగా, స్వీకరించదగినదిగా చేసే ప్రయత్నాలకు మద్దతు ఇచ్చే విషయంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (డీపీఐ) కూడా సహకరిస్తుంది. ఉదాహరణకు, రాష్ట్రాల వ్యాప్తంగా వివిధ పథకాల మధ్య డేటా పంపిణీకి ఆధార్ను ఉపయోగించవచ్చని ఐఎమ్ఎఫ్ కార్యాచరణ పత్రం పేర్కొంది. చివరగా, డీపీఐ (డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్)ని ప్రభావితం చేయడానికి కాలక్రమాలు, నాణ్యత, సాధారణ ప్రభుత్వ ద్రవ్య నివేదికల కవరేజీ వంటివాటిని భారత్ గణనీయంగా మెరుగుపర్చుకుంది. అదే సమయంలో తన పౌరుల కోసం ప్రభుత్వ రంగ జవాబుదారీతనాన్ని మెరుగుపర్చుకోవడంలో ద్రవ్యపరమైన పారదర్శకతను విస్తరించడం అనేది కీలక అంశంగా ఉంటోంది. – ఎమ్. ముఖేశ్ రాణా, ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా -
జీ20తో డిజిటల్ కృషిని ప్రపంచానికి చాటి చెప్తాం
న్యూఢిల్లీ: డిజిటల్ పరివర్తనలో భారత్ చేస్తున్న కృషిని జీ20 కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పనున్నట్లు నీతి ఆయోగ్ మాజీ సీఈవో, జీ20 షెర్పా అమితాబ్ కాంత్ తెలిపారు. తద్వారా గ్లోబల్ సౌత్ (లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికా, ఓషియానియా దేశాలు) ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు తోడ్పాటు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఆలిండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 8వ జాతీయ నాయకత్వ సదస్సులో పాల్గొన్న సందర్భంగా కాంత్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా 400 కోట్ల మందికి డిజిటల్ గుర్తింపు లేదని, 250 కోట్ల మంది కనీసం బ్యాంకు ఖాతా కూడా లేదని కాంత్ చెప్పారు. 133 దేశాల్లో వేగవంతమైన డిజిటల్ చెల్లింపుల విధానాలు లేవని పేర్కొన్నారు. అలాంటిది, డిజిటైజేషన్ ద్వారా భారత్ ప్రజల జీవితాల్లో మార్పులు తేగలిగిందని, ఉత్పాదకత పెంచుకుని సమర్థమంతమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకెడుతోందని కాంత్ చెప్పారు. డిజిటైజేషన్ డిజిటల్ చెల్లింపులు తదితర విభాగాల్లో భారత్ సాధిస్తున్న పురోగతిని వివరించారు. ‘భారత్ పాటిస్తున్న ఈ మోడల్ను మిగతా ప్రపంచం ముందుకు ఎలా తీసుకెళ్లాలన్నది ఒక సవాలు. భారత డిజిటల్ పరివర్తన గాధను ప్రపంచానికి పరిచయం చేసేందుకు జీ20 వేదికను ఉపయోగించు కుందాం. ఆ విధంగా గ్లోబల్ సౌత్ దేశాల పౌరుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుందాం‘ అని కాంత్ పేర్కొన్నారు. -
వేరబుల్ గ్యాడ్జెట్స్కి నిబంధనలు
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టం విధి విధానాలకు సంబంధించి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గురువారం తొలిసారిగా పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు నిర్వహించారు. స్పై కెమెరా గ్లాసెస్, వేరబుల్ డివైజ్లు వంటి గ్యాడ్జెట్లు సేకరించే డేటాను హ్యాండిల్ చేయడానికి సంబంధించి నిబంధనలపైనా చర్చించారు. వీటిని విక్రయించే దశలోనే కేవైసీ (కస్టమర్ల వివరాల సేకరణ) నిబంధనలను వర్తింపచేయడం తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు. మరో రెండు విడతల సంప్రదింపుల తర్వాత డిజిటల్ ఇండియా చట్టం ముసాయిదా పూర్తి కాగలదని, ఏప్రిల్లో దీన్ని జారీ చేసే అవకాశం ఉందని రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. సుమారు 45–60 రోజుల పాటు ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత జూలై నాటికల్లా చట్టాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే 10 ఏళ్లలో వచ్చే మార్పులను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ చట్టాన్ని తీర్చిదిద్దాల్సి ఉందని మంత్రి చెప్పారు. -
‘డిజిటల్’ అంతరాలు!
సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాలవారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్ఫామ్ ఇండియా డిజిటల్ డివైడ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది. పురుషులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సదుపాయాలు మహిళలకు తక్కువగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్ వాడుతున్నట్లు ఆక్స్ఫామ్ ఇండియా నివేదిక తెలిపింది. ► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్హోల్డ్ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్ఫామ్ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్ సదుపాయం, ఇంటర్నెట్ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. ► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ► పేదల్లో 40 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. ► దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్ ఇండెక్స్ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది. ► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలున్నాయి. -
భరోస్, డేటా భద్రతకు ఓఎస్! భారత్ విప్లవాత్మక ముందడుగు
ప్రపంచమంతటా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు విలాసాలు కాదు.. నిత్యావసరాలుగా మారిపోయాయి. మన దేశం కూడా అందుకు మినహాయింపు కాదు. దాదాపు అన్ని రంగాల్లో కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వాడకం తప్పనిసరిగా మారింది. ఇక ఫోన్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ధనవంతుల నుంచి సామాన్యుల దాకా అందరి చేతుల్లోనూ దర్శనమిస్తున్నాయి. కంప్యూటర్లు, ఫోన్లు పని చేయాలంటే అందులో ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) కచ్చితంగా ఉండాలి. ఇలాంటి ఓఎస్ కోసం మనం ఇన్నాళ్లూ విదేశాలపైనే ఆధారపడుతున్నాం. ఓఎస్ను దేశీయంగా మనమే తయారు చేసుకోలేమా? అన్న ప్రశ్నకు సమాధానమే ‘భరోస్’. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసే దిశగా ఫోన్లలో ఉపయోగపడే ఓఎస్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)–మద్రాస్ అభివృద్ధి చేసింది. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, అశ్వినీ వైష్ణవ్ స్వయంగా పరీక్షించారు. భరోస్ పరీక్ష విజయవంతమైందని ప్రకటించారు. ఈ ఓఎస్ అభివృద్ధి ప్రక్రియలో భాగస్వాములైన వారిని అభినందించారు. ఏమిటీ భరోస్? ► విదేశీ ఓఎస్పై ఆధారపడడాన్ని తగ్గించుకోవడం, స్థానికంగా అభివృద్ధి చేసిన టెక్నాలజీ వాడకాన్ని ప్రోత్సహించడాన్ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. ► ఇందుకోసం భరోస్ పేరిట దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధికి నిధులు సమకూర్చింది. ► ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఆండ్రాయిడ్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ ఓఎస్లతో డిఫాల్ట్ యాప్లు, గూగుల్ సర్వీసులు తప్పనిసరిగా వస్తాయి. వాటిలో చాలావరకు మనకు అవసరం లేనివే ఉంటాయి. అవి ఏ మేరకు భద్రమో తెలియదు. ► భరోస్ ఓఎస్ వీటి కంటే కొంత భిన్నమనే చెప్పాలి. ఇదొక ఉచిత, ఓపెన్–సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది నో డిఫాల్ట్ యాప్స్(ఎన్డీఏ)తో వస్తుంది. అంటే భరోస్ ఓఎస్ను ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్లో ఎలాంటి యాప్లు కనిపించవు. ► గూగుల్ ఆండ్రాయిడ్ వెర్షన్లతో క్రోమ్, జీమెయిల్, గూగుల్ సెర్చ్, యూట్యూబ్, మ్యాప్స్ వంటివి డిఫాల్ట్గా వస్తుండడం తెలిసిందే. ► డిఫాల్ట్గా వచ్చే యాప్లతో మోసాలకు గురవుతుండడం వినియోగదారులకు అనుభవమే. అందుకే భరోస్ ఓఎస్ ఉన్న ఫోన్లలో అవసరమైన యాప్లను ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీసెస్(పాస్) నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ► ‘పాస్’లో బాగా నమ్మకమైన, ప్రభుత్వ అనుమతి ఉన్న, అన్ని రకాల భద్రత, గోప్యత ప్రమాణాలు కలిగిన యాప్లు మాత్రమే ఉంటాయి. దీనివల్ల ఫోన్లలోని డేటా చోరీకి గురవుతుందన్న ఆందోళన ఉండదు. ► స్మార్ట్ఫోన్ల కంపెనీలకు ఈ ఓఎస్ను ఎలా అందజేస్తారు? ప్రజలకు ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకొస్తారు? రెగ్యులర్ స్మార్ట్ఫోన్ వినియోగదారులందరికీ ఇస్తారా? లేదా? అనేదానిపై ఐఐటీ–మద్రాస్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎవరు వాడుతున్నారు? ► కఠినమైన భద్రత, గోప్య త అవసరాలు కలిగిన కొన్ని సంస్థలు ప్రస్తుతం భరోస్ ఆపరేటింగ్ సిస్టమ్ను పరీక్షిస్తున్నాయి. ► రహస్య సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే ప్రభుత్వ కంపెనీలు ఈ ఓఎస్ను వాడుతున్నట్లు సమాచారం. ఎందుకీ ఓఎస్? ► గూగుల్ మొబైల్ ఓఎస్ ఆండ్రాయిడ్పై కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖకు చెందిన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ► ఆండ్రాయిడ్తో డిఫాల్ట్గా వస్తున్న కొన్ని యాప్ల్లో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్లు తెలియజేసింది. ► ఈ నేపథ్యంలోనే దేశీయ ఆపరేటింగ్ సిస్టమ్ తయారీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. విప్లవాత్మక ముందడుగు ఐఐటీ–మద్రాసు ఆధ్వర్యంలో స్థాపించిన జండ్ కే ఆపరేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(జండ్కాప్స్) అనే లాభాపేక్ష లేని స్టార్టప్ కంపెనీ భరోస్ ఓఎస్ను అభివృద్ధి చేసింది. ‘నేషనల్ మిషన్ ఆన్ ఇంటర్ డిసిప్లినరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్’ కింద కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ నిధులు అందజేసింది. నమ్మకం అనే పునాదిపై భరోస్ మొబైల్ ఆపరేటింగ్ వ్యవస్థను రూపొందించినట్లు ఐఐటీ–మద్రాస్ డైరెక్టర్ చెప్పారు. తమ అవసరాలను తీర్చే యాప్లను పొందే స్వేచ్ఛను వినియోగదారులకు కల్పించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశమని వివరించారు. దీనివల్ల సంబంధిత యాప్లపై వారికి తగిన నియంత్రణ ఉంటుందన్నారు. ఫోన్లలోని డేటా భద్రతకు భరోసా కల్పించే విషయంలో ఇదొక విప్లవాత్మకమైన ముందడుగు అని అభివర్ణించారు. మన దేశంలో ఈ ఓఎస్ వినియోగాన్ని పెంచేందుకు ప్రైవేట్ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, వ్యూహాత్మక సంస్థలు, టెలికాం సర్వీస్ ప్రొవైడర్లతో కలిసి పని చేస్తామని వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డిజిటల్ ఇండియా విజన్కు సహకరిస్తాం
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా విజన్’ సాకారం కావడానికి తమ వంతు సహకారం అందిస్తామని మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈఓ సత్య నాదెళ్ల హామీ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో ప్రధాని మోదీతో ఆయన సమావేశమయ్యారు. పలు కీలక అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ప్రధాని మోదీతో తన భేటీ చక్కగా జరిగిందని సత్య నాదెళ్ల వెల్లడించారు. డిజిటల్ ఇండియా విజన్ మొత్తం ప్రపంచానికి వెలుగును చూపుతుందని ఉద్ఘాటించారు. తర్వాత మోదీ ట్వీట్ చేశారు. దేశ యువత నూతన ఆలోచనలు భూగోళాన్ని ప్రభావితం చేయగలవని వివరించారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు పెట్టుబడులు బెంగళూరు: భారత్లో డేటా సెంటర్ల ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని నాదెళ్ల తెలిపారు. తమ దారిలోనే ఇతర కంపెనీలు సైతం నడుస్తాయని, భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తాయని భావిస్తున్నట్లు వెల్లడించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ‘ఫ్యూచర్ రెడీ టెక్నాలజీ సదస్సు’లో సత్య నాదెళ్ల పాల్గొన్నారు. అనంతరం మీడియాతో భారతదేశ టెక్నాలజీ స్టోరీ విస్తరించడానికి సహకరిస్తామని వ్యాఖ్యానించారు. టెక్నాలజీలో భారత్ అద్భుత విజయాలు సాధిస్తోందని ప్రశంసించారు. ఇది రాయాల్సిన, మాట్లాడుకోవాల్సిన చరిత్ర అని చెప్పారు. బిర్యానీ.. సౌతిండియా ‘టిఫిన్’ కాదు: సత్య నాదెళ్ల ఆధునిక కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సాఫ్ట్వేర్తో పనిచేసే చాట్ రోబో ‘చాట్జీపీటీ’లో తనకు ఎదురైన అనుభవాన్ని సత్య నాదెళ్ల వివరించారు. దక్షిణ భారతదేశంలో బాగా పేరున్న టిఫిన్ల గురించి తాను అడగ్గా.. ఇడ్లి, దోశ, వడతోపాటు బిర్యానీ అంటూ చాట్జీపీటీ బదులిచ్చిందని అన్నారు. తాను హైదరాబాదీనని, తన పరిజ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దని, బిర్యానీ అనేది టిఫిన్ కాదను తాను గట్టిగా చెప్పడంతో చాట్జీపీటీ క్షమాపణ కోరిందని వెల్లడించారు. -
డిజిటల్ బిల్లు ముసాయిదా కమింగ్ సూన్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా బిల్లు ముసాయిదా డిసెంబర్ ఆఖరు కల్లా సంప్రదింపుల కోసం సిద్ధం కాగలదని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వ్యక్తిగతయేతర డేటా యాజమాన్య అధికారాలు, డేటా పోర్టబిలిటీ తదితర అంశాలు కూడా ఇందులో ఉంటాయని ఆయన వివరించారు. సమకాలీనమైనదిగా, అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ ఇండియా చట్టం ఉంటుందని మంత్రి చెప్పారు. 22 ఏళ్ల నాటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం స్థానంలో కేంద్రం దీన్ని ప్రవేశపెట్టనుంది. ప్రభుత్వం ఇటీవలే డిజిటల్ వ్యక్తిగత డేటా భద్రత (డీపీడీపీ) బిల్లు ముసాయిదా విడుదల చేసింది. మరోవైపు, ’వేరబుల్స్’ (వాచీలు మొదలైనవి)కి కూడా ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) పథకాన్ని వర్తింప చేసే యోచన ఉందని చంద్రశేఖర్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో వేరబుల్స్ విభాగం అత్యంత వేగంగా వృద్ధి చెందుతోందని తెలిపారు. -
మరో మైలురాయి: జియో 5జీ సేవల్లో తొలి రాష్ట్రంగా గుజరాత్
సాక్షి,ముంబై: దేశ వ్యాప్తంగా 5జీ సేవలను అందించే లక్క్ష్యంతో రిలయన్స్ జియో దూసుకుపోతోంది. ఇప్పటికే ట్రూ-5జీ సేవలను పలు నగరాల్లో ప్రారంభించిన జియో తాజాగా మరో ఘనతను సాధించింది. భారతదేశంలో జియో 5 జీ సేవలను పూర్తిగా పొందిన తొలి రాష్ట్రంగా గుజరాత్ అవతరించింది. ఈ విషయంలో రిలయన్స్ జన్మభూమి కాబట్టి గుజరాత్ ప్రత్యేక స్థానంలో నిలిచింది. (ఈపీఎఫ్వో ఖాతాదారులకు తీపికబురు!) ‘ట్రూ 5G ఫర్ ఆల్’ ఇనిషియేటివ్ కింద జిల్లా ప్రధాన కార్యాలయాలలో 100శాతం ట్రూ 5జీ సేవలను అందించనుంది. ‘జియో ట్రూ-5జీ వెల్కమ్ ఆఫర్’ నేటి (నవంబరు 25) నుంచి 33 జిల్లా కేంద్రాల్లో 5జీ సేవలు పొందుతారు. ఎలాంటి అదనపు చెల్లింపులు లేకుండా 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డేటా పొందొచ్చని జియో ఒక ప్రకటనలో వెల్లడించింది. (ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు) గుజరాత్లో ఈ శుభారంభం ఒక ముఖ్యమైన నిజమైన 5G-ఆధారిత చొరవతో జరుగుతోందని కంపెనీ ప్రకటించింది. రిలయన్స్ ఫౌండేషన్, జియో కలిసి ‘ఎడ్యుకేషన్ ఫర్ ఆల్’ కింద మొదట గుజరాత్లోని 100 పాఠశాలల్ని డిజిటలైజ్ చేసి, దీనితో పాఠశాలల్ని అనుసంధానం చేస్తుందని జియో ప్రకటించింది. ⇒ JioTrue5G కనెక్టివిటీ ⇒ అధునాతన కంటెంట్ ప్లాట్ఫారమ్ ⇒ ఉపాధ్యాయ & విద్యార్థి సహకార వేదిక ⇒ స్కూల్ మేనేజ్మెంట్ ప్లాట్ఫారమ్ ఈ సాంకేతికత ద్వారా, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది విద్యార్థులు లబ్ది పొందుతారు. డిజిటల్ ప్రయాణంలోనాణ్యమైన విద్య , తద్వారా సాధికారత ఈజీ అవుతుందని కంపెనీ తెలిపింది. 100 శాతం జిల్లా ప్రధాన కార్యాలయాలు 5జీకి అనుసంధానమైన తొలిరాష్ట్రంగా గుజరాత్ నిలవడం సంతోషంగానూ, గర్వంగానూ ఉందని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. రాబోయే పది, పదిహేనే ళ్లలో 300-400 మిలియన్ల నైపుణ్యం కలిగిన భారతీయులు వర్క్ఫోర్స్లో చేరనున్నారు. ప్రతి భారతీయుడికి మెరుగైన జీవన ప్రమాణాన్ని మాత్రమే అందించడంతోపాటు,2047 నాటికి అభివృద్ధి చెందిన మన దేశ ఆర్థిక వ్యవస్థగా మారాల ప్రధానమంత్రి లక్క్ష్య సాధనతో తోడ్పడుతుందన్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన జియో 1.3 బిలియన్ల యూజర్లతో డిజిటల్ రంగంలో ఇండియాను గ్లోబల్ లీడర్గా నిలిపిందని పేర్కొంది. (Bisleri Success Story 1969-2022: అపుడు 4 లక్షలు, ఇపుడు వేల కోట్లు, ‘బిస్లరీ’ పేరు ఎలా వచ్చింది?) -
డిజిటల్ ఇండియా చట్టం వచ్చేస్తోంది
న్యూఢిల్లీ: ప్రతిపాదిత డిజిటల్ ఇండియా చట్టానికి సంబంధించి చాలా మటుకు ప్రక్రియ పూర్తయ్యిందని, 2023 తొలినాళ్లలో దీన్ని ప్రవేశపెట్టే అవకశం ఉందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ఇందులోని కీలక అంశాలపై మరింతగా సంప్రదింపులు జరగాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆయన వివరించారు. ‘వినియోగదారులు, పరిశ్రమ, స్టార్టప్లు, లాయర్లు, న్యాయమూర్తులు, పౌరులు మొదలైన వర్గాలన్నింటి సంప్రదింపులతో రూపొందాలి. వారందరి అభిప్రాయాలకు ఆ చట్టాల్లో స్థానం లభించాలి. ప్రభుత్వం చేయబోతున్నది ఇదే‘ అని మంత్రి చెప్పారు. దాదాపు రెండు దశాబ్దాల నాటి ఐటీ చట్టం 2000 స్థానంలో డిజిటల్ ఇండియా చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. -
ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300..మరి ఇప్పుడు ఎంతుందో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలిసారి 5జీ నెట్ వర్క్ సర్వీసుల్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్లో అక్టోబర్ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్ కాంగ్రెస్–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని..దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. అనంతరం 5జీ నెట్ వర్క్ల వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో ఒక కొత్త శకం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. చదవండి👉 మీ స్మార్ట్ ఫోన్ 5జీ నెట్ వర్క్కు సపోర్ట్ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి! ►5 జీ నెట్ వర్క్ ప్రారంభం అవ్వడం 130 కోట్ల మంది భారతీయులకు గొప్ప బహుమతి. దేశ అపరిమిత సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు సాక్షాత్కారంగా నిలుస్తాయి. ►ప్రపంచ సాంకేతిక విప్లవంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. 5జీతో టెలికాం టెక్నాలజీలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని వినియోగదారులకు అందిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ యువతకు అనేక ఉపాధి అవకాశాల్ని అందిస్తుంది. ►పొడక్ట్ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా ఖర్చులు, డిజిటల్ ఫస్ట్ అప్రోచ్లు అనే నాలుగు స్తంభాలపై డిజిటల్ ఇండియా విజయం ఆధారపడి ఉంది. మనం ఆత్మ నిర్భర్ అయినప్పుడే ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుతాయి. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నేడు వాటి సంఖ్య 200కు పెరిగింది. న్యూ ఇండియా ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ల తయారీలో రెండవ స్థానంలో ఉంది. ►కమ్యూనికేషన్ రంగంలో కనెక్టివిటీ చాలా ముఖ్యం. 2014 లో బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులు ఆరు కోట్ల మంది ఉంటే ప్రస్తుతం 80 కోట్లకు మందికి పైగా ఉన్నారు. ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ 100 గ్రామ పంచాయతీల నుండి ఇప్పుడు 170,000 పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్తో అనుసంధానించ బడి ఉన్నాయి. ►డిజిటల్ ఫస్ట్ విధానంతో మనం ఆన్లైన్ చెల్లింపుల వంటి పౌర కేంద్రీకృత సేవల (robust network) నెట్వర్క్ను నిర్మించడంలో విజయం సాధించాం. డిజిటల్ ఇండియా ప్రతి పౌరుడికి అనేక అవకాశాల్ని అందించింది. చిన్న వీధి వ్యాపారులు సైతం యూపీఐ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు. ►ఇంతకుముందు 1జీబీ డేటా ధర సుమారు రూ. 300. ఇప్పుడు అది రూ.10. టెక్నాలజీ - టెలికాం అభివృద్ధితో, భారతదేశం పరిశ్రమ 4.0 విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఇది భారతదేశ దశాబ్దం కాదు, భారతదేశ శతాబ్దం’ అంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. చదవండి👉 ‘కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సెటైర్లు’ -
వారంలో కొత్త టెలికం బిల్లు: వైష్ణవ్
న్యూఢిల్లీ: నూతన టెలికం బిల్లును వారంలో ప్రకటిస్తామని టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రతిపాదిత డిజిటల్ ఇండియా కొత్త చట్టం తయారీ దశలో ఉన్నట్టు చెప్పారు. ఆన్లైన్ ప్రపంచాన్ని (ఇంటర్నెట్ కంపెనీలు) మరింత బాధ్యతాయుతంగా చేయనున్నట్టు చెప్పారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడారు. తాము ప్రచురించే సమాచారానికి సోషల్ మీడియా, ఇంటర్నెట్, టెక్నాలజీ ప్రపంచాన్ని జవాబుదారీగా మార్చాలన్నది తమ ఉద్దేశ్యమని తెలిపారు. -
‘డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం మార్మోగాలి!
బెంగళూరు: దేశీయంగా సెమీకండక్టర్ల ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్రం అన్ని చర్యలూ తీసుకుంటోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాచుర్యం పొందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ నినాదం ’ఇంటెల్ ఇన్సైడ్’ తరహాలో ’డిజిటల్ ఇండియా ఇన్సైడ్’ నినాదం ప్రపంచంలో మార్మోగాలని ఆయన పేర్కొన్నారు. సెమీకండక్టర్ల తయారీపై డెల్, సోనీ వంటి సంస్థలు డిజిటల్ ఇండియా ఆర్ఐఎస్సీ–వీ (డీఐఆర్–వీ) ప్రోగ్రామ్లో కలిసి పనిచేస్తున్నాయని చంద్రశేఖర్ చెప్పారు. డీఐఆర్–వీ కింద దేశీయంగా తయారైన తొలి చిప్సెట్ను 2023–24 నాటి కల్లా వ్యాపార అవసరాల కోసం అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్దేశించుకున్నట్లు వివరించారు. -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ మళ్లీ వచ్చింది
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ‘డిజిటల్ ఇండియా సేల్’ మళ్లీ వచ్చింది. అన్ని రకాలైన ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై రిలయన్స్ డిజిటల్ భారీ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఏదైనా క్రెడిట్ కార్డు/ డెబిట్కార్డు లావాదేవీలపై 6%.., సిటీ బ్యాంక్ క్రిడెట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ ఈఎంఐ లావాదేవీలపై ఏకంగా 10% తక్షణ తగ్గింపు పొందవచ్చు. అలాగే రూ.5,000కు మించిన కొనుగోళ్లపై డిజిటల్ వోచర్లు అందిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లలో టీవీలు, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, ఇతర గృహోపకరణాలపై ఈ ఆఫర్లు ఈ నెల 26 వరకూ అమల్లో ఉంటాయని వివరించింది. కంపెనీ వెబ్సైట్ www. reliancedigital.in ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. -
జియో ఫేషియల్ టెక్నాలజీలో యువతను ప్రోత్సహించాలి
మాదాపూర్: మ్యాపింగ్, సర్వే, సెర్చింగ్లలో జియో ఫేషియల్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుందని.. ఈ టెక్నాలజీలో యువతను, పరిశోధకులను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ చెప్పారు. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మూడ్రోజుల పాటు నిర్వహించనున్న జియో స్మార్ట్ ఇండియా–2021ను మంగళవారం గవర్నర్ ప్రారంభించి మాట్లాడారు. ప్రపంచ స్థాయి కంపెనీల్లో భారతీయులే ఎక్కువగా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. కేంద్రం డిజిటల్ ఇండియా లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. స్టార్టప్ కంపెనీలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా నిలుస్తోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం దేశాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తోందని అన్నారు. కార్యక్రమంలో ఇస్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అగేంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
Mann Deshi: ఇప్పుడు ప్రపంచం నా దగ్గరే ఉంది!
అనారోగ్యంతో పట్టణంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు లత భర్త. ఊళ్లో ఉన్న భార్య ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. భర్త గురించే ఆమె ఆలోచనలన్నీ... ఎలా ఉన్నాడో ఏమో! భర్త దగ్గర మాత్రమే సెల్ఫోన్ ఉంది. లత దగ్గర లేదు. తనకు అవసరం అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పుడైనా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త తన ఫోన్ ఇచ్చేవాడు. అలాంటి లత చేతిలోకి ఇప్పుడు సెల్ఫోన్ వచ్చింది. దాంతో గతంలో మాదిరిగా ఆమె ఇతరుల మీద ఆధారపడడం లేదు. తానే భర్తకు ఫోన్ చేసే మాట్లాడుతుంది. వీడియో కాల్స్ మాట్లాడడం కూడా నేర్చుకుంది. లతది మహారాష్ట్రలోని నింబోర గ్రామం. ఇప్పుడు అదే మహారాష్ట్రలో భానుపూరి గ్రామానికి వెళదాం...జ్యోతి దేవ్కర్ చిన్నపాటి కిరాణా దుకాణం నడుపుతుంది. తాను కూడా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే భర్త ఫోన్పైనే ఆధారపడేది. ఇప్పుడు తన దగ్గర కొత్త ఫోన్ ఉంది. మాట్లాడడమే కాదు మార్కెట్లోకి కొత్తగా వచ్చిన వస్తువుల గురించి తెలుసుకోవడం నుంచి ఆన్లైన్ పేమెంట్స్ వరకు ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఇదే గ్రామానికి చెందిన పూర్ణ కూలి పనులు చేసుకుంటుంది. అంతో ఇంతో చదువువచ్చు. ఒకప్పుడు సెల్ఫోన్లో ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే...ఎవరినో ఒకరిని బతిమిలాడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆమె చేతిలో కొత్త ఫోన్. ‘మాట్లాడడం మాత్రమే కాదు, ప్రపంచంలో ఏంజరుగుతుందో తెలుసుకో గలుగుతున్నాను’ అంటుంది పూర్ణ. ఉన్నట్టుండి వీరి చేతిలోకి ఫోన్లు ఎలా వచ్చాయి? సతార జిల్లా (మహారాష్ట్ర) కేంద్రంగా పనిచేసే ‘మన్దేశీ’ అనే స్వచ్ఛంద సంస్థ వీరికి మాత్రమే కాదు ఎంతోమంది పేద మహిళలకు సెల్ఫోన్లను ఉచితంగా ఇచ్చింది. ఇవ్వడమే కాదు ఫోన్ ఎలా ఆపరేట్ చేయాలో కూడా నేర్పించింది. ‘నాకంటూ సెల్ఫోన్లేదు..అని ఈరోజుల్లో ఎవరూ అనరు’ అనుకుంటాంగానీ గ్రామీణ ప్రాంతాల్లోకి వెళితే సెల్ఫోన్లేని పేద మహిళలు, వాటి గురించి ఏమీ తెలియని మహిళలు ఎంతోమంది ఉన్నారు. మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ‘డిజిటల్ జెండర్ గ్యాప్’ ఎక్కువగా ఉందని రకరకాల రిపోర్ట్లు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని పేదమహిళలకు ఉచితంగా సెల్ఫోన్లు ఇచ్చింది మన్దేశీ. విచిత్రమేమిటంటే ఉచితంగా ఇచ్చినా ‘ఈ ఫోన్లతో మేమేం చేసుకోవాలమ్మా’ అనేంత అమాయకులు కూడా ఉన్నారు. అలాంటి వారికి సెల్ఫోన్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో, సులభంగా ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించారు. ‘తీసుకోవాలా వద్దా? అని మా భర్తను అడిగి చెబుతాను’ అనే మాట చాలామంది నోటి నుంచి వినిపిస్తుంది. మహారాష్ట్ర, బిహార్, రాజస్థాన్...మొదలైన రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో మహిళలు సెల్ఫోన్ వాడడంపై అప్రకటిత నిషేధం ఉంది. కొన్ని గ్రామీణప్రాంతాల్లో ‘మహిళలు వాడకూడదు’ అంటూ సెల్ఫోన్లపై నిషేధాలు కూడా ఉన్నాయి. ఈ కారణం వల్లే కావచ్చు...ఫోన్ కొనగలిగే స్థాయి ఉండికూడా కొనలేకపోవడం. దీనికితోడు వారెవ్వరికీ దానిని ఆపరేట్ చేయడం కూడా రాదు. బిహార్లోని కిషన్గంజ్ జిల్లాలో ఉన్న సుందర్బడి గ్రామంలో పెళ్లికాని అమ్మాయిలు సెల్ఫోన్ వాడితే రెండు వేలు, పెళ్లయిన మహిళలు వాడితే పదివేల రూపాయల జరిమానా విధిస్తారట! అందుకే...సెల్ఫోన్ ఇవ్వడం మాత్రమే కాదు, దాని చుట్టూ ఉన్న అపోహలను తొలగించే కాన్యాచరణ కూడా చేపట్టింది మన్దేశీ. ఫలితంగా ఎంతో మందిలో మార్పు వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకుచ్చి ప్రపంచంతో అనుసంధానం కావడానికి సెల్ఫోన్ ఎలా ఉపయోగపడుతుంది అనేదానిపై విస్తృత ప్రచారం చేస్తుంది మన్దేశీ. చదవండి: Social Star: పైజమా పాప్స్టార్ శిర్లే సెటియా.. ఆర్జే నుంచి సింగర్గా.. -
ఈ-సెక్యూరిటీలో చైనా కంటే ఇండియానే బెటర్.. సర్వేలో సంచలన విషయాలు
ఒకటి గుడ్ న్యూస్, మరొకటి బ్యాడ్ న్యూస్. ఇంటర్నెట్ స్పీడులో భారత్ వెనుకంజలో ఉంటే..ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విషయంలో దక్షిణాసియా చెందిన 8 దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. వరల్డ్ వైడ్గా చైనా కంటే భారత్ మెరుగ్గా ఉంది. యూకేకి చెందిన వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ సర్వీస్ (వీపీఎన్) 'సర్ఫ్షార్క్' సంస్థ ప్రపంచ దేశాల్లో సర్వే నిర్వహిస్తుంది. అయితే ఎప్పటిలాగా ఈ ఏడాది కూడా 110 దేశాల్లో 6.9 బిలియన్ల మంది ఇంటర్నెట్ యూజర్లని సర్వే చేసింది. ఇంటర్నెట్ ఆఫార్డబులిటీ, ఇంటర్నెట్ క్వాలిటీ, ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రెక్చర్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ల పనితీరు వంటి అంశాలపై సమాచారాన్ని సేకరించింది. ఇందులో 'డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2021'(డీక్యూఎల్)లో భారత్ 59వ స్థానం దక్కించుకుంది. గతేడాదికంటే రెండు స్థానాలు తగ్గాయి. మొత్తం 110 దేశాలకు ర్యాకింగ్ ఇచ్చారు. అదే విధంగా ఈ సర్వేలో పలు విభాగాలకు కేటాయించిన ర్యాంకుల్లో ఎలక్ట్రానిక్ గవర్నమెంట్ 33వ ర్యాంక్, ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ 36వ ర్యాంక్, ఇంటర్నెట్ అఫార్డబులిటీ 47వ ర్యాంక్, ఎలక్ట్రానిక్ ఇన్ఫ్రాస్ట్రెచ్చర్ 91వ ర్యాంక్లు దక్కాయి. ఇంటర్నెట్ క్వాలిటీ, స్పీడ్ విషయంలో 67వ ర్యాంక్ సాధించగా.. ప్రపంచంలో మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ (12.33 ఎంబీపీఎస్) తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా నిలిచింది. చైనా కన్నా మనమే బెటర్ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో భారత్ వెనుకంజలో ఉన్నా ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ విషయంలో చైనా కంటే ముందజలో ఉంది. టెక్నాలజీ విషయంలో ప్రపంచంలో తమకు మించిన దేశం మరొకటి లేదని చైనా ప్రచారం చేసుకుంటున్నా..భద్రత విషయంలో మిగిలిన దేశాల ఎదుట పరువు పొగొట్టుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలింది. ఈ-సెక్యూరిటీలో విభాగంలో భారత్ గతే డాదికంటే ఈ ఏడాది 76శాతం మెరుగైన ఫలితాల్ని రాబట్టి 36 వ ర్యాంక్ను సాధించి చైనాను వెనక్కి నెట్టింది. ఏసియా స్థాయిలో 17వ స్థానం..దక్షిణ ఆసియా దేశాల్లో ప్రథమ స్థానంలో ఇండియా ఉంది. ఇంటర్నెట్ వినియోగంలో భారత్ 95వ స్థానంలో ఉండగా.. ఇంటర్నెట్ సామర్ధ్యం గతేడాది కంటే ఈ ఏడాది 75 శాతం తగ్గి 47వ ర్యాంక్ దక్కించుకుంది. బంగ్లాదేశ్తో పోలిస్తే, మన దేశంలో ఇ-ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువగా ఉంది. ఇంటర్నెట్ ధర, ఇంటర్నెట్ సామర్ధ్యం, ఇ-సెక్యూరిటీ, ఇ-గవర్నమెంట్లో మాత్రం ఎక్కుగా ఉంది. అగ్రస్థానంలో డెన్మార్క్ డీక్యూఎల్ సర్వేలో అత్యధిక ర్యాంకులు సాధించిన 10 దేశాలలో ఐరోపాకి చెందిన 6 దేశాలున్నాయి. మొత్తం 110 దేశాల సర్వేలో మొదటి ఐదు స్థానాల్లో డెన్మార్క్ వరుసగా రెండో సారి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా.. దక్షిణ కొరియా 2వ స్థానం, ఫిన్లాండ్ 3 వ స్థానం, ఇజ్రాయెల్, అమెరికా దేశాలు ఉన్నాయి. దిగువన ఇథియోపియా, కంబోడియా, కామెరూన్, గ్వాటెమాల ,అంగోలా ఐదు దేశాలు ఉన్నాయి. చదవండి: చైనా మూర్ఖపు నిర్ణయంతో.. -
రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు
సాక్షి, ముంబై: క్యాబ్ సేవల సంస్థ ఓలాకు చెందిన ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో దుమ్మురేపుతోంది. అమ్మకాలు ప్రారంభించిన రెండు రోజుల్లో రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. రెండు రోజుల్లో రూ 1100 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసింది. ఈ విషయాన్ని కంపెనీ ఓలా గ్రూప్ సీఈఓ భవీష్ అగర్వాల్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు. తొలి రోజు సేల్స్ను మించి రెండో రోజు అమ్మకాలతో తమ రికార్డును తామే అధిగమించామంటూ ట్వీట్ చేశారు ఆటోమోటివ్ పరిశ్రమలో మాత్రమే కాదు, భారతీయ ఇ-కామర్స్ చరిత్రలో ఇది ఘనమైన రికార్డు అని ఒకే ఉత్పత్తికి ఒక రోజు (విలువ ప్రకారం) అత్యధిక అమ్మకాలలో ఇదొకటి అన్నారు. ఇదే కదా డిజిటల్ ఇండియా అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఆన్లైన్ అమ్మకానికి మొదటి రోజు, కంపెనీ రూ 600 కోట్లకు పైగా విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించిన సంగతి తెలిసిందే. 48 గంటల సేల్ నిన్నటితో (సెప్టెంబరు 16) ముగిసింది. అయితే కస్టమర్లు స్కూటర్ను ఆన్లైన్లో రూ. 20వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. తదుపరి సేల్ దీపావళి సందర్బంగా నవంబర్ 1 నిర్వహించనుంది. కేవలం రూ. 499 వద్ద ఆన్లైన్లో ప్లాట్ రిజర్వ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కొనుగోలు విండోను క్లోజ్ చేసినా, రిజర్వేషన్లు olaelectric.com ఓపెన్లో ఉంటుందని ఓలీ సీఈఓ తెలిపారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రోలను కొనుగోలు చేయాలనుకుంటే ఇపుడే రిజర్వ్ చేసుకోవాలనికోరారు అలాగే ఇప్పటికే రిజర్వ్ చేసుకుని, కొనుగోలు చేయని వారు కూడా నవంబర్ 1న తమ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సొంతం చేసుకోవచ్చని చెప్పారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఓలా ఎస్ 1 ధర 1 లక్ష రూపాయలు, ఎస్ 1 ప్రో ధర రూ. 1.30 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్). అంతేకాదు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలపై రాష్ట్ర సబ్సిడీలను బట్టి డెలివరీ సమయంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఎస్ 1 గరిష్ట వేగం గంటలకు 90 కి.మీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 121 కిమీ వరకు ఉంటుంది. ఎస్ 1 ప్రో గరిష్ట వేగం 181- 115 కి.మీ.ల మధ్య ఉంటుంది. Day 2 of EV era was even better than Day 1! Crossed ₹1100Cr in sales in 2 days! Purchase window will reopen on Nov 1 so reserve now if you haven't already. Thank you India for the love & trust. You are the revolution! https://t.co/oeYPc4fv4M pic.twitter.com/fTTmcFgKfR — Bhavish Aggarwal (@bhash) September 17, 2021 -
టెక్ ఇండియా... 75 ఏళ్లలో సాధించిన పురోగతి ఇదే
Technology Achievements Of India: 1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే. సామాన్యుల బతుకులపైనా ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు కోకొల్లలు. అంగారకుడిపైకి చౌకగా నౌకను పంపామని... ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో... దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకుని తినడమే కాకుండా... ఎగుమతులూ చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం. అనుకూలమైన విధానాలూ తోడవడంతో ఆహారం, పాలు, పండ్లు, కాయగూరలు, వ్యాక్సిన్లు, మందుల తయారీలో ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రక్షణ రంగంలోనూ సొంతంగా మన కాళ్లపై మనం నిలబడగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. ఎదుగుతోంది కూడా. 1947లో స్థూల జాతీయోత్పత్తిలో శాస్త్ర పరిశోధనలకు కేటాయించింది 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ గత దశాబ్ద కాలంలో ఇది ఒక శాతానికి కొంచెం దిగువన మాత్రమే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తమ్మీద శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో స్వాతంత్య్రానంతరం మనం సాధించిన ఘన విజయాలను స్థూలంగా తరచి చూస్తే... హరిత విప్లవం... 1947లో దేశం పండించిన గోధుమలు కేవలం 60 లక్షల టన్నులు. డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో అప్పట్లో అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే భూ సంస్కరణలతోపాటు భాక్రా–నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడంతో పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. సొంతంగా ఎరువుల ఉత్పత్తి కూడా చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫలితంగా 1964 నాటికి గోధుమల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపోని పరిస్థితి. మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బెంజిమన్ పియరీ పాల్ చేపట్టిన పరిశోధనలు 1961లో ఫలప్రదమవడంతో గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడులిచ్చే వంగడాల అభివృద్ధే లక్ష్యంగా హరిత విప్లవం మొదలైంది. గోధుమతోపాటు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో కొత్త వంగడాలు వృద్ధి చేయడం మొదలైంది. 1947లో బెల్ ల్యాబ్స్ తొలి ట్రాన్సిస్టర్ను తయారు చేయగా.. అప్పట్లో దాన్ని మనుషులు చేతులతో తయారు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి ట్రాన్సిస్టర్ సైజు ఎంతుంటుందో తెలుసా? సూదిమొనపై చాలా సులువుగా పదికోట్ల ట్రాన్సిస్టర్లను పెట్టేయవచ్చు. ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు తమదైన సహకారం అందించారు. చదవండి : మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా క్షీర విప్లవం... స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారంతోపాటు పాల ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పసిపిల్లలకు వాడే పాల ఉత్పత్తులు, వెన్న, చీజ్ వంటివి దిగుమతయ్యేవి. 1955లో భారత్ యూరప్ నుంచి మొత్తం 500 టన్నుల వెన్న, మూడు వేల టన్నుల పిల్లల ఆహారాన్ని దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్లో కైరా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ప్రారంభంతో ఈ పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందు ఈ సంస్థ త్రిభువన్ దాస్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైంది. 1949లో తన పై చదువులకు సహకరించిన ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా వర్ఘీస్ కురియన్ గుజరాత్లోని ఆనంద్కు రావడం, అమూల్ ప్రారంభంతో దేశంలో క్షీర విప్లవం మొదలైంది. తొలినాళ్లలో అమూల్ సేకరించే పాల సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పాలపొడి తయారీ టెక్నాలజీ అప్పట్లో యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఉండేది. పైగా వాళ్లేమో బర్రెపాలను పొడిగా మార్చలేమని చెప్పేవారు. కానీ.. కురియన్తో పాటు అమూల్లో పనిచేసిన హెచ్.ఎం.దహియా అనే యువ డెయిరీ ఇంజినీర్ ప్రయోగాలు చేపట్టి బర్రెపాలను పొడిగా మార్చవచ్చునని నిరూపించారు. ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం చెప్పుకోవాల్సిన విషయం. పెయింట్ పిచికారి చేసే యంత్రం, గాలిని వేడి చేసే యంత్రాల సాయంతో తయారైన ఈ టెక్నాలజీ కాస్తా దేశంలో పాల దిగుబడి అవసరానికి మించి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే... ప్రపంచమంతా కోవిడ్–19తో సతమతమవుతున్న సమయంలో భారత్ ఏకంగా 550 కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేంత! చదవండి : సిరులిచ్చే.. సోయగాల చేపలు! ఉపగ్రహాలు, సమాచార విప్లవం... 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ ఛైర్మన్గా విక్రమ్ సారాభాయ్ సమాచార ప్రసారాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ టెక్నాలజీని వాడుకోవాలని అంటూంటే.. ఆయన్ను నమ్మేవారు చాలా తక్కుమంది మాత్రమే ఉండేవారు. సొంతంగా రాకెట్లు తయారు చేసే జ్ఞానమెక్కడిదని చాలామంది విమర్శించేవారు కూడా. విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహాల సాయంతో దేశంలో విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో వృద్ధి సాధించాలని కలలు కనేవాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్థాపనతో ఈ కలల సాకారం మొదలైంది. దశాబ్దకాలంలోనే దేశం సొంతంగా రాకెట్ను తయారు చేయడంతోపాటు అంతరిక్ష ప్రయోగాలను శాంతి కోసం వాడుకోవచ్చునని నిరూపించారు. ఆర్యభట్ట ఉపగ్రహం సాయంతో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంతరిక్ష రంగంలో భారత్ తన ముద్రను వేయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆఖరుకు చంద్రయాన్ –1తో జాబిల్లిపై నీటి ఛాయలను నిర్ధారించగలగడంతోపాటు తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న దేశంగానూ రికార్డు స్థాపించింది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్తో అంగారకుడిపైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపించడం వెనుక ఉన్న భారతీయ శాస్త్రవేత్తల మేధకు ప్రపంచం జేజేలు కొట్టింది. వీశాట్ టెక్నాలజీ వాడకం ద్వారా 1980లలో బ్యాంకింగ్ సేవలు దేశం మూలమూలలకు చేరుకుంది. ఉపగ్రహాల సాయంతో తుపానులను ముందుగా గుర్తించడం వీలు కావడంతో వేలాది ప్రాణాలను రక్షించగలుగుతున్నాం. ఫార్మా, వ్యాక్సిన్ తయారీల్లో... మీకు తెలుసా... ప్రపంచం మొత్తమ్మీద వేసే ప్రతి వ్యాక్సిన్లో మూడో వంతు భారత్లోనే తయారవుతున్నాయని వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఫార్మా రంగంలోనూ భారత్ సాధించిన ప్రగతి కచ్చితంగా ఎన్నదగ్గదే. జెనెరిక్ మందుల తయారీతో పేద దేశాల్లో హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతున్న లక్షలాది ప్రాణాలను కాపాడగలగడం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. మేధాహక్కుల పేరుతో విపరీతమైన లాభాలను గడించే ఫార్మా కంపెనీల ఆటలకు అడ్డుకట్ట పడిందిలా. విదేశీ ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1954లో హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ను ప్రారంభించింది. ఆ వెంటనే సోవియెట్ యూనియన్ సాయంతో హైదరాబాద్లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) ఏర్పాటు జరిగింది. నేషనల్ కెమికల్స్ లాబొరేటరీ, రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ (తరువాతి కాలంలో దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా మార్చారు), సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రభుత్వ సంస్థలు తమ వంతు పాత్ర పోషించడంతో అనతి కాలంలోనే అటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల తయారీ మొదలుకొని ఇటు మందుల తయారీలోనూ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదగగలిగాం. 1970లో పేటెంట్ హక్కుల్లో మార్పులు రావడంతో దేశంలో జెనెరిక్ మందుల వెల్లువ మొదలైంది. సిప్రోఫ్లాక్సిన్, డైక్లోఫెనాక్, సాల్బుటమాల్, ఒమిప్రొజోల్, అజిత్రోమైసిన్ వంటి మందులను భిన్నమైన పద్ధతిలో తయారు చేసి పెటెంట్ రాయల్టీల చెల్లింపుల సమస్యను అధిగమించగలిగారు. సి–డాట్తో టెలికామ్ రంగంలో పెనుమార్పులు... స్వాతంత్య్రం వచ్చే సమయానికి అనేక ఇతర రంగాల మాదిరిగానే టెలికామ్ రంగంలోనూ విదేశీ కంపెనీల హవా నడుస్తూండేది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం.. విదేశీ కంపెనీలేమో విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న నేపథ్యంలో టెలికామ్ రంగంలోనూ స్వావలంబనకు ఆలోచనలు మొదలయ్యాయి. 1970లలో ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చేదో కొంతమందికి అనుభవమే. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు అస్సలు ఉండేవే కావు. ఈ నేపథ్యంలో 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే టెలిఫోన్ ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేసే ప్రయత్నానికి శ్రీకారం పడింది. 1973లో వంద లైన్లతో తొలి ఎలక్ట్రానిక్ స్విచ్ తయారవడంతో టెలికామ్ రంగంలో దేశీ ముద్రకు బీజం పడినట్లు అయ్యింది. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబేలు మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్లను అభివృద్ధి చేశాయి. 1984లో శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సొంత టెలిఫోన్ ఎక్సే్ఛంజీల నిర్మాణం మొదలైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ రంగానికి ఉచితంగా మళ్లించడంతో మల్టీనేషనల్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమాచార వ్యవస్థలు ఏర్పడటం మొదలైంది. ఏసీల అవసరం లేకుండా.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల భారతీయ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ టెక్నాలజీ సీ–డాట్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సాయపడటం కొసమెరుపు! రైల్వేల కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... ఐబీఎం, ఐసీఎల్... స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో డేటా ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చలాయించిన రెండు కంపెనీలు ఇవి. రెండూ విదేశీ బహుళజాతి కంపెనీలే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు రక్షణ, పరిశోధన సంస్థల్లోనూ ఈ కంపెనీలు తయారు చేసిన డేటా ప్రాసెసింగ్ యంత్రాలనే వాడేవారు. విదేశాల్లో వాడిపడేసిన యంత్రాలను భారత్కు తెచ్చి అధిక ధరలకు లీజ్కు ఇచ్చేవి ఈ కంపెనీలు. నేషనల్ శాంపిల్ సర్వే, అణురియాక్టర్ తయారీ వంటి ప్రాజెక్టుల కోసం ఈ డేటా ప్రాసెసింగ్ యంత్రాల అవసరమైతే భారత్కు ఎంతో ఉండేది. ఈ అవసరాన్ని ఐబీఎం, ఐసీఎల్లు రెండూ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గుత్తాధిపత్యానికి తెరవేసే ప్రయత్నంలో భాగంగా హార్డ్వేర్, సాఫ్ట్వేర్లను సొంతంగా తయారు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 1970లలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్తోపాటు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)లను స్థాపించింది. ఈ సంస్థల ద్వారా జరిపిన ప్రాథమిక పరిశోధనల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన రైల్వే రిజర్వేషన్ ప్రాజెక్టు 1986కల్లా అందుబాటులోకి వచ్చింది. ఇవి మాత్రమే కాదు.. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు తద్వారా మత్స్యకారులకు తగినంత జీవనోపాధి కల్పించేందుకు కూడా స్వాతంత్య్రం తరువాతే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1970లలో తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం తరువాతి కాలంలో బహుముఖంగా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు, కార్యక్రమాలు మొదలయ్యాయి. ∙గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్లు..
హైదరాబాద్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ గ్రూప్లో భాగమైన రిలయన్స్ డిజిటల్ సంస్థ తాజాగా స్వాతంత్య్ర దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని ’డిజిటల్ ఇండియా సేల్’ నిర్వహిస్తోంది. రిలయన్స్ డిజిటల్, మై జియో స్టోర్స్, రిలయన్స్డిజిటల్డాట్ఇన్ పోర్టల్లో షాపింగ్ చేసేవారికి దీని కింద పలు ఉత్పత్తులపై ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. ఆగస్టు 16 దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డులపై 10 శాతం డిస్కౌంటు (రూ.3,000 వరకూ), పేటీఎం ద్వారా రూ. 9,999 కనీస చెల్లింపుపై ఆగస్టు 31 దాకా రూ. 500 వాలెట్ క్యాష్బ్యాక్ అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, జెస్ట్మనీ ద్వారా రూ. 10,000కు పైబడి చేసే కొనుగోళ్లపై నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్బ్యాక్ (రూ. 5,000 దాకా) పొందవచ్చని పేర్కొంది. టీవీలు, ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు మొదలైన వాటిపై ఈ ఆఫర్లు లభిస్తాయని వివరించింది. -
ధమాకా ఆఫర్లతో రిలయన్స్ డిజిటల్ ఇండియా సేల్
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తున్న డిజిటల్ ఇండియా సేల్ను రిలయన్స్ ప్రారంభించింది. ఆకర్షణీయ ఆఫర్లు, డిస్కౌంట్లతో రిలయన్స్ డిజిటల్ ఈ సేల్ను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. ఇందులో 300లకు పైగా జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు, 500లకు పైగా టీవీలు, ల్యాప్ట్యాప్లు, రిఫ్రిజిరేటర్లు వంటి ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు రిలయన్స్ డిజిటల్లో అందుబాటులో ఉంటాయి. దేశంలోని 80 నగరాల్లో ఉన్న 460 స్టోర్లలో ఈ సేల్ ప్రారంభం కానుంది. స్టోర్లతో పాటు మై జియోస్టోర్స్తో పాటు www.reliancedigital.in లో ఈ సేల్ ఆగస్టు 16 వరకు ఉంటుంది. ఆఫర్లు - ఆగస్టు 16 వరకు జరిగే కొనుగోళ్లలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులు, ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ని అందిస్తోంది. ఇందులో గరిష్టంగా రూ.3,000 వరకు తగ్తింపు పొందవచ్చు - కనీసం రూ.9999 కొనుగోళ్లపై పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపితే ఆగస్టు 31 వరకు రూ.500 వ్యాలెట్ క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రూ.10,000 ఆ పైన జరిపే కొనుగోళ్లపై జెస్ట్మనీ ద్వారా నో కాస్ట్ ఈఎంఐ, 10 శాతం క్యాష్ బ్యాక్ పొందవచ్చు. క్యాష్బ్యాక గరిష్ట పరిమితి రూ.5,000లుగా ఉంది. ఫైనాన్సింగ్ సులభమైన ఫైనాన్సింగ్, ఈఎంఐ ఆప్షన్స్తో డిజిటల్ ఇండియా సేల్స్ ఈ సంవత్సరం మరింత ఆకర్షణీయంగా మారింది. కొనుగోలు చేసిన భారీ వస్తువులను ఇన్స్టా డెలివరి కింద మూడు గంటల్లోనే డెలివరీ చేయనున్నారు. వినియోగదారులు తమ వీలుని బట్టి సమీపంలోని స్టోర్ నుంచి స్టోర్ పికప్ ఆప్షన్ను కూడా పొందవచ్చు. -
ప్రత్యేక ఆఫర్.. పేటిఎమ్లో రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్లు
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు ఏళ్లయిన సందర్భంగా ప్రముఖ పేటిఎమ్ యాప్ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు, వ్యాపారులకు క్యాష్ బ్యాక్ అందించేందుకు రూ.50 కోట్లను కేటాయించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద పేటిఎమ్ యాప్ ద్వారా చేయబడ్డ లావాదేవీలపై వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్ బ్యాక్లను అందుకొనున్నట్లు పేటిఎమ్ ప్రకటించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహ దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పేటిఎమ్ కమ్యూనిటీలో భాగం కావడం వల్ల డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారని సంస్థ తెలిపింది. ఈ ఏడాది క్యాష్ బ్యాక్ ఆఫర్ కోసం కంపెనీ రూ.50 కోట్లు కేటాయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళి వరకు పేటిఎమ్ ద్వారా అత్యధిక సంఖ్యలో లావాదేవీలు చేసిన వ్యాపారులలో టాప్ మర్చంట్ లకు సర్టిఫికేట్, రివార్డులు ఇవ్వనున్నారు. ఉచిత సౌండ్ బాక్స్, ఐఓటి పరికరాలు వంటి అనేక రివార్డులను కూడా అందుకుంటారు. పేటిఎమ్ యాప్ ద్వారా స్టోరుల వద్ద పేటిఎమ్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే కస్టమర్లు కూడా ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ అందుకుంటారని ప్రకటనలో తెలిపింది. చదవండి: వోడాఫోన్ ఐడియా మూతపడనుందా? -
భారత సాంకేతిక దశాబ్దం ఇది!
సాక్షి, న్యూఢిల్లీ: భారత దేశంలో డేటా, శ్రామిక శక్తి లభ్యతలో పెరుగుదల సమ్మేళనానికి.. టెక్నాలజీ రంగంలో ఇప్పటికే నిరూపితమైన శక్తి సామర్థ్యాలు తోడై మరిన్ని అవకాశాలు అందనున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ దశాబ్దం భారత సాంకేతిక దశాబ్దం(టెకేడ్)గా మారుతుందని అభివర్ణించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ఆరేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డిజిటల్ ఇండియా లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. డేటా పవర్హౌజ్గా భారతదేశానికి తన బాధ్యతలు తెలుసని చెబుతూ డేటా రక్షణకు సంబంధించిన కార్యక్రమం పురోగతిలో ఉందని వివరించారు. ‘డేటా, శ్రామిక శక్తి లభ్యతలో పెరుగుదల భారతదేశానికి భారీ అవకాశాన్ని ఇస్తోంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఈ దశాబ్దం ‘భారత టెకేడ్’గా మారడంలో విజయవంతమవుతుంది’ అని పేర్కొన్నారు. రాబోయే సంవత్సరాల్లో దేశంలోని డజన్లకొద్దీ టెక్ కంపెనీలు యూనికార్న్ క్లబ్( 1 బిలియన్ డాలర్ల విలువతో కూడినవి)లో ప్రవేశిస్తాయని అంచనాలు సూచిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా కార్యక్రమాలైన దీక్ష, ఇ-నామ్, ఈ సంజీవని, ప్రధాన మంత్రి స్వనిధి తదితర పథకాల లబ్ధిదారులతో ఆయన మాట్లాడారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. విద్య కొనసాగింపులో, ఆరోగ్య సంరక్షణలో, ఇతర పౌర సేవలు అందించడంలో టెక్నాలజీ కీలకపాత్ర పోషించిందని వివరించారు. ఈ సమయంలో మన దేశం ఆవిష్కరించిన డిజిటల్ సేవలకు ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభించిందన్నారు. ‘కరోనా సమయంలో భారతదేశం చూపిన పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ట్రేసింగ్ యాప్లలో ఒకటైన ఆరోగ్య సేతు యాప్ కోవిడ్ కట్టడిలో కీలకపాత్ర పోషించింది’ అని పేర్కొన్నారు. కోవిన్ యాప్పై చాలా దేశాలు ఆసక్తి కనబరిచాయని, ఇలాంటి సాధనాలు భారతదేశ సాంకేతిక నైపుణ్యానికి సాక్ష్యాలని పేర్కొన్నారు. దేశంలో ఆవిష్కరణల పట్ల ఉన్న అభిరుచిని, ఆ ఆవిష్కరణలను వేగంగా కార్యరూపంలో అందించాలని ఉన్న ఉత్సాహాన్ని మోదీ ప్రశంసించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం దేశ స్వావలంబన సంకల్పాన్ని చాటిచెబుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు అందుబాటు ధరల్లో ఎలక్ట్రానిక్ టాబ్లెట్లు, డిజిటల్ పరికరాలు అందుతున్నాయని, ఇందుకోసం ఆయా కంపెనీలకు ఉత్పత్తి అనుసంధానిత రాయితీలు ఇస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్కు చెందిన ఐదో తరగతి విద్యార్థిని సుహానీ సాహు ‘దీక్ష యాప్’ గురించి తన అనుభవాలను ప్రధాన మంత్రితో పంచుకున్నారు. తాను చదువు కొనసాగించేందుకు ఈ యాప్ ఎలా తోడ్పడిందో వివరించారు. అవినీతిపై దాడి ఇది జూలై 1, 2015 న ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమం కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన అనే భావనపై నిర్మితమైందని, ‘అందరికీ అవకాశాలు, అందరికీ సౌకర్యం, అందరి భాగస్వామ్యం’ లక్ష్యంగా రూపొందిందని ప్రధాన మంత్రి వివరించారు. ఇది ప్రభుత్వ వ్యవస్థల్లోకి ప్రజలకు ప్రవేశం కల్పించిందని, సేవల్లో పారదర్శకతకు దారి తీసిందన్నారు. ‘డిజిటల్ ఇండియా’ కార్యక్రమం అవినీతిపై నేరుగా దాడి చేసిందని వివరించారు. అది వైద్యుల ఘనతే..! కరోనాను భారత్ సమర్థ్దంగా ఎదుర్కోవడంపై మోదీ ప్రశంస కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశంలో ఆరోగ్య రంగంలో మౌలిక వసతుల కల్పన కోసం తమ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. ఒక్క ప్రాణాన్ని కోల్పోవడమైనా బాధాకరమే.. అయినా, కోవిడ్ నుంచి ప్రాణాలను కాపాడే విషయంలో భారత్ అనేక అభివృద్ధి చెందిన దేశాల కన్నా సమర్థ్దవంతంగా పనిచేసిందని ప్రధాని పేర్కొన్నారు. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా గురువారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. కాగా, కరోనా సమయంలో ప్రాణాలొడ్డి సేవలందిస్తున్న వైద్యులను రాష్ట్రపతి కోవింద్ స్వార్థం లేని దేవుళ్లని, వారి సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. వైద్యుల దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు. -
కరోనాపై పోరులో డిజిటల్ ఇండియా కీలకపాత్ర : ప్రధాని మోదీ
-
డిజిలాకర్: ఆధార్ను ఆన్లైన్లోనే దాచుకొవచ్చు!
సాక్షి,హైదరాబాద్: ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితులు ‘డిజిటల్ సర్వీసెస్’ను ఫోకస్లోకి తీసుకొచ్చాయి. ఏడాది కాలంగా చోటుచేసుకున్న పరిణామాలతో గతంలో డిజిటల్ టెక్నాలజీలను అంతగా అందిపుచ్చుకోని సంప్రదాయ వ్యాపారసంస్థలు, విద్యాసంస్థలు కూడా ఇప్పుడు ఆన్లైన్ కార్యకలాపాలకు షిప్ట్ అయిపోయాయి. గతంలో ఈ సంస్థల లావాదేవీలు, రోజువారీ విధులు, కార్యక్రమాల్లో ఎక్కువగా డాక్యుమెంట్ల రూపంలో కాగితంతో కూడిన ‘ఫిజికల్ డాక్యుమెంట్ అథెంటికేషన్’కున్న ప్రాధాన్యత నేపథ్యంలో దానికి ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’ప్రణాళికలో భాగంగా ‘డిజిలాకర్’ ఇప్పుడు ముఖ్య భూమికను పోషిస్తోంది. ఎడ్యుకేషన్, బర్త్ సర్టిఫికెట్లు, ఐటీ చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర ముఖ్యపత్రాలను డిజిలాకర్లో దాచుకునే సౌలభ్యం ఏర్పడింది. దీనిద్వారా దేశపౌరులు తమ జనన ధ్రువీకరణపత్రాలు మొదలు విద్యార్హతల సర్టిఫికెట్లు, బిజినెస్ డాక్యుమెంట్లు, ఆదాయపు పన్ను చెల్లింపు పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీలు ఇలా అనేక రకాల డాక్యుమెంట్లను ఆన్లైన్ డిజిటల్ ఫార్మాట్లో జాగ్రత్తగా దాచుకునే వీలు ఏర్పడింది. ఈ ఏడాది చివరకల్లా యూజర్ల సంఖ్య 8 కోట్లకు... 2015–16లోనే ప్రారంభమైన ఈ వినూత్న ఆలోచన ద్వారా అన్నిరకాల డాక్యుమెంట్లను ఓ ‘సెంట్రల్ రిపోసిటరీ’లో పదిలపరుచుకుని అవసరం పడినపుడు రిజిష్టర్డ్ సొంతదారు వాటిని డిజిటల్ రూపంలో చూపించుకునే సౌలభ్యం చిక్కింది. దీనిని ప్రారంభించిన నాటి నుంచి ఉపయోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగినా గతేడాది జూన్–ఆగస్టు మధ్యకాలంలో దేశవ్యాప్తంగా యూజర్స్ రిజిస్ట్రేషన్లు 4 కోట్ల లోపు నుంచి నాలుగున్నర కోట్లకు పెరిగాయి. గతేడాది మార్చి–ఏప్రిల్ నెలల్లో రోజుకు 20 వేల మంది కొత్తయూజర్లు వచ్చి చేరుతుండగా ఇప్పుడు వారి సంఖ్య లక్షకు చేరుకున్నట్టుగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్పర్మేషన్ టెక్నాలజీ పరిధిలోని నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది చివరకల్లా దీని రిజిష్టర్డ్ యూజర్ల సంఖ్య 8 కోట్లకు చేరచ్చునని అంచనా వేస్తున్నారు. ఏపీఐ కీలకం... అన్ని రకాల డాక్యుమెంట్లను అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ)–లెవల్ ఇంటిగ్రేషన్ ద్వారా డిజిలాకర్ అనుమతిస్తుంది. ఏపీఐ ద్వారా ఒక సాఫ్ట్వేర్ నుంచి మరొక సాఫ్ట్వేర్కు డేటాను బదిలీ చేసే వీలు ఏర్పడుతుంది. ప్రభుత్వపరంగా ఓపెన్ ఏపీఐ పాలసీ అమల్లో ఉండడంతో డేటా సొంతదారుల నుంచి ప్రభుత్వ ఏజెన్సీల (ఇంటర్ అండ్ ఇంట్రా గవర్నమెంటల్ ఏజెన్సీస్) మధ్య సమర్థవంతంగా ‘డేటా షేర్’చేసుకోడానికి దోహదపడుతోంది. తెలంగాణ విషయానికొస్తే... రాష్ట్రంలో డిజిలాకర్ విధానాన్ని వర్తింపజేస్తూ 2020 నవంబర్ 4న ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉత్తర్వులు జారీచేసింది. పౌరులకు డిజిటల్ సాధికారతను అందించడంలో భాగంగా డిజిటల్ ఫార్మాట్లో సంబంధిత విభాగాల నుంచి డాక్యుమెంట్లు, సర్టిఫికెట్ల యాక్సెస్ చేసేందుకు డాక్యుమెంట్ వ్యాలెట్ ఉపయోగపడుతోంది. పేపర్లెస్ గవర్నెన్స్లో భాగంగా ఆయా విభాగాలు, రంగాల్లో ఈ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అవి... ► వివిధ ప్రభుత్వశాఖలు, పీఎస్యూలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో డిజిలాకర్ సిస్టమ్ను అడాప్ట్ చేసుకున్నాయి. ► శాఖలు లేదా ఏజెన్సీలు డిజిలాకర్ ప్లాట్ఫామ్పై రిజిష్టర్ చేసుకోవాలి. వారి సాఫ్ట్వేర్/సిస్టమ్ (వెబ్, మొబైల్ అప్లికేషన్లు) ఈ ప్లాట్ఫామ్లో అనుసంధానించుకోవాలి. ప్రత్యక్షంగా హార్డ్కాపీ సర్టిఫికెట్/డాక్యుమెంట్తో సమానంగా దీనిని పరిగణలోకి తీసుకుంటారు. డిజిలాకర్ ద్వారా ఏయే డాక్యుమెంట్లు పరిగణనలోకి... ప్రత్యక్షంగా పేపర్తో కూడిన ఆధీకృత డాక్యుమెంట్ను చూపడానికి బదులు డిజిలాకర్ ద్వారా దాదాపు 492 ముఖ్యమైన డాక్యుమెంట్లను డిజిటల్ ఫార్మాట్లో పరిగణలోకి తీసుకుంటారు. ఉదా: ఆధార్, పాన్కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల ఆర్సీలు, క్లాస్ 10,12 సర్టిఫికెట్లు, ఇన్సురెన్స్పాలసీ డాక్యుమెంట్లు, స్కిల్ సర్టిఫికెట్, లీగల్ హేర్ సర్టిఫికెట్, సీనియర్ సిటిజన్ సర్టిఫికెట్, ప్రాపర్టీ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు తదితరాలు... ఏ విధంగా ప్రయోజనం... ►గతేడాది ఢిల్లీ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల సందర్భంగా కరోనా కారణంగా విద్యార్థులు కాలేజీకి వచ్చి మార్కుషీట్లు సమర్పించే పరిస్థితి లేదు. నేషనల్ ఈ–గవర్నెన్స్ డివిజన్ ఏపీఐ–లెవల్ వెరిఫికేషన్కు అనుమతివ్వడంతో దాదాపు లక్షమంది విద్యార్థులు వ్యక్తిగతంగా వచ్చి సర్టిఫికెట్లను సమర్పించకుండానే అడ్మిషన్లు పొందారు. ► కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం కర్ణాటక పోలీస్ శాఖ అభ్యర్థుల 10,12 తరగతుల సర్టిఫికెట్లను డిజిలాకర్ ద్వారా పరిశీలించింది. లక్షలాది మంది దరఖాస్తు చేసుకోవడంతో వాటిని వ్యక్తిగతంగా పరిశీలనకు ఆరునెలలకు పైగా సమయం పట్టి ఉండేది. దీంతో రిక్రూట్మెంట్ ప్రక్రియ 7,8 నెలలు ఆలస్యం కాకుం డా డిజిటల్ వెరిఫికేషన్ దోహదపడింది. ► డిజిలాకర్ ద్వారా డిజిటల్ ఇన్సూరెన్స్ పాలసీలను జారీచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అన్ని బీమా కంపెనీలకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. ► నేషనల్ అకడెమిక్ డిపొసిటరీ (ఎన్ఏడీ)డిజిలాకర్ను ఏకైక రిపొసిటరీగా చేసుకుంది. ► నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కూడా డిజిలాకర్ను ఉపయోగిస్తోంది. డిజిలాకర్ నమోదు ఎలా ? డిజిలాకర్ యాప్ను మొబైల్ (యాపిల్, ఆండ్రాయిడ్) ఫోన్లలో ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://digilocker.gov.in/ లేదా https://accounts.digitallocker.gov.in/వెబ్సైట్ల ద్వారా నమోదు చేసుకోవచ్చు. కావాల్సినవి... ►పేరు, పుట్టినతేదీ, మొబైల్ ఫోన్, ఆధార్ నంబర్ ►మొబైల్ ఫోన్ను ఆధార్ నంబర్ను అథెంటికేట్ చేస్తూ వన్టైమ్పాస్ వర్డ్ వస్తుంది. ►ఆ తర్వాత ఆథెంటికేషన్ కోసం సెక్యూరిటీ పిన్ను సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజి యూజర్స్... ‘ఎక్కువగా మీ–సేవా ద్వారా సర్టిఫికెట్ల జారీ, ఇతర కార్యకలాపాలు సాగుతున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇంటిగ్రేట్ చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రంలో 80 లక్షల దాకా డిజిలాకర్ రిజిష్టర్ యూజర్స్ ఉన్నారు. ప్రజలు ఈ సదుపాయాన్ని మరింత ఉపయోగించుకునేందుకు ముందుకు రావాలి. తమ మొబైల్, ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసుకోవాలి. తదనుగుణంగా డిజిలాకర్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. విద్యార్థుల సర్టిఫికెట్లకు సంబంధించి యూనివర్సిటీలు, వాహన లైసెన్స్లు, ఆర్సీలు తదితర డాక్యుమెంట్ల కోసం రవాణాశాఖ తదితరాలు మరింతగా భాగస్వామ్యమైతే ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ఈ విషయమై వర్సిటీలకు లెటర్స్ పంపించాం. –శ్రీనివాస్ పెండ్యాల, రాష్ట్ర నోడల్ ఆఫీసర్, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ కోవిడ్తో కొంత మేర అంతరాయం... రాష్ట్రంలో ఇప్పటికే మీ–సేవా కేంద్రాల ద్వారా ఆదాయ ధ్రువీకరణపత్రాలు, ఇతర డాక్యుమెంట్లు అప్లోడ్ అవుతున్నాయి. డిజిలాకర్లో ఇవి అందుబాటులోకి వచ్చాయి. పీడీఎస్, రేషన్కార్డులు కూడా చేయబోతున్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం ద్వారా డిజిలాకర్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని యూనివర్సిటీలకు కూడా రాశాం. అయితే కోవిడ్ పరిస్థితుల కారణంగా కొంత అంతరాయం ఏర్పడుతోంది. విద్యాశాఖ కూడా ఈ దిశలో చర్యలు చేపడుతోంది. తద్వారా ఎంసెట్, ఇతర కోర్సుల్లో కౌన్సెలింగ్ అపుడు సులభమౌతుంది. రవాణాశాఖకు సంబంధించి ‘ఎం వ్యాలెట్’ను డిజిలాకర్తో అనుసంధానించాల్సి ఉంది. ఇది ప్రభుత్వం వెరిఫై చేయాల్సిన పత్రాలకు సంబంధించినది అయినందున, హార్డ్కాపీలు వెంట తీసుకోవాల్సిన అవసరం లేకుండా, ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యే విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయి. వివిధ కార్యకలాపాల నిమిత్తం లబ్ధిదారులు లేదా అభ్యర్థుల నుంచి డాక్యుమెంట్లు కోరుతున్న వివిధ ప్రభుత్వ శాఖలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాల్సి ఉంది. డిజిలాకర్ సౌకర్యాన్ని వినియోగించుకునేలా పౌరుల్లో మరింత అవగాహన, ప్రచారం కల్పించాల్సి ఉంది. ఈ విధానంలో పూర్తి భద్రత ఉంది. – గునవలన్, రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఈ–గవర్నెన్స్ ప్రతినిధి -
ఇదేం టీకా విధానం?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కోవిడ్ టీకా విధానంపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకా విధానంలోని తప్పుల్ని ఎత్తి చూపుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. టీకాల ఉత్పత్తి, సేకరణ నుంచి ప్రజలకు వయస్సుల వారీగా టీకాలను ఇవ్వాలన్న నిర్ణయం వరకు.. టీకాల ధరల నుంచి, టీకా కోసం ‘కోవిన్’యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేయడం వరకు.. ప్రభుత్వ విధాన నిర్ణయాలను తీవ్రంగా తప్పుబట్టింది. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నవారు క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలని వ్యాఖ్యానించింది. మునుపెన్నడూ ఎరగని ఇలాంటి మహమ్మారిని ఎదుర్కొనేందుకు అత్యంత అప్రమత్తత అవసరమని పేర్కొంది. టీకా ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేలా చూడమని కేంద్రాన్ని ఆదేశించింది. ‘కోవిన్’ యాప్లో కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్న నిర్ణయం తీసుకునే ముందు డిజిటల్ ఇండియా వాస్తవ పరిస్థితిని తెలుసుకోవాలని సూచించింది. దేశ ప్రజలందరికీ అది సాధ్యమేనా అన్న విషయం ప్రభుత్వం ఆలోచించలేదని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవల సౌలభ్యం ఎంత? నిరక్షరాస్యులైన గ్రామీణులు ఎలా రిజిస్టర్ చేసుకోగలరు? అని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎల్ఎన్రావు, జస్టిస్ రవీంద్ర భట్ సభ్యులుగా ఉన్న ప్రత్యేక ధర్మాసనం ప్రశ్నించింది. వాస్తవ పరిస్థితులను గమనిస్తూ, తదనుగుణంగా ఎప్పటికప్పుడు విధాన నిర్ణయాల్లో మార్పులు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. దేశంలో డిజిటల్ నిరక్షరాస్యత అధికంగా ఉందని వ్యాఖ్యానించింది. ధర్మాసనం ప్రశ్నలకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిస్తూ.. రెండో డోసు టీకా వేసుకోవాల్సిన వారిని గుర్తించడానికి ‘కోవిన్’లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి చేశామన్నారు. అలాగే, గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ కోసం కమ్యూనిటీ సెంటర్లు ఉన్నాయన్నారు. దీనిపై.. ఇదంతా సాధ్యమేనా? అని కోర్టు ప్రశ్నించింది. అలాగే, సంబంధిత విధాన నిర్ణయ పత్రాన్ని తమ ముందుంచాలని ఆదేశించింది. కోవిడ్ టీకా నిర్వహణపై సుమోటోగా ఈ కేసును కోర్టు విచారణకు స్వీకరించిన విషయం తెలిసిందే. పంజాబ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాలు టీకాల కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని నిర్ణయించడం, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ ఇప్పటికే కొన్ని బిడ్లను స్వీకరించడాన్ని ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రం లేదా ఏదైనా మున్సిపల్ కార్పొరేషన్ స్వయంగా టీకాలను సేకరించుకోవచ్చన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ణయమా? లేక కేంద్రం నోడల్ ఏజెన్సీగా ఉండి టీకాలను కొనుగోలు చేసి, రాష్ట్రాలకు సరఫరా చేస్తుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. టీకా కొనుగోలు, పంపిణీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై తమకు స్పష్టత కావాలని, సంబంధిత ఫైల్స్ను తమకు అందించాలని ఆదేశించింది. ‘45 ఏళ్లు పైబడిన వారందరికీ కేంద్రమే టీకాలను కొనుగోలు చేసి రాష్ట్రాలకు పంపించింది. 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారి విషయంలో రెండు విధానాలు అవలంబిస్తోంది. దాని ప్రకారం.. 50% టీకాలను ఉత్పత్తి సంస్థలు కేంద్రం నిర్ణయించిన ధరకు రాష్ట్రాలకు సరఫరా చేయాలి. మిగతా 50% ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేయాలి.ఈ నిర్ణయం వెనుక హేతుబద్ధత ఏమిటి?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. కేంద్రం కన్నా రాష్ట్రాలకు ఎక్కువ ధర ఎందుకు నిర్ణయించారని ప్రశ్నించింది. అలాగే, టీకాలకు ధరలను నిర్ణయించే అధికారం ఉత్పత్తి సంస్థలకు ఇవ్వకుండా, కేంద్రమే దేశవ్యాప్తంగా ఒకటే ధరను నిర్ణయించాలి కదా!? అని వ్యాఖ్యానించింది. అలాగే, 45 ఏళ్లు పైబడినవారిపైనే కరోనా ప్రభావం ఎక్కువ ఉంటుందని కేంద్రం చెప్పిందని, కానీ రెండో వేవ్లో 18 నుంచి 44 ఏళ్ల వయస్సున్నవారిపైనే అది ఎక్కువ ప్రభావం చూపిందని గుర్తు చేసింది. మే 1 నుంచి మే 24 మధ్య నమోదైన కోవిడ్ కేసుల్లో దాదాపు 50% 18 – 44 వయస్సు వారిలోనే నమోదైనట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ద్వంద్వ ధరల విధానం వద్దు టీకా ధరల విధానాన్ని కూడా కోర్టు తప్పుబట్టింది. కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు ఎందుకని ప్రశ్నించింది. సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలను వ్యాక్సిన్ల కోసం మీలో మీరే పోటీ పడండి అని వాటి మానాన వాటిని వదిలేయడం సరికాదని వ్యాఖ్యానించింది. భారత్ రాష్ట్రాల సమాఖ్య అని రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. రాష్ట్రాలను తమలో తామే పోటీ పడమని కేంద్రం వదిలేసింది అనడం సరికాదని తుషార్ మెహతా వాదించారు. రాష్ట్రాలకు అందించే టీకా ధరపై కేంద్రమే ఉత్పత్తి సంస్థలతో మధ్యవర్తిత్వం జరిపిందన్నారు. అయినా, ఇలాంటి విధాన నిర్ణయాలపై సమీక్షించే అధికారం కోర్టులకు పరిమితంగా ఉంటుందని మెహతా వ్యాఖ్యానించారు. దీనిపై ధర్మాసనం.. ‘మేం ప్రభుత్వం.. సరైనదేదో మాకే తెలుసు అని మీరు భావించకూడదు. అవసరమైతే మేం గట్టిగా నిలదీయగలం’ అని స్పందించింది. ప్రైవేటు నుంచి సందేశాలు ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకోగానే ప్రైవేటు ఆసుపత్రుల నుంచి సందేశాలు వస్తున్నాయని, ప్రైవేటుగా టీకా తీసుకుంటే నలుగురు సభ్యులున్న ఒక కుటుంబం దాదాపు రూ. 4 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఈ కేసులో ఎమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై జస్టిస్ భట్ స్పందిస్తూ.. ధరను ప్రభుత్వం నిర్ణయించలేదు కాబట్టి.. డిమాండ్ పెరిగితే ప్రైవేటు ఆసుపత్రుల్లో వాటి ధర మరింత పెరిగే ప్రమాదముందన్నారు. ‘కోవిన్’లో రిజిస్టర్ చేసుకున్నవారికి స్లాట్లు దొరకని పరిస్థితి కూడా ప్రస్తుతం నెలకొని ఉందన్నారు. భారత్లో అర్హులైన వారందరికీ ఈ సంవత్సరం చివరలోగా వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫైజర్ సంస్థతో టీకాల కొనుగోలుపై చర్చలు జరుపుతున్నామని, అవి సఫలమైతే, మరింత ముందుగానే వ్యాక్సినేషన్ ముగుస్తుందని వెల్లడించింది. విమర్శించడం మా ఉద్దేశం కాదు విచారణ చివరలో.. కరోనాను ఎదుర్కొనే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, ఇందుకు విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికా వెళ్లి చర్చలు జరపడాన్ని ధర్మాసనం ప్రశంసించింది. ఎవరినీ విమర్శించాలన్నది తమ ఉద్దేశం కాదని కోర్టు వివరించింది. ఈ సందర్భంగా, వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఆటంకం కలిగేలా ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరారు. ‘టీకా ఉత్పత్తి సంస్థలు పరిమితంగా ఉన్నాయి. ఈ సమయంలో టీకా ధరలపై కోర్టు ఏవైనా ఆదేశాలిస్తే.. టీకా ఉత్పత్తి సంస్థలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలకు ఆటంకం కలుగుతుంది. అది వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’ అని తుషార్ మెహతా అభ్యర్థించారు. దీనిపై.. దేశ సంక్షేమానికి అడ్డుతగలాలని కోర్టు భావించడం లేదని ధర్మాసనం పేర్కొంది. తమ ప్రశ్నలు, ఆందోళనలకు రెండు వారాల్లో సమగ్ర అఫిడవిట్తో సమాధానమివ్వాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. థర్డ్ వేవ్పై ఆందోళన కరోనా మూడో వేవ్ చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపనుందన్న వార్తలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గ్రామాలపైనా దీని ప్రభావం భారీగా ఉండబోతోందన్న వార్తలను ప్రస్తావించింది. ఈ వార్తలపై శాస్త్రీయ అధ్యయనం ఏదైనా చేపట్టారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీనికి సంబంధించి ప్రత్యేక వ్యాక్సినేషన్ విధానాన్ని రూపొందించారా? అని ప్రశ్నించింది. రెమిడెసివిర్ వంటి కోవిడ్ ఔషధాల ధరలు ఆకాశాన్ని అంటడాన్ని కూడా ధర్మాసనం ప్రస్తావించింది. కేంద్రం మే 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త సరళీకృత విధానం ప్రకారం.. రాష్ట్రాలు తమ టీకా అవసరాల్లో 50% ఉత్పత్తి సంస్థల నుంచి నేరుగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే, కేంద్రం చెల్లిస్తున్న ధర కన్నా ఇది సాధారణంగా ఎక్కువ ఉంటుంది. అలాగే, ప్రైవేటు ఆసుపత్రులు మరింత ఎక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇలా వేర్వేరుగా ధరలను నిర్ణయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. టీకాల ద్వారా కూడా లాభాలు ఆర్జించాలని కేంద్రం భావిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. -
సిగ్నల్స్ అందక మంత్రి పాట్లు, ఫోటోలు వైరల్
భోపాల్: మధ్యప్రదేశ్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఫోన్ సిగ్నల్ అందకపోవడంతో ఏకంగా రంగులరాట్నం ఎక్కి ఫోన్ మాట్లాడుతున్న మంత్రి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో డిజిటల్ ఇండియాపై నెటిజన్లు తమదైన శైలిలో మిమ్స్ క్రియోట్ చేసి షేర్ చేస్తున్నారు. వివరాలు.. మధ్యప్రదేశ్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ మంత్రి బ్రజేంద్రసింగ్ యాదవ్ ఇటీవల అమ్ఖో గ్రామంలో జరుగుతున్న ఓ కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఆయన 9 రోజుల పర్యటనకు వెళ్లారు. అయితే అక్కడ సరిగా మొబైల్ సిగ్నల్స్ లేకపోవడంతో ప్రతి రోజు రంగులరాట్నం ఎక్కి 50 అడుగుల ఎత్తులో కుర్చోని ఫోన్ మాట్లాతున్నారు. ఆయనతో పాటు కెమెరామెన్, ఫోటోగ్రాఫర్లు కూడా ఆ రంగులరాట్నం ఎక్కి మంత్రి ఫోటోలు, వీడియోలు కవర్ చేస్తున్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ.. ‘భగవత్ కథ, శ్రీరామ్ మహాయగ్య కార్యక్రమాల్లో పాల్గోనేందుకు ఈ గ్రామానికి వచ్చాను. 9 రోజులు ఇక్కడే ఉంటాను. ఈ క్రమంలో ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి రోజు నా వద్దకు వస్తున్నారు. ఇక్కడ మొబైల్ సిగ్నల్స్ సరిగా అందడం లేదు. దీంతో నేను వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకేళ్లలేకపోతున్నా. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకేళ్లేందుకు ప్రతి రోజు ఈ రంగులరాట్నం ఎక్కి అధికారులతో మాట్లాడుతున్నా’ అని మంత్రి చెప్పుకొచ్చారు. చదవండి: రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని మృతి పెళ్లి విందు: తుపుక్మంటూ రోటీ మీద ఉమ్మేసి -
డిజిటలైజేషన్తో స్పీడ్: జుకర్బర్గ్, ముకేశ్
ముంబై, సాక్షి: ఫ్యూయల్ ఫర్ ఇండియా2020పేరుతో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిర్వహిస్తున్న తొలి ఎడిషన్ నేడు ప్రారంభమైంది. వర్చువల్ పద్ధతిలో ప్రారంభమైన సదస్సులో భాగంగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ప్రసంగించారు. దేశీయంగా డిజిటల్ విభాగంలో గల అవకాశాలు, ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో డిజిటల్ ప్రభావం తదితర పలు అంశాలను ప్రస్తావించారు. సదస్సులో ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్బర్గ్, ఫేస్బుక్ ఇండియా ఎండీ అజిత్ మోహన్తోపాటు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అధికారులు సైతం ప్రసంగించనున్నారు. ఇదేవిధంగా రిలయన్స్ జియో తరఫున డైరెక్టర్లు ఆకాశ్ అంబానీ, ఈషా అంబానీ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయనున్నారు. కాగా.. డిజిటలైజేషన్లో దేశాన్ని ప్రధాని మోడీ ముందుండి నడిపిస్తున్నట్లు జుకర్బర్గ్, ముకేశ్ అంబానీ ప్రశంసించారు. వివరాలు చూద్దాం.. (5జీ టెక్నాలజీను వెంటనే అనుమతించండి) మార్క్ జుకర్బర్గ్: భారత్లో ప్రస్తావించదగ్గ ఎంటర్ప్రెన్యూర్షిప్ సంస్క్రతి నెలకొని ఉంది. ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా విజన్ కారణంగా పలు అవకాశాలు పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వంతో భాగస్వామ్యానికి పరిశ్రమకు వీలు చిక్కనుంది. టెక్నాలజీ ద్వారా అభివృద్ధి వేగమందుకోనుంది. ప్రభుత్వం సృష్టించిన యూపీఐ చెల్లింపుల వ్యవస్థ ప్రజలకెంతో మేలు చేస్తోంది. డిజిటల్ టూల్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం లభించనుంది. దేశీయంగా కోట్ల కొద్దీ ప్రజలకు ఇంటర్నెట్ ప్రయోజనాలను అందించడంలో రిలయన్స్ జియో కీలకంగా మారింది. మరోపక్క వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ తదితర ప్లాట్ఫామ్స్ ద్వారా డిజిటల్ ఇన్క్లూజన్కు దారి ఏర్పడుతోంది. దేశీ వినియోగదారులకు భద్రతతో కూడిన స్వేచ్చా ఇంటర్నెట్కు ఫేస్బుక్ వేదికగా నిలుస్తోంది. (ముకేశ్ కుంటుంబం ఆసియాలోకెల్లా సంపన్నం) ముకేశ్ అంబానీ: రిలయన్స్ జియోలో ఫేస్బుక్ పెట్టుబడుల కారణంగా జియోకు లబ్ది చేకూరుతోంది. అంతేకాకుండా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా నిలిచింది. ఈ ఏడాది ఏప్రిల్లో రిలయన్స్ జియోలో 9.9 శాతం వాటాను రూ. 43,754 కోట్లకు ఫేస్బుక్ కొనుగోలు చేసిన విషయం విదితమే. దేశంలో రిలయన్స్ జియో డిజిటల్ కనెక్టివిటీకి తెరతీసింది. మరోవైపు వాట్సాప్ నౌ ద్వారా వాట్సాప్ డిజిటల్ ఇంటరేక్టివిటీని కల్పిస్తోంది. ఇక రిటైల్ రంగంలో జియో మార్ట్ అటు ఆన్లైన్, ఇటు ఆఫ్లైన్లో అపార అవకాశాలకు చోటిస్తోంది. దీంతో గ్రామాలు, చిన్న పట్టణాలలోగల చిన్న షాపులకూ డిజిటలైజేషన్ ద్వారా బిజినెస్ అవకాశాలకు దారి ఏర్పడుతోంది. విద్య, ఆరోగ్య రంగాలలోనూ డిజిటల్ అవకాశాలకు కొదవలేదు. డిజిటల్ సోసైటీగా మారాక రానున్న రెండు దశాబ్దాలలో దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని టాప్-3లో ఒకటిగా ఆవిర్భవించే వీలుంది. యువశక్తి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తుంది. దీంతో తలసరి ఆదాయం ప్రస్తుత 2,000 డాలర్ల నుంచి 5,000 డాలర్లకు పుంజుకునే అవకాశముంది. -
ఇక డిజిటల్ ఓటరు కార్డు!
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియాలో భాగంగా ఓటరు గుర్తింపు కార్డును డిజిటల్ చెయ్యా లని కేంద్ర ఎన్నికల సంఘం యోచిస్తోంది. పలు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకి ముందే డిజిటల్ ఫార్మేట్లోకి మార్చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీని వల్ల ఓటరు తమ గుర్తింపు కార్డుని పోలింగ్ బూతులకి వెంట తీసుకువెళ్లాల్సిన పని ఉండదు. అంతేగాక క్యూఆర్ కోడ్ల ద్వారా సమాచారాన్ని కార్డులో ఉంచనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారి ఒకరు శనివారం వెల్లడించారు. దీంతో విదేశాల్లో ఉన్న వారు కూడా తమ కార్డుని ఒక్క క్లిక్ సాయంతో క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. -
4జీ సేవలు.. డిజిటల్ భారతం
భారత్లో ఇంటర్నెట్ సేవలు పాతికేళ్ల కిందట ప్రారంభమయ్యాయి. అప్పట్లోనే మొబైల్ఫోన్లూ వాడుకలోకి వచ్చాయి. తొలినాళ్లలో సంపన్నులకే పరిమితమైన ఇంటర్నెట్, మొబైల్ సేవలు అనతికాలంలోనే దేశంలోని సామాన్యులకూ అందుబాటులోకి వచ్చాయి. భారత్లో 2008 చివర్లో 3జీ నెట్వర్క్ సేవలు ప్రారంభం కావడంతో స్మార్ట్ఫోన్లు వాడుకలోకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లలోనే నేరుగా ఇంటర్నెట్ వాడుకునే సౌలభ్యం ఉండటంతో సోషల్ మీడియా శరవేగంగా విస్తరించడం మొదలైంది. కాలక్రమంలో 4జీ సేవలు కూడా అందుబాటులోకి రావడంతో ‘డిజిటల్’ వేగం మరింతగా పెరిగింది. ప్రపంచమంతా డిజిటల్మయంగా మారుతుండటంతో భారత ప్రభుత్వం 2015లో ‘డిజిటల్ ఇండియా’ ప్రచారం ప్రారంభించింది. దేశంలో స్మార్ట్ఫోన్ల వాడకం కూడా మొదలైంది. గడచిన ఐదేళ్లలో దేశంలో డిజిటల్ పరుగు మరింతగా వేగం పుంజుకుంది. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నాటికి ప్రస్తుతం మన దేశంలో మొబైల్ఫోన్లు వాడుతున్న వారు 106 కోట్ల మంది ఉంటే, ఇంటర్నెట్ యూజర్లు 68.76 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో దాదాపు 78 శాతం మంది వద్ద మొబైల్ ఫోన్లు ఉన్నాయి. గత ఏడాది జనవరి నాటితో పోల్చుకుంటే దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 1.50 కోట్లు (1.4 శాతం) తగ్గినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఈ ఏడాది వ్యవధిలో దేశంలో సోషల్ మీడియా యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగడం విశేషం. గత ఏడాదితో పోల్చుకుంటే, ఈ ఏడాది సోషల్ మీడియా యూజర్ల సంఖ్య ఏకంగా 13 కోట్లు (48 శాతం) పెరిగింది. ఈ ఏడాది జనవరి నాటికి దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. సోషల్ మీడియా యూజర్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల ప్రజల్లో పెరిగిన చైతన్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నింగి నుంచి నేల మీదకు... దేశంలో మొబైల్ సేవలు ప్రారంభమైనప్పుడు ధరలు విపరీతంగా ఉండేవి. తొలిసారిగా 1995లో ఈ సేవలు మొదలైనప్పుడు ప్రీపెయిడ్ సిమ్కార్డు కోసమే రూ.4,900 వెచ్చించాల్సి వచ్చేది. కాల్ ధర నిమిషానికి రూ.17 ఉండేది. ఔట్గోయింగ్కే కాదు, ఇన్కమింగ్ కాల్కు కూడా ఇదే ధర. తొలిసారిగా దేశంలో ఈ సేవలు ప్రారంభమైనప్పుడు కోల్కతాలోని రైటర్స్ బిల్డింగ్ (పశ్చిమ బెంగాల్ సచివాలయం) నుంచి అప్పటి ముఖ్యమంత్రి జ్యోతి బసు ఢిల్లీలోని సంచార్ భవన్లో ఉన్న నాటి టెలికం మంత్రి సుఖ్రామ్కు తొలి మొబైల్ ఫోన్కాల్ చేశారు. అప్పట్లో రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సమాజంలోని అత్యంత సంపన్నులు మాత్రమే మొబైల్ఫోన్లతో కనిపించేవారు. తొలినాటి మొబైల్ ఫోన్లన్నీ బేసిక్ ఫోన్లే. వాటి ద్వారా కాల్ చేసుకోవడానికి, ఎస్ఎంఎస్ పంపుకోవడానికి తప్ప మరే వెసులుబాటూ ఉండేది కాదు. అయినా, అప్పట్లో వాటి ధరలు చుక్కలను తాకేవి. తొలినాటి మొబైల్ హ్యాండ్సెట్లలో భద్రతాపరమైన లోపాలూ ఉండేవి. వాటిలో ఎలాంటి ట్రాకింగ్ సౌకర్యం ఉండేది కాదు. చోరీలకు గురైన మొబైల్ ఫోన్లను తిరిగి పొందటం కల్లగానే ఉండేది. దేశంలో క్రమంగా మొబైల్ఫోన్లకు, సిమ్కార్డులకు డిమాండ్ పెరుగుతూ వస్తున్న రోజుల్లో మొబైల్ఫోన్లు, సిమ్కార్డుల స్మగ్లింగ్ కూడా బాగానే జరిగేది. స్మగుల్డ్ హ్యాండ్ సెట్లు కస్టమ్స్ కళ్లుగప్పి మార్కెట్లోకి రావడంతో, సహజంగానే వాటి ధర సగానికి సగం తక్కువగా ఉండేది. ‘సిమ్’కార్డులతో జీఎస్ఎం సేవలు కొనసాగుతుండగానే, 2002లో ‘సిమ్’ అవసరం లేని సీడీఎంఏ సేవలు మొదలయ్యాయి. రిలయన్స్, టాటా, హచ్ వంటి సంస్థలు సీడీఎంఏ సేవలను అందిస్తూ, 2జీ టెలికం సేవల మార్కెట్లో 20 శాతం వాటాను కైవసం చేసుకునే స్థాయికి ఎదిగాయి. సీడీఎంఏ సేవలు మొదలవడంతో మొబైల్ కాల్ ధరలు, ఎస్ఎంఎస్ ధరలు గణనీయంగా తగ్గి, దేశంలోని సామాన్యులకు సైతం ఇవి అందుబాటులోకి వచ్చాయి. మరో రెండేళ్లు తిరిగే సరికి– అంటే 2004 నాటికి దేశంలో తొలిసారిగా మొబైల్ కనెక్షన్ల సంఖ్య ల్యాండ్ఫోన్ కనెక్షన్ల సంఖ్యను అధిగమించడం జరిగింది. దేశంలో 2008లో 3జీ సేవలు మొదలవడంతో స్మార్ట్ఫోన్లు వాడుకలోకి రావడం మొదలైంది. ఇంటర్నెట్, మొబైల్ సేవలను అందించే సంస్థలు పోటాపోటీగా ధరలు తగ్గిస్తూ రావడంతో పాటు 2012 నాటికి 4జీ సేవలు అందుబాటులోకి రావడంతో 2014 నాటికి మొబైల్ఫోన్ల డిమాండ్ దేశంలో తారస్థాయికి చేరుకుంది. బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లకు దీటుగా కారుచౌక ధరల్లో చైనా స్మార్ట్ఫోన్లు కూడా కుప్పలు తెప్పలుగా మార్కెట్లోకి రావడం మొదలైంది. మొబైల్ సేవల ధరలు దాదాపు పూర్తిగా నింగి నుంచి నేలపైకి వచ్చాయి. స్మార్ట్ఫోన్లు పల్లెలకు సైతం చేరడం ప్రారంభమైంది. రిలయన్స్ జియో 2016లో మొదలైన తర్వాత మొబైల్ సేవల్లో మరింత వేగం పుంజుకుంది. ఫలితంగా, గత ఏడాది నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్ఫోన్ మార్కెట్గా అవతరించింది. భారత్లో ఇంటర్నెట్ ప్రస్థానం... మన దేశంలో ఇంటర్నెట్ ప్రస్థానం తొలి ఐదేళ్లలో మందకొడిగానే సాగింది. దేశంలో 1995 నుంచి ఇంటర్నెట్ సేవలు మొదలైనా, 2000 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య కేవలం 2 కోట్లు మాత్రమే ఉండేది. మరో పదేళ్లు గడిచే సరికి– అంటే 2010 నాటికి ఈ సంఖ్య 10 కోట్లకు, 2015 నాటికి 31.70 కోట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి, ఈ సంఖ్య గణనీయంగా పెరిగి, 62.7 కోట్లకు చేరుకుంది. గత ఏడాది చివరినాటి లెక్కల ప్రకారం ఇంటర్నెట్ సేవలను క్రియాశీలంగా ఉపయోగించుకునే యాక్టివ్ యూజర్ల సంఖ్య 49.30 కోట్లుగా ఉంటే, వీరిలో పట్టణ ప్రాంతాల్లోని వారు 29.30 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లోని వారు 20.00 కోట్లుగా ఉన్నట్లు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) ప్రకటించింది. కనీసం నెలకు ఒకసారైనా ఇంటర్నెట్ను ఉపయోగించుకునే వారిని యాక్టివ్ యూజర్లుగా పరిగణనలోకి తీసుకున్నామని, వీరిలో 70 శాతం మంది దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక ప్రయోజనం కోసం ఇంటర్నెట్ సేవలను వినియోగించుకుంటున్న వారేనని వెల్లడించింది. దేశంలోని యాక్టివ్ యూజర్లలో 43.3 కోట్ల మంది పన్నెండేళ్ల పైబడిన వయసు గలవారు కాగా, 7.1 కోట్ల మంది 5–11 ఏళ్ల లోపు చిన్నారులే కావడం గమనార్హం. గత ఏడాది మార్చి–నవంబర్ మధ్య కాలంలోనే ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో 5.30 కోట్ల పెరుగుదల నమోదైందని, దీంతో భారత్... అమెరికాను అధిగమించి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యలో ప్రపంచంలోనే రెండో స్థానానికి చేరుకుంది. అయితే, మన దేశంలోని యూజర్లలో పురుషులకు, మహిళలకు అంతరం చాలా ఎక్కువగా ఉంటోంది. యాక్టివ్ యూజర్లలో 71 శాతం మంది పురుషులైతే, మహిళలు 29 శాతం మంది మాత్రమే. ఇదిలా ఉంటే, దేశంలో అత్యధికంగా 97 శాతం మంది మొబైల్ఫోన్ల ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందుతున్నారు. మొబైల్ మాత్రమే కాకుండా పర్సనల్ కంప్యూటర్లు, ల్యాప్టాప్ల ద్వారా ఇంటర్నెట్ వినియోగించుకునే వారి సంఖ్య 30.3 కోట్లుగా ఉన్నట్లు ఐఏఎంఏఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో ఇంటర్నెట్ వినియోగంలో వృద్ధి రేటు ఇదే స్థాయిలో కొనసాగితే, 2025 నాటికి దేశంలో యాక్టివ్ యూజర్ల సంఖ్య 97.4 కోట్లను అధిగమించగలదని ఐఏఎంఐఐ అంచనా వేస్తోంది. సమాచారానికి ఆధారం సమాచారం కోసం వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఇంటర్నెట్పై ఆధారపడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గడచిన రెండేళ్లలో మన దేశంలో వార్తా పత్రికల ప్రింట్ ఎడిషన్ల మార్కెట్లో 4.4 శాతం పెరుగుదల నమోదైంది. ఇదేకాలంలో సమాచారం కోసం ఇంటర్నెట్పై ఆధారపడే వారి సంఖ్యలో 19 శాతం పెరుగుదల నమోదైంది. న్యూస్ వెబ్సైట్లు, పోర్టల్స్ వృద్ధికి ఇదొక ఆశాజనకమైన పరిణామమేనని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంటర్నెట్ యూజర్లలో స్థానిక భాషల్లో కంటెంట్ను వినియోగించుకునే వారు మన దేశంలో 60 శాతానికి పైగానే ఉంటున్నారు. ఇదిలా ఉంటే, ‘కరోనా’ మహమ్మారి తాకిడి మొదలైన తర్వాత వార్తల కోసం యూజర్లు ఇంటర్నెట్లో గడిపే సమయం గణనీయంగా పెరిగినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ‘కరోనా’ వ్యాప్తికి ముందు మూడు నెలలు– జనవరి నుంచి మార్చి వరకు చూసుకుంటే, యూజర్లు వారానికి సగటున 27 నిమిషాలు ఇంటర్నెట్లో వార్తల కోసం వెచ్చించేవారు. మార్చి చివర్లో లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఈ సమయం 40 నిమిషాలకు పెరిగిందని ‘బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ (బీఏఆర్సీ) వెల్లడించింది. వార్తలను చదువుకోవడం, వార్తలకు సంబంధించిన వీడియో క్లిపింగ్స్ను చూడటమే కాకుండా, నచ్చిన వార్తలను సామాజిక మాధ్యమాల్లో పంచుకునే వెసులుబాటు ఉండటంతో చాలామంది ఇంటర్నెట్లో వార్తల వెదుకులాట సాగిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత దేశంలో న్యూస్ యాప్స్ వినియోగం ఏకంగా 50 శాతం మేరకు పెరిగిందని, న్యూస్ వెబ్సైట్స్ వినియోగం 42 శాతం మేరకు పెరిగిందని ‘బీఏఆర్సీ’–నీల్సన్ అధ్యయనంలో వెల్లడైంది. సామాజిక మాధ్యమ చైతన్యం ఇంటర్నెట్ సేవలు విస్తృతం కావడమే కాకుండా, స్మార్ట్ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడంతో భారత యూజర్లలో సామాజిక మాధ్యమ చైతన్యం కూడా పెరుగుతూ వస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 40 కోట్లకు పైగా సోషల్ మీడియా యూజర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా 79.3 శాతం యూజర్లు ఫేస్బుక్, 7.35 శాతం యూట్యూబ్, 5.32 పింటరెస్ట్, 3.9 శాతం ఇన్స్టాగ్రామ్, 1.91 శాతం ట్విట్టర్ వేదికలను వినియోగిస్తున్నారు. ఇవే కాకుండా, స్మార్ట్ఫోన్లను వినియోగించుకునే వారిలో వాట్సాప్ యూజర్ల సంఖ్య ఈ ఏడాది 40 కోట్లను అధిగమించడం విశేషం. సామాజిక మాధ్యమాలను ఎక్కువగా సమాచారాన్ని, సామాజిక పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడానికి, వినోదానికి, నైపుణ్యాల ప్రదర్శనకు ఉపయోగించుకుంటు న్నారు. కొంతమంది వీటిని వ్యాపార విస్తరణ వేదికలుగా, ఆదాయ మార్గాలుగా కూడా ఉపయోగించుకుంటున్నారు. ‘యూట్యూబ్’ వీడియోలను స్వయం ఉపాధి మార్గంగా ఎంచుకున్నవారు కూడా మన దేశంలో పెద్దసంఖ్యలోనే ఉన్నారు. సోషల్ మీడియా యూజర్లలో భారతీయులు గత ఏడాది రోజుకు సగటున 2.4 గంటల కాలం గడిపేవారు. ఏడాది వ్యవధిలోనే ఈ సమయం ఏకంగా 87 శాతానికి పెరిగి, రోజుకు 4 గంటలకు చేరుకుంది. ‘కరోనా’ లాక్డౌన్ కాలానికి ముందు రోజుకు సగటున 150 నిమిషాలు గడిపేవారు కాస్తా, లాక్డౌన్ కాలం మొదలైనప్పటి నుంచి రోజుకు 280 నిమిషాలు గడుపుతున్నట్లుగా ‘హ్యామర్కాఫ్ కన్జూమర్ స్నాప్చాట్ సర్వే’ వెల్లడించింది. ఇదిలా ఉంటే, ‘కరోనా’ దెబ్బకు సినిమా థియేటర్లు మూతబడటంతో ఈ ఏడాది ఓవర్ ది టాప్ (ఓటీటీ) ద్వారా సినిమాలు చూసేవారి సంఖ్య ఏకంగా 71 శాతం పెరిగినట్లు ఈ సర్వేలో తేలింది. లాక్డౌన్ సమయంలో ఉద్యోగులకు వర్క్ఫ్రమ్ హోమ్, విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు మొదలవడంతో వాట్సాప్, జూమ్ వంటి వాటి వినియోగం పెరగడం కూడా ఈ పెరుగుదలకు దోహదపడినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కరోనా’తో ఈ–కామర్స్కు ఊపు భారత రిటైల్ మార్కెట్ వార్షిక విలువ 800 బిలియన్ డాలర్లు (రూ.58.47 లక్షల కోట్లు). ఇందులో ఈ–కామర్స్ వాటా 3.5 శాతం మాత్రమే. ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఈ–కామర్స్ సంస్థలు నిత్యావసరాల నుంచి ఎలక్ట్రానిక్ వస్తువుల వరకు రకరకాల వస్తువులను ఆన్లైన్లో విక్రయిస్తున్నా, ఆన్లైన్లో వీటిని తెప్పించుకునేవారు మన దేశంలో తక్కువే. నేరుగా దుకాణాలకు వెళ్లి షాపింగ్ చేయడానికే భారతీయులు మొగ్గు చూపుతారు. దుకాణాలకు, షాపింగ్ మాల్స్కు వెళ్లడం, కలియదిరగడం, బేరాలు చేయడం చాలామందికి కాలక్షేపం. ‘కరోనా’ ఈ పరిస్థితిలో పెను మార్పు తెచ్చింది. దేశంలో లాక్డౌన్ మొదలైన తర్వాత ఈ–కామర్స్ సంస్థల అమ్మకాలు ఏకంగా 90 శాతం మేరకు పెరిగాయి. ఈ–కామర్స్ రంగంలో ఆశాజనకమైన మార్పులు కనిపిస్తున్నాయని, రానున్న ఐదేళ్లలో ఈ రంగం సగటున 30 శాతం వృద్ధితో ముందుకు దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. సామాజిక మాధ్యమాలకు అలవాటుపడిన యువతలో చాలామంది సమాచారం కోసం, వినోదం కోసం మాత్రమే వీటికి పరిమితం కాకుండా ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతున్నారనే ఆందోళనా వ్యక్తమవుతోంది. ఇటీవల ప్రభుత్వం పబ్జీ, టిక్టాక్ వంటి యాప్స్ను బ్యాన్ చేసింది గాని, వీటి వాడకం తారస్థాయిలో ఉన్నప్పుడు వీటి ద్వారా దుస్సాహసాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నవారు, వీటి ఉచ్చులో చిక్కుకుని మానసిక కుంగుబాటుతో ఆత్మహత్యలకు పాల్పడ్డవారు చాలామందే ఉన్నారు. సామాజిక మాధ్యమాలలో మితిమీరి సమయం గడిపేవారిలో చాలామంది మానసిక సమస్యల బారిన పడుతున్నారని పలు వార్తాకథనాలు, గణాంకాలు చెబుతున్నాయి. -
డిజిటల్ ఇండియా: కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా వైరస్ ఉధృతి, తీవ్ర మందగమనంలో ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, విభాగాల్లో డైరీలు, గ్రీటింగ్ కార్డులు, కాఫీ టేబుల్ బుక్స్, క్యాలెండర్లను భౌతిక రూపంలో ముద్రించడాన్నిని షేధించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖలు, విభాగాలు,స్వయంప్రతిపత్త సంస్థలతో పాటు, ఇతర ప్రభుత్వ రంగ విభాగాలకు సంబంధిత ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. రాబోయే సంవత్సరంలో ఏ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, ప్రభుత్వంలోని అన్ని ఇతర విభాగాల్లో వాల్ క్యాలెండర్లు, డెస్క్టాప్ క్యాలెండర్లు, డైరీలు ఇతర వస్తువులను ముద్రించకూడదని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. డిజిటలైజేషన్ను ప్రోత్సహించడంతోపాటు ఆర్థిక పొదుపు చర్యల కింద ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం (సెప్టెంబర్ 2న) ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. దీంతో ఇపుడు ఇవన్నీ డిజిటల్ రూపును సంతరించుకోనున్నాయి. వాల్ క్యాలెండర్లు, డెస్క్టాప్ క్యాలెండర్లు, డైరీలు,పండుగ గ్రీటింగ్ కార్డులు లాంటి వాటిని ఇకపై ఇ-బుక్స్ రూపంలో మాత్రమే అందించాలని ఆదేశించింది. ప్రపంచమంతా డిజిటల్ వైపు పరుగులు పెడుతున్న తరుణంలో ఉత్పాదకత రెట్టింపు, ప్రణాళిక, షెడ్యూలింగ్, అంచనాలకు నూతన సాంకేతిక ఆవిష్కరణల ఉపయోగంతో ఖర్చులను తగ్గించుకోవడమే కాదు నిర్వహణ కూడా సమర్థవంతంగా ప్రభావవంతంగా ఉంటుందని తెలిపింది. -
కరెన్సీ నోట్లతో కరోనా వ్యాపిస్తుందా?
సాక్షి,న్యూఢిల్లీ : కరెన్సీ నోట్ల ద్వారా కరోనా వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఉందా? అవుననే అనుమానంతోనే ప్రజలంతా నగదుకు బదులుగా డిజిటల్ లావాదేవీలను ఆశ్రయించాల్సిందిగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా మార్చి 16వ తేదీన దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ఒక్క భారతీయ రిజర్వ్ బ్యాంక్ మాత్రమే కాదు, ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు కూడా తమ దేశాల ప్రజలకు ఈ పిలుపునిచ్చాయి. ఆఖరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా డిజిటల్ లావాదేవీలను ఆశ్రయించడమే శ్రేయస్కరం అని సూచించింది. కావచ్చేమో అన్న అనుమానంతో దేశవ్యాప్తంగా అనేక మంది భారతీయులు నోట్లను ఇచ్చి పుచ్చుకునేటప్పుడు చేతులకు శానిటైజర్లు పూసుకుంటున్నారు. కొందరైతే నోట్లకు కూడా శానిటైజర్లను పూసి ఆరబెడుతున్నారు. కొందరైతే కరెన్సీ నాణాలను ముట్టుకోకుండా ఏదోచోట దాస్తున్నారు. (కరోనా : తక్కువ ధరలో మరో ఫావిపిరవిర్ డ్రగ్) వారి భయాల్లో నిజమెంత? భారత దేశంలో 94 శాతం లావాదేవీలు నగదుతోనే నడుస్తున్నాయని ఇటీవలనే ఓ జాతీయ సర్వే తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ ‘డిజిటల్ ఇండియా’ నినాదంతో సరికొత్త విప్తవానికి శ్రీకారం చుట్టడంతో ఓ దశలో దేశంలో డిజిటల్ లావాదేవీలు 27–29 శాతానికి చేరుకున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో డిజిటల్ లావాదేవీలు పడిపోతూ మళ్లీ నగదు లావాదేవీలు ఊపందుకున్నాయి. ఇక్కడ కరెన్సీ లావాదేవీలకు, కరోనాకు సంబంధం ఏమిటీ అన్న అనుమానం రావచ్చు. కరెన్సీ కారణంగా కరోనా విస్తరించే అవకాశం ఉన్నట్లయితే కరెన్సీ లావాదేవీలు ఎక్కువగా సాగే భారత్లోనే ఇతర దేశాల కన్నా ఎక్కువ కరోనా కేసులు నమోదై ఉండాలి. శానిటైజర్లు ఉపయోగించడం వల్ల నోట్ల ద్వారా కరెన్సీ అంటుకోవడం లేదన్న లాజిక్ రావచ్చు. దేశంలో ఇప్పటికీ 35 శాతానికి మించి ప్రజలు శానిటైజర్లు ఉపయోగించడం లేదు. ఇక అందులో నోట్లకు కూడా శానిటైజర్లను పూసే వారి సంఖ్య ఎంతుంటుందో ఊహించవచ్చు. నగదు లావాదేవీలు, జాతీయ స్థూల ఉత్పత్తి సంయుక్త నిష్పత్తితో పది లక్షల మందికి ఎంత మంది కరోనా రోగులు తేలుతున్నారనే సంఖ్యను పోల్చి చూడడం ద్వారా నోట్లకు, కరోనా కేసులకు సంబంధం ఉందా, లేదా అంశాన్ని అంచనా వేయవచ్చు. (కరోనా వాక్సిన్: నోవావాక్స్ శుభవార్త) ఉదాహరణకు స్వీడన్లో కరెన్సీ లావాదేవీలు–జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) నిష్పత్తి 3.1 శాతం ఉండగా, ఆ దేశంలో కరోనా రోగుల సంఖ్య జూలై నెల వరకు పది లక్షలకు 2,186 చొప్పున నమోదయ్యాయి. అదే భారత దేశంలో కరెన్సీ లావాదేవీలు–జీడీపీ రేషియో 11.2 శాతం ఉండగా, కరోనా కేసులు మాత్రం భారత్లో జూలై నెల నాటికి పది లక్షలకు 31 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరెన్సీ తక్కువగా, డిజిటల్ లావాదేవీలు ఎక్కువగా జరిగే అమెరికా, యూరో జోన్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. -
కొత్త ఉపాధి అవకాశాలు, కొత్త వ్యాపారాలు: అంబానీ
సాక్షి, ముంబై: భారతదేశంలో డిజిటల్ అవకాశాలను మెరుగు పర్చేందుకు ఫేస్బుక్ , రిలయన్స్ జియో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) చైర్మన్, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశం ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ సొసైటీలలో ఒకటిగా అవతరించనుందని పేర్కొన్నారు. ఇందుకు దీర్ఘకాలిక, గౌరవనీయ భాగస్వామిగా ఫేస్బుక్ను స్వాగతిస్తున్నందుకు ఆనందంగా, ఇంతటి ఉత్తేజకరమైన వార్తలను పంచుకోవడానికి సంతోషంగా వుందని అంబానీ తెలిపారు. అలాగే డిజిటల్ టెక్నాలజీతో కొత్త ఉపాధి అవకాశాలను రాబోతున్నాయని అంబానీ ప్రకటించారు. ఫేస్బుక్-జియో అనుసంధానం ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు మూడు కోట్ల కిరాణా దుకాణాలకు భారీ ప్రయోజనాలు కలగనున్నాయని చెప్పారు. అలాగే రైతులు, చిన్న, మధ్యతరహా సంస్థలు, విద్యార్థులు , ఉపాధ్యాయుల ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, అన్నింటికంటే మించి కొత్త భారతదేశానికి పునాది వేసే మహిళలు, యువకులకు డిజిటల్ టెక్నాలజీ ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. (ఫేస్బుక్ - జియో డీల్ : జుకర్ బర్గ్ సందేశం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ "ఈజీ ఆఫ్ లివింగ్", "ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్" లక్ష్యాలను సాకారం చేయడానికి ఈ భాగస్వామ్యం సహాయపడుతుందని అంబానీ అన్నారు. వాట్సాప్ డిజిటల్ చెల్లింపు సేవను ప్రభుత్వం ఆమోదించిన తరువాత ఫేస్బుక్ను జియోలో అతిపెద్ద మైనారిటీ వాటాదారుగా మార్చే ఈ ఒప్పందం అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈ కీలకమైన అనుమతితో జియోమార్ట్ ద్వారా చిన్న కిరాణా దుకాణాలు, చిరు వ్యాపారులు ఆన్లైన్ బాట పట్టనున్నాయి. తద్వారా స్థానిక దుకాణాలనుండి రోజువారీ వస్తువులను ఆర్డర్ చేయవచ్చు. పంపిణీ కూడా వేగవంతమవుతుంది. అదే సమయంలో, ఈ దుకాణాలు తమ వ్యాపారాలను పెంచుకోవచ్చు. అసోచామ్-పిడబ్ల్యుసి ఇండియా అధ్యయనం ప్రకారం 2023 లో 135.2 బిలియన్ డాలర్ల విలువతో అవతరించబోతున్న డిజిటల్ మార్కెట్ తో ఫేస్బుక్ యాజమాన్యంలోని సంస్థ, గూగుల్ పే , పేటిఎమ్ వంటి వాటితో పోటీ పడేందుకు సిద్ధంగా ఉందన్నారు. భారతదేశంలో వాట్సాప్ 400 మిలియన్ల వినియోగదారులతో, దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు చేరువైందని పేర్కొన్నారు. -
ప్రమాదాలకు చెక్..!
సాక్షి, చెన్నై : ప్రమాదాల కట్టడి లక్ష్యంగా మదురైకు చెందిన ఓ యువకుడి డిజిటల్ ఇండియా యాక్సిడెంట్ ప్రివెంటింగ్ కిట్ను రూపొందించాడు. కేవలం రూ.ఐదు వేల ఖర్చుతో ఈ కిట్ను సిద్ధం చేశాడు. అలాగే, వాయిస్ కిట్ కూడా తయారు చేసి అందరి దృష్టిలో పడ్డాడు.రాష్ట్రంలో ఇటీవల కాలంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అతి వేగం, నిర్లక్ష్యం వెరసి ప్రతి ఏటా వేలాది మందిని బలి కొంటున్నాయి. ప్రభుత్వ గణాంకాల మేరకు ప్రతి ఏటా పది హేను వేల ప్రమాదాలు రాష్ట్రంలో చోటుచేసుకుంటున్నాయి. ఇందులో పది వేల మంది మరణించగా, రెండు వేల మంది కోమాలోకి వెళ్తున్నారు. మరో మూడు వేల మంది క్షతగ్రాతులుగా మిగులుతున్నారు. గత వారం కూడా మదురై, తిరువళ్లూరులలో అతి పెద్ద ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. నిత్యం రోడ్లు రక్తమోడుతున్నాయి. వాటని తగ్గించడానికి మదురైకు చెందిన పాజిల్ (23) యువకుడు వినూత్న ఆవిష్కరణ మీద దృష్టి పెట్టారు. తండ్రి చిన్న మరుదు పాండి, తల్లి షీబాలు అందించిన సహకారంతో సరికొత్త కిట్ తయారీ మీద దృష్టి పెట్టాడు. డిజిటల్ ఇండియా యాక్సిడెంట్ ప్రివెంటింగ్ కిట్ను సిద్ధం చేశారు. దీనిని వాహనాల్లో అమర్చితే చాలు, ఇందులోని సెన్సార్, అమరికల మేరకు ప్రమాదాల కట్టడి చేయవచ్చు. పయనిస్తున్న వాహనానికి నాలుగు మీటర్ల దూరంలో ఏదేని వాహనం దూసుకొచ్చినా, ఎవరైనా అడ్డు పడ్డా, అమరికలు, సెన్సార్ ఆధారంగా ఆ వాహనం బ్రేక్ సడన్గా పడుతుంది. తద్వారా ప్రమాదాల్ని నియంత్రించేందుకు వీలుందని పాజిల్ పేర్కొంటున్నాడు. ప్రస్తుతానికి తాను 30 నుంచి 35 కి.మీ వేగంతో ఈ కిట్ను ప్రయోగించి ఫలితాన్ని సాధించినట్టు వివరించారు. తనకు పూర్తి సహకారాన్ని అందించిన పక్షంలో వంద కీ.మీ వేగంతో సాగే దిశగా , సడన్ బ్రేక్ వేసి ప్రమాదాల్ని నియంత్రించే రీతిలో పరికరాన్ని రూపొందించేందుకు సిద్ధం గా ఉన్నట్టు పాజిల్ విజ్ఞప్తి చేస్తున్నాడు. తాను, ప్రస్తుతం తయారు చేసిన కిట్కు రూ. ఐదు వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు వెల్లడించాడు. ఈ కిట్తో పాటుగా షీబా పేరిట వాయిస్కంట్రోల్ కిట్ను కూడా సిద్ధం చేసి ఉన్నట్టు తెలిపా డు. ఆటోమేటిక్ డోర్లు కల్గిన వాహనాల్లో డోర్లాక్ అయిన పక్షంలో, ఏదేని సమస్య తలెత్తిన పక్షంలో వాయిస్ కంట్రోల్ కిట్ ద్వారా బయట పడే వీలుందని వివరించాడు. వాయిస్ కంట్రోల్ కిట్ను వైఫై, హాట్సాట్లకు అనుసం ధించే రీతిలో సిద్ధం చేశానని, త్వరలో ఏదేని కార్ల సంస్థను సంప్రదించి దీనిని ప్రయోగించనున్న ట్టు తెలిపాడు. కాగా, గతంలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని పరీక్షించకుండానే పసిగట్టే రీతిలో ఓ పరికరాన్ని ఈ యువకుడు రూపొందించిన విషయం తెలిసిందే. -
5జీ వేలం ఈ ఏడాదే..
న్యూఢిల్లీ: 5జీ టెలికం సేవలకు అవసరమైన స్పెక్ట్రం వేలాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే నిర్వహించనున్నట్లు కేంద్ర టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. స్పెక్ట్రం ధరలకు సంబంధించి సంస్కరణలు ఉంటాయని టెలికం పరిశ్రమకు హామీ ఇచ్చారు. సోమవారం ప్రారంభమైన ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2019 సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘టెలికం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రభుత్వానికి తెలుసు. స్పెక్ట్రం వేలం ఈ ఆర్థిక సంవత్సరంలోనే జరుగుతుంది. ధరకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేపడుతున్నాం‘ అని ప్రసాద్ చెప్పారు. మరోవైపు, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వదంతుల వ్యాప్తి అంశంపై స్పందిస్తూ ఎన్క్రిప్షన్ను ప్రభుత్వం కూడా గౌరవిస్తుందని చెప్పారు. అయితే, హింసను ప్రేరేపించే విధమైన తప్పుడు వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు .. దర్యాప్తు సంస్థలు వాటి మూలాలను కచ్చితంగా కనుగొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇందుకు అనువైన వ్యవస్థ ఉండటం తప్పనిసరన్నారు. స్పెక్ట్రం రేటును సంస్కరిస్తామంటూ ప్రసాద్ ప్రకటించడాన్ని సెల్యులార్ సంస్థల సమాఖ్య సీవోఏఐ స్వాగతించింది. ఇది టెలికం కంపెనీలకు ‘భారీ ఊరట‘ ఇస్తుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ చెప్పారు. తగినంత స్పెక్ట్రం, సరైన ధర ఉంటే రాబోయే వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు టెల్కోలు కూడా ఆసక్తి చూపుతాయని పేర్కొన్నారు.5జీ స్పెక్ట్రం వేలానికి రూ. 4.9 లక్షల కోట్ల బేస్ ధరను నిర్ణయించాలంటూ టెలికం రంగ నియంత్రణ సంస్థ (ట్రాయ్) గతేడాది సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న టెలికం పరిశ్రమ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. తొలి రోజున 5జీ టెక్నాలజీ మెరుపులు.. దేశీ టెలికం సంస్థలకు కీలక కార్యక్రమమైన ఐఎంసీ అక్టోబర్ 16 దాకా మూడు రోజుల పాటు సాగనుంది. ఈసారి ఒక లక్ష మంది దాకా దీన్ని సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు టెలికం శాఖ కార్యదర్శి అన్షు ప్రకాష్ తెలిపారు. ఇందులో 500 పైచిలుకు కంపెనీలు, 250 స్టార్టప్లు, 110 మంది విదేశీ కొనుగోలుదారులు పాల్గొంటున్నారు. తొలి రోజున వివిధ టెలికం దిగ్గజాలు పలు కొత్త కాన్సెప్ట్స్ను సందర్శకులకు ప్రదర్శించాయి. గాయకులు ఒక చోట పాడుతుంటే, మ్యూజిక్ కంపోజర్ మరోచోట కంపోజ్ చేస్తుండగా..రెండింటినీ అనుసంధానం చేసి ఏకకాలంలో పూర్తి పాటను లైవ్లో వినిపించే 5జీ టెక్నాలజీ కాన్సెప్ట్ను ఎరిక్సన్, ఎయిర్టెల్ ప్రదర్శించాయి. స్మార్ట్ వాహనాల్లో 5జీ టెక్నాలజీ వినియోగాన్ని వొడాఫోన్ ఐడియా ప్రదర్శించింది. వైద్యం, విద్యా రంగాల్లో లైవ్ 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ను చూపించింది. రిలయన్స్ జియో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియో కాల్ అసిస్టెంట్ను ప్రదర్శించింది. రిలయన్స్ చీఫ్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్ ఈసారి హాజరు కాకపోవడం గమనార్హం. నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలి: బిర్లా కొత్త డిజిటల్ భారతదేశాన్ని నిర్మించాలంటే టెలికం రంగం కీలకమని వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా తెలిపారు. ఈ రంగం వృద్ధికి నియంత్రణ వ్యవస్థ తోడ్పాటు ఉండాలని, ప్రభుత్వం ఇందుకు అనువైన పరిస్థితులు కల్పించాలని పేర్కొన్నారు. మరోవైపు, భారీ స్పెక్ట్రం ధరలు, నెట్వర్క్ విస్తృతికి భారీగా వ్యయాలు చేయాల్సి వస్తుండటం టెలికం రంగంపై మరింత భారం మోపుతోందని భారతీ ఎంటర్ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేష్ భారతి మిట్టల్ చెప్పారు. 5జీ స్పెక్ట్రంనకు ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రిజర్వ్ ధర మిగతా దేశాలతో పోలిస్తే ఏకంగా ఏడు రెట్లు అధికమన్నారు. 5జీ లో భారత్ లీడరుగా ఎదగాలంటే స్పెక్ట్రం ధర సహేతుకంగా ఉండేలా చూడటం అవసరమని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తెలిపారు. -
మైక్రోసాఫ్ట్ డిజిటల్ గవర్నెన్స్ టెక్ టూర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న డిజిటల్ ఇండియా విజన్లో భాగంగా మైక్రోసాఫ్ట్ ఇండియా మంగళవారం డిజిటల్ గవర్నెన్స్ టెక్ టూర్ను ఆవిష్కరించింది. జాతీయస్థాయిలో చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా ఐటీ విభాగాలకు ఇన్ఛార్జులుగా ఉన్న ప్రభుత్వాధికారులకు కీలకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటెలిజెంట్ క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్లో శిక్షణ ఇస్తారు. రానున్న 12 నెలల్లో 5,000 మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో పలు వర్క్షాపులు ఉంటాయి. ఏఐని అందిపుచ్చుకునేందుకు, ఉత్పాదకతో కూడిన, పారదర్శక పాలన అందించేందుకు భద్రతతో కూడిన క్లౌడ్ టెక్నాలజీని ప్రభుత్వ సంస్థలకు మైక్రోసాఫ్ట్ అందించనుంది. నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్, ఐటీ మంత్రిత్వశాఖ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నీ ఢిల్లీలో డిజిటల్ గవర్నెన్స్ టెక్ సమిట్ 2019ను ప్రారంభించారు. దేశంలో సమ్మిళిత ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు ఎఐ, క్లౌడ్ సర్వీసెస్ డేటా ఎనలిటిక్స్ను కీలక రంగాల్లో భాగస్వామ్యం కల్పించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి పాల్గొన్నారు. -
ఆన్లైన్లో కొనేద్దామా!
సాక్షి, హైదరాబాద్: డిజిటల్ ఇండియాలో భాగం కావాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. తద్వారా రైతులకు కావాల్సిన వ్యవసాయ ఉపకరణాలు మొదలు తమకు అవసరమైన స్టేషనరీని తక్కువ ధరకు ఆన్లైన్లో కొనుగోలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో అవకతవకలు లేకుండా కొనుగోళ్లు చేయవచ్చని భావిస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యం లో కేంద్రం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన గవర్నమెంట్ ఈ–మార్కెట్ ప్లేస్ (జీఈఎం)ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. తమ శాఖ తరఫున జీఈఎం పోర్టల్ నుంచి కొనుగోళ్లు జరిపేందుకు సిద్ధమవుతున్నామని వ్యవసాయశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ‘సాక్షి’కి తెలిపారు. వ్యవసాయ సంబంధ యంత్రాలూ అందులో లభ్యమవుతున్నాయని, వివరాలు పూర్తిగా తెలుసుకున్నాక కొనుగోలు చేస్తామని వివరించారు. పత్తి యంత్రాలు మొదలు ల్యాప్టాప్ల వరకూ... ప్రైవేటులో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా తదితర ఆన్లైన్ పోర్టళ్లు ఎలాగో కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే జీఈఎం అలాంటిదే. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆయా వస్తువులపై కేంద్ర ప్రభుత్వ పన్నులు ఉండవు. కాబట్టి తక్కువ ధరకే లభిస్తాయి. ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్టేషనరీ మొదలు ల్యాప్టాప్లు, కార్లు, వ్యవసాయ ఉపకరణాలన్నీ లభ్యమవుతాయి. హైఎండ్ ఇన్నోవాకారు బయటి మార్కెట్లో రూ. 20 లక్షలుంటే, జీఈఎంలో రూ.16 లక్షలకే కొనుగోలు చేయవచ్చని తెలిపారు. పత్తిని తీసేందుకు బ్యాటరీతో పనిచేసే మిషన్లు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, హార్డ్వేర్ పరికరాలు, సీసీ కెమెరాలు, ప్యాసింజర్ మోటార్ వాహనాలు, కార్యాలయ ఫర్నిచర్ వంటి 8 వేలకు పైగా ఉత్పత్తులు అందిస్తున్నారు. ఇప్పుడు అందజేస్తున్న వ్యవసాయ యంత్రాలను ఆన్లైన్లో కొనుగోలుచేసే అవకాశం ఉంది. ప్రభుత్వం వాటికి సబ్సిడీ ఇచ్చి రైతులకు అందజేయమని చెబితే పోర్టల్లోనే ఆర్డర్ చేయడానికి వీలుంది. ఇప్పటికే ట్రాక్టర్లు సబ్సిడీపై ఇస్తున్నామని, వాటినీ ఆన్లైన్లో కొనుగోలు చేసే అవకాశాలను అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో జీఈఎంలో కొనుగోలుకు ఆలోచిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ పథకానికి సంబంధించిన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసి జీఈఎంలో కొనుగోలు చేసే సదుపాయం కల్పిస్తున్నారు. వ్యవసాయ శాఖలోని వ్యవసాయ ఉపసంచాలకులకు ఈ–మెయిల్ సౌకర్యం కల్పించి అవసరమైనవి కొనుగోలు చేసేందుకు అనుమతించాలని భావిస్తున్నారు. -
అదృశ్యమవుతున్న ‘డిజిటల్ వాలెట్స్’
సాక్షి, న్యూఢిల్లీ : భారత్లో ‘డిజిటల్ వాలెట్ల’ వ్యాప్తికి దాదాపు తెరపడినట్లేనా? పరిస్థితి అలాగే కనిపిస్తోంది. ‘డిజిటల్ ఇండియా’ స్ఫూర్తితో డిజిటల్ వాలెట్లు పురోగమించడం మానేసి తిరోగమించడం ఆశ్చర్యకరం. 2006లో ఒకే ఒక్క డిజిటల్ వాలెట్ ఉండగా, 2017 నాటికి వాటి సంఖ్య 60కి చేరుకున్నాయి. వివిధ కారణాల వల్ల ఇప్పుడు వాటి సంఖ్య 49కి పడిపోయాయని భారతీయ రిజర్వ్ బ్యాంకు తెలియజేసింది. డిజిటల్ మార్కెట్ వ్యవస్థ స్థిరీకరణకు చేరుకోకపోవడం, పోటీ తత్వం పెరగడం, లాభాలు లేక పోవడంతోపాటు ప్రభుత్వ విధాన నిర్ణయాలు సానుకూలంగా లేకపోవడమే ఈ మార్కెట్ పతనానికి కారణమని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా చిన్న, మధ్య తరహా కంపెనీలు మూసుకుపోగా పెద్ద కంపెనీలు మనుగడ కోసం పోరాటం సాగిస్తున్నాయని అ వర్గాలు అంటున్నాయి. తొలి డిజిటల్ వాలెట్ ‘వాలెట్ 365. కామ్’ ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ గ్రూపు ‘ఎస్ బ్యాంక్’తో కలిసి ఈ వాలెట్ను 2006లో తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు బ్యాంకులు, పలు బ్యాంకేతర ఆర్థిక సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించాయి. బిగ్బాస్కెట్, గోవర్స్ అనే రిటేల్ సంస్థలు, అమెజాన్ లాంటి ఆన్లైన్ సంస్థలు, ప్రముఖ మెస్సేజింగ్ సంస్థ ‘వాట్సాప్’లు ఈ రంగంలోకి ప్రవేశించాయి. పేటీఎం, మోబిక్విక్ లాంటి డిజిటల్ వాలెట్ సంస్థలు మార్కెట్లో మంచి వాటాలను కూడా సంపాదించుకున్నాయి. స్మార్ట్ఫోన్ల విప్లవం ఈ మార్కెట్ను ముందుగా ప్రోత్సహించాయి. ఆ తర్వాత 2016 నవంబర్ 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేయడంతో ఈ మార్కెట్కు మంచి ఊపు వచ్చింది. 2015–2016 సంవత్సరంలోనే ఈ మార్కెట్ 154 కోట్ల రూపాయలకు చేరుకుంది. 2021–2022 సంవత్సరానికి ఈ మార్కెట్ దేశంలో 30 వేల కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ఈ వాలెట్ పరిశ్రమ ఆశించింది. పతనం ప్రారంభం ‘చెల్లింపులేవో పెద్ద మొత్తాల్లో జరపాల్సి రావడం, వ్యాపారమేమో చాలా తక్కువగా ఉండడం వల్ల చిన్న కంపెనీలు నిలదొక్కుకోలేక మూతపడ్డాయి. పెద్ద కంపెనీలు ఇప్పటికీ క్లిష్ట పరిస్థితినే ఎదుర్కొంటున్నాయి’ అని మోబిక్విక్ సహ వ్యవస్థాపకులు ఉపాసన తెలిపారు. ‘విస్తత స్థాయి కస్టమర్ నెట్వర్క్ లేకపోయినట్లయితే డబ్బులను తగలేసుకోవడం తప్ప, స్థిరత్వం ఎలా సాధించగలం’ అని మొబైల్ వాలెట్ ‘టీఎండబ్లూ’ వ్యవస్థాపకుడు వినయ్ కలాంత్రి చెప్పారు. పెద్ద కంపెనీలకు లాభాలు లేకపోవడంతో చిన్న కంపెనీల నెట్వర్క్లను కొనుక్కోవాల్సి వస్తోందని, అందుకనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ‘ట్రూపే’ను తాము కొనుగోలు చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఈ కారణంగానే గత రెండేళ్లలో పలు పెద్ద కంపెనీలు చిన్న కంపెనీలను కొనుగోలు చేశాయి. మొబైల్ ‘ఫర్మ్ ఫ్రీచార్జ్’ని ఆక్సిస్ బ్యాంక్, ఆన్లైన్ పేమెంట్ సంస్థ ‘ఎమ్వాంటేజ్’ను అమెజాన్, ‘ఫోన్పే’ను ఫ్లిప్కార్ట్ కంపెనీ, ఆఫ్లైన్ స్టోర్ల మొబైల్ వాలెట్ ‘మొమో’ను షాప్క్లూస్ కంపెనీలు కొనేశాయి. ఆర్బీఐ కొత్త రూల్ వల్ల కూడా డిజిటల్ వాలెట్ కంపెనీలు ఎల్లప్పుడు రెండు కోట్ల రూపాయల నెట్వర్త్ను కలిగి ఉండాలనే నిబంధనను ఐదు కోట్ల రూపాయలకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ పెంచడం, మూడేళ్ల మొత్తానికి నెట్వర్త్ 15 కోట్ల రూపాయలు ఉండాలనే నిబంధన తేవడం వల్ల చాలా కంపెనీలు వెనకడుగు వేశాయి. ఇప్పటికే లైసెన్స్లు తీసుకున్న కంపెనీలు కూడా తమ డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించలేదు. అక్రమ చెల్లింపులు జరుగకుండా ‘నో యువర్ కస్టమర్’ కింద స్పష్టమైన వెరిఫికేషన్ ఉండాలనడం, అందుకోసం అదనపు డాక్యుమెంట్లు అవసరం అవడం కూడా డిజిటల్ వాలెట్ కంపెనీలను నిరుత్సాహ పరిచాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కూడా సరకుల మార్పిడీ లేదా సర్వీసుల కోసం కార్పొరేట్ కంపెనీలు లేదా వ్యక్తులు ఆధార్ కార్డుల సమాచారాన్ని కోరరాదని సుప్రీం కోర్టు గత సెప్టెంబర్ నెలలో ఉత్తర్వులు జారీ చేయడం కూడా ఈ మార్కెట్పై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియ క్లిష్టమైనప్పటికీ ఆధార్ కార్డుల ద్వారా అందులో ఉండే బయోమెట్రిక్ ముద్రలను తీసుకొని వినియోగదారులను సులభంగానే గుర్తుపట్టే వాళ్లమని, ఆధార్ కార్డు డేటాను ఉపయోగించ కూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులతో పెద్ద కంపెనీలకు కూడా ‘నో యువర్ కస్టమర్’ ప్రక్రియను అమలు చేయడం కష్టమైపోయిందని మరో వాలెట్ కంపెనీ ‘పేవరల్డ్’ కంపెనీ సీఈవో ప్రవీణ్ దాదాభాయ్ చెప్పారు. -
డిజిటల్ ఇండియాలో ఇంటర్నెట్ బ్లాక్!
ఆర్థిక వ్యవస్థకు, భావ ప్రకటనకు అత్యంత కీలకం ఇంటర్నెట్. కానీ తప్పుడు సమాచారాన్నీ వదంతుల్నీ అడ్డుకునే పేరిట నెట్ సర్వీసుల్ని యథేచ్చగా నిలిపేస్తున్నాయి ప్రభుత్వాలు. సాఫ్ట్వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ (ఎస్ఎఫ్ఎల్సీ) గణాంకాల ప్రకారం.. రాష్ట్రాలు గత 7నెలల్లో మొత్తం 95 సార్లు ఇంటర్నెట్ సర్వీసులనునిలిపేశాయి. ఇంతకు ముందెన్నడూ ఇన్ని ఘటనలు నమోదు కాలేదని విశ్లేషణలు చెబుతున్నాయి. గత ఏడేళ్లలో మొత్తం 233 సార్లు నెట్ బ్లాక్చేసినట్లు రికార్డు అయింది. ఇవి మీడియా స్వేచ్ఛ, హక్కుల ఉల్లంఘన కిందికే వస్తాయంటూ మానవ హక్కుల బృందాలు విమర్శిస్తున్నాయి. అత్యవసర సందర్భాల్లో తప్ప నెట్ సేవలు నిలిపేయరాదన్న నిబంధనను రాష్ట్రాలు ఖాతరు చేయట్లేదు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో మోసాల్ని నివారించే పేరిట రాజస్తాన్ ప్రభుత్వం జూలై 14, 15 తేదీల్లో ఇంటర్నెట్ను బ్లాక్ చేసిన వైనం తాజా ఉదాహరణ. ఆ రాష్ట్రంలో 2017 ఆగస్టు–2018 మే మధ్య మొత్తం 21 సార్లు నెట్ను షట్డౌన్ చేశారు. చిన్న సమస్యకూ షట్డౌన్.. ♦ ఎస్ఎఫ్ఎల్సీ ప్రకారం– 2017లో 79సార్లు, 2016లో 30 సార్లు నెట్ సేవల్ని బ్లాక్ చేశారు. గత 7 నెలల్లో జమ్మూ కశ్మీర్ (36), రాజస్తాన్ (26)లో సర్వీసులు నిలిపేశారు. ఉత్తరప్రదేశ్లో7సార్లు, మహారాష్ట్రలో 5సార్లు ఆపేశారు. 2012–17 సంవత్సరాల మధ్య.. జమ్మూ కశ్మీర్, రాజస్తాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఎక్కువసార్లు నెట్ షట్డౌన్ చేశారు. ♦ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల భారతీయ పరిశోధన మండలి తాజా నివేదిక ప్రకారం.. 2012–17 మధ్య 16,315 గంటలపాటు నెట్ను నిలిపేయడం వల్ల భారత్కు దాదాపురూ.20 వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ– కామర్స్, ఐటీ సర్వీసులు, పర్యాటకం మొదలైన రంగాలకు జరిగిన నష్టాన్ని మండలి పరిగణనలోకి తీసుకుంది. చిరు వ్యాపారాలు, పాఠశాలలు, ఆసుపత్రులు మొదలైనవి కూడా నెట్ బ్యాన్తో నష్టపోయాయి. ♦ రాష్ట్రాల్లోపరిస్థితులను అదుపు చేసేందుకు నెట్ షట్డౌన్ను ప్రభుత్వాధికారులు ఒక సాధనంగా వాడుకుంటున్నారనే విమర్శ వినిపిస్తోంది. పండుగ ఊరేగింపులు, పరీక్షల్లో మోసాలు, సామాజిక సమస్యలపై జరిగే నిరసన ప్రదర్శనలు, పెద్ద రాజకీయ నాయకుల పర్యటనల సందర్భాల్లోకూడా నెట్ను బ్లాక్ చేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నెట్ సేవల నిలిపివేతకు సంబంధించి పారదర్శకంగా వ్యవహరించకపోవడం, చట్టపరమైన నిబంధనలు పాటించకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ♦ బ్రూకింగ్సంస్థ 2015 జూలై– 2016 జూన్ మధ్య జరిపిన అధ్యయనం ప్రకారం 19 దేశాల్లో నెట్ సర్వీసుల నిలిపివేత వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వాటిల్లిన నష్టం దాదాపు రూ.16 వేల కోట్లు, భారత్కు రూ.96.8 కోట్లు నష్టమొచ్చింది. ♦ రాజకీయ కారణాల వల్ల అలజడులు చెలరేగిన సందర్భాల్లో నెట్పై నిషేధం విధించడం వల్ల హింస మరింత పెరిగే ప్రమాదముందని అధ్యయనాలు చెబుతున్నాయి. ♦ఐక్య రాజ్యసమితి ప్రకారం.. ఇంటర్నెట్ కలిగి ఉండటం మనిషి హక్కుల్లో ఒకటి. దీన్ని సుప్రీంకోర్టు 2017లో ప్రా«థమిక హక్కుగా పేర్కొంది. ♦ షట్డౌన్లు పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (ఐఎఫ్ఎఫ్) ‘కీప్ అజ్ ఆన్లైన్’పేరిట సంతకాల సేకరణ చేపట్టింది. దీనిపై 16,000 మందికి పైగా సంతకా లు చేశారు. 100 సంస్థలు సంతకాలతో మద్దతు ప్రకటించాయి. ♦ 2017లో ప్రభుత్వం చేసిన షట్డౌన్ నిబంధనలు ఫలితాలివ్వట్లేదని ఐఎఫ్ఎఫ్ చెబుతోంది. నిబంధనల రూపకల్పన విషయంలో ప్రజలతో సంప్రదింపులు జరపకపోవడంపై అభ్యంతరాలు లేవనెత్తింది. కానీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన లభించలేదు. -
ఉద్యోగుల జీతాల చెల్లింపునకు కొత్త విధానం
-
ఈ–కుబేర్తో వేతనాలు!
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగుల వేతనాల చెల్లింపు ప్రక్రియలో కొత్త విధానం అమల్లోకి వస్తోంది. ‘డిజిటల్ ఇండియా’కార్యక్రమంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొత్తగా అమల్లోకి తెచ్చిన ‘ఈ–కుబేర్’విధానాన్నే ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల చెల్లింపులను అమలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కొత్త పద్ధతిలోనే ఆగస్టు 1న వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే తుది దశకు చేరింది. స్వల్ప సాంకేతిక సమస్యలను అధిగమించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారంలోపే అన్ని సమస్యలను పరిష్కరించి కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఆర్థిక, ఖజానా శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 3.2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.56 లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు. అందరికీ కలిపి ప్రభుత్వం ప్రతి నెలా దాదాపు రూ.6 వేల కోట్లను చెల్లిస్తోంది. భారీ మొత్తం కావడంతో చెల్లింపుల విషయంలో జాప్యం జరుగుతోంది. ఈ–కుబేర్ విధానం అమల్లోకి వస్తే ఉద్యోగులకు ప్రతి నెలా కచ్చితమైన సమయానికి వేతనాలను చెల్లిస్తారు. పెన్షనర్లకు ఇప్పటికే అమలు: ఈ–కుబేర్ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. తొలిదశలో ఎనిమిది రాష్ట్రాల్లో అమలు చేసేలా చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేరళ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో ప్రస్తుతం అమలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే 2.56 లక్షల పెన్షనర్లకు ప్రస్తుతం ఈ–కుబేర్ విధానాన్ని ప్రయోగాత్మక విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉద్యోగులకు సైతం దీన్ని అమలు చేసేందుకు నెలాఖరుకల్లా ఏర్పాట్లు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. అప్పటికీ సమస్యలు ఉంటే కొత్త విధానాన్ని సెప్టెంబర్కు వాయిదా వేసే అవకాశం ఉందని చెప్పారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగుల వేతనాల బిల్లులను ట్రెజరీ అధికారులు ‘ఈ–కుబేర్’సాఫ్ట్వేర్తో ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఉద్యోగి బ్యాంకు ఖాతా నంబర్, బ్యాంకు ఐఎఫ్ఎస్సీ కోడ్, ఆధార్ కార్డు నంబర్ను అప్లోడ్ చేస్తారు. ఈ వివరాలు ఆర్బీఐకి చేరుతాయి. నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ (నెఫ్ట్) పద్ధతిలో ఆర్బీఐ నేరుగా ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలను జమ చేస్తుంది. ప్రస్తుతం ఇలా.. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపునకు సంబంధించి ప్రస్తుత విధానంలో ఎక్కువ ప్రక్రియ ఉంటోంది. ఆయా కార్యాలయాల్లోని డ్రాయింగ్ హోదా కలిగిన ఉద్యోగి.. మిగిలిన ఉద్యోగుల వేతనాల చెల్లింపులకు సంబంధించిన బిల్లులను తయారు చేస్తున్నారు. వీటిని ఆయా జిల్లాల పరి ధిలోని ట్రెజరీలకు, అక్కడి నుంచి బ్యాంకులకు పంపిస్తున్నారు. బిల్లులకు అనుగుణంగా బ్యాం కుల్లో ప్రభుత్వం నిధులను జమ చేస్తోంది. అనంతరం ఉద్యోగుల వారీగా బ్యాంకులు ఖాతాల్లో వేతనాలను జమ చేస్తున్నాయి. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా ఉంటోంది. సెలవులు వస్తే అన్ని ప్రక్రియల్లో జాప్యం జరిగి వేతనాల చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఈ–కుబేర్తో ఆలస్యానికి అవకాశమే లేదు. -
జిల్లా ఆస్పత్రికి డిజిటల్ ఇండియా అవార్డు
నిజామాబాద్అర్బన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి ‘డిజిటల్ ఇండియాా’ అవార్డు రానుంది. ఆన్లైన్లో అందిస్తున్న సేవలకుగాను కేంద్రం ఈ అవార్డు ఇవ్వనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ -ఆస్పత్రి విధానం అమలు అవుతోంది. ఈ-ఆస్పత్రి సేవలు.. దేశ వ్యాప్తంగా 41 చోట్ల ఈ-ఆస్పత్రి విధానం అందుబాటులో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మాత్రమే ఈ-ఆస్పత్రి విధానం అందుబాటులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరి 3న ఈ -ఆస్పత్రిని ప్రారంభించారు. ఆస్పత్రికి వచ్చే రోగులు తమ పేర్లను ముందుగా ఈ-ఆస్పత్రి విభాగంలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం రోగి సమ స్య ఏమిటి, సంబంధిత వైద్యుడు ఎవరు, రోగికి అందించవల్సిన సేవలు ఏమిటి, చికిత్స అనంతరం రోగి ఎలా ఉన్నాడు.. తదితర వివారాలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. రోగికి ఒక నెంబర్ ను కేటాయిస్తారు. ఈ నెంబర్ ద్వారా ఎక్కడినుం చి అయినా రోగి వివరాలను తెలుసుకోవచ్చును. ప్రస్తుతం జనరల్ ఆస్పత్రిలో ఈ విధానం కొనసాగుతోంది. ఈ-ఆస్పత్రి విధానానికి ముందు జనరల్ ఆస్పత్రిలో ప్రతినెల 500 నుంచి 700 వరకు రోగులు నమోదు అయ్యే వారు. ఈ-ఆస్పత్రి విధానం ప్రారంభం అయిన తరువాత అవుట్, ఇన్పేషెంట్ట్లు 1200 నుంచి 1300 వరకు నమోదు అవుతున్నారు. పలుసార్లు 1500 సంఖ్య దాటింది. 15 మంది సిబ్బంది, 20 కంప్యూటర్లతో ఒక ప్రత్యేక విభాగాన్ని ఆస్పత్రిలో ఏర్పాటు చేశారు. అత్యధికంగా గైనిక్, చిన్నపిల్లలు, ఆర్థో, జనరల్ సర్జన్, కంటి విభాగానికి సంబంధించి రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. మునుముందు ప్రతి వార్డులోను ఈ-ఆస్పత్రి విభాగం ఏర్పాటుచేసి ఇన్పేషెంట్ రోగులకు సంబంధించి ప్రతి రోజు వైద్యసేవలను ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఇందుకుగాను ఏర్పాట్లు చేస్తున్నారు. అవార్డు.. కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియాలో భాగంగా సేవలను ఆన్లైన్లో అందిస్తున్న ఆస్పత్రులను ప్రోత్సహించేందుకు డిజిటల్ ఇండియా అవార్డులను అందిస్తుంది. ఇందులో భాగంగా నిజామాబాద్ జనరల్ ఆస్పత్రి నుంచి ప్రతిపాదనలు కోరారు. ఢిల్లీలో ఆస్పత్రి అధికారులు అవార్డు అందుకునే అవకాశం ఉంది. ఇంతకు ముందే జిల్లా కేంద్రంలో జరిగిన డిజిటల్ మేళాలో ఈ ఆస్పత్రి విభాగం పనితీరుకు కేంద్ర మంత్రి అవార్డును అందించారు. -
ప్రతి భారతీయుడి దగ్గర ఉండాల్సిన 20 యాప్స్
న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఎంతో కృషిచేస్తోంది. దేశ అభివృద్థికి కీలకంగా భావిస్తోన్న ఈ-గవర్నెన్స్, ఈ - క్రాంతి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ, బ్రాండ్ బ్యాండ్ హైవేలు, మొబైల్ కనెక్టివిటీ, పబ్లిక్ ఇంటర్నెట్ యాక్సెస్ తదుపరి ఐటీ ఆధారిత రంగాలకు ఊతమివ్వడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రభుత్వం పలు యాప్స్ను కూడా ప్రవేశపెట్టింది. వీటిలో 20 ప్రభుత్వ యాప్స్ తప్పసరిగా ప్రతి ఒక్క భారతీయుడు వాడాల్సి వస్తుందని ప్రముఖ ఆంగ్ల వెబ్సైట్ గాడ్జెట్స్నౌ రిపోర్టు చేసింది. అవేమిటో ఓసారి చూద్దాం.. ఇండియన్ పోలీసు ఆన్ కాల్ యాప్ : సమీపంలో పోలీసు స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడం కోసం ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా జిల్లా కంట్రోల్రూం, ఎస్పీ ఆఫీసు నెంబర్లను కూడా అందిస్తుంది. ఈపాఠశాల యాప్ : ఎన్సీఈఆర్టీ ఈ-బుక్స్ను ఈ యాప్ ఆఫర్ చేస్తుంది. హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ, ఎన్సీఈఆర్టీ కలిసి ఈ యాప్ను రూపొందించాయి. మొబైల్ ఫోన్లోనే విద్యార్థులకు, టీచర్లకు ఈ-బుక్స్ను అందిస్తుంది. ఎంపరివాహన్ యాప్ : మీ డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీని ఇది క్రియేట్ చేస్తుంది. కారు రిజిస్ట్రేషన్ వివరాలను వెరిఫై చేసుకోవచ్చు. సెకండ్-హ్యాండ్ కారు కొనుగోలు చేద్దామనుకునే వారికి ఈ యాప్ ఆ కారు వయసు, రిజిస్ట్రేషన్ వివరాలు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. స్టార్టప్ ఇండియా : స్టార్టప్ ఎకోసిస్టమ్ను అర్థం చేసుకోవడానికి, సమాచారాన్ని పొందడానికి ఈ యాప్ను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టార్టప్ల కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలను తెలుసుకోవచ్చు. డిజిసేవక్ యాప్ : పలు ప్రభుత్వ రంగ పనులకు వాలంటీర్ సర్వీసులు అందజేయడానికి ప్రజలకు అనుమతిస్తోంది. జీఎస్టీ రేటు ఫైండర్ : ఇప్పటికీ జీఎస్టీ రేట్లు గురించి అయోమయంలో ఉన్నారా? అయితే జీఎస్టీ రేటు ఫైండర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలట. పలు ఉత్పత్తులు, సర్వీసులు వాటి సంబంధిత జీఎస్టీ రేట్లను తెలుసుకోవడం కోసం జీఎస్టీ రేటు ఫైండర్ యాప్ ఉపయోగపడుతుంది. ఉమాంగ్ యాప్ : అన్ని ప్రభుత్వ రంగ డిపార్ట్మెంట్లను, వాటి సర్వీసులను ఒకే వేదికపైకి తీసుకు రావడంతో ఈ యాప్ ఎంతో కీలకం. ఆధార్, డిజిలాకర్, పేగవర్న్మెంట్ వంటి సర్వీసులను ఇది అందజేస్తుంది. ఇంక్రిడెబుల్ ఇండియా యాప్ : ఇది ప్రభుత్వ టూరిజం యాప్. టూర్ ఆపరేటర్లు, రిజిస్ట్రేషన్ సర్వీసు ప్రొవైడర్లు వంటి వారి వివరాలను అందిస్తుంది. ఎంపాస్పోర్టు : పాస్పోర్టు అప్లికేషన్ స్టేటస్ ట్రాకింగ్, పాస్పోర్టు సేవ కేంద్ర లొకేషన్ వంటి పలు సేవలను ఈ యాప్ ఆఫర్ చేస్తుంది. ఎంఆధార్ యాప్ : ఎంఆధార్ యాప్ అనేది మరో ఉపయోగకర యాప్. ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ గుర్తింపును స్మార్ట్ఫోన్లలో తీసుకెళ్లడానికి ఈ యాప్ సహకరిస్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా ఆధార్ ప్రొఫైల్ను షేర్ చేయవచ్చు, చూసుకోవచ్చు. పోస్ట్ఇన్ఫో : పార్సిల్స్ను ట్రాక్ చేయడం, పోస్ట్ ఆఫీసు సెర్చ్, పోస్టేజ్ కాల్యుకేటర్, ఇన్సూరెన్స్ ప్రీమియం కాల్యుకేటర్, ఇంటరెస్ట్ కాల్యుకేటర్ వంటి సౌకర్యాలను ఇది ఆఫర్ చేస్తుంది. ఈ యాప్ ద్వారానే పోస్టులలో కట్టే ఇన్సూరెన్స్ పాలసీ వివరాలను తెలుసుకోవచ్చు. మైగవ్ : మంత్రిత్వ శాఖలకు, దాని సంబంధిత సంస్థలకు ఐడియాలను, కామెంట్లను, సూచనలను ఇవ్వడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. విధాన రూపకల్పనలో, ప్రొగ్రామ్ అమలులో కూడా ఈ యాప్ ద్వారా ప్రజలు పాల్గొనవచ్చు. మైస్పీడ్(ట్రాయ్) : మీ డేటా స్పీడ్ను కొలిచేందుకు, ఆ ఫలితాలను ట్రాయ్కు పంపించేందుకు ఉపయోగపడుతుంది. ఎంకవాచ్(మొబైల్ సెక్యురిటీ సొల్యుషన్స్) : మొబైల్ ఫోన్లకు చెందిన ప్రమాదాలను గుర్తించడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఇది కేవలం ఆండ్రాయిడ్ డివైజ్లకు మాత్రమే అందుబాటులో ఉంది. స్వచ్ఛ్ భారత్ అభియాన్ : మీ నగరం, దాని పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉండేందుకు ఈ యాప్ సహకరిస్తుంది. ప్రజా సమస్యలకు సంబంధించిన ఫోటోలను క్లిక్ చేసి, సంబంధిత మున్సిపల్ అథారిటీలకు పంపించవచ్చు. అన్ని అర్బన్ లోకల్ బాడీలకు, ఈ యాప్కు లింక్ ఉంటుంది. భీమ్ : యూపీఐ పేమెంట్ అడ్రస్లను, ఫోన్ నెంబర్లను, క్యూఆర్ కోడ్లను వాడుతూ నగదును పంపించడానికి, పొందడానికి యూజర్లకు ఈ యాప్ సహకరిస్తుంది. అన్ని దిగ్గజ భారతీయ బ్యాంకులు యూపీఐతో లింక్ అయి ఉన్నాయని, దీంతో ఈ లావాదేవీలు కుదురుతున్నాయి. ఐఆర్సీటీసీ : అత్యంత పాపులర్ ప్రభుత్వ యాప్లలో ఇదీ ఒకటి. రైల్వే టిక్కెట్లను ఆన్లైన్గా బుక్ చేసుకునేందుకు ఇది సహకరిస్తుంది. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్తో ఇది ఇంటిగ్రేట్ అయింది. ఆయ్కార్ సేథు : ఆదాయపు పన్ను విభాగానికి చెందిన పలు సర్వీసులను అందజేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఆన్లైన్లోనే పన్నులు చెల్లించడం, ఆన్లైన్ పాన్ దరఖాస్తు చేసుకోవడం, పన్ను కాల్యుకేటర్కు ఇది ఎంతో సహకరిస్తుంది. కిసాన్ సువిధ యాప్ : వాతావరణ అప్డేట్లు, పంటల మార్కెట్ ధరలు తెలుసుకోవడం కోసం వ్యవసాయదారులకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. -
డిజిటల్ ఇండియా ఎక్కడా?
మనం పదే పదే వల్లెవేసే డిజిటల్ ఇండియాలో ప్రతి నలుగురిలో ఒక్కరు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నట్టు తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 2017 లో అతి తక్కువ మంది వయోజనులు ఇంటర్నెట్ వినియోగంలో భారత్దే ప్రథమ స్థానమని ప్యూ(పీడబ్ల్యూ) పరిశోధనా సంస్థ తాజా అధ్యయనం స్పష్టం చేసింది. అత్యధికంగా 96 శాతం మంది మేజర్లు ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న దేశంగా దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో ఉన్నట్టు 37 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వే వెల్లడించింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు కలిగి ఉన్న మేజర్లు 2013 లో12 శాతం ఉంటే, 2017లో పదిశాతం పెరిగి 22 శాతానికి చేరింది. సామాజిక మాధ్యమాలను ఉపయోగిస్తున్న వారి సంఖ్య 8 శాతం నుంచి గత యేడాది 12 శాతానికి పెరిగి ప్రస్తుతం 20 శాతానికి చేరింది. దీనర్థం మన దేశంలో 78 శాతం మంది మేజర్లు స్మార్ట్ఫోన్లు కలిగిలేరు. 80 శాతం మందికి ఫేస్బుక్, ట్విట్టర్ గురించి అవగాహన లేదు. అభివృద్ధి చెందుతోన్న, చెందిన దేశాలకూ మధ్య ఇంటర్నెట్ వాడకంలో ఉన్న వ్యత్యాసం కొంత తగ్గినప్పటికీ, ప్రపంచంలో ఇంటర్నెట్ వినియోగించని ప్రాంతాలు ఇంకా అనేకం ఉన్నట్టు అధ్యయనం స్పష్టం చేస్తోంది. -
డిజిటల్తో దళారులకు బ్రేకులు
న్యూఢిల్లీ: ‘డిజిటల్ ఇండియా’ దళారులు, మధ్యవర్తులకు వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమమని... ఇది నల్లధనాన్ని, బ్లాక్ మార్కెటింగ్ను నియంత్రించడంతోపాటు చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సాయపడిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా చర్యలతో లబ్ధి పొందిన పలువురితో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన సంభాషించారు. దేశీయతకు చిహ్నమైన రూపే కార్డును డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగించుకోవాలని దేశ ప్రజల్ని కోరారు. జనానికి నేరుగా సేవలు... ‘‘డబ్బుల్ని దిండ్ల కింద పెట్టుకునే వారున్న ఈ దేశంలో... దళారులు లేకుండా రేషన్ పొందలేని ఈ దేశంలో... డిజిటల్ చెల్లింపుల గురించి చెప్పినప్పుడు నన్ను ఎగతాళి చేశారు. కానీ, దీనివల్ల సేవలు నేరుగా అందుతున్నాయని లబ్ధిదారులు చెప్పడమే విమర్శకులకు గట్టి సమాధానం. రేషన్ కోసం ఇప్పుడు దళారులు అవసరం లేదు. ప్రజలు తాము కష్టపడిన దానికి ప్రతిఫలాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలోనే పొందుతున్నారు. గ్రామాల్లోని పేద రైతులు డీజిటల్ చెల్లింపుల బాట పడుతుండటంతో దళారులు వదంతులను వ్యాప్తి చేస్తున్నారు. డిజిటల్ లావాదేవీలు సురక్షితం కాదని అబద్ధాలు చెబుతున్నారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు నేరుగా డబ్బులు పంపుతుండటంతో వారి వ్యాపారం తగ్గింది’’ అని ప్రధాని వివరించారు. డిజిటల్ ఇండియాతో దళారులకు కమీషన్ కరువైందన్నారు. నల్లధనానికి, బ్లాక్ మార్కెట్కు (అక్రమమార్గంలోకి మళ్లించడం), మధ్యవర్తులకు డిజిటల్ ఇండియా అడ్డుకట్ట వేసిందని చెప్పారాయన. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ కర్తవ్యంగా పేర్కొన్నారు. దేశీ కార్డులను వాడండి ‘‘ప్రభుత్వం తెచ్చిన చెల్లింపుల యాప్ భీమ్ ద్వారా 2017–18 సంవత్సరంలో 10,983 కోట్ల విలువైన 91.5 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2016–17లో భీమ్ ద్వారా జరిగిన లావాదేవీల విలువ రూ.695 కోట్లే’’ అని వివరించారు. భీమ్ ద్వారా చెల్లించేందుకు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా వర్తకులను, దుకాణదారులపై వినియోగదారులు ఒత్తిడి తేవాలని కోరారు. దేశీయంగా రూపొందించిన రూపే క్రెడిట్/ డెబిట్ కార్డులను వినియోగించాలని లేదంటే ప్రాసెసింగ్ ఫీజులు విదేశీ కంపెనీలకు వెళతాయని చెప్పారాయన. దేశంలో 50 కోట్ల రూపే కార్డులు ఉన్నాయంటూ... ఈ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలు రూ.2,347 కోట్లకు పెరిగాయన్నారు. దేశ భక్తి గురించి మాట్లాడేవారు రూపే కార్డును వినియోగించడం వల్ల కూడా దేశానికి ఒక విధంగా సేవ చేయవచ్చని సూచించారు. వెనుకబడిన వర్గాల పురోగతి డిజిటల్ సాక్షరత అభియాన్ కింద 1.25 కోట్ల మందికి శిక్షణ ఇచ్చామని, వీరిలో 70 శాతం షెడ్యూల్డ్ కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన తరగతులవారే ఉన్నారని మోదీ చెప్పారు. ఇన్నాళ్లూ వెనుకబడి ఉన్న ఓ పెద్ద సమూహం డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల పురోగతి చెందుతున్నట్టు తెలుస్తోందన్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీతో భారీగా ఉద్యోగాలు ‘‘ప్రభుత్వ ప్రోత్సాహంతో దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 23 ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతో 2014లో మొబైల్ హ్యాండ్సెట్లు, వాటి కాంపోనెంట్ల తయారీ కేంద్రాలు 2 మాత్రమే ఉండగా, అవిప్పుడు 120కి పెరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 4.5 లక్షల మందికి ఉపాధినిస్తున్నాయి’’ అని వివరించారు. రూ.550 కోట్లతో చేపట్టిన బీపీవో ప్రోత్సాహ పథకం వల్ల 2 లక్షల ఉద్యోగాలు సమకూరాయన్నారు. దేశవ్యాప్తంగా మూడు లక్షలకు పైగా ఉన్న కామన్ సర్వీస్ సెంటర్లు డిజిటల్ సేవలందించే ప్రాథమిక కేంద్రాలుగా పనిచేస్తున్నట్టు తెలిపారు. -
ఈవీఎంలపై నమ్మకం పోయింది
సాక్షి, చెన్నై: స్టార్ హీరో విశాల్ మరోసారి పొలిటికల్ కామెంట్లు చేశారు. విశాల్ తాజా చిత్రం ఇరుంబు తిరై(తెలుగులో అభిమన్యుడు) సక్సెస్ మీట్ గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఈవీఎంలు కీలకంగా మారాయి. నాకు మాత్రం ఈవీఎంలపై నమ్మకం పోయింది. బ్యాలెట్ పేపర్ పైనే నాకు పూర్తి విశ్వాసం ఉంది. సంస్కరణల పేరిట డిజిటల్ ఇండియా, ఆధార్ అంటూ ప్రభుత్వం హడావుడి చేసింది. కానీ, వాటిపై ప్రజల్లో అభద్రతా భావం నెలకొంది. చివరకు సుప్రీం కోర్టు కూడా వాటి విశ్వసనీయతపై అనుమానం వ్యక్తం చేస్తోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు’ అని విశాల్ అన్నారు. వివాహంపై... సామాజిక అంశాలనే ఇరుంబు తిరైలో చూపించామన్న ఆయన, చిత్రం సక్సెస్ పట్ల ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక వివాహంపై విశాల్ మరోసారి ప్రకటన చేశారు. ‘జనవరిలో ఓ తమిళ అమ్మాయిని వివాహం చేసుకుంటా. నడిగర్ సంఘం కళ్యాణ మండపంలో మొదటి వివాహం నాదే’ అని చెప్పారు. కాగా, కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్కుమార్తో విశాల్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. -
డిజిటల్ ఇండియా మరోకోణం
తమిళసినిమా: డిజిటల్ ఇండియా మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇరుంబుతిరై చిత్రం ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు పీఎస్. మిత్రన్ పేర్కొన్నారు. విశాల్ కథానాయకుడిగా నటించి తన విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన చిత్రం ఇరుంబుతిరై. నటి సమంత నాయకిగా నటించిన ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సుమన్, రోబోశంకర్ ముఖ్య పాత్రలను పోషించిన ఈ చిత్ర నిర్మాణంలో లైకా సంస్థ భాగస్వామ్యం పంచుకుంది. ఇందులో విశాల్ ఆర్మీ అధికారిగా నటించగా, నటి సమంత ఆర్మీ సైకియాలజిస్ట్గా నటించారు. ఇరుంబుతిరై శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర సగ భాగాన్ని బుధవారం పత్రికల వారికి చిత్ర యూనిట్ స్థానిక సత్యం థియేటర్లో ప్రదర్శించారు. ఇలా చిత్ర సగ భాగాన్ని ప్రదర్శించడం అన్నది కొత్త విధానం అవుతుంది. అనంతరం చిత్ర దర్శకుడు పీఎస్. మిత్రన్ మాట్లాడుతూ ఎప్పుడు కొత్తగా ఆలోచించే నటుడు విశాల్ తన ఏదో ఒక చిత్ర సగభాగాన్ని విడుదలకు ముందు పత్రికల వారికి ప్రదర్శించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని భావించారన్నారు. ఇప్పుడు ఇరుంబుతిరై చిత్ర సగభాగా న్ని ప్రదర్శించడానికి అదే కారణం అని పేర్కొన్నారు. చిత్ర రెండవ భాగం జనరంజకంగానే ఉంటుందన్నారు. ఆధార్ కార్డు వల్ల కలిగే ముప్పు గురించి ఈ చిత్రం ఉంటుందనే ప్రచారం జరుగుతోందని, నిజా నికి డిజిటల్ ఇండియా మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా ఇరుంబుతిరై చిత్రం ఉంటుందని చెప్పారు. చిత్ర సగభాగాన్ని ముందుగా పత్రికల వారికి ప్రదర్శించడంలో తమ కెలాంటి భయం లేదని, ఒక కొత్త ప్రక్రియకు నాంది పలకాలన్నదే దీని ముఖ్యోద్దేశం అని అన్నారు. ఈ సమావేశంలో లైకా సంస్థకు చెందిన కరుణ, ఆయుబ్ఖాన్, ఎడిటర్ రూపన్ పాల్గొన్నారు. -
కరెన్సీ కొరత
దేశాన్ని డిజిటల్ బాట పట్టించి నగదురహిత ఆర్థిక వ్యవస్థను సాకారం చేస్తామని చెప్పిన పాలకుల లక్ష్యం కాస్తా దారి తప్పి ఎటో పోయింది. పెద్ద నోట్ల రద్దు ప్రహ సనానికి ముందు కళాకాంతులతో చల్లని లోగిళ్లుగా వెలిగిన ఏటీఎంలు ఆ తర్వాత షట్టర్లు దించుకుని... డబ్బు లేదని చెప్పే కాగితాలు, అట్టలు అతికించుకుని దీన వదనాలతో దర్శనమివ్వడం మొదలైంది. కాస్త ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ఎప్పటికప్పుడు జనం సహనంతో ఎదురుచూస్తుంటే ఉన్నకొద్దీ పరిస్థితి మరింత దిగజారుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెలు ఒకే తీరుగా నగదు కొరతతో ఇబ్బం దులెదుర్కొంటున్నాయి. పది పన్నెండు రాష్ట్రాల్లో అన్ని బ్యాంకుల ఏటీఎంలు ఖాళీ డబ్బాలుగా మిగిలిపోయాయి. అటు కేంద్ర ప్రభుత్వమూ, రిజర్వ్ బ్యాంకు అక్క డక్కడ కొన్ని సమస్యలు మినహా అంతా బాగానే ఉన్నదని ఇస్తున్న వివరణలు అంద రినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. దేశంలోని 2.2 లక్షల కోట్ల ఏటీఎంలలో దాదాపు 80 శాతం ఇంచక్కా పనిచేస్తున్నాయని కేంద్రం నమ్మబలుకుతోంది. ఆ నోటితోనే ఒకటి రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుందని హామీ ఇస్తోంది. కానీ ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం దేశంలో రూ. 70,000 కోట్ల మేర కొరత ఉంది. ఈ నెల మొదటి నుంచి ఇంతవరకూ ఏటీఎంలలో ఉంచే డబ్బును ప్రభుత్వ రంగ బ్యాంకులు 30 శాతం మేర తగ్గించేశాయని ఏటీఎం పరిశ్రమల సమాఖ్య చెబుతోంది. దేశంలో ప్రతి నెలా ఏటీఎంల నుంచి ఖాతాదార్లు సగటున రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ. 2.4 లక్షల కోట్ల వరకూ విత్డ్రా చేసుకుంటారని అంచనా. అంత మొత్తం ఏటీఎంలలో ఉండేలా చూసుకోవడంలో బ్యాంకులెందుకు విఫల మయ్యాయి? నిజానికిది హఠాత్తుగా వచ్చిపడిన సమస్య కాదు. పెద్ద నోట్ల రద్దు తర్వాత మొదలైన ఈ సమస్య కొద్దో గొప్పో తేడాతో నిరంతరం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా మూడు నాలుగు నెలల నుంచి మరింత ఉగ్రరూపం దాల్చింది. మీడి యాలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ తరచు దీనిపై కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. అయినా కేంద్రంగానీ, రిజర్వ్బ్యాంక్ గానీ సకాలంలో మేల్కొనలేదు. కరెన్సీ కొరత తాత్కాలికమేనంటూ వివరణనిచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ చాలినంత కరెన్సీ చలామణిలో ఉన్నదని చెబుతున్నారు. చలామణి అంటే నగదు లావాదేవీలు జరగడం. బ్యాంకులకు డబ్బు వస్తూ పోతూ ఉండటం. ఎక్కడో ఒక చోట అది ఆగిపోయినప్పుడు కొరత మొదలవుతుంది. కరెన్సీ కష్టాలకు ఒక్కొ క్కరు ఒక్కో రకమైన కారణం చెబుతున్నారు. పంటల కొనుగోళ్ల సీజన్ కారణమని ఒక రంటే, రాష్ట్రాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కారణమని మరికొందరు, మొత్తం డబ్బు బ్యాంకులో పెట్టుకోవడం కన్నా దగ్గరుంచుకుంటే మంచిదని జనం అనుకోవడం వల్లే ఈ స్థితి తలెత్తిందని ఇంకొందరు భాష్యం చెబుతున్నారు. ఇలా అంటున్నవారంతా సామాన్యులు కాదు. అందులో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్య దర్శి, ఎస్బీఐ చైర్మన్ వగైరాలున్నారు. కానీ పంటల సీజన్, సంక్షేమ పథకాలు వంటివి ఇంతకు ముందూ ఉన్నాయి. ఇప్పుడే అవి కరెన్సీ కొరతకు కారణమెలా అయ్యాయి? కొత్తగా ఖాతాలు తెరిచేవారినుంచి డెబిట్ కార్డుకోసమని రూ. 130 నుంచి రూ. 300 వరకూ వసూలు చేస్తున్న సంగతి బ్యాంకులకు గుర్తుందో లేదో తెలియదు. పైగా ఖాతాలో తగినంత మొత్తంలో డబ్బులేదని తెలియక ఏటీఎం దగ్గరకెళ్లి కార్డు ఉపయోగించిన వారికి దాదాపు రూ. 25 వడ్డిస్తున్నాయి. అలాగే పరిమితికి మించి లావాదేవీలు నడిపినా, అసలు లావాదేవీలే జరపకపోయినా బ్యాంకులు సర్చార్జీల మోత మోగిస్తున్నాయి. వేరే బ్యాంకుల ఏటీఎంల దగ్గర డ్రా చేసుకోవడానికి పరిమి తులు పెట్టి అవి మించితే వడ్డిస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఖాతాదారుల నుంచి ఏటా వేల కోట్లు రాబట్టుకుంటున్న బ్యాంకులు తమ ఏటీఎంలు ఖాళీగా ఉంచినం దుకూ, ఖాతాదార్లకు అవసరం పడిన సమయంలో డబ్బు అందించలేకపోయినం దుకూ పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయా? పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు 40 శాతం ఏటీఎంలు ఎప్పుడూ ఖాళీగానే దర్శనమిస్తున్నాయని గణాం కాలు చెబుతున్నాయి. ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం డబ్బు రాల్చనప్పుడు తప్పని సరై మరో బ్యాంకు ఏటీఎంకు ఎవరైనా పరుగెడతారు. అలాంటివారందరిపైనా చార్జీలు విధించడం వ్యాపారమవుతుందా, నిలువుదోపిడీ అవుతుందా? అసలు తాము డబ్బు దాచుకుంటున్న బ్యాంకు సమయానికి మొహం చాటేసిందన్న అభి ప్రాయం ఖాతాదారుల్లో ఒకసారంటూ ఏర్పడితే... బ్యాంకింగ్ వ్యవస్థపై ఒకసారి నమ్మకం కోల్పోతే వాటి పర్యవసానాలెలా ఉంటాయో రిజర్వ్Sబ్యాంకుకు తెలిసే ఉండాలి. అయినా మూడు నాలుగు నెలలుగా ఏర్పడ్డ కరెన్సీ కొరతను అది గుడ్లప్ప గించి చూస్తూ ఉండిపోయింది. బ్యాంకింగ్ రంగం అంటే డబ్బుతో వ్యాపారం చేయడం. ఖాతాదార్లు జమచేసే సొమ్ముతో అధిక వడ్డీలకు అప్పులిచ్చి లాభపడటం వాటి ప్రధాన వ్యాపకం. అలా అప్పులిచ్చే ముందు తీసుకుంటున్నవారు తీర్చగలరో లేదో చూడాల్సి ఉంటుంది. ఆ స్తోమత ఉన్నదని గుర్తించాక తగినంత మేర స్థిరాస్తులను కుదువ పెట్టుకుని డబ్బు విడుదల చేస్తాయి. కానీ పబ్లిక్ రంగం, ప్రైవేటు రంగం అనే తేడా లేకుండా దేశంలోని ప్రధాన బ్యాంకులన్నీ ఈ కార్యకలాపాలను సక్రమంగా నిర్వర్తించడంలో విఫలమవుతున్నాయి. బ్యాంకుల ఈ చేతగానితనాన్ని ఆసరా చేసుకుని విజయ్ మాల్యా, నీరవ్మోదీ లాంటివారు వేల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టి విదే శాలకు పరారవుతున్నారు. దానికితోడు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఎఫ్ఆర్ డీఐ బిల్లు చట్టమైతే బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ముకు భద్రత ఉండదన్న భయం సామాన్య పౌరుల్లో ఏర్పడింది. తమపై ఏర్పడ్డ ఈ అవిశ్వాసాన్ని తొలగించేందుకు బ్యాంకులు చేసిందేమీ లేదు. సమస్య ఏర్పడినప్పుడు అందుకు గల కారణాలేమిటో పౌరులకు చెప్పాల్సిన బాధ్యత రిజర్వ్బ్యాంకుకు, కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందుకు బదులు అంతా సవ్యంగానే ఉన్నదని దబాయిస్తే నమ్మడానికెవరూ సిద్ధంగా లేరు. -
గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్ వైఫై
సాక్షి, హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని గ్రామీణ రైల్వేస్టేషన్లలోనూ హైస్పీడ్ వైఫై వ్యవస్థ ఏర్పాటవుతోంది. ఏ1, ఏ, బీ తరహా పెద్ద రైల్వేస్టేషన్లలో ఇప్పటికే గూగుల్ సహాయంతో హైస్పీడ్ వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా రైల్వే అనుబంధ సంస్థ రైల్టెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గ్రామీణ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవలే 45 గ్రామీణ స్టేషన్లలో హైస్పీడ్ వైఫై వ్యవస్థ ఏర్పాటు పూర్తయింది. సాధారణంగా ఇలాంటి వైఫైలను తొలి అరగంటో, గంటనో ఉచితంగా అందజేసి.. తర్వాత చార్జీ వసూలు చేసే పద్ధతి అమల్లో ఉంది. కానీ గ్రామీణ స్టేషన్లలో రైల్టెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వైఫైని మాత్రం పూర్తి ఉచితంగా వినియోగించుకునే అవకాశం ఉందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ప్రతి గంటకోసారి లాగిన్ అవుతూ వినియోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. డిజిటల్ ఇండియాలో భాగంగా.. ప్రధాని మోదీ డిజిటల్ ఇండియాపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాలను అందులో భాగస్వామ్యం చేసిన నేపథ్యంలో రైల్వే శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆ శాఖ మంత్రి పీయూష్గోయల్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) పేరుతే ప్రత్యేక నిధి ఏర్పాటు చేశారు. దాని కింద ఉచిత వైఫైని అందుబాటులోకి తేవాలని.. తొలుత ఏ1, ఏ, బీ కేటగిరీ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఏ1 స్టేషన్లుగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, విజయవాడ, తిరుపతిలలో.. ఏ కేటగిరీలో 31 స్టేషన్లలో గూగుల్ సంస్థ సహాయంతో ఉచిత వైఫై ఏర్పాటు చేశారు. ఇక బీ కేటగిరీలో 38 స్టేషన్లు ఉండగా.. ప్రస్తుతానికి కామారెడ్డి, నిడదవోలు స్టేషన్లలో ఏర్పాటు చేశారు. ఏడాది చివరినాటికి మిగతా చోట్ల కూడా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో గ్రామీణ స్టేషన్లపై దృష్టి సారించారు. రైల్టెల్ కార్పొరేషన్ ఇందుకు అవసరమైన సాంకేతికతను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. సాంకేతిక ఏర్పాట్లు పూర్తయిన కొద్దీ ఆయా స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి తెస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఏడు డీ కేటగిరీ స్టేషన్లు, 35 ఈ కేటగిరీ స్టేషన్లు, మూడు ఎఫ్ కేటగిరీ స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులోకి వచ్చింది. ఇందులో సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో 2, హైదరాబాద్ డివిజన్ పరిధిలో 19, విజయవాడ డివిజన్ పరిధిలో 20, గుంటూరు డివిజన్ పరిధిలో 4 స్టేషన్లు ఉన్నాయి. -
టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలకు భారత్ చిరునామా
-
ప్రజలే సారథులు
సాక్షి, హైదరాబాద్ : ‘‘డిజిటల్ విధానాల్లో ప్రజలకు సేవలందించేందుకు ప్రారంభించిన ప్రయాణమే డిజిటల్ ఇండియా. ప్రజల భాగస్వామ్యంతో మూడున్నరేళ్లలో మేం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. డిజిటల్ ఇండియా ఇక కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. ప్రజల జీవన విధానం. దీన్ని ప్రజలే ముందుండి నడుపుతున్నారు’’అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఆవిష్కరణలకు మన దేశం చిరునామాగా మారిందని పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు భౌగోళిక దూరాలు ఇక ఏమాత్రం అవాంతరం కాదన్నారు. కొత్త ఆవిష్కరణలతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పారు. వరల్డ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ అలయెన్స్ (డబ్ల్యూఐటీఎస్ఏ), నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్(నాస్కామ్), రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్లో సోమవారం ప్రపంచ ఐటీ కాంగ్రెస్ ప్రారంభమైంది. ఈ సదస్సును ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి కీలకోపన్యాసం చేశారు. దేశంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రారంభించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. రూ.57 వేల కోట్లు ఆదా చేశాం టెక్నాలజీకి ప్రపంచంలోనే భారత్ అత్యంత అనుకూల దేశమని, ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా ఇప్పటికే దేశంలో లక్షకు పైగా గ్రామాలు ఇంటర్నెట్ సదుపాయం కలిగి ఉన్నాయని ప్రధాని చెప్పారు. ‘‘దేశంలో 121 కోట్ల మొబైల్ ఫోన్లున్నాయి. 50 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 120 కోట్ల మందికి ఆధార్ కార్డు ఉంది. పేదలకు జారీ చేసిన జన్ధన్ బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్లను ఆధార్తో అనుసంధానించడం ద్వారా సంక్షేమ పథకాల్లో రూ.57 వేల కోట్ల నిధులు ఆదా అయ్యాయి. దేశవ్యాప్తంగా 172 ఆస్పత్రుల్లో 2.2 కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి. స్కాలర్షిప్ల కోసం 1.4 కోట్ల మంది విద్యార్థులు జాతీయ ఉపకార వేతనాల వెబ్ పోర్టల్లో వివరాలు నమోదు చేసుకున్నారు. రైతులకు సరైన మద్దతు ధర అందించేందుకు ప్రవేశపెట్టిన ఈ–నామ్ వెబ్సైట్లో 66 లక్షల మంది రైతులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. భీమ్ యాప్తో గత జనవరిలో రూ.15 వేల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. ఇటీవల తెచ్చిన ‘ఉమంగ్’యాప్ ద్వారా 185 ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చాం. దేశంలో 2.8 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు ఎన్నో డిజిటల్ సేవలందిస్తున్నాయి. వీటి ద్వారా 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అందులో లక్షల మంది మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తలున్నారు’’అని ప్రధాని వివరించారు. మొబైల్ పరిశ్రమలు 2 నుంచి 118కి.. 2014 నాటికి దేశంలో కేవలం రెండు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి పరిశ్రమలే ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్యను 118కు పెంచామని, అందులో కొన్ని ప్రపంచ ప్రఖ్యాత బ్రాండ్ల కంపెనీలు ఉన్నాయని ప్రధాని చెప్పారు. కృత్రిమ మేధోశక్తి (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రంగంలో పరిశోధనల కోసం ముంబై వర్సిటీలో వాద్వానీ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థను ఆదివారమే ప్రారంభించిన సంగతిని గుర్తుచేశారు. ఇటీవల దుబాయ్లో జరిగిన వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కు వెళ్లిన సందర్భంగా సరికొత్త ఆలోచనలు, ఆవిష్కరణలకు అక్కడ ఏర్పాటు చేసిన ‘మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్’ను సందర్శించానని చెప్పారు. ఈ సదస్సుకు వచ్చిన వారిలో కొత్త పరిజ్ఞాన ఆవిష్కర్తలెందరో ఉన్నారంటూ వారికి అభినందనలు తెలిపారు. మానవజాతి ఉజ్వల భవిష్యత్ కోసం వీరంతా కృషి చేస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ వంటకాలను ఆస్వాదించండి ‘‘నేను హైదరాబాద్లో ఉండాల్సి ఉంది. అయినా ఆనందంగానే ఉంది. సుదూర ప్రాంతం నుంచి మీ ముందు ప్రసంగించే అవకాశాన్ని సాంకేతిక పరిజ్ఞానం కల్పించింది’’అని ప్రధాని పేర్కొన్నారు. హైదరాబాద్ ఘన చరిత్ర తెలుసుకోవడంతోపాటు అక్కడి రుచికరమైన వంటకాలను ఆస్వాదించాలని సదస్సుకు తరలి వచ్చిన విదేశీ ప్రతినిధులకు సూచించారు. భారతదేశం పురాతన, వైవిధ్య, ఘన చరిత్ర, సంస్కృతికి నిలయమైనప్పటికీ ఏకత్వమనే నినాదంతో పురోగమిస్తోందన్నారు. వసుధైక కుటుంబం భావన భారతీయ తత్వంలో లోతుగా పాతుకుపోయిందన్నారు. ఐటీలో ఈ ఎనిమిదే కీలకం ప్రస్తుతం ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, రొబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డాటా అనాలిటిక్స్, 3డీ ప్రింటింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సోషల్ అండ్ మొబైల్ అనే ఎనిమిది రకాల అంశాలు కీలకంగా మారాయని ప్రధాని చెప్పారు. తన సూచన మేరకు నాస్కామ్ ఈ జాబితాను తయారు చేసిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీటిపై శిక్షణ కోసం నాస్కామ్ రూపొందించిన ‘స్కిల్స్ ఆఫ్ ఫ్యూచర్’కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాత టెక్నాలజీని వెనక్కి నెట్టి కొత్త సాంకేతికతను సదస్సులో చర్చనీయాంశంగా తీసుకోవడాన్ని ప్రధాని స్వాగతించారు. నూతన టెక్నాలజీ దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రస్తుతమున్న సిబ్బందికి ‘రీ స్కిల్లింగ్’కల్పించే అంశంపై దృష్టి సారించామన్నారు. ఈ సదస్సులో ప్రసంగించేందుకు ఆహ్వానం పొందిన యంత్ర మనిషి (హ్యూమనాయిడ్ రోబో) సోఫియా.. టెక్నాలజీ శక్తి సామర్థ్యాలకు అద్దం పడుతోందన్నారు. ఇంటెలిజెంట్ ఆటోమేషన్తో ఉద్యోగాల స్వరూపంలో వస్తున్న మార్పులపై దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. -
‘రూ. 57 వేల కోట్లు ఆదా చేశాం’
సాక్షి, న్యూఢిల్లీ : డిజిటల్ ఇండియా దిశగా వర్ధమాన భారత్ ప్రయాణిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా జరుగుతున్న వరల్డ్ ఐటీ కాంగ్రెస్ను న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భారత్లో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ జరగడం ఇదే ప్రథమమని చెప్పారు. ఈ సదస్సును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. సదస్సుకు వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు భారత్, హైదరాబాద్ ఆహ్వానం పలుకుతోందన్నారు. డిజిటల్ సాంకేతికత ఆవిర్భావానికి భారత్ ప్రధాన కేంద్రమని మోదీ చెప్పారు. డిజిటల్ ఇండియా లక్ష్యంగా దేశంలోని లక్ష గ్రామాలను ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో అనుసంధానించామని ఆయన వెల్లడించారు. డిజిటల్ ఇండియా దిశగా కొనసాగుతోన్న మా ప్రయాణం.. కేవలం ప్రభుత్వంతోనే సాధ్యమయ్యే పని కాదన్నారు. ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమన్నారు. 32 కోట్ల జన్ధన్ ఖాతాల ద్వారా రూ. 57 వేల కోట్లను ప్రభుత్వం ఆదా చేసిందని గుర్తు చేశారు. 470 వ్యవసాయ మార్కెట్లను ఈ-నామ్కు అనుసంధానించామని తెలిపారు. దేశంలో 60 మిలియన్ల మందిని డిజిటల్ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి చాలా నిధులు మిగులుతున్నాయని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. -
నరేంద్ర మోదీ స్మార్ట్ సిటీలివిగో!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి రాగానే ‘మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా’ అంటూ వినిపించిన అభివృద్ధి నినాదాలు ప్రజలను ఎంతగా ఆకర్షించాయో దేశంలోని వంద నగరాలను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన ‘స్మార్ట్ సిటీ’లుగా మారుస్తానన్న హామీ కూడా అంతకంటే ఎక్కువే ఆకర్షించింది. మరి మోదీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయిన సందర్భంగా ఆయన స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానన్న నగరాలు ఇప్పుడు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ట్విటర్ పారడీ అకౌంట్ ‘ఎట్ద రేట్ ఆఫ్ హిస్టరీపిక్ ’ మంగళవారం నాడు ట్విటర్ యూజర్ల అభిప్రాయాన్ని కోరగా, దాదాపు రెండువేల మంది తమదైన శైలిలో ట్వీట్లు చేశారు. ఎక్కువ మంది ఫొటోలు, చిత్రాలతో స్పందించారు. కొందరు సింగపూర్, స్విట్జర్లాండ్, హాంకాంగ్ తరహాలో భారత నగరాలు అభివృద్ధి చెందినట్లు ఆర్కిటెక్చర్ డిజైన్లను పంపించగా, మరొకరు బుల్లెట్ రైలు ఇదిగో అంటూ లారీపైకి రైలు డబ్బా ఎక్కించిన ఫొటోషాప్ ఇమేజ్ని పంపించారు. భారత్ సిలికాన్ సిటీగా పేరుపడ్డ బెంగళూరు నగరం పకోడాపూర్గా మారిందని సూచిస్తూ ఇంకొకరు గ్రాఫిక్ డిజైన్ను పంపించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ ఇలా మారిందంటూ మరొకరు డిస్నీఐలాండ్ ఇంపోజ్డ్ చిత్రాన్ని పంపించారు. నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ గుజరాత్గా అభివర్ణిస్తూ ఒంటెకు రెందు రాకెట్ బూస్టర్లను అమర్చుకొని, దానిపై రాకెట్లా దూసుకుపోతున్న ఓ వ్యక్తి ఫొటోను పోస్ట్ చేశారు. ఇక నాగపూర్లోని ఆరెస్సెస్ కార్యాలయం అమెరికాలోని వైట్హౌజ్గా మారిందంటూ వైట్హౌజ్ భవనం ఫొటేనే పొస్ట్ చేశారు. వర్షాలకు కొట్టుకుపోయే భారతీయ రోడ్లను చూసి కోపం వచ్చిందేమో నీళ్లతో గుంతలు పడిన రోడ్డులో రవాణా ట్రక్కు కూరుకుపోయిన ద్యశ్యం ఫొటోను పంపించారు. ప్రయాణికులకు 24 గంటలపాటు తాగునీరు అందిస్తూ, ట్రక్కులకు ప్రత్యేక పార్కింగ్ వసతి కల్పిస్తున్న మధ్యప్రదేశ్లోని స్మార్ట్ సిటీ అంటూ ఒకరు పోస్టింగ్ పంపించారు. గోవాలోని పాంజిం నగరంలో అతి పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటూ జలమయమైన ఓ రహదారి ఫొటోను మరొకరు పోస్ట్ చేశారు. ట్విటర్లో అందరు వ్యంగ్యంగానే స్పందించారు. అందరి బాధ ఒకటే అధికారంలోకి వచ్చిన కొత్తలోనే వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు ఒక్క నగరాన్నైనా సంపూర్ణ స్మార్ట్ సిటీగా మార్చలేకపోయిందన్నదే! -
ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్లోనే..!
సాక్షి, విశాఖపట్నం: రోడ్డు రవాణా శాఖ (ఆర్టీఏ) ఇక అన్ని సేవలను ఆన్లైన్ ద్వారానే అందించనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా ఇకపై గ్రామస్థాయిలోనూ డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. కొన్నాళ్ల నుంచి మీసేవ కేంద్రాల ద్వారా పూర్తిస్థాయి ఆర్టీఏ సేవలు పొందడానికి సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా వినియోగదార్లు ఇబ్బందులు పడుతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఓన్డ్ కామన్ సర్వీస్ సెంటర్ (సీఎస్సీ)లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. సీఎస్సీలు ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మీ–సేవ కేంద్రాల ద్వారా రవాణా శాఖ అందించాలనుకున్న సేవలను ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కొత్తగా అత్యాధునిక పరిజ్ఞానంతో అందుబాటులోకి వచ్చిన సీఎస్సీలను ఇందుకోసం వినియోగించనుంది. ఉత్తరాంధ్రతో పాటు పొరుగున ఉన్న తూర్పు గోదావరి జిల్లాతో వెరసి 2500 వరకు సీఎస్సీలు నడుస్తున్నాయి. విశాఖ జిల్లాలో 970, శ్రీకాకుళం 469, విజయనగరం 450, తూర్పు గోదావరి జిల్లాలో 611 సీఎస్సీలున్నాయి. ప్రస్తుతం ఈ సెంటర్ల ద్వారా పాన్కార్డులు, ఓటరు కార్డులు, డిజిటల్ బ్యాంకింగ్, టెలికాం బిల్లుల చెల్లింపు, వివిధ సర్టిఫికెట్లు పొందడం వంటి సేవలను వినియోగించుకుంటున్నారు. తాజాగా వాటి జాబితాలోకి ఆర్టీఏ సేవలను కూడా చేర్చారు. గ్రామస్థాయిలో ఉన్న వీటి ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్టీఏ సేవలు చేరువవుతాయి. ఇవి అందుబాటులోకి వస్తే డ్రైవింగ్ లైసెన్సులకు స్లాట్ల బుకింగ్, లెర్నింగ్ (ఎల్ఎల్ఆర్)/డ్రైవింగ్ లైసెన్స్లు పొందడం, రెన్యూవల్ (నవీకరణ) చేయించుకోవడం, వాహనాల ఓనర్షిప్ల బదిలీలు, చిరునామా మార్పు, డూప్లికేట్లకు దరఖాస్తు చేసుకోవడం వంటి వాటి కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం రాదు. అందుబాటులో ఉన్న సీఎస్సీల ద్వారానే ఈ ఆర్టీఏ సేవలను తేలికగా పొందవచ్చు. ఇన్నాళ్లూ వీటి కోసం విశాఖ ఏజెన్సీలోని దూరప్రాంతాల నుంచి అనకాపల్లి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చేవారు. వారు ఆ కార్యాలయానికి చేరుకునే సరికి సమయం (మధ్యాహ్నం రెండు గంటలు) మించిపోయేది. దీంతో మళ్లీ మర్నాడో, మరో రోజో రావలసి వచ్చేది. ఇకపై సీఎస్సీలకే ఆర్టీఏ సేవలను అనుసంధానం చేయడం వల్ల వారికి సమీపంలోని కేంద్రాలకు వెళ్లి ఆర్టీఏ సేవలు పొందడానికి వీలవుతుంది. అంతేకాదు.. ఆర్టీఏ కేంద్రాల్లో ఉదయం 10.30 నుంచి మధ్నాహ్నం రెండు గంటల వరకే సేవలు పొందడానికి అనుమతిస్తారు. అదే సీఎస్సీల్లో అయితే ఉదయం నుంచి సాయంత్రం ఆరు, ఏడు గంటల వరకు, సెలవు రోజుల్లోనూ తెరిచే ఉంచుతారు. వీటి నిర్వహణపై సంబంధిత సీఎస్సీ ఆపరేటర్లకు విశాఖ నగరంలోనూ, జిల్లాలోని అనకాపల్లిల్లోనూ శిక్షణ ఇస్తున్నట్టు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ వెంకటేశ్వరరావు ‘సాక్షి’కి చెప్పారు. మార్చి నెల నుంచి సీఎస్సీల ద్వారా ఆన్లైన్లో ఆర్టీఏ సేవలు పూర్తిస్థాయిలో వినియోగంలోకి రానున్నాయి. -
మీట నొక్కు..పింఛన్ పట్టు
ఖమ్మం, వైరా: విశ్రాంత ఉద్యోగులు పింఛన్ పొందాలంటే ఇక సులభ ప్రక్రియ అందుబాటులోకి వస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కలల ప్రాజెక్ట్ డిజిటల్ ఇండియాలో భాగంగా..కేంద్ర ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పెన్షనర్లు ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో జీవించి ఉన్నట్లు ధ్రవీకరణపత్రం (లైవ్ సర్టిఫికెట్) ఖజానా కార్యాలయాలు, బ్యాంకుల్లో విధిగా అందజేయాలి. వీటి కోసం వృద్ధులు ప్రతీ సంవత్సరం నానా కష్టాలు పడుతుంటారు. 10–15 రోజుల పాటు గెజిటెడ్ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. పెన్షనర్ల బాధలను తొలగించాలనే సదుద్దేశంతో నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బయోమెట్రిక్ ద్వారా జీవన ధ్రువీకరణ పత్రం పొందే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. జీవన్ ప్రమాణ్ అనే పోర్టల్ ద్వారా ధ్రువీకరణ పత్రాలు అందజేసే అవకాశమొచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర, సత్తుపల్లి, వైరా, నేలకొండపల్లి, ఇల్లెందు, భద్రాచలం, మణుగూరు, అశ్వారావుపేట పరిధిలో 12,500 మంది పైగా పెన్షన్షర్లు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఇతర రంగాల్లో విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు దాదాపు 45వేల మందికి పైగా ఉన్నారు. వీరందికీ కొత్తగా కల్పించిన అవకాశం వల్ల ఇక ‘మేం జీవించి ఉన్నాం’ అని ప్రతిసారీ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడకుండా..బయోమెట్రిక్ యంత్రంపై మీటనొక్కితే చాలు. ఇక ఆగకుండా పెన్షన్ అందుతుంది. నమోదు ప్రక్రియ ఇలా.. www.jeevanpramaan.gov.in అనే వెబ్సైట్లో జీవన్ ప్రమాణ్కు సంబంధించిన పూర్తి వివరాలు లభ్యమవుతాయి. సెల్ఫోన్ నంబర్, ఆధార్కార్డు సంఖ్య ఆధారంగా సమగ్ర వివరాలతో పేరు నమోదు చేసుకుంటే బయోమెట్రిక్ విధానం ద్వారా డిజిటల్ ధ్రువీకరణ పత్రం జారీ అవుతుంది. ఖాజానా, బ్యాంకు అధికారులు ఈ వెబ్సైట్ ద్వారా సంబంధిత పెన్షనర్ల లైఫ్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వెబ్సైట్లోకి వెళ్లి ఆధార్ సంఖ్య పెన్షన్ పేమేంట్ ఆర్డర్ బ్యాంకు ఖాతా సంఖ్య, ఫోన్నంబర్ వివరాలు పొందుపర్చాలి. ఆధార్లోని వేలిముద్రలు వైబ్సైట్లో తాజాగా నమోదు చేసే వేలిముద్రలు సరిపోతే పెన్షన్దారులకు రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు. సెల్ఫోన్కు సంక్షిప్త సందేశం అందుతుంది. ఆ తర్వాత జీవన్ ప్రమాణ్ ప్రత్యేక గుర్తింపు సంఖ్య వస్తుంది. ఈ సంఖ్యలో ప్రత్యేక డిజిట్ «ధ్రువీకరణపత్రం జారీ అవుతంది. ఒక్కసారి జీవన్ ప్రమాణ్ డిజిటల్ ధ్రువీకరణ పత్రం జారీ అయితే..ఆ తర్వాత జీవన్ప్రమాణ్ పోర్టల్లో వేలిముద్రలు వేస్తే సరిపోతుంది. ప్రతి ఏటా కార్యాలయాలు, అధికారల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఉండదు. ఈ విషయాలు కీలకం.. సంబంధిత సైట్లోకి వెళ్లాక..హోమ్, ఎబౌట్, సెండ్యువర్ ఆధార్, గెట్ ఏ సర్టిఫికెట్ అనే వివరాలు కనిపిస్తాయి. ఎబౌట్ సైట్లో జీవన్ ప్రమాణ్ ధ్రువీకరణ పత్రం నమోదుకు సంబంధించిన వివరాలు పూర్తిగా పొందుపరిచారు. గెట్ ఏ సర్టిఫికెట్ సైట్లో పీసీల ద్వారా, ఆండ్రాయిడ్ సెల్ఫోన్ ద్వారా జీవనప్రమాణ్ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది. తద్వారా పెన్షనర్లు ఇక ఏటా నవంబర్ నెల నుంచి వేలిముద్రలు వేసే అవకాశం లభిస్తుంది. -
వారికి భారీగా డిమాండ్, జీతం రూ.4 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్ డిజిటల్ దిశగా పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. కానీ వారు మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ముఖ్యంగా నాయకత్వ స్థానాల్లో వీరి కొరత ఎక్కువగా ఉందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. గత ఏడాదిగా ఇండియా ఇంక్లో సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్కు బాగా కొరత ఏర్పడిందని, దీంతో ఈ బాధ్యతలు నిర్వర్తించే వారికి 25-35 శాతం ఎక్కువగా వేతనాలు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపాయి. వీటిలో టాప్ రోల్స్కు వార్షిక వేతనం రూ.2 కోట్లకు పైన ఉంటుందని, వేరియబుల్స్ వంటి వాటిని మొత్తం కలుపుకుని, కొన్ని సందర్భాల్లో వీరి వేతనాలు రూ.4 కోట్ల వరకు ఉంటున్నాయని తెలిసింది. గతేడాది నవంబర్ 8న ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో, డిజిటల్ లావాదేవీలు పెరిగి సైబర్ సెక్యురిటీ టాలెంట్కు భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కంపెనీలు కూడా సైబర్ అటాక్స్తో బెంబేలెత్తుతున్నాయి. దీంతో సైబర్ ప్రొఫిషెనల్స్ నియామకాలపై ఎక్కువగా దృష్టిసారించాయి. తమ క్లయింట్ల బోర్డుల్లో చాలామంది సైబర్ సెక్యురిటీ కోసం కమిటీలను ఏర్పాటుచేస్తున్నట్టు సెర్చ్ సంస్థలు హంట్ పార్టనర్స్, ట్రాన్సెర్చ్ పేర్కొన్నాయి. 18 నెలల క్రితం వరకు కూడా సైబర్ సెక్యురిటీ నిపుణులు సమస్యల్లో ఉన్న ఐటీ సర్వీసులను మాత్రమే చూసుకునే వారని, కానీ ప్రస్తుతం వీరు కంపెనీల్లో బోర్డుల్లో స్థానం సంపాదించడమే కాకుండా.. మొత్తం వ్యాపారాలు వారిపై ఆధారపడేలా చేసుకున్నారని కేపీఎంజీ సైబర్ సెక్యురిటీ లీడ్, పార్టనర్ అతుల్ గుప్తా చెప్పారు. నాయకత్వ స్థానాల్లో సైబర్ సెక్యురిటీ ప్రొఫిషెనల్స్కు డిమాండ్ బాగా ఉందని, అదేవిధంగా తక్కువ స్థాయిలో కూడా వీరికి ప్రాధాన్యం ఉందని కార్న్ ఫెర్రి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ నవ్నీత్ సింగ్ తెలిపారు. సైబర్ సెక్యురిటీ అధినేతలకు వార్షిక వేతనం రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ఉందని గుప్తా చెప్పారు. ముఖ్యంగా కన్సల్టింగ్ సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, రిటైల్, బీఎఫ్ఎస్ఐ కంపెనీలు, ఐటీ కంపెనీల్లో వీరికి డిమాండ్ బాగా ఉందని పేర్కొన్నారు. -
'మెర్శల్'లో రాజకీయ డైలాగ్లు.. దుమారం!
సాక్షి, చెన్నై: 'ఇళయదళపతి' విజయ్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా 'మెర్శల్'ను వివాదాలు విడిచిపెట్టడం లేదు. ఇప్పటికే బెంగళూరులోని ఈ సినిమా థియేటర్లపై దాడులు జరిగాయి. తెలుగులో విడుదలకావాల్సి ఉన్నా.. వివాదాల కారణంగా రిలీజ్ కాలేదు. తమిళనాడు అంతటా విడుదలై.. భారీ వసూళ్లు రాబడుతున్న ఈ సినిమాను మరో వివాదం చుట్టుముట్టింది. సినిమాలో విజయ్ పలు రాజకీయ డైలాగ్లు పేల్చడం కలకలం రేపుతోంది. ముఖ్యంగా వస్తుసేవల పన్ను (జీఎస్టీ), డిజిటల్ చెల్లింపులపై విజయ్ పేల్చిన డైలాగులు బీజేపీని అసంతృప్తికి గురిచేశాయి. సినిమా నుంచి ఈ డైలాగులు వెంటనే తొలగించాలని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు తమిళిసాయి సౌందర్రాజన్ డిమాండ్ చేశారు. విజయ్ రాజకీయ లక్ష్యాలు ఉండటంతోనే ఆయన సినిమాలో ఈ డైలాగులు పేల్చారని విమర్శించారు. 'మెర్సల్ సినిమాలోని పలు డైలాగులు అభ్యంతరకరంగా ఉన్నాయి. జీఎస్టీ, డిజిటల్ ఇండియాను కించపరిచేలా ఉన్న డైలాగులను వెంటనే సినిమా నుంచి తొలగించాలి' అని ఆమె అన్నారు. -
95 మొబైల్ కంపెనీలొచ్చాయ్..!
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా ప్లాన్ లో 95 మొబైల్ కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభించాయని ఐటీ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. భారతదేశం ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ తయారీలో పెద్ద కేంద్రంగా మారిందన్నారు. అలాగే దేశంలో 6 కోట్ల కుటుంబాలను డిజిటల్-అక్షరాస్యతలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. 95 మొబైల్ తయారీ కర్మాగారాలు ఇండియాలోకి వచ్చాయనీ, వీటిలో 32 యూనిట్లు నోయిడా, గ్రేటర్ నోయిడాలలో ఏర్పాటయ్యాయని రవిశంకర్ ప్రసాద్చెప్పారు. కాపిటల్ ఫౌండేషన్ వార్షిక ఉపన్యాసంలో మంత్రి ఈ వివరాలు అందించారు. ప్రతి రోజు 3-4స్టార్టప్కంపెనీలను వస్తున్నాయన్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు వదులుకున్న ఐఐటీయన్లు దేశానికి తిరిగి వచ్చి ఈ కంపెనీలను ప్రారంభించారని తెలిపారు. అలాగే అమెరికరన్ సిలికాన్ వ్యాలీలో 51శాతం ఐటి-ఆధారిత నూతన ఆవిష్కరణలు జరుగుతోంటే వాటిలో 14శాతం భారతీయ నిపులే సృష్టిస్తున్నారని. అలా ఇండియా పురోగతిని సాధిస్తోందన్నారు. న్యాయ శాఖా మంత్రికూడా అయిన రవిశంకర్ ప్రసాద్ డిజిటల్ విధానాన్ని అనుసరిస్తున్న సుప్రీంకోర్టును ప్రశంసించారు.దీనికి సంబంధించి డిజిటల్ గ్రిడ్ను సృష్టించామనీ, ఇందులో ఆరుకోట్ల ఆర్డర్లు, తీర్పులు, దాదాపు 4 కోట్ల పెండింగ్ కేసుల వివరాలు కూడా పొందుపరిచామని తెలిపారు. దీంతో ప్రజలు ఒక్క క్లిక్ ద్వారా ఈ వివరాలను, అప్డేట్స్ను పొందవచ్చని వివరించారు. -
డిజిటల్ ఇండియా మాకెందుకు
సాక్షి, లక్నో : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్షాలను కేసులతో భయపెట్టాలని చూస్తోందని ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా సంకుచితంగా ఆలోచిస్తున్నారని అన్నారు. తనకు అడ్డొస్తారనుకున్న ప్రతి పక్షనేతలపై తప్పుడు కేసులను బీజేపీ ప్రభుత్వం బనాయిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. తప్పుడు వాగ్దానాలతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ‘మాకు డిజిటల్ ఇండియా అవసరం లేదు.. యువత కోసం, రైతుల కోసం ఇండియా కావాల’ని చెప్పారు. దేశాన్ని మతం పేరుతో బీజేపీ చీల్చే కుట్ర చేస్తోందని అన్నారు. -
ఇక డిజిటల్.. మున్సిపల్
► ఒకే చోట అన్ని పౌరసేవలు ► ఆన్లైన్ ద్వారానే బల్దియా పనులు ► నిర్మల్లో పేపర్లెస్ ఈ–ఆఫీస్ ► ఈనెల 4నుంచి ప్రారంభానికి ఏర్పాట్లు నిర్మల్రూరల్: ఏ కార్యక్రమానికి వెళ్లినా.. ఏ దేశంలో మాట్లాడినా.. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిజిటల్ ఇండియా గురించే చెబుతున్నారు. ప్రజలకు వేగవంతమైన సేవలను అందించేందుకు అన్ని కార్యాలయాలు, పనులు ఆన్లైన్ ద్వారానే జరగాలని, ఇందుకు ఈ–ఆఫీసులుగా మారాలని పేర్కొంటున్నారు. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఈ–ఆఫీసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెబుతూనే ఉన్నారు. ఈక్రమంలో నిర్మల్ మున్సిపల్ డిజిటల్ వైపు అడుగులు వేసేందుకు సిద్ధమైంది. బల్దియాకు సంబంధించిన పౌరసేవలన్నింటినీ ఒకేచోట ఆన్లైన్ విధానం ద్వారా అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సత్వర సేవలు.. బల్దియా అందించే పదుల సంఖ్యలో సేవలను ఒకే చోట అందించే ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. మున్సిపల్లో చాలా సమస్యలు రోజులు, నెలల తరబడి పెండింగ్లో ఉన్న సందర్భాలుంటాయి. చాలామంది బల్దియా చుట్టూ తిరిగి వేసారిపోయిన వాళ్లూ ఉంటారు. ఇక ఇలాంటి సమస్యలకూ పౌర సేవాకేంద్రం పరిష్కారం అందించనుంది. ఈ కేంద్రం ద్వారా మున్సిపల్కు సంబంధించిన అన్నిసేవలూ సత్వరమే పొందవచ్చు. ప్రజలు పెట్టుకున్న దరఖాస్తుకు సంబంధించిన రసీదులను సిబ్బంది ఇస్తారు. పని ఎప్పుడు పూర్తవుతుందో.. తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెండింగ్ ఫైళ్లు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు సిబ్బంది క్లియర్ చేసేందుకూ ఈ సేవా కేంద్రం ఉపయోగపడనుంది. ప్రారంభానికి సిద్ధంగా.. నిర్మల్ మున్సిపల్లోకి అడుగుపెట్టగానే మొదటి గదిలో సిటిజన్ సర్వీస్ సెంటర్ (పౌర సేవాకేంద్రం)ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ గదిని సర్వాంగ సుందరంగా రంగులు, హంగులతో ముస్తాబు చేశారు. ఇక్కడ అందించే సేవలకు సంబంధించిన ఫ్లెక్సీ బోర్డులనూ ఏర్పాటు చేశారు. మున్సిపల్కు సంబంధించి 14రకాల సేవలను అందించనున్నట్లు ఫ్లెక్సీలనూ ఏర్పాటు చేశారు. ఇటీవల కంప్యూటర్ సిస్టంలను పెట్టి పరీక్షించారు. గతంలో ఈ గదిలో కొనసాగిన నల్లా బిల్లుల కలెక్షన్ కౌంటర్ను లోపలి గదిలోకి మార్చారు. మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేశ్ చక్రవర్తి, కమిషనర్ త్రియంబకేశ్వర్రావు ప్రత్యేక దృష్టి పెట్టి పౌరసేవా కేంద్రం ఏర్పాట్లు పూర్తి చేయించారు. పేపర్లెస్ ఈ–ఆఫీస్గా.. దరఖాస్తులు, రసీదులు, వినతిపత్రాలు.. ఇలా అన్నింటికీ పేపర్ అవసరమే. వీటితో కార్యాలయాలు నిండిపోతున్నాయి. ఫైళ్లకు ఫైళ్లు జమ అవుతున్నాయి. ఏళ్లుగా వీటిని కాపాడలేక ఆఫీ స్ సిబ్బందీ ఇబ్బంది పడుతున్నారు. కొన్నిచోట్ల ఫైళ్లు చెదలు పడుతున్నాయి. పౌర సేవాకేంద్రం ప్రారంభమైతే ఇలాంటి సమస్యలూ ఉండవు. ఆన్లైన్ విధానంలో ప్రారంభించే ఈ కేంద్రం ఈ–ఆఫీస్గా సేవలందించనుందని అధికారులు పేర్కొన్నారు. పేపర్లెస్ ఈ–ఆఫీస్గా మున్సిపల్ను చేయనున్నట్లు చైర్మన్ గణేశ్ చక్రవర్తి, కమిషన్ త్రియంబకేశ్వర్రావు చెప్పారు. ఇందుకు ప్రజలూ సహకరించాలని కోరారు. సెక్షన్లు తిరగాల్సిన పనిలేకుండా.. ‘సార్ బర్త్ సర్టిఫికెట్ ఎక్కడిస్తరు.. పింఛన్లకు యాడ దరఖాస్తు చేసుకోవాలె.. ఇల్లు కట్టాలంటే ఓళ్ల పర్మిషిన్ దీస్కోవాలా సార్..’ ఇలా నిత్యం ఎంతోమంది మున్సిపల్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. పట్టణాల్లో ఎన్నో రకాల పనులను తీర్చే గుండెకాయ మున్సిపల్. దాదాపు అన్నిరకాల పనులనూ చేసేది బల్దియానే. ప్రతీరోజు ఏదో ఒక పనిపై వందలమంది మున్సిపల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. అందులో చాలామందికి ఏ పని.. ఏ సెక్షన్లో చేస్తారో తెలియదు. అక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలో అవగాహన ఉండదు. దీంతో వాళ్లను వీళ్లను అడగాల్సి వస్తుంది. ఇలాంటి కష్టాలకు ఇక చెక్ పడనుంది. సెక్షన్ల చుట్టూ తిరగాల్సిన అవసరమూ ఉండదు. మున్సిపల్ చేసే అన్ని సేవలనూ ఒకే గదిలోకి చేరుస్తున్నారు. పౌరసేవా కేంద్రం పేరిట ఏర్పాటు చేసిన ఈ గదిలో ఆన్లైన్ ద్వారా వేగవంతంగా సేవలను అందించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం నిర్మల్ పట్టణ ప్రజలకు మున్సిపల్ తరఫున సత్వర, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ ఉన్నతాధికారులు సూచిస్తున్న పథకాలను బల్దియాలో వేగవంతంగా అమలు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మరిన్ని సేవలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తాం. – అప్పాల గణేశ్ చక్రవర్తి, మున్సిపల్ చైర్మన్, నిర్మల్ ప్రారంభానికి సిద్ధం మున్సిపల్ కార్యాలయంలో ఈ–ఆఫీస్ ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తిచేశాం. వీలైతే అవతరణ దినోత్సవం రోజున లేదంటే ఈనెల 4న పౌరసే వా కేంద్రాన్ని ప్రారంభిస్తాం. పురపాలక సేవలన్నీ సిటీజన్ సర్వీస్ సెంటర్లోనే పొందవచ్చు. కాగిత రహిత సేవలను సత్వరమే అందించేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నాం. – త్రియంబకేశ్వర్రావు, మున్సిపల్ కమిషనర్, నిర్మల్ -
పెట్టుబడులకు ఆకర్షణీయ దేశంగా భారత్
మూడేళ్లలో అనేక సంస్కరణలు ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరగాలి భారత్–టర్కీ వ్యాపార దిగ్గజాల సదస్సులో ప్రధాని మోదీ న్యూఢిల్లీ: అత్యంత వేగంగా ఎదుగుతున్న భారత్ ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ దేశంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇన్వెస్ట్మెంట్స్కు భారత్ గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత ఆశావహంగా ఉందన్నారు. ఆర్థిక వ్యవస్థను, పాలనా విధానాలను సంస్కరించేందుకు గత మూడేళ్లలో తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని భారత్–టర్కీ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మోదీ తెలిపారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా పేర్లతో పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ‘ప్రస్తుతం భారత ఎకానమీ ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతోంది. ఈ వేగాన్ని కొనసాగించడంతో పాటు వ్యవస్థలో లోపాలను సరిదిద్దడంపైనా దృష్టి సారిస్తున్నాం‘ అని ఆయన వివరించారు. నవభారత నిర్మాణం కొనసాగుతోందని,విధానాలు.. ప్రక్రియలు మొదలైనవాటిని సంస్కరించడం ద్వారా వ్యాపారాల నిర్వహణకు అనుకూల పరిస్థితులు కల్పించేందుకు కృషి చేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్లో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా టర్కీ వ్యాపార దిగ్గజాలను ఆయన ఆహ్వానించారు. -
సీవీఆర్లో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్
హైదరాబాద్: కేంద్ర మానవ వనరుల శాఖ, యూజీసీ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి సంయుక్తంగా నిర్వహించే స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ 2017 జాతీయ స్థాయి ప్రోగ్రామింగ్ సదస్సుకు నగరంలోని సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల వేదిక కానుంది. కేంద్రం స్టార్ట్ అప్ ఇండియా- స్టాండ్ అప్ ఇండియా అనే నినాదంతో చేపట్టిన మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా లో విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఈ సామూహిక సదస్సును ఏప్రిల్ 1,2 వ తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీనికి దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి, కళాశాల సౌకర్యాల ఆధారంగా నోడల్ సెంటర్లును ఎంపిక చేశారు. తెలంగాణ నుంచి సీవీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఎంపికయింది. ఈ సదస్సులో ఒక్కో సెంటర్ నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖలకు తలెత్తిన సమస్యలను విద్యార్థులు తమ సాంకేతిక పరిజా్ఞనంతో పరిష్కారాన్ని అందించనున్నారు. జాతీయ దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రోగ్రామింగ్ సమస్యలను పరిష్కరించే సెంటర్గా సీవీఆర్ ఎంపికయింది. దేశ వ్యాప్తంగా వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొని ప్రోగ్రామింగ్ రూపొందించనున్నారు. ఈ సాఫ్ట్వేర్ దివ్యాంగులకు ఉపయోగపడే సాంకేతిక పరికరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం దివ్యాంగులకు మంజూరు చేసే ఉపకార వేతనాలు అర్హులకు అందే విధంగా ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ప్రారంభిస్తారు. ఏప్రిల్ 1 నుంచి 2 సాయంత్రం 8 గంటల వరకు ఈ కార్యక్రమం కోనసాగుతుంది. కార్యక్రమ అనంతరం విజేతలకు నగదు బహుమతులు అందజేశాస్తారు. దేశాభివృద్ధిలో భాగస్వాములను చేసే సదస్సుకు తమ సంస్థ వేదిక కావడం సంతోషంగా ఉందని సీవీఆర్ యాజమాన్యం తెలిపింది. -
పీఓఎస్ పరికరాలపై పన్నుల్లేవ్
న్యూఢిల్లీ: డిజిటల్ ఇండియా విధానంలో భాగంగా దేశంలో ఈ–చెల్లింపులను మరింతగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కీలక చర్య చేపట్టింది. నగదు రహిత లావాదేవీల ప్రక్రియలో ఉపయోగించే పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) పరికరాలపై అన్ని రకాల డ్యూటీలు తొలగించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. పీఓఎస్ పరికరాలైన కార్డు రీడర్లు, ఎంపీఓఎస్ మైక్రో ఏటీఎంలు (1.5.1 వెర్షన్ ), వేలిముద్ర రీడర్లు, స్కానర్లు, ఐరిస్ స్కానర్లపై బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ), ఎక్సైజ్ డ్యూటీ, కౌంటర్వెయిలింగ్ డ్యూటీ (సీవీడీ), స్పెషల్ అడిషనల్ డ్యూటీ (ఎస్ఏడీ) నుంచి మినహాయింపు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అలాగే ఈ పరికరాల స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు ఆయా పరికరాల్లో ఉపయోగించే విడిభాగాలకూ పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం.. కేంద్రం నిర్ణయాన్ని ఎల్సినా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా స్వాగతించింది. ఈ చర్య డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తుందని పేర్కొంది. అయితే పన్ను మినహాయింపును తక్షణ అవసరాలను తీర్చుకునేందుకే పరిమితం చేయాలని సూచించింది. పన్ను మినహాయింపును దీర్ఘకాలం కొనసాగించడం వల్ల విదేశీ మార్కెట్ల నుంచి పీఓఎస్ పరికరాలు భారీ స్థాయిలో ముంచెత్తవచ్చని ఎల్సినా సెక్రటరీ రాజూ గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. పన్ను మినహాయింపును పూర్తి ఆర్థిక సంవత్సరంపాటు ఇవ్వకూడదని సూచించారు. -
‘డిజిటల్ ఇండియా ఢిల్లీలో ఏమైంది?’
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్రమోదీ ఏ వేదికపై ఉన్నా కూడా భారతదేశం శరవేగంతో ముందుకెళుతోందని, డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో అడుగులేస్తుందని చెప్తున్నారు. ముఖ్యంగా నోట్ల రద్దు కార్యక్రమం తర్వాత డిజిటలైజేషన్ పదం మాత్రం తెగ వినిపిస్తోంది. అయితే, ఇదంతా కూడా ఇంకా మాటల స్టేజీలోనే ఉందని అమల్లోకి రావడంలేదని నోట్ల రద్దు తర్వాత వస్తున్న తొలి రిపబ్లిక్ డే సాక్షిగా తెలిసింది. అవును గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్పథ్లో పెద్ద మొత్తంలో గ్రాండ్ పరేడ్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనిని వీక్షించేందుకు ఏర్పాటుచేసిన టిక్కెట్లను ఆన్లైన్లో పొందే వీలు లేకుండా పోయింది. మొత్తం ఏడు చోట్ల కౌంటర్లు ఏర్పాటుచేసి అక్కడి నుంచి టికెట్లు విక్రయిస్తున్నారు. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్కోసం టిక్కెట్ల వ్యవహారం మొత్తం డిజిటలైజేషన్ చేస్తామని చెప్పినప్పటికీ అది పూర్తి కాలేదు. అయితే, డెబిట్, క్రెడిట్లతో ఈ టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశం మాత్రం ఏర్పడింది. -
నేటి నుంచి ఈ–గవర్నెన్స్ సదస్సు
సీఎంతో సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు విశాఖపట్నం : 20వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు సోమ, మంగళ వారాల్లో విశాఖలో జరగనుంది. డిజిటల్ ఇండియాలో భాగంగా నోవొటెల్ వేదికగా జరగనున్న ఈ సదస్సుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, అశోక్గజపతిరాజు, డాక్టర్ జితేంద్ర సింగ్, పీపీ చౌదరి, సుజనాచౌదరిలతో పాటు ఎంపీలు టి.సుబ్బరామిరెడ్డి, కె.హరిబాబు, కేంద్రానికి చెందిన వివిధ శాఖల కార్యదర్శులు విజయానంద్, సి.విశ్వనా«థ్, అరుణ సుందరరాజన్, జేఎస్ దీపక్, ఉషాశర్మ తదితరులు పాల్గొంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ఐటీ మంత్రులు, ఐటీ కార్యదర్శులతో పాటు 1200 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని అంచనా. ఇప్పటి వరకు కేవలం 450 మంది మాత్రమే రి జిస్ట్రర్ చేసుకున్నట్టు సమాచారం. రాష్ట్రానికి ఈ సదస్సు నిర్వహణ వల్ల పెద్దగా ఎలాంటి ప్రయోజనం ఒనగూరే అవకాశాలు లేకున్నప్పటికీ రూ.2.50 కోట్లకు పైగా ఖర్చు చేస్తోంది. మొత్తం 5 ప్లీనరీ సెషన్స్ తొలి రోజు మూడు ప్లీనరీ సెషన్స్, రెండో రోజు రెండు ప్లీనరీ సెషన్స్ జరగనున్నాయి. తొలి రోజు వరుసగా ఐఓటీ అండ్ డాటా ఎనలిటిక్స్, సైబర్ సెక్యురిటీ పాలసీ ఫర్ ది ఫ్యూచర్, డిజిటల్ కనెక్టివిటీ టూ ద లాస్ట్ మెయిల్ అనే అంశాలపై సెషన్స్ ఉంటాయి. రెండో రోజు టెక్నాలజీ లెడ్ మోనటరీ ట్రాన్జ్క్షన్స్ లీడింగ్ టు ఫైనాన్షియల్ ఇన్క్లూషన్, ఏపీ లీడింగ్ ఇండస్ట్రీ 4.0 అనే అంశాలపై చర్చించనున్నారు. 10వ తేదీ మధ్యాహ్నం 12.45 గంటలకు బహుమతుల ప్రదానోత్సవం, ముగింపు వేడుకలు జరుగుతాయి. ఈగవర్నెన్స్ జాతీయ సదస్సు ఏర్పాట్లను ఐటీ కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్కుమార్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎగ్జిబిషన్ ఏర్పాట్లను పరిశీలించారు. -
మీ సేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు
నగదు రహిత లావాదేవీలపై శిక్షణ కార్యక్రమంలో జేసీ గిరీషా చిత్తూరు (కలెక్టరేట్): మీసేవా కేంద్రాల్లో బ్యాంకింగ్ సేవలు నిర్వహించాలని జిల్లా జారుుంట్ కలెక్టర్ పీఎస్ గిరీషా తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని డీఆర్డీఏ కార్యాలయ సమావేశ భవనంలో జిల్లాలోని మీ సేవా ఆపరేటర్లకు నగదు రహిత లావాదేవీలు, బ్యాంకింగ్ సేవలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జేసీ ప్రారంభించారు. లో భాగంగా కామన్ సర్వీస్ సెంటరు ద్వారా రాష్ట్రంలోనే ప్రయోగాత్మకంగా మన జిల్లాలో మీసేవా కేంద్రాల ద్వారా నగదు రహిత, బ్యాంకింగ్ సేవలు చేపట్టనున్నామన్నారు. మీసేవా కేంద్రాలకు వివిధ పనుల నిమిత్తం విచ్చేసే ప్రజల నుంచి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. అదేగాక సామాజిక పింఛనుదారులకు పింఛను మొత్తాలను బయోమెట్రిక్ విధానంతో వారి బ్యాంకు ఖాతాలోని నగదును ట్రాన్సఫర్ చేసుకుని, పింఛను మొత్తాలను అందించే ప్రక్రియను కూడా చేపట్టాలన్నారు. బ్యాంకుల్లో ఖాతాదారులకు కూడా మీసేవా కేంద్రాల్లో నగదును అందించాలన్నారు. ఇందుకోసం ప్రతి మీసేవా కేంద్రంలో ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసుకుని నగదు లావాదేవీలను నడపాలన్నారు. ప్రస్తుతం అర్బన్ ప్రాంతాల్లో ఈ-పాస్ మిషన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. దీనిని వందశాతం మేరకు పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇందుకోసం మీ సేవా ఆపరేటర్లు ఈ-పాస్ యంత్రాలు, మొబైల్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యాప్, మెబైల్ వాలెట్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు ఏవిధంగా జరపాలనే విషయాలను ఈ శిక్షణ ద్వారా పూర్తి స్థారుులో అవగాహన పొందాలన్నారు. ప్రస్తుతం వస్తున్న టెక్నాలజీలోని మార్పులను ఆపరేటర్లు పూర్తిస్థారుులో అవగాహన పెంచుకుని, ప్రజాసేవ చేయాలని డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్డీయం రామ్మోహన్, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
ఆ పథకాలు విజయవంతమైతే భారతే సూపర్పవర్: ప్రణబ్
చండీగఢ్: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘క్లీన్ ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ వంటి పథకాలు విజయవంతమైతే భారతదేశం ప్రపంచంలోనే ఆధునిక ఆర్థిక శక్తిగా మారుతుందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఆదివారం ఇక్కడ జరిగిన సీఐఐ ఆగ్రో-టెక్ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగించారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యువెన్ రివ్లిన్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘‘ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాల్లోనూ కేంద్ర ప్రభుత్వం పలు కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రత్యేకించి మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి సరికొత్త పథకాలను చేపట్టింది. వీటిని కనుక విజయవంతంగా అమలు చేసినట్లరుుతే భారతదేశం ప్రపంచంలోనే ఒక సుసంపన్నమైన, శక్తివంతమైన, ఆధునిక ఆర్థిక శక్తిగా మారడం తథ్యం’’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఆధునిక ఆర్థిక శక్తిగా మారడానికిగాను మనకున్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. -
ఆధునికతకు దూరంగా...!
విశ్లేషణ స్వచ్ఛ భారత్ సరే... నీళ్లు లేని టాయ్లెట్ మాటేమిటి, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా సంవత్సరాలపాటు చేసిన ప్రచార ఫలితమే మరుగుదొడ్లు. తేఢా ఏమిటంటే వీటికి నీటి సరఫరా ఉండదు, తగినన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండవు. ఎవరైనా ప్రకృతి పిలుపు అవసరం పడినప్పుడు తప్పకుండా దాన్ని తీర్చు కోవలసి ఉంటుంది. అందుకనే బర్హాన్ పూర్లోని కుగ్రామం పటిల్పడాలో చిత్రి స్తున్న చిత్రకారుడి కేసి చూస్తున్న పదేళ్ల అబ్బాయిని ఈ విషయమై నేను అడిగి నప్పుడు అతడు బొటన వేలును చూపి ‘అక్కడ మరుగుదొడ్డి ఉంది’ అని చెప్పాడు. ‘ఎవరింట్లో అయినా ఉందా?’అని అడిగితే.. ‘అవును, అక్కడ నీరు లేదు’ అన్నాడతను. మరుగుదొడ్డి అంటే ఏమిటి అనే విషయంలో నగర జీవిత దృక్పథాన్ని అతడు అర్థం చేసుకోవడం అద్భుతమైన విషయం. టాయ్లెట్ అంటే పరిశుభ్రంగానూ, ఉపయోగించుకోదగినది గాను ఉండటం అనే కదా అర్థం. ముంబైకి 120 కిలోమీటర్ల దూరంలో బర్హాన్పూర్ ఉంటోంది. ప్రస్తుతం పాల్ఘర్ తాలూకాలో ఉన్న ఈ గ్రామాన్ని ఇటీవలే థానే జిల్లా నుంచి వేరు చేశారు. దీంతో థానే దాదాపుగా పట్టణ ప్రాంత జిల్లాగా మారిపోయింది. పాల్ఘర్ దాదాపుగా గ్రామీణ, గిరిజన ప్రాంతం. ఇది చిన్నది, ఒక జిల్లాలో భాగం కాదు కాబట్టి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తు న్నారు. మెరుగైన కేంద్రీకరణ, సత్వర పాలనాయంత్రాంగం కోసమే దీన్ని వేరు చేశారు. అయితే నీళ్లు లేని టాయ్లెట్ మాటేమిటి, బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా సంవత్సరాలపాటు చేసిన ప్రచార ఫలి తమే మరుగుదొడ్లు. వీటికి నీటి సరఫరా ఉండదు, తగినన్ని సెప్టిక్ ట్యాంకులు కూడా ఉండవు. కానీ టాయ్లెట్లను నిర్మించడం ద్వారా, భారత్ను స్వచ్ఛంగా ఉంచడానికి జరుగుతున్న ప్రచా రానికి అనుకూలంగా గణాంకాలు రూపొందుతాయి. ఇది ఒక భ్రమాత్మక వంచనతో కూడిన కార్యక్రమం. ఇలాంటి నీళ్లులేని మరుగుదొడ్లు గ్రామాల్లోనే కాదు.. ముంబైలోని మురికివాడల్లో కూడా ఇవి ఉంటున్నాయి. దాదాపు 20 మంది కళాకారులు తమ కుంచెలతో, బొమ్మలు గీయడానికి పెట్టుకునే ఏటవాలు బల్లలతోపాటు, అనువైన ప్రదే శాలను గుర్తించి వాటిని ప్రత్యక్షంగా చిత్రించడానికి గాను పటి ల్పడాకు వచ్చినప్పుడు ఆ కుగ్రామానికి విషమ పరీక్షే మరి. అది కూడా ఈ కళాకారులు నేరుగా రంగంలో ఉండి చిత్రించడానికి వచ్చారు. నీటిరంగు పెయింటింగులో అద్భుతప్రావీణ్యం ఉన్న ముంబై కళాకారుడు అమోల్ పవార్ నిర్వహించిన ఒక వర్క్ షాపులో వీరు భాగం. తన నైపుణ్యాలను ఇతరులకు పంచిపెట్టి వారిని మెరుగుపర్చాలని ఆయన కోరిక. ఉన్నట్లుండి ఒక బస్సు నిండా కళాకారులు తమ ఊరికి వచ్చి దిగడం బర్హాన్పూర్ నివాసులకు ఆశ్చర్యకరమైంది. రెండు రోజుల పాటు, రోజుకు 5 నుంచి 6 గంటలదాకా వీరు గ్రామస్తుల భూముల్లో, ఆవరణల్లో గుమికూడి సందడి చేశారు. కానీ గ్రామ స్తులు ఆ కళాకారులకు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు. రెఫరెన్స్ ఫొటో లను తీసుకోవడానికి వారిని తమ ఇళ్లలోకి అనుమతించారు. తమ ఇంటిమెట్లపై కూర్చోనిచ్చారు. ప్రారంభ ఆసక్తి తగ్గిపోయాక, ఈ కొత్త అతిథులతో ఇబ్బంది పడకుండా గ్రామస్తులు తమ రోజు వారీ పనులకు వెళ్లేవారు. కళాకారులు తమ కుగ్రామాన్ని ఎంచు కుని మరీ వచ్చారన్న వాస్తవాన్ని వారు బోధపర్చుకున్నట్లు కనిపిం చింది. ఈ గ్రామంలో 4 వేలమంది నివసిస్తున్నారు. మన కాలనీలలోకి అలా ఎవరయినా వచ్చి ఆక్రమిస్తే అను మతించేవాళ్లమా అని మాకు మేమే ప్రశ్నించుకున్నాం. అలా ఎవ రైనా ఊడిపడితే వంద ప్రశ్నలడిగేవాళ్లం. మన గోప్యతపై వారి దాడి గురించి ఆందోళన చెంది ఉండేవాళ్లం. చివరకు పోలీసులను కూడా పిలిచేవాళ్లం. గుర్తుంచుకోండి. మనం స్పాట్లో రైల్వేస్టేష న్లను చిత్రించలేము. ఎవరైనా సరే రిఫరెన్స్ చిత్రాన్ని ఎవరూ చూడకుండా ఫొటోతీయగలరు, దీని ఆధారంగా తదుపరి పని జరుగుతుంది. కాని ఇక్కడేమిటి.. మేం పెయింటింగులు వేసు కోవడానికి వారు ఊరినే మాకు అప్పగించి వెళ్లారు. ఆశ్చర్యపర్చే రెండో విషయం ఏమిటంటే, గ్రామం ఎంత పొందికగా ఉండేదంటే నీటిరంగులో ముంచిన కుంచెను తుడవ డానికి ఉపయోగించే టిస్యూ పేపర్ని నేలమీద విసిరివేస్తే అది బాధించే పుండులాగా ఉండేది. నిస్సందేహంగా గ్రామం బుర దతో ఉండేది. కానీ ప్రతి ఇంటి ముందు నేలమీద ఉండే ధూళిని ఆవుపేడ కలిపిన నీళ్లతో అలికి మటుమాయం చేసేవారు. ఆ గ్రామంలో ప్లాస్టిక్ సంచులు కానీ, గుట్కా ప్యాకెట్లు కానీ లేవు. గ్రామం పేదదే అయినప్పటికీ పరిశుభ్రంగా ఉండటం మాలో కొందరిని ఆశ్చర్యపరిచింది. ఎలాంటి చెత్తా లేదు. ప్రతిరోజూ ఆవు పేడను ఎండిపోకముందే గ్రామస్తులు సేకరించుకునేవారు. అన్నిటికీ మించి చిన్నదే అయినప్పటికీ గ్రామ ప్రధాన రహదారి మన నగర రహదారులతో పోలిస్తే సాఫీగా ఉండేది. బర్హాన్ పూర్ మా హృదయాలను కొల్లగొట్టిందని మాత్రం చెప్పగలను. ప్రత్యేకించి డిజిటల్ ఇండియాను ముందుకు తీసుకొస్తున్న మోదీ అధికారులకు మాత్రం ఒక విషయం మనం చెప్పితీరాలి. ముంబై-అహ్మదాబాద్ హైవేకి కొన్ని కిలో మీటర్ల దూరంలో ఉన్న సెల్ఫోన్ టవర్ల నుంచి బలహీనమైన సిగ్నల్స్ వెలువడుతుం టాయి. 3జి కవరేజీ కలిగిన స్మార్ట్ ఫోన్లో కూడా ఇంటర్నెట్ పనిచేయదు. నిజానికి హైవేకి దగ్గర ఉండి కూడా మీరు ఇంటికి కాల్ చేయలేరు. గ్రామానికి అవతల ప్రపంచం గురించి ఎవరూ పట్టించుకోరు. మేం బస చేసిన స్థలంలో కనీసం టీవీ కూడా లేని విషయాన్ని ఎవరూ గుర్తించలేదు. లోకజ్ఞానం విషయంలో నాకు అమితాసక్తి కాబట్టి నేను టీవీని మిస్ కావచ్చు కానీ ఇతరులు అలా భావించినట్లు లేదు. వర్తమాన ఘటనలకు చెందిన వార్తలు వారిలో ఆసక్తి కలిగిస్తు న్నట్లు కనిపించలేదు. మీరు వేటికయినా దూరమయ్యారా అని నా తోటి కళాకారులను కొందరిని ప్రశ్నించాను. అలాంటి ప్రశ్న వేయ వచ్చా అన్నట్లుగా వారు అపనమ్మకం వ్యక్తపరిచారు. బహుశా రాత్రిపూట షోలలో వాగుడుకాయలు చిందించే చెత్తకంటే ఎక్కువ మంది ప్రజలపైనే టీవీ స్టూడియోలు దృష్టి సారిస్తూండవచ్చు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ-మెయిల్ : mvijapurkar@gmail.com -
‘స్వచ్ఛ భారత్’లో ఏపీ ముందుంది
‘స్వచ్ఛ భారత్ సమ్మేళనం’లో సీఎం చంద్రబాబు సాక్షి, న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’లో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్ని బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చగలిగినట్టు పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ‘స్వచ్ఛభారత్ సమ్మేళనం’లో పాల్గొన్న అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను చాలా తక్కువ సమయంలో బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చగలిగామని, త్వరలోనే గ్రామాల్లోనూ సాధిస్తామని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలుగా మార్చిన రాష్ట్రాలు ఏపీ, గుజరాత్ మాత్రమేనన్నారు. స్వచ్ఛ భారత్లో మొట్టమొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా సెంట్రలైజ్డ్ ఏసీ నుంచి పెద్ద శబ్దం రావడంతో సీఎం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వెంటనే భద్రతాధికారులు ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. సెంట్రలైజ్డ్ ఏసీ గ్యాస్ సిలిండర్ లీక్ కావడంతో శబ్దం వచ్చినట్లు అధికారవర్గాలు తెలిపాయి. సంస్కరణ ప్రోత్సాహకాలు.. ఇదిలా ఉండగా అమృత్ పథకం కింద పట్టణ సంస్కరణలను ప్రోత్సహిస్తున్న 20 రాష్ట్రాలకు 2015-16 సంవత్సరానికిగాను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రోత్సాహకాలు అందించారు. అందులో భాగంగా ఏపీకి రూ.13.62 కోట్లు, తెలంగాణకు రూ.10.73 కోట్లు లభించాయి. వాజ్పేయికి నేనే చెప్పా సాక్షి, అమరావతి: గతంలో బ్యాండ్ విడ్త్ (నిర్దిష్ట సమయంలో డేటా బదిలీ రేటు) వేగం సమస్య దేశంలో తీవ్రంగా ఉండేదని దాని గురించి అప్పటి ప్రధాని వాజ్పేయికి తానే చెప్పానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. దీంతో ఆయన జశ్వంత్సింగ్ అధ్యక్షునిగా, తనను ఉపాధ్యక్షుడుగా నియమించి ఒక కమిటీ వేశారని చెప్పారు. ఆ తర్వాతే టెలికమ్ కంపెనీలకు సంబంధించిన డి-రెగ్యులరైజేషన్ ప్రారంభమైందని పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఒక హోటల్లో ఇండియా టుడే, హెచ్పీ కంపెనీలు సంయుక్తంగా నిర్వహించిన డిజిటల్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. వారం రోజుల్లో 15 ఎంబీపీఎస్ స్పీడ్తో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తామని చంద్రబాబు చెప్పారు. దీంతోపాటు కేబుల్ ద్వారా అన్ లిమిటెడ్ ఛానల్స్, మూడు ఫోన్లను కేవలం రూ.149కే ఇస్తుండడం దేశంలోనే ప్రథమం అని అన్నారు. ఆరు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల నుంచి లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు సీనియర్ జర్నలిస్టు రాజ్దీప్ సర్దేశాయ్ సమన్వయకర్తగా డిజిటల్ టెక్నాలజీ వినియోగంపై చర్చా వేదిక నిర్వహించారు. -
డిజిటల్ రంగంలో వెనకబడిపోతున్న మహిళలు
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన దేశాలతోపాటు ఆర్థికంగా బలపడుతున్న భారత్ లాంటి వర్ధమాన దేశాల్లో ఆడవాళ్లు అన్ని రంగాల్లో మగవాళ్లతో పోటీ పడి దూసుకుపోతున్నారు అని భావిస్తాం. అన్ని రంగాల సంగతి పక్కన పెడితే భారత్ను ‘డిజిటల్ ఇండియా’ గా మార్చాలని కలలుగంటున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆశయం నెరవేరే ఆస్కారం కనిపించడం లేదు. డిజిటల్ రంగంలో భారతీయ మహిళలు బాగా వెనకబడిపోతున్నారని పలు అంతర్జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి. డిజిటల్ రంగంలో ఇంటర్నెట్, సోషల్ వెబ్సైట్లయిన ఫేస్బుక్, ట్విట్టర్, ఈకామర్స్ అన్ని వేదికల్లో మహిళలు వెనకబడే ఉన్నారు. ఫేస్బుక్పై నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి నలుగురు యూజర్లలో ముగ్గురు మగవాళ్లే ఉంటున్నారు. మొత్తంగా చూస్తే యూజర్లలో 76 శాతం మంది మగవాళ్లుకాగా, 24 శాతం మంది మహిళలు ఉన్నారు. నెట్ యూజర్లలో భారత్ అతి వేగంగా దూసుకుపోతోందని పలు సర్వేలు వెల్లడిస్తున్నా ఆడవాళ్లు మాత్రం తక్కువే ఉంటున్నారు. 125 కోట్ల జనాభా కలిగిన భారత్లో 46,20 కోట్ల మంది డిజిటల్ యూజర్లు ఉన్నారు. ఈ కామర్స్లో, పొలిటికల్ ట్వీట్స్లో మహిళలు మరీ వెనకబడి పోతున్నారు. ఈ రెండు రంగాల్లో సహజంగా మహిళలు వెనకబడి పోవడం వల్లనే ఇలా జరగుతోంది. మహిళలకన్నా 62 శాతం ఎక్కువ మంది మగవాళ్లు ఇంటర్నెట్ను కోరుకుంటున్నారు. మహిళలకన్నా 25 శాతం ఎక్కువ మంది మగవాళ్లు సొంతంగా సిమ్ కార్డు కలిగి ఉండాలని కోరుకుంటున్నారని గ్లోబల్ మొబైల్ అసోసియేషన్ ‘జీఎస్ఎంఏ’ తన నివేదికలో తెలిపింది. దేశంలో 29 శాతం మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్ ఉపయోగిస్తుండగా, 71 శాతం మగవాళ్లు ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారని ‘బాస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అండ్ రిటేలర్స్ అసోసియేషన్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 2020 నాటికి మహిళల సంఖ్య 40 శాతానికి పెరుగుతుందని అంచనావేయడం ఆశాజనకమైన విషయం. ఈ కామర్స్లో ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే మహిళ ఉన్నారని, మరో నాలుగేళ్లలో ఈ కామర్స్లో మహిళల శాతం 20 నుంచి 40 శాతానికి పెరుగుతుందని గూగుల్ సర్వే తెలియజేస్తోంది. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచంలో భారతీయ మహిళలు నేపాల్, భూటాన్ దేశాలకన్నా వెనకబడి ఉన్నారు. లైంగిక వేధింపులకు గురవుతామన్న భయంతో కూడా సోషల్ వెబ్సైట్లను ఆడవాళ్లు ఎక్కువగా ఉపయోగించడం లేదని తెలుస్తోంది. -
‘మైగవ్’లోకి 15 కోట్ల మంది!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మైగవ్’ ప్లాట్ఫాం ప్రజలకు ఎంతో చేరువవుతుందని, భవిష్యత్లో ఇందులో 15 కోట్ల మంది చేరే అవకాశం ఉందని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఈ వెబ్పోర్టల్ను ప్రారంభించి రెండు సంవత్సరాలు పూర్తై సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘డిజిటల్ ఇండియాలో మైగవ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ పోర్టల్ ద్వారా కేంద్ర బడ్జెట్ నుంచి నెట్ న్యూట్రాలిటీ, స్మార్ట్ సిటీస్ తదితర అన్ని అంశాలపై సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండటానికి, వారితో మమేకం అవడానికి ఇదొక ముందడుగు’ అని మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇందులో 35 లక్షల మంది చేరినట్లు తెలిపారు. మన దేశంలో మొబైల్ ఫోన్ యూజర్లు 103 కోట్ల మంది ఉన్నందున ‘మై గవ్’లో 10-15 కోట్ల మంది చేరటం పెద్ద కష్టమేమీ కాదన్నారు. సామాన్యలు సాధించిన విజయాలను ఈ పోర్టల్ ద్వారా అందరికీ తెలియజేయొచ్చని, టెక్నాలజీ సాయంతో భారత్ ముఖ చిత్రాన్ని మార్చొచ్చన్నారు. ఇదే మైగవ్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. -
ఇంటింటికీ ఇంటర్నెట్: కేటీఆర్
ఇంటింటికి ఇంటర్నెట్ ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమని తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు వర్క్షాప్లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఫైబర్ ప్రాజెక్టులో ప్రతి పౌరుడికి అవకాశం ఇవ్వాలనేది వర్క్షాప్ లక్ష్యమన్నారు. విద్య, వైద్య, ప్రభుత్వం సేవల వంటి రంగాల్లో ఈ ప్రాజక్టు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈప్రాజెక్టు ద్వారానే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ తెలంగాణ సాధ్యమన్నారు. ఈ దిశగా ప్రభుత్వ అడుగులు వేస్తోందని, అందుకు అందరూ సహకరించాలన్నారు. -
వ్యాపారాలకు టెక్నాలజీ దన్ను...
* డిజిటల్ ఇండియాలో అపార అవకాశాలు * ఐఎస్బీ కార్యక్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొంగొత్త టెక్నాలజీలు వ్యాపార స్వరూపాలను మార్చివేస్తున్న నేపథ్యంలో వ్యాపార సంస్థలు సాంకేతికతను ఆకళింపు చేసుకుని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ సూచించారు. డిజిటల్, సోషల్, మొబైల్ మాధ్యమాలు అత్యంత ప్రాచుర్యం పొందుతున్న తరుణంలో డిజిటల్ ఇండియాలో వ్యాపార అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆమె చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. మెరుగైన జీడీపీ వృద్ధి, విదేశీ మారక నిల్వలు తదితర సానుకూల అంశాలతో భారత్ కాంతిమంతంగా వెలుగొందుతోందని ఆమె పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా చందా కొచర్ ఈ విషయాలు తెలిపారు. యువ జనాభా అత్యధికంగా ఉండటం, టెక్నాలజీని త్వరితగతిన అందిపుచ్చుకోగలగడం భారత్కు లాభించే అంశాలన్నారు. టెక్నాలజీ స్టార్టప్స్ రంగంలో భారత్ అత్యంత వేగంగా మూడో స్థానానికి చేరిందని చెప్పారు. నిలకడగా రాణించడంతో పాటు మారే పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిదిద్దుకుంటూ ముందుకు సాగడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు. మరోవైపు, కేవలం మంచి మేనేజరు అనిపించుకోవడం కన్నా మంచి లీడర్లుగా పేరు తెచ్చుకోవడం ముఖ్యమని ఐఎస్బీ చైర్మన్ ఆది గోద్రెజ్ విద్యార్థులకు సూచించారు. ఇటు ఆర్థికాంశాల్లోనూ అటు మేధోపరంగానా నైతికతకు పెద్ద పీట వేయాలని ఆయన ఉద్బోధించారు. పదిహేనేళ్ల ప్రస్థానం.. దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఐఎస్బీలో చదివిన విద్యార్థుల సంఖ్య ప్రస్తుతం 7,500 మార్కును దాటిందని ఐఎస్బీ డీన్ రాజేంద్ర శ్రీవాస్తవ తెలిపారు. హైదరాబాద్ క్యాంపస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాం 2016 బ్యాచ్లో 559 మంది, పోస్ట్గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఫర్ సీనియర్ ఎగ్జిక్యూ టివ్స్ 2015 బ్యాచ్లో 57 మంది తాజాగా పట్టా పొం దారని చెప్పారు. ఈసారి రికార్డు స్థాయిలో 1,150 నియామక ఆఫర్లు రాగా వీటిలో పలు సీఎక్స్వో స్థాయి ఆఫర్లు ఉన్నాయని శ్రీవాస్తవ తెలిపారు. ఐఎస్బీ పూర్వ విద్యార్థులు దాదాపు 400 వ్యాపార సంస్థలనూ ప్రారంభించారన్నారు. ప్రస్తుతం 45 మం ది రెసిడెంట్ ఫ్యాకల్టీ ఉండగా, 120 పైగా విజిటింగ్ ఫ్యాకల్టీ ఉన్నారన్నారు. యూటీ డల్లాస్ అధ్యయనం ప్రకారం టాప్-100 అంతర్జాతీయ రీసెర్చ్ ర్యాంకింగ్లలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఐఎస్బీ నిల్చిందని పేర్కొన్నారు. పట్టాల బహూకరణ సందర్భంగా వివిధ విభాగాల్లో టాపర్లకు ప్రత్యేక పురస్కారాలు అందజేశారు. ఆల్రౌండర్ అవార్డును పీటర్ రాజ్కుమార్ పాల్ అందుకున్నారు. -
మైనింగ్ అక్రమాలకు ఇక చెక్
సాక్షి, హైదరాబాద్: ఖనిజాల వెలికితీతలో అక్రమాలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో ‘ప్రాజెక్ట్ సుదూర్ దృష్టి’కి శ్రీకారం చుట్టినట్లు కేంద్ర గనులశాఖ సంయుక్త కార్యదర్శి సుభాష్ చంద్ర వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పించిన ‘డిజిటల్ ఇండియా’లో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు వివరించారు. కేంద్ర గనులశాఖ పరిధిలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబీఎం), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ) గురువారం హైదరాబాద్లో ‘ప్రాజెక్టు సుదూర్ దృష్టి’పై పరస్పర అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఐబీఎం, ఎన్ఆర్ఎస్సీ అధికారులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గనులశాఖ ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి సుభాష్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిమితంగా ఉన్న సహజ వనరులను బాధ్యతాయుతంగా, సమర్థంగా వినియోగించుకుంటూ సుస్థిర అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు. నూతన సాంకేతికతతో ఖనిజాల వెలికితీతలో అక్రమాలను అరికట్టడం సాధ్యమవుతుందని.. మైనర్ మినరల్స్ వెలికితీతలోనూ ఈ సాంకేతికతను వినియోగించుకునే దిశగా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. ఐబీఎం, ఎన్ఆర్ఎస్ఏ ఒప్పందాన్ని చరిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. శాటిలైట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలనే ప్రధాని ఆదేశాల మేరకు మూడు నెలల వ్యవధిలోనే 30కిపైగా సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు ఎన్ఆర్ఎస్సీ డెరైక్టర్ వీకే దద్వాల్ వెల్లడించారు. 1974 మొదలుకుని ఇప్పటి వరకు ఎన్ఆర్ఎస్సీ ఏరియల్ సర్వే ద్వారా అనేక అంశాలపై సమాచారం సేకరించామన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్గ్రిడ్ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. గనుల తవ్వకాలను పర్యవేక్షించేందుకు ఐబీఎం అధికారులను రెండు బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇస్తున్నామని దద్వాల్ వెల్లడించారు. ఐబీఎం కంట్రోలర్ జనరల్ ఆర్కే సిన్హా మాట్లాడుతూ గనుల తవ్వకాల పర్యవేక్షణలో ఇకపై భౌతిక తనిఖీల అవసరం లేకుండా సుదూర్ దృష్టి ప్రాజెక్టు తోడ్పడుతుందన్నారు.