online gaming
-
ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’
భారతీయ ఈస్పోర్ట్స్ రంగంలో ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి క్రాఫ్టన్(Krafton) ఇండియా ఈస్పోర్ట్స్(Esports) ‘రైజింగ్ స్టార్’ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఈస్పోర్ట్స్ అథ్లెట్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, వారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్లో పాల్గొనేవారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించనున్నారు. గేమింగ్ నైపుణ్యాలను పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవనశైలి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి పరిశ్రమకు చెందిన కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు అందిస్తారు. వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఈస్పోర్ట్స్ లో దీర్ఘకాలిక విజయాల కోసం బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: గగనతలంలోకి 16.13 కోట్ల మందిరైజింగ్ స్టార్ ప్రోగ్రామ్కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి ప్లాట్ఫామ్ల్లో కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేదా సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)కు సంబంధించిన కంటెంట్ను క్రమం తప్పకుండా తయారు చేస్తుండాలి. అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు ఉండాలి. -
ఆన్లైన్ గేమింగ్కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
9 బిలియన్ డాలర్లకు ‘ఆన్లైన్ గేమింగ్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వచ్చే అయిదేళ్లలో 8.92 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు ఈ–గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్) సీఈవో అనురాగ్ సక్సేనా తెలిపారు. ప్రస్తుతం ఇది 3.1 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. ఇటీవలి గ్రాంట్ థార్న్టన్ భారత్, ఈజీఎఫ్ నివేదిక ప్రకారం 2018–23 మధ్య కాలంలో ఈ రంగంలో పనిచేసేవారి సంఖ్య 20 రెట్లు పెరిగిందని పేర్కొన్నారు. ఏడాదికి దాదాపు రూ. 7వేల కోట్ల స్థాయిలో జీఎస్టీ వసూళ్లు ఉంటున్నాయన్నారు. అయితే, పరిశ్రమ ఇంత భారీగా విస్తరిస్తున్నప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్ల స్కిల్ గేమింగ్, గ్యాంబ్లింగ్ మధ్య తేడా తెలియక గందరగోళం నెలకొంటోందని సక్సేనా చెప్పారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమకు నియంత్రణపరమైన విధి విధానాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఆయన పేర్కొన్నారు. దీనిపై కసరత్తు జరుగుతోందని వివరించారు. నియంత్రణ వ్యవస్థ ఉంటే గేమింగ్ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తాయని సక్సేనా చెప్పారు. గేమింగ్పై అవగాహన పెంచేందుకు ప్రత్యేకంగా వర్క్షాప్లు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టెక్ రంగంలో హైదరాబాద్ వేగంగా పురోగమిస్తోందని, స్థానికంగా 4,369 టెక్ స్టార్టప్లు, దాదాపు 77 గేమింగ్ స్టార్టప్లు ఉన్నాయని వివరించారు. -
జీఎస్టీ ఎగవేతలు రూ.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: జీఎస్టీ ఎగవేతల విలువ 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.01 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇందుకు సంబంధించి 6,084 కేసులను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) గుర్తించింది. ఆన్లైన్ గేమింగ్, బీఎఫ్ఎస్ఐ, ఇనుము, రాగి, స్క్రాప్ విభాగాల్లో అత్యధిక ఎగవేతలు నమోదయ్యాయని డైరెక్టరేట్ వెల్లడించింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 4,872 కేసులు నమోదు కాగా, ఎగవేతల విలువ రూ.1.01 లక్షల కోట్లుగా ఉంది. డీజీజీఐ వార్షిక నివేదిక ప్రకారం.. పన్ను చెల్లించకపోవడానికి సంబంధించిన ఎగవేత కేసుల్లో 46 శాతం రహస్యంగా సరఫరా, తక్కువ మూల్యాంకనం, 20 శాతం నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కు (ఐటీసీ) సంబంధించినవి కాగా 19 శాతం ఐటీసీని తప్పుగా పొందడం/రివర్సల్ చేయకపోవడం వంటివి ఉన్నాయి. 2023–24లో ఆన్లైన్ గేమింగ్ రంగంలో 78 కేసుల్లో గరిష్టంగా రూ.81,875 కోట్ల ఎగవేత జరిగింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ అండ్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) రంగం 171 కేసుల్లో రూ.18,961 కోట్ల ఎగవేతలను నమోదు చేసింది. -
GST Council meet: ఎరువులపై జీఎస్టీ తగ్గించేనా?
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తర్వాత జీఎస్టీ కౌన్సిల్ తొలిసారి భేటీ అవుతోంది. ఎరువులపై సబ్సిడీ రేటు తగ్గించాలంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన సూచనతోపాటు, ఆన్లైన్ గేమింగ్పై పన్ను అంశాలు శనివారం నాటి సమావేశంలో చర్చకు రానున్నాయి. 53వ జీఎస్టీ కౌన్సిల్ భేటీకి కేంద్ర ఆరి్థక మంత్రి అధ్యక్షత వహిస్తుండగా, రాష్ట్రాల ఆరి్థక మంత్రులు సైతం పాల్గొననున్నారు. జీఎస్టీలో ప్రస్తుతమున్న వివిధ రకాల రేట్లను కుదించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉండగా, దీనిపై ఏర్పాటైన మంత్రుల బృందం ఇప్పటి వరకు సాధించిన పురోగతి సైతం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎరువులపై జీఎస్టీలో 5 శాతం రేటు అమలవుతోంది. ఎరువుల తయారీలోకి వినియోగించే సల్ఫూరిక్ యాసిడ్, అమ్మోనియాపై 18 శాతం రేటు అమల్లో ఉంది. ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి సరుకులతోపాటు పంట పోషక ఉత్పత్తులపైనా రేటు తగ్గించాలని ఈ రంగానికి సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. ఎరువులపై రేట్ల తగ్గింపు ప్రతిపాదనను జీఎస్టీ కౌన్సిల్ 45వ, 47వ సమావేశాల అజెండాల్లో చోటు కలి్పంచినప్పటికీ.. ఈ దిశగా మండలి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చివరిగా జీఎస్టీ కౌన్సిల్ 52వ సమావేశం గతేడాది అక్టోబర్ 7న జరగడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, పందేల మొత్తంపై 28 శాతం జీఎస్టీ రేటు 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచి్చంది. ఆరు నెలల తర్వాత దీనిపై సమీక్ష చేపడతామని అప్పట్లోనే మండలి ప్రకటించింది. దీంతో ఇది చర్చకు వస్తుందని భావిస్తున్నారు. -
‘డెత్’లైన్ గేమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: బండ్లగూడ జాగీర్ సన్సిటీలో నివసించే భార్యభర్తలు ఇందిర, ఆనంద్ తమ కుమారుడు విక్కీని చంపి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ దారుణానికి కారణం ఆనంద్ ఆన్లైన్ గేమ్స్కు బానిసగా మారి అప్పుల పాలు కావడం. పంచాయితీ రాజ్ శాఖలో మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కీసర విభాగంలో ఏఈగా పని చేస్తున్న గడ్డం రాహుల్ బాబు ఆన్లైన్ గేమ్స్కు బానిసై ఆ నష్టాలు పూడ్చుకోవడానికి మోసగాడిగా మారి జైలుకెళ్లాడు. దుండిగల్లోని ఏరోనాటికల్ కాలేజీలో బీటెక్ చదువుతున్న గుడిమల్కాపూర్కు చెందిన శీలం మనోజ్ ఆన్లైన్ గేమింగ్కు అలవాటుపడి, ఆరి్థకంగా తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త జానారెడ్డి ఆన్లైన్ గేమింగ్కు అలవాటుపడి డబ్బు పోగొట్టుకోవడంతో ఆరి్థక సమస్యలు చుట్టుముట్టి మన్సూరాబాద్ భవానీనగర్కు చెందిన వివాహిత శిరీష ఆత్మహత్య చేసుకుంది. ....గడచిన నెలన్నర రోజుల కాలంలో వెలుగులోకి వచి్చన ఈ నాలుగు ఉదంతాలు ప్రస్తుతం సమాజంపై ఆన్లైన్ గేమింగ్స్ ప్రభావాన్ని చెప్పకనే చెప్తున్నాయి. ఈ గేమ్స్కు అలవాటుపడుతున్న వాళ్లు గెలవడానికి బానిసలుగా మారిపోతున్నారు. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్లో పడి వివిధ రకాలైన పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి, పందెం కాయడానికి అవసరమైన డబ్బు కోసం అప్పులు చేస్తున్నారు. చివరకు ఆ ఉచ్చులో పడి మోసాలు, ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పథకం ప్రకారం విస్తరించిన గేమ్స్... కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడిచాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరించాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్ను ప్రమోట్ చేశాయి. వీటికి ఆకర్షితులైన విద్యార్థులు, ఉద్యోగులు, యువత వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెట్టారు. ఆ తర్వాతి రోజుల్లో ఇవి ఆడటం అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్లే గెలిచేలా చేసి తమ ముగ్గులోకి దింపుతారు. వీళ్లకి గెలుపు అనేది ఓ కిక్గా మారుస్తారు. పాయింట్లు, పందేల పేరుతో.. ఇలా తమ గేమ్కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. ఇలా తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన ఆడేవారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. వీటిని వినియోగిస్తే గేమ్లో మీ తరఫున ఆడే క్రీడాకారులు బలంగా మారి, గెలుస్తావంటూ చెబుతారు. తొలుత ఈ పాయింట్లు ఉచితమే అంటూ వాటికీ బానిసలుగా మారేలా చేస్తారు. ఆపై ఈ పాయింట్లు రావాలంటే తమకు కొంత మొత్తం చెల్లించాలంటూ వసూలు చేయడం మొదలెడతారు. అందినకాడికి దండుకుంటారు... కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్కు బానిసలుగా మారిన వాళ్లు తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్లో పడిపోతున్నారు. తమవి లేదా తల్లిదండ్రుల కార్డులు తీసుకుని పేమెంట్లు చేస్తున్నారు. వీటి వివరాలను ఒకసారి నమోదు చేసి, ఆ సందర్భంలో కార్డు యజమానికి వచ్చే ఓటీపీ పొందుపరిచి, ఆటో రీచార్జ్ ఎంపిక చేసుకుంటే పదేపదే కార్డుతో అవసరం ఉండదు. దీంతో అదును చూసుకుని ఈ పని చేస్తున్న యువత అనునిత్యం భారీ మొత్తం ఖర్చు చేసేస్తోంది. ఇలా మళ్లీ గెలుపు అలవాటు చేసిన తర్వాత తమ వద్ద నిరీ్ణత మొత్తం పందెం కాసి గేమ్ ఆడితే... భారీ లాభాలు ఉంటాయని చెప్పే కంపెనీలు డబ్బు దండుకుంటున్నాయి. ఇలాంటి గేమ్స్లో తొలినాళ్లల్లో తక్కువ మొత్తం పెట్టినప్పుడు లా«భం వచి్చనా...పెట్టుబడి పెరిగే కొద్దీ నష్టాలే వస్తుంటాయి. వాటిలో ప్రోగ్రామింగ్ అలా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కొందరు ఆన్లైన్ గేమింగ్స్ కోసం యాప్స్లో అప్పులు తీసుకుని, ఆ భారం పెరిగిపోయి, వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యల వరకు వెళ్తున్నారు. పురుషులే ఎక్కువ.. ఇటీవల కాలంలో ఇలాంటి ‘గేమింగ్ ఉదంతాలు’ ఎక్కువగా జరుగుతున్నాయి. పురుషులతో పాటు మహిళలూ ఇలాంటి గేమ్స్కు బానిసలుగా మారుతున్నారు. అయితే తల్లిదండ్రుల, కుటుంబీకుల కార్డ్స్ వినియోగించి యూసీ పాయింట్లు ఖరీదు చేయడం, పందేలు కావడం వంటివి మాత్రం కేవలం పురుషులే చేస్తున్నారు. ఇప్పటి వరకు మా దృష్టికి వచి్చన ఉదంతాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. యువతులు, మహిళలు గేమ్స్ ఆడుతున్నా..డబ్బు చెల్లించాల్సి వస్తే వాటికి దూరంగా ఉంటున్నారు. – జి.రాజేంద్రన్, సైబర్ నిపుణుడు -
ఈ–గేమింగ్ కట్టడిపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగాన్ని కట్టడి చేసేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడంపై కేంద్ర ఎల్రక్టానిక్స్, సమాచార మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేషనల్ లా యూనివర్సిటీ, ఈ–గేమింగ్ ఫెడరేషన్ కలిసి పరిశ్రమవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిర్దిష్ట ప్రతిపాదనలను సమర్పించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పరిశ్రమ మెరుగైన నిర్వహణ కోసం నియంత్రణ ఉండక తప్పదని ఎన్ఎల్యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాఘవ్ పాండే తెలిపారు. అయితే, ఇటు పరిశ్రమ వృద్ధికి దోహదపడటం, అటు నియంత్రించడం మధ్య సమతౌల్యం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమ, ఇతర నియంత్రణ సంస్థలతో సంప్రదింపులతో పాటు నియంత్రించాల్సిన అంశాలపై సమగ్ర అధ్యయనంతోనే తగిన విధానాలను రూపొందించడానికి వీలవుతుందని చెప్పారు. ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి గేమింగ్ సంస్థలే స్వీయ నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలంటూ గతంలో చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీయంగా డ్రీమ్11, మొబైల్ ప్రీమియర్ లీగ్, డెల్టాటెక్ గేమింగ్, నజారా, గేమ్స్24 గీ7 వంటి పలు సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 3 బిలియన్ డాలర్ల మార్కెట్.. ప్రస్తుతం భారత గేమింగ్ మార్కెట్ దాదాపు 3 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది. ఇందులో 80 శాతం వాటా రియల్ మనీ ప్లాట్ఫాంలదే ఉంటోంది. అమెరికా, బ్రెజిల్ను కూడా దాటేసి భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద గేమింగ్ మార్కెట్గా మారినట్లు గేమింగ్ కంపెనీ విన్జో ఇటీవల ఒక నివేదికలో పేర్కొంది. భారత్లో 56.8 కోట్ల మంది గేమర్స్ ఉండగా, 2023లో 950 కోట్ల పైచిలుకు గేమింగ్ యాప్ డౌన్లోడ్స్ నమోదైనట్లు వివరించింది. ఇంతటి భారీ స్థాయిలో విస్తరించిన ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. మనీలాండరింగ్ స్కాములు, భారీ పన్నుల భారం మొదలైన సమస్యలతో సతమతమవుతోంది. తమ పరిశ్రమకు నియంత్రణ సంస్థను ఏర్పాటు చేస్తే సక్రమంగా నడుస్తున్న వాటికి ఇలాంటి సమస్యలు తగ్గగలవని గేమింగ్ కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో కంపెనీలు కలిసి స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్ఆర్బీలు) ఏర్పాటు చేసుకోవచ్చంటూ కేంద్రం ప్రతిపాదించింది. అయితే, బడా సంస్థలు సదరు ఎస్ఆర్బీలను ప్రభావితం చేయడానికి, అవి నిజంగానే స్వతంత్రంగా పని చేయడానికి అవకాశాలు తక్కువగా ఉండొచ్చని భావించి స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటుపై దృష్టి సారించింది. -
ఆన్లైన్ గేమ్ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. కష్టపడకుండా ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు..గెలిస్తే డబ్బు లు మీసొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరైతే .. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారు ఎందరో.. అటువంటి ఈ ఆన్ లైన్ గేమ్లపై అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కూడా నిబంధనలు ప్రకటించింది. అయితే తాజాగా గేమింగ్ ఇండస్ట్రీ బాడీ ‘ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్)’ బాధ్యతాయుతమైన గేమింగ్ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటగాళ్ల రక్షణకు కట్టుబడి బాధ్యతయుతమైన గేమింగ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు మంచి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా యువతకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: గూగుల్లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా? భారత దేశంలోని మొదటి మూడు ఆన్లైన్ గేమింగ్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ముంబైలో రెండు ఆన్లైన్ గేమింగ్ యునికార్న్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ గేమింగ్లపై డాక్టర్లు స్పందిస్తూ బాధ్యతారహితమైన గేమింగ్ వల్ల ఏకాగ్రత తగ్గుతుందని, సులువుగా కోపం, చిరాకు పడడం, దీర్ఘకాలిక ఆందోళన , డిప్రెషన్కు దారి తీస్తుందని చెబుతున్నారు. -
మరోసారి గెలుచుకునేదానిపైనా జీఎస్టీ ఉంటుందా? ఆర్థిక మంత్రి క్లారిటీ..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్లో ప్రారంభ పందేలపై 28% జీఎస్టీ విధింపునకు సంబంధించి విలువ ఆధారిత నిబంధనలు ప్రభావవంతంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ‘‘ఇందుకు సంబంధించి వివరణ జారీ అయింది. 28% పన్ను రేటు అమలవుతుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది, ఎవరిపై భారం పడుతుందన్నది వివరంగా పేర్కొనడం జరిగింది. విలువకు సంబంధించి నిబంధనలు విజయాలను మినహాయిస్తున్నాయి. కనుక దీనిపై ఎలాంటి గందరగోళం ఉండదని భావిస్తున్నాను’’అని మంత్రి వివరించారు. దీని ప్రకారం.. ఆన్లైన్ గేమింగ్లో గెలుచు కున్న నగదుతో తిరిగి బెట్టింగ్లు వేసినప్పుడు వా టిపై 28% జీఎస్టీ అమలు కాదు. స్పష్టంగా చెప్పాలంటే మొదటిసారి బెట్టింగ్కు పెట్టే మొత్తంపై 28% జీఎస్టీ చెల్లించాలి. దానిపై గెలుచుకున్న మొత్తాన్ని తిరిగి వెచ్చించినప్పుడు జీఎస్టీ పడదు. లోక్ సభలో జీఎస్టీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీతారామన్ మాట్లాడారు. అప్పిలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్, సభ్యుల వయో పరిమితిని ఈ బిల్లులో సవరించారు. ఇందుకు సంబంధించి ఆర్థిక మంత్రి ఓ ఉదాహరణను కూడా వినిపించారు. ‘‘ఒక వ్యక్తి రూ.1,000 బెట్ చేసి, దానిపై రూ.300 గెలుచుకుని.. ఆ తర్వాత రూ.1,300తో మరోసారి గెలుచుకునే మొత్తంపై జీఎస్టీ పడదు’’అని వివరించారు. -
డబ్బుకు డబ్బు.. అవకాశాలు, గేమింగ్ ఇండస్ట్రీపై తల్లిదండ్రుల ధోరణి ఇలా
న్యూఢిల్లీ: దేశంలో ఈ స్పోర్ట్స్ పరిశ్రమ వృద్ధి బాట నడుస్తుండడం, గేమర్లకు విస్తృతమైన కెరీర్ అవకాశాలతోపాటు, ఆదాయాలను పెంచుతున్నట్టు హెచ్పీ ఇండియా నిర్వహించిన గేమర్స్ ల్యాండ్స్కేప్ స్టడీ, 2023 పేర్కొంది. దేశవ్యాప్తంగా 15 పట్టణాల నుంచి 3,000 గేమర్ల (గేమ్లు ఆడేవారు) అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. విశ్రాంతి కోసమే కాకుండా, ఆర్జనకు, గుర్తింపునకు గేమింగ్ను సాధనంగా చూస్తున్నారు. గేమింగ్ పట్ల తల్లిదండ్రుల్లోనూ సానుకూల ధోరణి నెలకొంటున్నట్టు ఈ సర్వే గుర్తించింది. సర్వేలో 500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ►గేమ్లను సీరియస్గా ఆడేవారు ఏటా కనీసం రూ.6 లక్షలు సంపాదిస్తున్నారు. ►2022తో పోలిస్తే 2023లో గేమింగ్పై ఆదాయం పెరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది సీరియస్ గేమర్లు (గేమింగ్ను ఉపాధిగా తీసుకున్న వారు) రూ.6–12 లక్షల మధ్య ఆదాయం సంపాదిస్తున్నామని చెప్పారు. ►67 శాతం మంది మొబైల్ ఫోన్ కంటే కంప్యూటర్లోనే గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ►స్పాన్సర్షిప్, ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్లు గణనీయమైన ఆదాయ వనరులుగా మారాయి. గేమింగ్కు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని ఇవి తెలియజేస్తున్నాయి. ►గేమింగ్ను ఒక అలవాటుగా 42 శాతం మంది తల్లిదండ్రులు అంగీకరిస్తున్నారు. ఈ పరిశ్రమకు ఉన్న వృద్ధి అవకాశాలతో గేమింగ్ పట్ల తమ దృక్పథంలో మార్పు వచ్చిందని 40 శాతం మంది చెప్పారు. ►అదే సమయంలో గేమింగ్ అవకాశాల పట్ల తల్లిదండ్రులకు సరైన సమాచారం కూడా లేదని తెలిసింది. దీనికి సంబంధించిన సమాచారం కోసం 49 శాతం మంది స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడుతున్నారు. ►గేమింగ్ కెరీర్లో స్థిరత్వం, సామాజికంగా ఒంటరి కావడంపై ఆందోళన వ్యక్తమైంది. ‘‘భారత్ ప్రపంచంలో టాప్–3 పీసీ (కంప్యూటర్) గేమింగ్ కేంద్రాల్లో ఒకటిగా మారింది. ఎప్పటికప్పుడు ఆవిష్కరణలు, అధునాతన ఉపకరణాల ద్వారా గేమర్ల సాధికారతకు మేము కట్టుబడి ఉన్నాం. గేమింగ్ పరిశ్రమను, గేమర్ల ఆకాంక్షలను మరింత లోతుగా అర్థం చేసుకునేందుకు ఈ అధ్యయనం వీలు కల్పించింది’’అని హెచ్పీ ఇండియా మార్కెట్ ఎండీ ఇప్సితాదాస్ గుప్తా తెలిపారు. ‘‘ఈస్పోర్ట్స్ రంగం వేగంగా వృద్ధి చెందుతూ, విభిన్న ఉపాధి అవకాశాలను గేమర్లకు కల్పిస్తుండడం ప్రోత్సాహకరంగా ఉంది. భారతీయ యువత అంతర్జాతీయ ఈస్పోర్ట్స్ విభాగంలో తమ స్థానాన్ని మరింత పెంచుకోవడమే కాకుండా, పరిశ్రమలో వ్యాపార అవకాశాలను కూడా సొంతం చేసుకుంటారని భావిస్తున్నాం’’అని హెచ్పీ ఇండియా మార్కెట్ పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడి పేర్కొన్నారు. -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్లో మొత్తం డిజిటల్ గేమ్లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
డిసెంబరులో ఇండియా ఏఐ సదస్సు
నోయిడా: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ గేమింగ్ విభాగాలు 2026–27 నాటికి భారత స్థూల జాతీయోత్పత్తికి (జీడీపీ) 300 బిలియన్ డాలర్ల వరకు సమకూరుస్తాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. 2026–27 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఒక ట్రిలియన్ డాలర్లు ఉండాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో ఏఐ చాలా ముఖ్యమైన భాగం అని భావిస్తున్నామని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ’ఇండియా ఏఐ’ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. ఇండియా ఏఐ 2023 పేరుతో ఈ ఏడాది డిసెంబర్ 10న అంతర్జాతీయ సదస్సును ప్రభుత్వం నిర్వహించనుందని వెల్లడించారు. -
ఆన్లైన్ గేమింగ్లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్లు భారత్లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
‘ఇలా వేధించడం తగదు’.. కేంద్రంపై అశ్నీర్ ఆగ్రహం
ప్రముఖ ఫాంటసీ గేమింగ్ యాప్ ‘క్రిక్పే’ ఫౌండర్ అశ్నీర్ గ్రోవర్ ట్యాక్స్ ఉన్నతాధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బకాయల పేరుతో వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) విభాగం ఆన్లైన్ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) కంపెనీలకు జీఎస్టీ డైరెక్టర్ జనరల్ గట్టి షాకిచ్చింది. రూ. 55,000 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాలంటూ దాదాపు 12 ఆర్ఎంజీ కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారిచేసింది. ఆ నోటీసులపై అశ్నీర్ గ్రోవర్ స్పందించారు. డీజీజీఐ విభాగాన్ని నిర్వహిస్తున్న వారి లక్ష్యం కేవలం వ్యాపారస్తులను వేధించడమే’ అని అన్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ ప్రజలు భారీ పన్నులు చెల్లించరని, ప్రభుత్వం సైతం చెల్లించదు..కేవలం వాటిని సేకరించగలదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అలా.. బీజేపీ ఇలా దీనిని 'రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్' (గత లావాదేవీలకు వర్తించే విధంగా) అని పిలుస్తున్నారు. కాంగ్రెస్ వోడాఫోన్ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ విధించగా, బీజేపీ గేమింగ్ జీఎస్టీ రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ను తీసుకొచ్చింది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించాలనే లక్ష్యంతో ఉన్న ప్రభుత్వ దృక్పథానికి సహాయం చేయదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను అభ్యర్థించారు. జీఎస్టీ నిర్ణయంపై అసంతృప్తి ఆన్లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్పై 28 శాతం వస్తు సేవల పన్ను విధిస్తూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జిఎస్టి) కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గ్రోవర్ తప్పుబట్టారు. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమపై 28 శాతం జీఎస్టీ విధించడం వల్ల కొత్త గేమ్లలో పెట్టుబడి పెట్టే వారి సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని, ట్రాన్సాక్షన్లు, అలాగే వ్యాపార విస్తరణపై ప్రభావం చూపుతుందన్నారు. . అశ్నీర్ గ్రోవర్ ఏం చేస్తున్నారు? భారత్ పే కో-ఫౌండర్గా ఆ సంస్థలో విధులు నిర్వహించే సమయంలో అశ్నీర్ గ్రోవర్, ఆయన భార్య మాధురి జైన్ గ్రోవర్లు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దీంతో అశ్నీర్ను, ఆయన భార్యను భారత్ పే బోర్డ్ యాజమాన్యం ఆ సంస్థ నుంచి తొలగించింది. ఆ తర్వాత ఈ ఏడాది క్రిక్పే పేరుతో సొంత ఫాంటసీ గేమింగ్ సంస్థను ప్రారంభించారు. -
ఆ యాడ్తో బాద్షాకి చిక్కులు
ముంబై: బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చిక్కుల్లో ప డ్డారు. ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించినందుకు ఆయన ఇల్లు ముట్టడికి కొందరు విఫలయత్నం చేశారు. ఆన్లైన్ జూదాన్ని ప్రోత్సహించేలా షారూక్ వ్యవహరించడం వారికి మింగుడు పడడం లేదు. అన్టచ్ ఇండియా ఫౌండేషన్కు చెందిన కొందరు బాంద్రాలోని షారూక్ ఇంటి బయట నిరసనలకు దిగడానికి చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. షారూక్ ఇంటికి గట్టి భద్రత ఏర్పాటు చేసి కొందరు యువకుల్ని అదుపులోనికి తీసుకున్నారు. ఏ23 అనే ఆన్లైన్ రమ్మీ పోర్టల్కి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న షారూక్ ఇటీవల దానికి సంబంధించిన ఒక వాణిజ్యప్రకటన(యాడ్)లో నటించారు. ఆ యాడ్లో ‘పదండి కలిసి ఆడదాం’ అని షారూక్ వ్యాఖ్యానిస్తారు. ఈ అడ్వర్టయిజ్మెంట్పై అన్టచ్ యూత్ పౌండేషన్ తీవ్ర స్థాయిలో మండిపడింది. జంగ్లీ రమ్మీ, జూపీ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ యువతని పక్కదారి పట్టిస్తున్నాయని అన్టచ్ ఇండియా ఫౌండేషన్ విమర్శించింది. -
లూడో తెచ్చిన ముప్పు: లక్షలు గోవిందా! చివరికి..!
Online Gaming Ludo Bangalore Woman ఆన్లైన్ గేమ్కు బానిసైన మహిళ లక్షలు పోగొట్టుకున్న వైనం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో ఆన్లైన్ గేమింగ్ ఒక వ్యసనంలా మారిపోతోంది. ఈక్రమంలో భారీగా నష్టపోతున్న బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బెంగళూర్కు చెందిన ఓ మహిళ ఏకంగా రూ. 4 లక్షలు పోగొట్టుకుంది. అంతేకాదు ఇద్దరు పిల్లల తల్లి అయిన మహిళ కొంత నగదుతో సహా ఇంటి నుంచి పారిపోవడం మరింత సంచలనం రేపింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథన ప్రకారం బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల వివాహిత ఆన్లైన్ గేమింగ్కు బానిసైంది. ఈ క్రమంలో లూడో ఆడుతూ రూ.4 లక్షలకు పైగా పోగొట్టు కుంది. అయితే ఆన్లైనింగ్ వ్యసనం గత ఏడాదినుంచే ఉంది. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టిమరీ ఆన్లైన్లో గేమ్స్ ఆడుతూ ఉండటం అలవాటుగా మారిపోయింది. ఈ క్రమంలో గతంలో రూ. 50వేల పోగొట్టుకుంది. రూ. 1.25 లక్షల విలువైన తన బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టింది. అంతేకాదు,కుటుంబ సభ్యులు భర్తకు చెప్పకుండా బంధువుల వద్ద రూ.1.75 లక్షలు అప్పు తీసుకోవడం గమనార్హం. అయితే విషయం తెలిసిన భర్త ఆమెను మందలించాడు. మళ్లీ అలాంటి పొరపాటు జరగదని భర్తకు హామీ ఇచ్చింది. కానీ ఈ ఏడాది జూలైలో ఆన్లైన్లో లూడో ఆడేందుకు ఆ మహిళ మరోసారి తన బంగారు ఆభరణాలను రూ.1.20 లక్షలకు తాకట్టు పెట్టింది. ఈసారి ఏకంగా నాలుగు లక్షల రూపాయలు స్వాహా అయిపోయాయి. దీంతో ఆమె భర్త జోక్యం చేసుకుని భార్య తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో వారు కూడా గేమ్ను కొనసాగించవద్దని మందలించారు. దీంతో ఆ మహిళ ఆగస్టు 8న, ఇంట్లో ఉన్న నగదుతో పాటు ఇద్దరు పిల్లలనూ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. "నేను క్షమాపణలు కోరుతున్నాను, నేను ఇంట్లో ఉంచిన డబ్బు తీసుకుంటున్నాను, దయచేసి నన్ను క్షమించు" అంటూ ఒక నోట్ కూడా పెట్టి ంది. దీంతో ఇక చేసేదేమీ లేక .భర్త పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారిఆచూకీ కోసం అన్వేషిస్తున్నారు. -
జీఎస్టీ మార్పులకు కేబినెట్ ఓకే
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్లలో బెట్టింగ్ల ప్రవేశ స్థాయి పూర్తి ముఖ విలువపై 28 శాతం పన్ను విధించేలా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) చట్టాల్లో మార్పులకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపిందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ ), ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్టాల్లో సవరణలకు ఆగస్టు 2వ తేదీన జరిగిన 51వ జీఎస్టీ మండలి భేటీలో ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సంబంధిత చట్ట సవరణలను ఆగస్టు 11న ముగియనున్న ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టవచ్చని ఆ వర్గాలు వెల్లడించాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ విధించడం వల్ల ఈ పన్ను రాబడులు పెరుగుతాయి. రిజి్రస్టేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే, విదేశాల్లోని ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫారమ్లకు యాక్సెస్ నిరోధించడం కూడా సవరణల్లో భాగంగా ఉన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అక్టోబర్ నుంచి అమల్లోకి జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలు అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తాయి. ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ మనీ గేమింగ్లతోపాటు ఆన్లైన్ గేమ్లకు చెల్లించడానికి ఉపయోగించే వర్చువల్ డిజిటల్ అసెట్స్ అలాగే ఆన్లైన్ గేమింగ్ విషయంలో సప్లయర్ వంటి పదాలకు తాజా సవరణలలో విస్పష్ట నిర్వచనాలు కూడా ఉండడం గమనార్హం. అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ప్రతినిధులతో కూడిన ఆగస్టు 2 మండలి సమావేశం అనంతరం, ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ సవరణలు ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఈ నిర్ణయాల విషయంలో రాష్ట్రాలు తమ తమ అసెంబ్లీలలో రాష్ట్ర జీఎస్టీ చట్టానికి సవరణలను ఆమోదిస్తాయి. ప్రస్తుత పన్నుల తీరు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ, కొన్ని గుర్రపు పందెం క్లబ్లు ప్రస్తుతం ప్లాట్ఫారమ్ ఫీజు/కమీషన్ (5– 20%) పూర్తి ముఖ విలువలో 18% చొప్పున జీఎస్టీని చెల్లిస్తున్నాయి. అయితే కొన్ని గుర్రపు పందెం క్లబ్లు పూర్తి ముఖ విలువపై 28% చెల్లిస్తున్నాయి. బెట్టింగ్, జూదం రూపంలో చర్య తీసుకోగల క్లెయిమ్లపై విధిస్తున్న ఈ తరహా 28% లెవీపై ఆయా క్లబ్లు న్యాయపోరాటం చేస్తున్నాయి. క్యాసినోలూ ప్రస్తుతం స్థూల గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై 28% జీఎస్టీ చెల్లిస్తున్నాయి. ప్రవేశ స్థాయి పందెం పూర్తి ముఖ విలువపై 28% జీఎస్టీ వల్ల ఖజానాకు మరింత మొత్తం సమకూరనుంది. -
ఆన్లైన్ గేమింగ్: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల్లో బెట్టింగ్ ముఖ విలువపై 28 శాతం జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ బుధవారం నిర్ణయించింది. ఢిల్లీ, గోవా, సిక్కిం రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైనా, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్ ఈ విషయంలో మందుకే వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ప్రస్తుత సమావేశాల్లోనే సెంట్రల్ జీఎస్టీలో సవరణలకు సంబంధించి కేంద్ర సర్కారు బిల్లును ప్రవేశపెట్టనుంది. అనంతరం రాష్ట్రాల అసెంబ్లీలు సవరణలకు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. (నితిన్ దేశాయ్ అకాల మరణం: అదే కొంప ముంచింది!) వచ్చే అక్టోబర్ 1 నుంచి చట్ట సవరణలు అమల్లోకి రానున్నాయి. ‘‘ఆడేవారి తరఫున చెల్లించిన మొత్తం ఆధారంగా విలువ నిర్ణయించడం జరుగుతుంది. ముందు ఆటలో గెలిచిన మొత్తాన్ని మళ్లీ పందెంలో పెడితే దాన్ని జీఎస్టీ నుంచి మినహాయిస్తారు. ఆరంభంలో పెట్టే మొత్తంపైనే పడుతుంది’’అని కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ వివరించారు. ఇందుకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. ‘‘రూ.1,000 పందెంలో పెడితే, దీనిపై రూ.300 గెలిస్తే.. అనంతరం ఈ రూ.1,300తో మళ్లీ పందెం కాస్తే గెలిచే మొత్తంపై జీఎస్టీ విధించరు’’ అని వివరించారు. ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీని అమలు చేసిన 6 నెలల తర్వాత (2024 ఏప్రిల్లో) సమీక్షిస్తామని మంత్రి తెలిపారు. ఆఫ్షోర్ గేమింగ్ ప్లాట్ఫామ్లు జీఎస్టీ వద్ద నమోదు చేసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా చెప్పారు. నిబంధనలు పాటించని పోర్టళ్లను బ్లాక్ చేస్తామని హెచ్చరించారు. (రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా? ) -
ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ డబ్బులు సంపాదిస్తున్నారు.. జీఎస్టీ తగ్గించాలని లేఖ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ తమపై ఇటీవల విధించిన 28 శాతం జీఎస్టీని తగ్గించాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరింది. అధిక పన్ను భారం చట్టవిరుద్ధమైన గేమింగ్ సంస్థలను పరోక్షంగా ప్రోత్సహించినట్టు అవుతుందని పేర్కొంది. చట్టవిరుద్ధమైన, ఆఫ్షోర్ గేమింగ్ సంస్థలకు ఎలాంటి పన్ను భారం ఉండదని, ప్రభుత్వ నిర్ణయం చట్ట పరిధిలో పనిచేసే ఆన్లైన్ గేమింగ్ సంస్థలను రిస్క్లోకి నెడుతుందని ఇండియన్ గేమర్స్ యునైటెడ్ ఆందోళన వ్యక్తం చేసింది. టైర్–2, 3 పట్టణాల్లోని ఆన్లైన్ గేమర్స్తో కూడిన ఈ అసోసియేషన్ ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఓ లేఖ రాసింది. గ్యాంబ్లింగ్కు, స్కిల్ గేమింగ్కు స్పష్టమైన వ్యత్యాసం చూపించాలని సూచించింది. అన్ని రకాల గేమింగ్ సంస్థలను 28 శాతం పన్ను పరిధిలోకి తీసుకొస్తూ ఈ నెల మొదట్లో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గుర్రపు పందేలు, జూదం వంటి అదృష్టాన్ని పరీక్షించుకునే గేమ్లు, నైపుణ్యాలతో కూడిన గేమ్లను ఒకే గాటన కట్టొద్దంటూ, ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని తిరిగి సమీక్షించాలని అసోసియేషన్ కోరింది. పన్ను పరంగా అనుకూలంగా ఉండేలా పరిశ్రమ పట్ల వ్యవహరించాలని సూచించింది. ఆన్లైన్ స్కిల్ గేమింగ్లను యువత తమ గేమింగ్ నైపుణ్యాలతో ఆడుతూ, కొంత ఆదాయాన్ని ఆర్జిస్తోందని వివరిస్తూ.. ఈ విధంగా ఆర్థిక వ్యవస్థలో భాగమవుతున్నట్టు తెలిపింది. 28 శాతం జీఎస్టీ అనేది ఎదుగుతున్న ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. మరోవైపు బుధవారం సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్.. గేమింగ్ పరిశ్రమకు సంబంధించి 28 శాతం జీఎస్టీ అమలు విధి విధానాలను ఖరారు చేయనుంది. -
ఆన్లైన్ గేమింగ్లో పెట్టుబడులకు విఘాతం
న్యూఢిల్లీ: రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయంతో పెట్టుబడులకు తీవ్ర విఘాతం కలుగుతుందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఇప్పటివరకు చేసిన 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులను రైటాఫ్ చేయాల్సిన పరిస్థితి వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీకి దేశ, విదేశాలకు చెందిన 30 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు సంయుక్తంగా లేఖ రాశాయి. అలాగే, వచ్చే 3–4 ఏళ్లలో రాబోయే సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులపైనే ప్రభావం పడుతుందని పేర్కొన్నాయి. లేఖ రాసిన ఇన్వెస్టర్లలో పీక్ ఫిఫ్టీన్ క్యాపిటల్, టైగర్ గ్లోబ ల్, డీఎస్టీ గ్లోబల్, ఆల్ఫా వేవ్ గ్లోబల్ మొదలైనవి ఉన్నాయి. జీఎస్టీ మండలి నిర్ణయం తమను షాక్కు గురి చేసిందని, ఇలాంటి వాటి వల్ల గేమింగ్పై మాత్రమే కాకుండా భారత్లో ఇతరత్రా వర్ధమాన రంగాలపైనా ఇన్వెస్టర్ల విశ్వాసం సన్నగిల్లుతుందని అవి తెలిపాయి. -
జీఎస్టీ పెంపు: ఇలా అయితే డిజిటల్ ఎకానమీ ఎలా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం పన్ను విధించాలన్న జీఎస్టీ మండలి నిర్ణయం.. పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎంఏఐ) వ్యాఖ్యానించింది. 2025 నాటికి 1 లక్ష కోట్ల డిజిటల్ ఎకానమీ కావాలన్న భారత్ ఆకాంక్షలకు ఎదురుదెబ్బలాంటిదని పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల పరిశ్రమపై పన్ను భారం 1,000 శాతం మేర పెరుగుతుందని ఐఏఎంఏఐ తెలిపింది. (పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్) ఫలితంగా 2.5 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ స్టార్టప్ వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొంది. కొత్తగా రాబోయే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) పూర్తిగా నిలిచి పోయే అవకాశం ఉందని వివరించింది. చట్టబద్ధమైన ఆన్లైన్ గేమింగ్ రంగంపై .. గ్యాంబ్లింగ్ కార్యకలాపాకు సమాన స్థాయిలో పన్ను విధించడం దేశీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ఐఏఎంఏఐ పేర్కొంది. కాగా బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సంబంధిత కంపెనీ స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా డెల్టా కార్ప్ ఎన్నడూ లేనంతగా నష్టాలను ఎదుర్కొంది. -
కేంద్రంపై విమర్శలు.. రాజకీయాల్లోకి అష్నీర్ గ్రోవర్?
ఫిన్టెక్ దిగ్గజం భారత్ పే మాజీ ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ రాజకీయాల్లోకి రానున్నారా? లేదంటే రావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తున్నాయి ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలు. కేంద్రం ఆన్లైన్ గేమ్స్పై 28 శాతం జీఎస్టీని విధించింది. ఈ నిర్ణయాన్ని అష్నీర్ గ్రోవర్ వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ తీరుతో దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ కుప్పకూలే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే సమయంలో తమ వాణిని వినిపించేందుకు టెక్నాలజీ స్టార్టప్ ఫౌండర్లు రాజకీయాల్లో రావాల్సిన అవసరం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. RIP - Real money gaming industry in India. If the govt is thinking people will put in ₹100 to play on ₹72 pot entry (28% Gross GST); and if they win ₹54 (after platform fees)- they will pay 30% TDS on that - for which they will get free swimming pool in their living room come… — Ashneer Grover (@Ashneer_Grover) July 11, 2023 గ్రోవర్ మాత్రమే కాదు ఇండియా గేమింగ్ ఫెడరేషన్తో పాటు ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ (FIFS), ఆన్లైన్ స్కిల్ గేమ్లపై జీఎస్టీని 18 శాతం నుండి 28 శాతానికి పెంచడంపై కౌన్సిల్ నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నాయి. నేనే రాజకీయ నాయకుడిని అయితే అష్నీర్ రాజకీయ రంగ ప్రవేశంపై గతంలోనూ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై కేంద్రం వసూలు చేసే టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్) విధానాన్ని వ్యతిరేకించారు. అందులో లోపాల్ని సవరించాలని అన్నారు. అదే సమయంలో తాను రాజకీయ నాయకుడిని అయితే, దేశంలో ఆదాయపు పన్ను రేటును తగ్గించేందుకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. ప్రతి ఒక్కరూ 10 నుంచి 15 శాతం ట్యాక్స్ కట్టేలా నిర్ధేశిస్తా. తద్వారా ఇప్పుడు ఎక్కువ పన్నులు కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే పన్ను తక్కువగా ఎగవేతకు ప్రయత్నించరు. ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని అన్నారు. తాజాగా, మరోమారు పాలిటిక్స్పై హాట్ కామెంట్స్ చేయడంపై అష్నీర్ గ్రోవర్ పాలిటిక్స్లోకి అడుగు పెడతారేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి👉 ‘విలాసాల రుచి మరిగి’..అశ్నీర్ గ్రోవర్, అతని భార్య మాధురి జైన్ గ్రోవర్కు మరో ఎదురు దెబ్బ! -
ఆన్లైన్ గేమింగ్పై పన్నులు.. ఖరారైతే మరిన్ని పెట్టుబడులు
సియోల్: ఆన్లైన్ గేమింగ్పై పన్నులకు సంబంధించిన విధానాలపై జీఎస్టీ కౌన్సిల్ కసరత్తు చేస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవి ఖరారైతే గేమింగ్ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు రాగలవని ఆమె వివరించారు. దక్షిణ కొరియాలోని సియోల్లో ప్రవాస భారతీయుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఇదీ చదవండి: భారత్ ‘గ్రీన్’ పరిశ్రమకు రాయితీ రుణాలు ట్యాక్సేషన్, నియంత్రణ సహా ఆన్లైన్ గేమింగ్కు సంబంధించిన వివిధ అంశాలపై జీఎస్టీ మండలి మంత్రుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని ఆమె చెప్పారు. కేపీఎంజీ నివేదిక ప్రకారం 2021లో రూ. 13,600 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ రంగం 2024–25 నాటికి రూ. 29,000 కోట్లకు చేరనుంది. ఆన్లైన్ గేములపై ట్యాక్సేషన్ అంశం రెండేళ్లుగా నలుగుతోంది. ఇతరత్రా బెట్టింగ్ గేమ్లతో పోలిస్తే నైపుణ్యాలు అవసరమయ్యే ఆన్లైన్ గేమ్ల విషయంలో పన్ను రేటు తక్కువగా ఉండాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులో లేదా జూన్లో జరిగే జీఎస్టీ తదుపరి సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోవచ్చు. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు -
బెట్టింగ్ గేమ్లపై నిషేధం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ రంగ నియంత్రణకు సంబంధించి కేంద్రం గురువారం నిబంధనలను ప్రకటించింది. సిసలైన డబ్బులు పెట్టి ఆడేవి, బెట్టింగ్ చేసే గేమ్లను నిషేధించింది. అలాగే, ఆన్లైన్ గేమింగ్ రంగం స్వీయ నియంత్రణ విధానాన్ని పాటించాలని సూచించింది. ఈ దిశగా దేశీయంగా ఉపయోగించే గేమ్లను ఆమోదించేందుకు తొలుత మూడు స్వీయ నియంత్రణ సంస్థలను (ఎస్ఆర్వో) నోటిఫై చేయనుంది. 2021 ఐటీ చట్టాలకు సవరణగా ఈ నిబంధనలను చేర్చారు. సిసలైన డబ్బుతో పందేలు కాయనివి, వినియోగదారులకు హాని కలిగించే కంటెంట్ ఏదీ ఉండనివి, పిల్లలకు వ్యసనంగా మారని గేమ్స్కు అనుమతి ఉంటుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చెప్పారు. ‘ఆన్లైన్ గేమింగ్ వృద్ధికి భారత్లో అపార అవకాశాలు ఉన్నాయి. అది గణనీయంగా విస్తరించేందుకు ఈ నిబంధనలు తోడ్పడగలవు‘ అని మంత్రి చెప్పారు. కొత్త నిబంధనలు నవకల్పనలకు ఊతమివ్వగలవని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందించగలదని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. గ్యాంబ్లింగ్ ప్లాట్ఫాంలను ఏరివేసి, అంతర్జాతీయంగా పరిశ్రమ పోటీపడేలా ప్రోత్సహించగలవని అభిప్రాయపడ్డాయి. నిబంధనల్లో మరిన్ని ముఖ్య అంశాలు.. ► ఆన్లైన్ గేమ్స్ను నియంత్రించే ఎస్ఆర్వోల్లో పరిశ్రమ ప్రతినిధులు, గేమర్లు, ఇతరత్రా సంబంధిత వర్గాలు ఉంటాయి. నిబంధనల ప్రకారం ఎస్ఆర్వోల్లో ఒక విద్యావేత్త, సైకాలజీ నిపుణులు, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న వ్యక్తి లేదా అధికారి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే ఎస్ఆర్వోలను డీనోటిఫై చేస్తారు. ► గేమింగ్ వ్యసనంగా మారకుండా, ఆర్థికంగా నష్టపోకుండా, మోసాల బారిన పడకుండా యూజర్లను కాపాడేందుకు తగు వ్యవస్థను ఎస్ఆర్వోలు రూపొందించాలి. ఒక గేమింగ్ సెషన్లో సముచిత సమయం దాటితే పదే పదే హెచ్చరిక మెసేజీలు కూడా పంపించే విధంగా అది ఉండాలి. -
గవర్నర్లకు నోరు తప్ప చెవుల్లేవు : స్టాలిన్
చెన్నై: గవర్నర్ల వ్యవహార శైలిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లకి మాట్లాడడానికి నోరు ఉందే తప్ప వినడానికి చెవుల్లేవని వ్యంగ్యస్త్రాలు విసిరారు. అందుకే గవర్నర్లందరూ ఎక్కువగా మాట్లాడుతూ తక్కువగా వింటున్నారని వ్యాఖ్యానించారు. ఆన్లైన్లో జూదం నిరోధక బిల్లుని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వెనక్కి తిప్పి పంపిన నేపథ్యంలో స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉంగలిల్ ఒరువన్ అనే కార్యక్రమంలో గురువారం పాల్గొన్న స్టాలిన్ ప్రజలు వేసే ప్రశ్నలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్లు జోక్యం చేసుకోకూడదని ఇటీవల సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలకు గవర్నర్లు కట్టుబడి ఉన్నారా? అని ప్రేక్షకుల నుంచి వచ్చిన ప్రశ్నకు స్టాలిన్ స్పందిస్తూ కొందరు గవర్నర్ల వ్యవహార శైలి చూస్తుంటే వారికి నోరు ఉందే తప్ప చెవులు లేవని అనిపిస్తోందని అన్నారు. ఢిల్లీ మద్యం విధానం కేసులో మనీశ్ సిసోడియా అరెస్ట్ను ఆయన ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలను బీజేపీ బహిరంగంగానే ఎలా హెచ్చరిస్తుందో సిసోడియా అరెస్ట్ నిలువెత్తు నిదర్శనమని అన్నారు. రాజకీయ కారణాల కోసం దర్యాప్తు సంస్థల్ని బీజేపీ వాడుకుంటోందని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై ఎన్నికల్లో గెలవడానికి బదులుగా, దర్యాప్తు సంస్థల్ని ప్రయోగించి విజయం సాధించాలని చూడడమేంటని ప్రధాని మోదీకి లేఖ రాసినట్టుగా స్టాలిన్ వెల్లడించారు. -
స్టాలిన్ సర్కార్కు షాకిచ్చిన గవర్నర్
చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవి భారీ షాక్ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తూ వస్తున్న ఆన్లైన్ గేమింగ్ బిల్లును వెనక్కి తిప్పి పంపారాయన. ఆన్లైన్ జూదంపై నిషేధంతో పాటు ఆన్లైన్ గేమ్స్పై నియంత్రణ కోసం స్టాలిన్ సర్కార్ ఈ బిల్లును తీసుకొచ్చింది. అయితే నెలల తరబడి ఆ బిల్లును పెండింగ్లో ఉంచిన గవర్నర్ రవి.. ఇప్పుడు దానిని వెనక్కి పంపారు. తమిళనాడులో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా.. పదుల సంఖ్యలో ఆత్మహత్య కేసులు నమోదు అయ్యాయి (ఆ సంఖ్య 44కి చేరుకుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది). ఇంతకు ముందు అన్నాడీఎంకే ప్రభుత్వ సమయంలోనూ ఆన్లైన్ గేమ్స్ నిషేధానికి సంబంధించి ఒక చట్టం చేసింది. అయితే ఆ సమయంలో కోర్టు దానిని కొట్టేసింది. ఈ క్రమంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. మాజీ జడ్జి జస్టిస్ కే చంద్రు నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయించింది. ఆయన ప్రతిపాదనల మేరకు ఆన్లైన్ గేమింగ్ బిల్లును రూపొందించింది స్టాలిన్ సర్కార్. కిందటి ఏడాది అక్టోబర్లో తమిళనాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది కూడా. ఆపై బిల్లును రాజ్భవన్కు పరిశీలనకు పంపింది. అయితే గవర్నర్ రవి ఆ బిల్లుకు (మొత్తం 20 బిల్లుల దాకా పెండింగ్లోనే ఉంచారాయన) క్లియరెన్స్ ఇవ్వకపోగా.. ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీ ప్రతినిధులతో భేటీ కావడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ తరుణంలో అధికార, ప్రతిపక్షాలు సైతం గవర్నర్ తీరును తప్పుబట్టాయి. ఇదిలా ఉండగానే ఇప్పుడు.. బిల్లుపై కొన్ని సందేహాలు ఉన్నాయంటూ ఆయన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి బిల్లును తిప్పి పంపించారు. దీంతో అధికార డీఎంకే మండిపడుతోంది. ఇదిలా ఉంటే.. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న 20 బిల్లుల్లో యూనివర్సిటీల ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించాలనే బిల్లు సైతం ఉండడం గమనార్హం. మరోపక్క గవర్నర్ తీరును ప్రభుత్వం ఏకిపారేస్తోంది. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటూ.. బీజేపీ, ఆరెస్సెస్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శిస్తోంది. మరోవైపు సీఎం స్టాలిన్ సైతం గవర్నర్ తీరును నిరసిస్తూ.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరారాయన. అయితే ఎన్ని విమర్శలు చెలరేగినా.. తాను రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తానని గవర్నర్ రవి తేల్చేశారు. -
ఐటీ పరిధిలో ఆట
ఆన్లైన్ గేమింగ్లో అతి పెద్ద మార్కెట్ అయిన మనం ఎట్టకేలకు కళ్ళు తెరిచి, కష్టనష్టాలను నియంత్రించే పనిలో పడ్డాం. ఆన్లైన్ గేమింగ్ను ఐటీ నిబంధనల కిందకు తెస్తూ, కొన్ని ముసాయిదా సవరణలను కేంద్ర ఐటీ శాఖ సోమవారం విడుదల చేసింది. ఆన్లైన్ గేమ్స్ అన్నీ భారత చట్టాలకు అనుగుణంగా ఉండేలా, వాడకందార్లకు హాని కలగకుండా కాపాడేందుకే ఈ చర్యలని సర్కారు మాట. ముసాయిదాలో స్వీయ నియంత్రణ వ్యవస్థను ప్రతిపాదించిన మంత్రి, భవిష్యత్తులో గేమింగ్ కంటెంట్ను సైతం నియంత్రించే అవకాశం ఉందని చెప్పడం గమనార్హం. సాధారణంగా ఆన్లైన్ గేమింగ్ 3 రకాలు. ఒకటి – 1990లలో వీడియో పార్లర్లలోని ఆటల్లాగా ఇప్పుడు ఆన్లైన్లో వ్యవస్థీకృతంగా ఆడే ‘ఇ–స్పోర్ట్స్’. రెండోది – వేర్వేరు జట్లలోని నిజజీవిత ఆట గాళ్ళను ఒక జట్టుగా ఎంచుకొని, పాయింట్ల కోసం ఆన్లైన్లో ఆడే ‘ఫ్యాంటసీ గేమ్స్’. మూడోది – మానసిక, శారీరక నైపుణ్యంపై, లేదంటే పాచికలాట లాంటి సంభావ్యతపై ఆధారపడ్డ ఆన్లైన్ సరదా ఆటలు. సంభావ్యతపై ఆధారపడ్డ ఆటల్ని డబ్బులకు ఆడితే జూదం. ఇదీ స్థూలమైన లెక్క. తాజా ప్రతిపాదనల్లో ‘ఆన్లైన్ ఆట’ను నిర్వచించడమే కాక, ఆపరేటర్లు నియమ నిబంధనలన్నీ వాడకందారుకు ముందే చెప్పాలంటూ పారదర్శకతకు ప్రయత్నించడం బాగుంది. అలాగే çసమయం దాటి ఆడుతుంటే, అది ఓ వ్యసనంగా మారకుండా హెచ్చరిక సందేశాలు పంపాలనడమూ భేష్. కేంద్ర చట్టం పరిధిలోకి ఆన్లైన్ ఆటల్ని తీసుకొస్తున్న పాలకుల చొరవను స్వాగతిస్తూనే, లోపా లనూ నిపుణులు వేలెత్తి చూపుతున్నారు. గతంలో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ ‘ఐటీ చట్టం–2000’ పరిధిలోది కాదు. తాజాగా ఐటీ శాఖను ఆన్లైన్ గేమింగ్ చూసే కేంద్ర మంత్రిత్వ శాఖగా నియమిం చారు. అది జరిగిన వారానికే ఈ కొత్త ముసాయిదా సవరణలు తెచ్చారు. నిజానికి, ఆన్లైన్ గేమింగ్ ఏ శాఖ కిందకు వస్తుందనే పాలనాపరమైన స్పష్టత ఇవ్వడం వరకు ఓకే కానీ, ఆ అధికారాన్ని సదరు శాఖ వినియోగించాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి. ఆ పని చేయకుండానే ఐటీ చట్టం నియంత్రణ పరిధిలోకే ఆన్లైన్ గేమింగ్ను తెస్తూ, ఐటీ నిబంధనలు చెయ్యడం విడ్డూరం. అలాగే, ఈ సరికొత్త ముసాయిదా సవరణలపై ఈ నెల 17 లోగా ప్రజలు సలహాలు, సూచనలి వ్వాలని కోరారు. కానీ, ఈ సంప్రతింపుల ప్రక్రియలో వచ్చిన అభిప్రాయాలను ప్రజా క్షేత్రంలో ఉంచట్లేదు. ఇటీవల ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ –2022’లోనూ ఐటీ శాఖ ఇదే పని చేసింది. దీనివల్ల ఈ విధాన నిర్ణయంలో ప్రభుత్వ చర్యల పట్ల ప్రజల్లో ఏ మేరకు నమ్మకం ఉంటుం దంటే సందేహమే. ముందుగా ఎలాంటి చర్చ, శ్వేతపత్రం లేకుండానే, కనీసం ప్రభుత్వ ఆలోచన ఏమిటో చెప్పకుండానే కొత్త ముసాయిదా సవరణల్ని కేంద్రం తేవడం కొంత వివాదాస్పదమైంది. భౌతికంగా అన్ని రకాల జూదం, పందాలపై దేశంలో గోవా, సిక్కిమ్, కేంద్రపాలిత డామన్ మినహా మిగతా రాష్ట్రాల్లో నిషేధం ఉంది. బ్రిటీష్ కాలపు బహిరంగ జూద చట్టం 1867 సహా, వివిధ రాష్ట్రాల చట్టాలున్నాయి. కొన్నిచోట్ల నైపుణ్య ఆధారిత ఆటలకూ షరతులున్నాయి. పాపులర్ ఆన్లైన్ ఆట లూడోలోనూ జూదం సాగుతోందని వివాదమైంది. ఇప్పుడు ఆన్లైన్ ఆటల్ని సైతం ఒక కేంద్ర చట్టం కిందకు తేవడంతో విదేశాల నుంచి నడిచే చట్టవిరుద్ధ, దేశవిద్రోహ జూద వేదికల ముప్పును అరికట్టవచ్చు. అయితే, పరిమాణం, రిస్క్తో సంబంధం లేకుండా ఆన్లైన్ ఆటల్ని అందించే సైట్లు, మొబైల్ యాప్లు (ఇంటర్మీడియరీలు) అన్నిటినీ ఒకే గాట కట్టడంపై పునరాలోచించాలి. అంతర్జాతీయ సంస్థలు తమ సేవల్ని భారత్లో ఆరంభించడానికి ఇక్కడ ఆఫీసర్లను పెట్టుకోవడం ఎంత ఆచరణాత్మకమో చెప్పలేం. డబ్బుతో జూదంపై మరింత కఠిన నిబంధనలుండాలని తమిళనాడు కోరుతోంది. మరి రాష్ట్రాలు అదనపు షరతులు పెట్టవచ్చేమో స్పష్టత లేదు. నిజానికి, కరోనాలో మనం వినోదాన్ని ఆస్వాదించే విధానం మారిపోయింది. ఓటీటీ ఛానల్స్ విస్తరణతో పాటు ఆన్లైన్ గేమింగ్ బాగా పెరిగింది. ఆన్లైన్ ఆటలపై వెచ్చించే సగటు సమయం కోవిడ్ ముందుతో పోలిస్తే, 65 శాతం హెచ్చింది. ఏకంగా 43 కోట్ల మందికి పైగా ఈ వర్చ్యువల్ గేమింగ్పై సమయం వెచ్చిస్తున్నారని లెక్క. కరోనాతో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా టెక్నాలజీని వాడి, డిజిటల్ తెరను వీక్షించే వ్యవధి పెరగడం తిప్పలు తెచ్చింది. యువతరానికి ఆన్లైన్ ఆట ఓ వ్యసనమై, రోజూ 6 నుంచి 8 గంటలు వెచ్చిస్తున్నారు. చదువు, మానవ సంబంధాలు, చివరకు ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నాయి. గతంలో పబ్జీ, బ్లూ వేల్ ఛాలెంజ్ లాంటి ఆన్లైన్ గేమ్స్ హింస, ఆత్మహత్యలను ప్రేరేపించేసరికి, వాటిని నిషేధించాల్సి వచ్చిన సంగతి మరిచిపోలేం. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గేమింగ్ వ్యసనాన్ని ఆరోగ్య సమస్యగా గుర్తించడం గమనార్హం. చైనా ఇప్పటికే ఈ ఆటల్ని ‘మెదడుకు మత్తుమందు’ అంటూ, 18 ఏళ్ళ లోపు పిల్లలు వారానికి 3 గంటలు మించి ఆడే వీల్లేకుండా చేసింది. భారత్లోనూ క్యాసినో లాగే ఆన్లైన్ ఆటల్లోనూ పిల్లలకు కనీస వయఃపరిమితి విధించవచ్చు. ముఖ్యంగా వీటి దుష్ఫలితాలపై తల్లితండ్రులు, అధ్యాపకులు పిల్లల్లో చైతన్యం తేవాలి. వచ్చే 2025 కల్లా 65.7 కోట్ల యూజర్లతో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ రూ. 29 వేల కోట్లకు పైగా ఆదాయం తెస్తుంది. 15 వేల ఉద్యోగాలొస్తాయట. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ను తీర్చిదిద్దే క్రమంలో ఆర్థిక అవకాశాలెన్ని ఉన్నా, ఈ ఆటలపై అదుపు లేకుంటే సామాజిక నష్టమూ ఎక్కువే. కాబట్టి పట్టువిడుపులతో పాలకుల నియంత్రణ చర్యలే శరణ్యం. -
ఆన్లైన్ గేమింగ్కు స్వీయ నియంత్రణ సంస్థ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు సంబంధించిన నిబంధనల ముసాయిదాను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ (ఎంఈఐటీవై) విడుదల చేసింది.వీటి ప్రకారం ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ.. స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసుకోవాల్సి రానుంది. అలాగే తప్పనిసరిగా ప్లేయర్ల ధ్రువీకరణ, భారత్లో భౌతిక చిరునామా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. గేమ్స్ ఫలితాలపై బెట్టింగ్ చేయడానికి ఉండదు. వీటిపై పరిశ్రమ వర్గాలు జనవరి 17లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుందని ఎంఈఐటీవై సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. తుది నిబంధనలు ఫిబ్రవరి తొలి నాళ్లలో ఖరారయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగా ఆన్లైన్ గేమింగ్ రంగం వృద్ధికి, నవకల్పనలకు ప్రోత్సాహమివ్వాలనేది నిబంధనల ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు. 200 బిలియన్ డాలర్ల పైచిలుకు విలువ గల పరిశ్రమలో స్టార్టప్లు, పెట్టుబడులపరంగా ఎదిగేందుకు భారత్కు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. 2021లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కోసం రూపొందించిన కొత్త ఐటీ నిబంధనల పరిధిలో ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు పని చేయాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు. -
ఆన్లైన్ గేమింగ్కు ఎస్ఆర్వో ఏర్పాటు చేస్తాం
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై పర్యవేక్షణకు సంబంధించి స్వీయ నియంత్రణ సంస్థను (ఎస్ఆర్వో) ఏర్పాటు చేసేందుకు పరిశ్రమ సమాఖ్య ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఐఏఎంఏఐ ముందుకొచ్చింది. ఇందుకు అవసరమైన సామరŠాధ్యలు, అనుభవం తమకు ఉందని ఒక ప్రకటనలో పేర్కొంది. నైపుణ్యాల ఆధారిత పలు ఆన్లైన్ గేమింగ్ సంస్థలకు ఐఏఎంఏఐలో సభ్యత్వం ఉండటం కూడా ఇందుకు తోడ్పడగలదని పేర్కొంది. ఇప్పటికే కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిర్దేశించినట్లుగా ఆన్లైన్ క్యూరేటెడ్ కంటెంట్ కంపెనీస్ మొదలైన వాటికి సంబంధించిన ఎస్ఆర్వోలను నిర్వహిస్తున్నామని తెలిపింది. సమాజంపై ప్రభావం చూపే ఆన్లైన్ గేమింగ్పై కేంద్రం తగు విధానాలు లేదా కొత్త చట్టం తీసుకువస్తుందని ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో ఐఏఎంఏఐ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. -
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ, పరిశ్రమ నిపుణులు ఏమంటున్నారు?
న్యూఢిల్లీ: నైపుణ్య ఆధారిత ఆన్లైన్ గేమింగ్పై ప్రభుత్వం వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రస్తుత 18 శాతం నుండి 28 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన పట్ల తమకు అభ్యంతరం ఏదీ లేదని ఈ రంగంలో నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ స్థాయి పన్ను స్థూల గేమింగ్ రాబడి (జీజీఆర్) పైనే విధించాలని, పోటీకి సంబంధించిన ప్రవేశ మొత్తంపై (సీఈఏ) 28 శాతం జీఎస్టీ విధింపు సరికాదని పేర్కొంది. (వర్క్ ఫ్రం హోం: వచ్చే ఏడాది దాకా వారికి కేంద్రం తీపి కబురు) ప్రవేశ మొత్తంపైనే ఈ స్థాయి పన్ను విధిస్తే, అది దాదాపు 2.2 బిలియన్ డాలర్ల విలువచేసే పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషించింది. జీజీఆర్ అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్ ప్లాట్ఫారమ్ ద్వారా తమ ప్లాట్ఫారమ్లోని గేమ్లో పాల్గొనడానికి సర్వీస్ ఛార్జీలుగా ఆయా సంస్థలు వసూలు చేసే రుసుము. అయితే పోటీ ఎంట్రీ అమౌంట్ (సీఈఏ) అనేది ప్లాట్ఫారమ్పై పోటీలో పాల్గొనడానికి ప్లేయర్ డిపాజిట్ చేసిన మొత్తం. ఆయా అంశాలు, సమస్యలపై గేమింగ్ పరిశ్రమ నిపుణులు ప్రభుత్వానికి పలు కీలక సూచనలు చేశారు. (గుడ్న్యూస్: ఎఫ్ఎంసీజీపై తగ్గుతున్న ఒత్తిడి, దిగిరానున్న ధరలు!) నేపథ్యం ఇదీ... ఆన్లైన్ గేమింగ్ జీజీఆర్పై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని 28 శాతానికి పెంచడంపై డిసెంబర్ 17న జరుగుతుందన్న భావిస్తున్న జీఎస్టీ మండలి ఒక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తల నేపథ్యంలో గేమింగ్ రంగంలో నిపుణులు కేంద్రానికి తమ కీలక సూచనలు చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జరగబోయే రానున్న జీఎస్టీ సమావేశంలో ప్యానెల్ క్యాసినో, రేస్ కోర్స్ ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు సంబంధించిన ఎజెండాను చేపట్టవచ్చని అత్యున్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. జూన్లో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ గేమింగ్పై నివేదిక సమర్పించాలని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. నివేదిక రూపకల్పన విషయంలో ఈ రంగానికి సంబంధించి పలు అంశాల పరిశీలనతో పాటు రాష్ట్రాల నుండి వచ్చే మరిన్ని సూచనలనూ పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. (సరికొత్త అవతార్లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..?) గేమ్స్ ఇవీ... నైపుణ్యాల ప్రాతిపదికన జరిగే ఆన్లైన్ గేమ్లలో ఇ–స్పోర్ట్స్, ఫాంటసీ గేమ్లు, రమ్మీ, పోకర్ లేదా చెస్ ఉన్నాయి. ఇటువంటి గేమ్లు ఆన్లైన్లో ఉచితంగానూ ఆడవచ్చు. లేదా ఫ్లాట్ఫామ్ ఫీజుల రూపంలో డబ్బు చెల్లించి ఆడే వారూ ఉంటారు. చట్టబద్ద పరిశ్రమ ప్రయోజనాలు కాపాడాలి పోటీ ప్రవేశ మొత్తంపై కాకుండా స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ విధించాలని ఒకే పరిశ్రమగా ఒకే తాటిపై మేము కోరుతున్నాము. స్థూల గేమింగ్ ఆదాయంపై జీఎస్టీ 18 శాతం నుండి 28 శాతానికి పెరగడం వలన కేంద్రానికి పన్ను రాబడి పెరుగుతుంది. పరిశ్రమ కూడా దీనిని భరించగలుగుతుంది. ఇక పోటీ ప్రవేశ మొత్తంపై పన్ను విధించడం వల్ల పరిశ్రమ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. పెరిగిన పన్ను భారాన్ని వినియోగదారులపై మోపవలసి ఉంటుంది. దీనివల్ల భారతదేశంలో ఎటువంటి పన్ను బాధ్యతలు లేని గ్రే మార్కెట్, ఆఫ్షోర్ గేమింగ్ ప్లాట్ఫారమ్లకు ఆటగాళ్లు మారిపోతారు. దీనితో చట్టబద్ధమైన గేమింగ్ వ్యాపార సంస్థలు తమ కస్టమర్ బేస్ను కోల్పోతాయి. చివరకు చట్టబద్దమైన సంస్థలపై, ప్రభుత్వ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపడమే కాకుండా, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారు సైతం ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునేలా చేస్తుంది- త్రివిక్రమన్ థంపి, గేమ్స్ 24గీ7 కో–చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రతికూల ప్రభావాలు ఎంట్రీ ఫీజుల కంటే స్థూల గేమింగ్ రాబడిపై పరిశ్రమ జీఎస్టీ విధించడం వల్ల ఫలితాలు బాగుంటాయి. ఎంట్రీ ఫీజుపై పన్ను విధింపు మాత్రం భారత్దేశంలో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న గేమింగ్ రంగం వృద్ధిని నియంత్రిస్తుంది. ప్రవేశ రుసుములపై జీఎస్టీని వర్తింపజేయడం వలన ఇప్పటికే అనేక రకాల పన్నులు– రుసుములను చెల్లించే ప్లేయర్లు తీవ్రంగా నిరుత్సాహపడతారు. స్థూల గేమింగ్ రాబడిపై పన్ను విధించడం వలన ప్లేయర్లు వారి నైపుణ్యం లేదా విజయంతో సంబంధం లేకుండా, న్యాయమైన సమానమైన మార్గంలో పన్ను చెల్లింపులకు సహకరిస్తారు. ఎంట్రీ ఫీజుపై జీఎస్టీ విధింపు వల్ల కంపెనీలు లేదా ప్లేయర్లు చట్టవిరుద్ధమైన ఆఫ్షోర్ జూదం యాప్ల వైపు నడిచే అవకాశం ఉంది. ఇవి భారత్ చట్టాలకు అనుగుణంగాగానీ లేదా ఎకానమీకి లాభదాకంగా ఉండే అవకాశమే ఉండదు -సుమంత డే, డిజిటల్ వర్క్స్ సీనియర్ డైరెక్టర్ -
FIFA WC: నమ్మలేకున్నాం.. ఇంత దారుణంగా మోసం చేస్తారా?
ఖతర్ వేదికగా ఫిఫా వరల్డ్కప్ 2022 ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పటికే గ్రూప్ దశతో పాటు రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లు ముగిశాయి. శుక్రవారం నుంచి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు జరగనున్నాయి. అరబ్ గడ్డపై జరుగుతున్న వరల్డ్కప్ను లైవ్లో వీక్షించేందుకు దాదాపు కోటికి పైగా వెళ్లారు. లైవ్ చూడలేని వాళ్లు మాత్రం టీవీల్లో, జియో సినిమాలో, తమకు నచ్చిన ఫ్లాట్ఫాంలో చూస్తూ ఆనందిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ మాత్రం ఫిఫా అభిమానులను దారుణంగా మోసం చేసింది. ఫిఫా వరల్డ్కప్ సందర్భంగా గ్రూప్ దశలో జపాన్, జర్మనీ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రీప్లేను యూట్యూబ్లో టెలికాస్ట్ చేశారు. రియల్ మ్యాచ్ అనుకొని ఎంజాయ్ చేసిన అభిమానులకు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆ ట్విస్ట్ ఏంటంటే.. అది రియల్ మ్యాచ్ కాదు ఫేక్ గేమ్ అని. ఫిఫా 23 గేమ్ప్లే(ఆన్లైన్ గేమ్)లో భాగంగా ఒక గేమింగ్ కంపెనీ దీనిని రూపొందించింది. మాములుగా యూట్యూబ్లో మనం ఏదైనా మ్యాచ్ వీక్షిస్తే.. ఒరిజినల్కు, డూప్లికేట్కు తేడా ఇట్టే తెలిసిపోతుంది. కానీ సదరు యూట్యూబ్ చానెల్ మాత్రం మ్యాచ్ రెజల్యూషన్(క్వాలిటీ) తగ్గించి గేమింగ్ను కాస్త రియల్ గేమ్లాగా చూపించారు. దూరం నుంచి చూస్తే మాత్రం అచ్చం రియల్ మ్యాచ్లానే కనిపిస్తోంది. కాస్త దగ్గరి నుంచి పరిశీలిస్తే కానీ అది బొమ్మల గేమ్ అని అర్థమవుతుంది. అంత మాయ చేశారు యూట్యూబ్ నిర్వాహకులు. అయితే నిజంగానే జపాన్, జర్మనీలు ఒకే గ్రూప్లో ఉండడంతో ఎవరికి అనుమానం రాలేదు. చిత్రమైన విషయం ఏంటంటే.. ఫేక్ మ్యాచ్ను ఒరిజినల్ అనుకొని దాదాపు 40వేల మంది వీక్షించారు. ఇక ఫిఫా వరల్డ్కప్లో నాలుగుసార్లు చాంపియన్ అయిన జర్మనీ గ్రూప్ దశలో వెనుదిరగ్గా.. జపాన్ ప్రీక్వార్టర్స్లో ఇంటిబాట పట్టింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం! -
చట్టానికి దొరక్కుండా... ఆన్లైన్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: కలర్ ప్రిడెక్షన్ గేమ్.. లోన్ యాప్స్.. నిర్వహణలో ఉన్న లోపాల కారణంగానే విషయం పోలీసు కేసుల వరకు వెళ్లిందని చైనీయులు భావిస్తున్నారా? అంటే అవుననే జవాబు చెబుతున్నారు సైబర్ క్రైమ్ అధికారులు. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ విషయంలో చట్టానికి దొరక్కుండా వ్యవహారాలు సాగిస్తున్నారని చెబుతున్నారు. ఇటీవల కాలంలో అందుబాటులోకి వస్తున్న ఆన్లైన్ గేమ్స్లో అత్యధికం చైనీయులకు సంబంధించినవే అని స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలను పరిగణనలోకి తీసుకుని ఈ గేమింగ్ యాప్స్పై చర్యలకు అవకాశాలను అన్వేషిస్తున్నట్లు ఓ అధికారి వ్యాఖ్యానించారు. గెలిపిస్తూ బానిసలుగా మార్చి.. ఎదుటి వ్యక్తికి తమ గేమ్కు బానిసలుగా మార్చడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న వాళ్లు (ప్రధానంగా యువత) వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. మొదట వాటిని ఫ్రీగా ఇచ్చి.. ఇలా తమ గేమ్కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్లో ఓడిపోయేలా చేస్తారు. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన వారిలో కలిగిస్తారు. దీనికోసం టిప్స్ ఇస్తున్నామంటూ కొన్ని యూసీ పాయింట్లను ఉచితంగా ఇస్తారు. ఆడే వ్యక్తి వీటికి అలవాటుపడిన తర్వాత యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ సందేశాలు పంపిస్తారు. వాటికి అవసరమైన రుసుం డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లించాలని షరతు పెడతారు. అప్పటికే ఈ గేమ్స్కు బానిసలుగా మారుతున్న వాళ్లు తప్పనిసరై డబ్బు చెల్లించి ముందుకు వెళ్తున్నారు. ఆ గేమ్ ఉచితం కావడంతో... ఇలా భారీ మొత్తాలు కోల్పోయిన అనేక మంది బాధితులు, వారి తల్లిదండ్రులు పోలీసులకు ఆశ్రయిస్తున్నారు. వీరి ఫిర్యాదులతో కేసులు నమోదు చేస్తున్నప్పటికీ చర్యలకు మాత్రం ఆస్కారం ఉండట్లేదు. గేమ్ ఆడటానికి డబ్బు వసూలు చేస్తే ఆ కంపెనీపై చర్యలు తీసుకోవచ్చు. అందుకే గేమ్ను ఉచితంగా అందిస్తున్న చైనా కంపెనీలు యూసీ పాయింట్ల పేరుతో డబ్బు వసూలు చేస్తున్నారు. ఆ గేమ్ ప్రారంభంలో ఎక్కడా ఈ చెల్లంపుల విషయం ఉండదు. ఈ నేపథ్యంలోనే కొన్ని గేమింగ్ యాప్స్పై గేమింగ్ చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉండట్లేదు. జీపీఎస్ మార్చడంతో ఇబ్బంది ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్లైన్ గేమింగ్కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్ను ఓపెన్ చేస్తే.. జీపీఎస్ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్పై సందేశం కనిపించేలా చేస్తారు. దీంతో వీటికి బానిసలుగా మారిన అనేక మంది ఫేజ్ జీపీఎస్ యాప్స్ను ఆశ్రయిస్తున్నారు. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: నష్టాలకు సాకు... బస్సులకు బ్రేక్) -
గేమింగ్, క్యాసినోలపై జీఎస్టీ ఉంటుందా? లేదా?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై పన్ను పెంచాలన్న ప్రతిపాదనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన ప్యానెల్ తన పని పూర్తి చేసింది. నివేదికను రెండు రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు అందించనుంది. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. మంత్రుల గ్రూపు సమర్పించే నివేదికపై ఈ నెల చివర్లో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో భేటీ అయ్యే జీఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకోనున్నారు. చదవండి:Kia Seltos:కియా మరోసారి అదరగొట్టింది,సెల్టోస్ కొత్త రికార్డు గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్, క్యాసినోల స్థూల వ్యాపారంపై 28 శాతం జీఎస్టీ విధించాలని లోగడ మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. దీన్ని ఆయా పరిశ్రమలు వ్యతిరేకిస్తున్నాయి. క్యాసినోలపై పన్నును 28 శాతానికి పెంచడం పట్ల మరోసారి చర్చించాల్సి ఉందంటూ గోవా కోరింది. దీంతో మరింతగా చర్చించి నివేదిక ఇవ్వాలని మంత్రుల బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ కోరడం గమనార్హం. ఇందులో భాగంగా పరిశ్రమకు చెందిన భాగస్వాములతో మంత్రుల బృందం సమావేశమై వారి అభిప్రాయాలను కూడా తీసుకుంది. చదవండి: Maruti Suzuki Swift S-CNG వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే! -
క్యాసినో,ఆన్లైన్ గేమింగ్పై భారీ జీఎస్టీ.. ఎంతంటే!
గేమింగ్ ఇండస్ట్రీపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం చివరిలో ఆన్లైన్ గేమింగ్పై ఎంత జీఎస్టీ విధించాలనే అంశంపై ఓ స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది. గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు,మహారాష్ట్ర ఆర్థిక మంత్రులు,తెలంగాణకు చెందిన రెవెన్యూ అధికారులు ఆన్లైన్ గేమింగ్పై ట్యాక్స్ విధింపును ఖరారు చేయనున్నట్లు సమాచారం. ఈ మంత్రుల బృందానికి మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా నాయకత్వం వహించనున్నారు. దేశంలో బెట్టింగ్, జూదంతో పాటు సరిసమానంగా ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధించాలని మంత్రుల ప్రతిపాదన ఉంది. ఆ ప్రతిపాదనల మేరకు 28 శాతం గేమింగ్పై జీఎస్టీ పడనుంది. జీఎస్టీ ఖరారు ఎప్పుడంటే ఆన్లైన్ గేమింగ్పై జీఎస్టీని ఖరారు చేయడానికి ఆర్ధిక మంత్రుల బృందం జూలై 23న బెంగళూరులో భేటీ కానున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఆయా రాష్ట్రాల ఆర్థిక మంత్రుల బృందం ప్రతిపాదనను ఫెడరల్ జీఎస్టి కౌన్సిల్ పరిశీలిస్తుంది. దీంతో పాటు ఆన్లైన్ గేమ్లో పెట్టే బెట్టింగ్పై 28 శాతం జీఎస్టీ విధించాలనే ప్రతిపాదనను కూడా రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం పరిశీలిస్తుంది. క్యాసినోల విషయంలో, ఎంట్రీ పాయింట్ వద్ద చెల్లించిన మొత్తంపై ట్యాక్స్ విధించాలని నిర్ణయించబడింది. ప్రతిసారి కాకుండా చిప్స్ కొనుగోలు చేసేటప్పుడు మాత్రమే ఈ జీఎస్టీ ఉండనుంది. హార్స్ రైడింగ్లో పందెం మొత్తంపై 28 శాతం జిఎస్టి విధించే ప్రస్తుత పద్ధతి కొనసాగుతుందని ప్రతిపాదించబడింది. -
క్యాసినోలు,ఆన్లైన్ గేమ్స్పై 28 శాతం జీఎస్టీ?
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలపై 28 శాతం జీఎస్టీ విధించాలన్న ప్రతిపాదనపై ఈ వారంలో సమావేశమయ్యే జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించనుంది. చండీగఢ్లో ఈ నెల 28, 29 తేదీల్లో జీఎస్ట్ కౌన్సిల్ భేటీ కానుంది. ఆన్లైన్ గేమింగ్ను యూజ ర్ చెల్లించే ప్రవేశ రుసుం సహా పూర్తి విలువపై పన్ను విధించాలని మేఘాలయ ముఖ్యమంత్రి కోనార్డ్సంగ్మ అధ్యక్షతన మంత్రుల గ్రూపు సిఫా రసు చేసింది. రేస్ కోర్స్లకు బెట్టింగ్ పూర్తి విలువపై విధించాలని సూచించింది. అదే క్యాసినోలు అయితే ఆడేవారు కొనుగోలు చేసే చిప్స్/కాయిన్స్ విలువపై విధించాలని సిఫారసు చేసింది. ఇలా అన్ని రకాల ఫీజులు, చార్జీలు, పందెం విలువపై 28 శాతం జీఎస్టీ రేటును మంత్రుల గ్రూపు సిఫారసు చేయడం గమనార్హం. ఆహారం, పానీయాలపైనా ఇదే పన్ను రేటు వర్తించనుంది. అంటే స్థూల విలువపై పన్ను ఉండాలన్నది మంత్రుల గ్రూపు ప్రతిపాదన. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై 18% జీఎస్టీ అమలవుతోంది. కానీ, పరిశ్రమ మాత్రం పన్ను పెంపును వ్యతిరేకిస్తోంది. -
ఆన్లైన్ బెట్టింగ్ ముఠా అరెస్టు
అమీర్పేట: గుజరాత్ కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లు నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు పట్టుకున్నారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా పట్టుబడ్డ వారి నుంచి రూ.1.15 కోట్ల నగదు, సెల్ ఫోన్లు, క్యాష్ కౌంటింగ్ మిషన్ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన వివరాలను ఇన్స్పెక్టర్ సైదులు, డీఐ రాంప్రసాద్లు వెల్లడించారు. గుజరాత్కు చెందిన విశాల్ పటేల్, కమలేష్రావత్, పటేల్ హితేష్ అంబాల, ధర్మేంద్ర భాయ్లు నగరంలోని గౌలిగూడ గురుద్వార, గౌలిపుర పరిసర ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు గుజరాత్ ప్రధాన కేంద్రంగా ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు వేసి ప్రచారం చేస్తారు. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ల ద్వారా అతి తక్కువ కాలంలో లక్షలు సంపాదించి ఆపై కోటీశ్వరులుగా ఎదుగుతారని నమ్మిస్తారు. సదరు వెబ్సైట్లో పొందుపర్చిన అందర్ బహార్, ఫుట్బాల్, క్రికెట్, సూపర్ ఓవర్, తీన్పత్తి వంటి గేమ్లను డౌన్లోడ్ చేసుకునే వారికి బెట్టింగ్లలో పాల్గొనే వీలు కల్పిస్తారు. కాగా నగరంలో వీరి వలలో పడిన వారినుంచి డబ్బులు తీసుకునేందుకు రాగా..పక్కా సమాచారం మేరకు బీకేగూడ పార్కు వద్ద మాటువేసి పోలీసులు విశాల్ పటేల్, కమలేష్ రావత్లను పట్టుకున్నారు. వీరి వద్ద రూ.2 లక్షలు లభించాయి. వీరిచ్చిన సమాచారంతో గౌలిగూడలో ఒక ఇంటికి వెళ్లి సోదాలు చేయగా లోపల పటేల్ హితేష్ అంబాల కనిపించాడు. ఇతని వద్ద రూ.1.13 కోట్లు లభించాయి. ముగ్గుర్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ప్రధాన నింధితుడు ధర్మేష్ భాయ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. (చదవండి: అంతా కవరింగే! ఒట్టి మాటలే తప్ప ప్లాస్టిక్ నిషేధం నై) -
టీమిండియా స్పాన్సర్కు భారీ షాక్...!
టీమీండియాకు జెర్సీ అందిస్తోన్న ప్రముఖ ఆన్లైన్ గేమింగ్ యాప్ మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఏమ్పీఎల్)కు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్నిచ్చింది. కర్ణాటకలో ఎమ్పీఎల్ను నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్గేమింగ్, గ్యాబ్లింగ్, బెట్టింగ్ యాప్స్పై కర్ణాటక ప్రభుత్వం తీవ్రస్థాయిలో విరుచుకపడింది. కర్ణాటకలో నిషేధానికి గురైన తొలి ఆన్గేమింగ్ యాప్గా ఎమ్పీఎల్ నిలిచింది. అక్టోబర్ 5 నుంచి ఎమ్పీఎల్పై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించినట్లు తెలుస్తోంది. ఎమ్పీఎల్ యాప్ను వాడుతున్న యూజర్లకు ‘ మీ రాష్ట్రంలో ఫాంటసీ స్పోర్ట్స్ ఆడేందుకు నిషేధం ఉన్నట్లు సందేశాన్ని చూపిస్తోన్నట్లు పలు యూజర్లు పేర్కొన్నారు. చదవండి: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1120కిమీ ప్రయాణం..! భారత్లో లాంచ్ ఎప్పుడంటే.. ఆన్లైన్ గేమింగ్ బూమ్...! దేశ వ్యాప్తంగా ఆన్లైన్ గేమింగ్, గ్యాబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ను యూజర్లు భారీ ఎత్తున వాడుతున్నారు. దీంతో పలు ఇన్వెస్టర్లు ఆయా బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ యాప్స్పై విచ్చలవిడిగా పెట్టుబడులను పెడుతున్నారు. ఇటీవలి కాలంలో విదేశీ ఇన్వెస్టర్లు మిలియన్ డాలర్లకు పైగా గేమింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేయగా..ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్ననిర్ణయంతో గేమింగ్ రంగానికి భారీ దెబ్బ తగిలే అవకాశం ఉందని గేమింగ్ రంగ నిపుణులు భావిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తరువాత ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్పై నిషేధం విధించిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. ఇంతకుముందు ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్స్పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించిన బిల్లును అక్కడి హైకోర్టు కొట్టివేసింది. డ్రీమ్-11 ఇంకా నడుస్తోంది...! టైగర్ గ్లోబల్ ఇన్వెస్ట్చేసిన డ్రీమ్ 11 కర్ణాటకలో ఇంకా పనిచేస్తోన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఫాంటసీ ఆన్లైన్ గేమ్స్ ఎమ్పీఎల్, పేటిఏమ్ ఫస్ట్ గేమ్స్పై మాత్రం కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించడం గమనార్హం. కాగా ఈ విషయంపై ఎమ్పీఎల్, పేటీఎం స్పందించలేదు. చదవండి: అప్పుడు సినిమాలో...ఇప్పుడు నిజజీవితంలో...సీన్ రిపీట్..! -
కాసుల వర్షం: రూ.29వేల కోట్లుకు చేరనున్న గేమింగ్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశంలో గేమింగ్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి 3.9 బిలియన్ డాలర్లకు (రూ.29,000 కోట్లు సుమారు) చేరుకుంటుందని ఐఏఎంఏఐ వన్ప్లస్, రెడ్సీర్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. గేమింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి కనిపిస్తోందని.. గడిచిన ఆరు నెలల్లోనే ఈ పరిశ్రమలోకి బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. ‘‘భారత్లో ప్రస్తుతం మొబైల్ గేమర్లు (మొబైల్పై గేమ్లు ఆడేవారు) 43 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 65 కోట్లకు పెరుగుతుంది. గేమింగ్ రంగాన్ని ప్రస్తుతం మొబైల్ గేమింగ్ శాసిస్తోంది. ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ 1.6 బిలియన్ డాలర్ల మేర ఉంటే.. ఇందులో మొబైల్ గేమింగ్ వాటా 90 శాతంగా ఉంది’’అంటూ ఈ నివేదిక పేర్కొంది. గేమింగ్ను అమితంగా ప్రేమించే వారిలో 40 శాతం మంది సగటున ప్రతీ నెలా రూ.230 చొప్పున ఇందుకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి డిజిటల్ గేమ్స్ వృద్ధికి సాయపడింది. యాప్ డౌన్లోడ్లు 50 శాతం పెరిగాయి’’ అని వివరించింది. గడిచిన కొన్నేళ్లలో ఈ–గేమింగ్ పరిశ్రమ అద్భుతంగా వృద్ధి చెందినట్టు వన్ప్లస్ ఇండియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవీన్ నక్రా పేర్కొన్నారు. గేమింగ్ పరికరాలకూ పీఎల్ఐ పథకం! ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని గేమింగ్ పరికరాల తయారీకి విస్తరించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్గౌర్ తెలిపారు. ఐఏఎంఏఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో గౌర్ పాల్గొన్నారు. ‘‘గేమింగ్ కన్సోల్స్కు ఎంతో ఆదరణ ఉంది. ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు ఇతర వనరులుగా ఉన్నాయి. దేశం లో గేమింగ్ వ్యవస్థకు ప్రోత్సాహం, బలోపేతానికి వీలుగా సమాచార శాఖ, సాంస్కృతిక శాఖతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం’’ అని గౌర్ చెప్పారు. చదవండి: జస్ట్ ఒక్క మొబైల్ గేమ్తో 75 వేల కోట్లు సొంతం...! -
ఊహించని లాభాలను ఆర్జించిన డ్రీమ్-11, ఎంతంటే..?
ముంబై: ప్రముఖ వెబ్ ఆధారిత ఫాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ డ్రీమ్-11 లాభాలను పొందింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.180 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. భారత్లో డ్రీమ్-11 ఫాంటసీ గేమింగ్ విభాగంలో యునికార్న్ సంస్థగా నిలిచింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.87 కోట్ల నష్టాలను చవిచూసింది. డ్రీమ్-11 నిర్వహిస్తున్న స్పోర్ట్టా టెక్నాలజీస్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో 2.5 రెట్లు గణనీయ వృద్ధిని నమోదుచేసింది. 2019లో డ్రీమ్-11 ఆదాయం సుమారు రూ. 775.5 కోట్ల నుంచి 2020లో రూ. 2,070 కోట్ల వరకు పెరిగింది. ఈ రేంజ్లో కంపెనీ ఆదాయ అభివృద్దికి వినూత్న మార్కెటింగ్ వ్యూహాలు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: బ్యాంకులకు భారీ షాక్ ? అప్పులు చెల్లించలేని స్థితికి చేరిన మరో సంస్థ ! ప్రముఖ ప్రైవేట్ కేర్ రిటైలర్ నైకా కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.62 కోట్ల ఆదాయాన్ని గడించిన స్టార్టప్గా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో డ్రీమ్ స్పోర్ట్ 400 మిలియన్ డాలర్లను సేకరించి, కంపెనీ మార్కెట్ విలువ సుమారు 5 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డ్రీమ్ స్పోర్ట్స్ అడ్వర్టైజింగ్పై దృష్టి సారిస్తూ సుమారు ఈ ఏడాదిలో సుమారు రూ.1,328 కోట్లను ఖర్చు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.785 కోట్లను ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. డ్రీమ్-11ను 2008లో జైన్, భవిత్ శేత్తో కలిసి ఏర్పాటుచేశారు. డ్రీమ్ 11 సుమారు 9 కోట్లపైగా కస్టమర్లను కలిగి ఉంది. ఫాంటసీ క్రికెట్, సాకర్, కబడ్డీ, హాకీలపై ఆన్లైన్ బెట్టింగ్ యాప్గా నిలిచింది. డ్రీమ్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఫార్మాట్ జూలైలో 'గేమ్ ఆఫ్ స్కిల్' అని సుప్రీంకోర్టు పేర్కొంది. చదవండి: బిలియనీర్ల కొంపముంచిన చైనా సంక్షోభం.. ! వందల కోట్లు ఆవిరి..! -
ఆన్ లైన్ గేమ్స్: ఇక వారంలో మూడు గంటలే ఆడాలి!
ఆన్లైన్ గేమ్స్కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే చైనా ఆన్ లైన్ వీడియో గేమ్స్పై ఆంక్షలు విధించింది. సెప్టెంబర్ 1 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు వారంలో కేవలం 3 గంటలు మాత్రమే ఆన్లైన్ వీడియో గేమ్స్ ఆడుకునేలా చైనా ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్ ప్రెస్ అండ్ పబ్లికేషన్ అడ్మినిస్ట్రేషన్ (NPPA) సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి శుక్రవారాలు, వీకెండ్స్, ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు గేమ్స్ ఆడుకొనేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది ఇదిలా ఉంటే చైనా ఇలా వీడియో గేమ్స్పై నిబంధనలు విధించడం ఇదే తొలిసారి కాదు 2019లో రోజుకు గంటన్నర, ప్రభుత్వ సెలవు దినాల్లో మూడు గంటల చొప్పున ఆన్లైన్ గేమ్స్ ఆడుకునే అవకాశాన్ని కలిపించింది. చైనా ప్రభుత్వంపై అసంతృప్తి చైనా ప్రభుత్వం వీడియో గేమ్స్పై విధించిన ఆంక్షలపై స్థానిక గేమింగ్ కంపెనీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. గేమింగ్ రీసెర్చ్ సంస్థ 'వెంచర్ బీట్' రిపోర్ట్-2020 ప్రకారం..2020 సంవత్సరం నాటికి చైనాలో 727 మిలియన్ల మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా.. వారిలో 97శాతం మంది 18 నుంచి 24ఏళ్లలోపు వాళ్లే అధికంగా ఉన్నారు. అయితే తాజాగా ప్రభుత్వ నిర్ణయం అక్కడి గేమింగ్ కంపెనీ యాజమాన్యాల గొంతులో చిక్కిన పచ్చి వెలక్కాయ సమస్యలా మారింది. కాగా, 727 మిలియన్ల మంది వీడియో గేమ్ ఆడగా గేమింగ్ కంపెనీలకు వచ్చే ఆదాయం 41బిలియన్ డాలర్లుగా ఉంది. 2020లో 727 మిలియన్ల మంది గేమ్ ఆడుతుండగా 2021 ఆ సంఖ్య 743.5మిలియన్ డాలర్లకు చేరింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. 2025నాటికి చైనాలో గేమ్ ఆడేవారి సంఖ్య 781.7 మిలియన్లకు చేరుతుందని వెంచర్ బీట్ అంచనా వేసింది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీకి చెందిన వీడియో గేమింగ్ కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. ఈ తరుణంలో చైనా ప్రభుత్వ నిర్ణయం గేమింగ్ కంపెనీలకు పెద్ద తలనొప్పిగా మారినట్లైంది. చదవండి : ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు -
జుపీ నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: నైపుణ్యాల ఆధారిత ఆన్లైన్ గేమింగ్ సంస్థ జుపీ తాజాగా 30 మిలియన్ డాలర్లు సమీకరించింది. 500 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ ఇండియా, ఓరియోస్ వెంచర్ పార్ట్నర్స్, అమెరికాకు చెందిన వెస్ట్క్యాప్ గ్రూప్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు సంస్థ వివరించింది. ఈ నిధులను కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ఉపయోగించనున్నట్లు తెలిపింది. 100 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్తో ఆరు నెలల క్రితమే నిధులు సమీకరించగా ప్రస్తుతం ఇది అయిదు రెట్లు పెరగడం గమనార్హం. మొత్తం మీద ఇప్పటిదాకా 49 మిలియన్ డాలర్లు అందుకున్నట్లు జుపీ తెలిపింది. ప్రస్తుతం 1 కోటి మంది పైగా యూజర్లు ఉన్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు దిల్షేర్ సింగ్ వివరించారు. -
గేమింగ్ గోల్మాల్
చిత్తూరు అర్బన్: కరోనా కాలంలో వర్క్ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించవచ్చనే మాయమాటలు నమ్మి పలువురు మహిళలు మోసపోయారు. ఆన్లైన్ గేమింగ్స్ ఆడుతూ అందులో పెట్టుబడి పెట్టి రూ.లక్షలు పోగొట్టుకున్నారు. వీరు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి విచారించిన చిత్తూరు పోలీసులు ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన జి.శివకేశవ్ (33), రాగాల కృష్ణ చైతన్య (35), బచ్చు కిరణ్ (29), పరస శివప్రసాద్ (32)లను అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను చిత్తూరు క్రైమ్ సీఐ రమేష్ మీడియాకు గురువారం వివరించారు. మోసాలకు పాల్పడతారు ఇలా... గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన బొబ్బిలి నవకిషోర్ అనే యువకుడు ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఇతను పలు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ను (ఏపీకే ఫైల్స్) రూపొందించాడు. ఇంట్లో ఉంటూ వర్క్ఫ్రమ్ చేసుకుంటూ ఆదాయానిచ్చే మార్గాలు చెబుతానంటూ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టాడు. వాటిని గమనించిన పలువురు మహిళలు వాట్సాప్ మెసేజ్ ద్వారా నవకిషోర్ను సంప్రదించగా ఓ ఆండ్రాయిడ్ ఫైల్ను పంపి, లింక్ను క్లిక్ చేయడం ద్వారా ఆన్లైన్ గేమింగ్లోకి ప్రవేశించేలా చేశాడు. ఇక్కడ తొలుత రూ.10, రూ.50 పెట్టుబడి పెట్టమని చెబుతూ బెట్టింగులు ఆడిస్తూ రూ.700 వరకు లాభం వచ్చేలా..ఈ మొత్తం గేమింగ్ ఆడేవారి బ్యాంకు ఖాతా ద్వారా విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించాడు. ఓ దశలో గేమింగ్ ఆడేవారి వద్ద రూ.50 వేలు ఉన్నా..దాన్ని నగదుగా మార్చుకునే అవకాశం ఉండదు. ఈ మొత్తం విత్డ్రా కావాలంటే బెట్టింగ్ కొద్దిగా పెంచాలని చెబుతూ దశల వారీగా రూ.వేలకు వేలు గేమింగ్లో పెట్టుబడి పెట్టించాడు. అరెస్టైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్ బాధితులు గేమింగ్లో పెట్టిన డబ్బులను కాజేయడానికి ఫిలిప్పీన్స్లో పైలట్ శిక్షణ తీసుకుని ఇటీవల తన సొంతూరుకు వచ్చిన ప్రకాశం జిల్లా చీరాల కొత్తపేటకు చెందిన జి.శివకేశవ్ను రంగంలోకి దించాడు. బీటెక్ చదువుకున్న శివకేశవ్ తన స్నేహితులైన కృష్ణచైతన్య, కిరణ్ ద్వారా చీరాలలో షెల్టైల్ ఇన్ఫో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించి దాదాపు 100 మంది నుంచి ఆధార్ కార్డు జిరాక్స్ ద్వారా వారిపేరిట సిమ్కార్డులు కూడా తీసుకున్నాడు. ప్రభుత్వ పథకాలు తీసుకోవడానికి కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపిస్తామంటూ ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు తెరచి, వాటి ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవల యూజర్ ఐడీ, పాస్వర్డ్ను నవకిషోర్కు అందజేశాడు. ఇలా చేసినందుకు ఒక్కో బ్యాంకు ఖాతాకు రూ.10 వేల నుంచి రూ.15 వేలు చొప్పున నవకిషోర్ ద్వారా శివకేశవ్ అతని స్నేహితులకు అందింది. తుదిగా గేమింగ్లో బాధితులు జమచేసిన నగదును ఇంటర్నెట్ బ్యాకింగ్ ద్వారా నవకిషోర్ తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. ఈ గేమింగ్ ఉచ్చులోకి చిత్తూరు జిల్లా వి.కోటకు చెందిన మానస, బంగారుపాళ్యంకు చెందిన టి.హేమలత, చిత్తూరుకు చెందిన హర్షితలు చిక్కుకుని గత నాలుగు నెలల్లో రూ.3.10 లక్షలు మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ విభాగం నిందితులైన శివకేశవ్, కృష్ణచైతన్య, కిరణ్, శివప్రసాద్లను చిత్తూరులో అరెస్ట్ చేశారు. బాధితుల్లో ఒకరైన మానస వెచ్చించిన రూ.61,500ను తిరిగి ఆమె ఖాతాకే పోలీసులు వేయించారు. నకిలీ ఖాతాల్లో ఉన్న రూ.5.13 లక్షల నగదును ఫ్రీజ్ చేశారు. ప్రధాన నిందితుడు నవకిషోర్ను అరెస్టు చేయడానికి లుక్ అవుట్ నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ వ్యవహారంలో బాధితులు, మోసగాళ్లకు అసలు పరిచయాలు లేకపోవడం, ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడుకోకపోవడం కొసమెరుపు. -
రాత్రికి రాత్రే డబ్బులు మాయం..
మార్గాలు వేరు.. గమ్యం ఒకటే! చదువుకుని ఆర్థికంగా స్థితిమంతులైనవారు కూడా ఇలాంటి మోసాల వలలో చిక్కుంటున్నారు. విలాసవంతమైన జీవనం కోసం కావచ్చు, కోవిడ్ వల్ల వచ్చిన నష్టాల వల్ల కావచ్చు. కారణమేదైనా అదనపు ఆదాయం కోసం అన్వేషిస్తుంటారు. ఆన్లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడానికి బెట్టింగ్ యాప్లను ప్రభుత్వాలు నిషేధించినప్పటికీ, కొత్త కొత్త మార్గాల ద్వారా యాప్ అప్లికేషన్స్ను సెండ్ చేస్తుంటారు. ఈ యాప్ల పట్ల ఆకర్షితులు అయినవారు మోసపోతుంటారు. మార్గాలు వేరు కానీ, మోసగాళ్ల గమ్యం ఒకటే... జనం దగ్గర డబ్బులు లాగడం. రాధిక (పేరు మార్చడమైనది) గేమింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకుంది. తనలాగే దేశవ్యాప్తంగా దాదాపు 3 వేల మంది డబ్బులు పోగొట్టుకున్న విషయాన్ని తెలిపింది. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ మరెవ్వరూ తమలా ఆన్లైన్ గేమింగ్ ద్వారా డబ్బులు పోగొట్టుకోకూడదని తాము మోసపోయిన విధానాన్ని తెలియజేసింది... ‘‘రెండేళ్ల క్రితం డిగ్రీ పూర్తయ్యాక నేను ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగినిగా చేరాను. వచ్చే జీతంలో కొంత ఈఎమ్ఐలకు పోతుంది. మరికొంత అదనపు ఆదాయం కావాలనుకున్నాను. ఈ విషయం గురించి నా స్నేహితులతో మాట్లినప్పుడు ఓ గేమింగ్ యాప్ గురించి చెప్పారు. దాని ద్వారా వాళ్లు రోజూ డబ్బులు సంపాదిస్తున్న విధానం చూసి, నేను ఆ గేమింగ్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాను. మన బదులుగా యాప్ వాళ్లే గేమ్ ఆడి, అందులో వచ్చిన పాయింట్స్ ఆధారంగా మనకు డబ్బులు ఇస్తారు. అందులో జాయిన్ అవాలంటే ఆ యాప్లోనే ముందు రూ. 10,000తో అకౌంట్ ప్రారంభించాలి. ఉదయం పెట్టుబడి పెడితే, రాత్రికి రిటన్స్ వచ్చేవి. రోజూ రూ.500 నుంచి రూ.700 వరకు లాభం వస్తుంది. ఏ రోజు డబ్బు ఆ రోజు అకౌంట్లో పడిపోతుంది. అలా వచ్చినప్పుడు 2 నుంచి 3 వేలు అదనంగా మరికొంత ఇన్వెస్ట్ చేయమనే సూచనలు యాప్లో కనిపించేవి. నేను నెల రోజులుగా ఆ యాప్ అకౌంట్లో మెంబర్గా ఉన్నాను. నా ఫ్రెండ్స్ రెండు నెలలుగా ఇందులో ఉన్నారు. వచ్చిన లాభంలో 40 శాతం ఆ యాప్ పోర్టల్ వారే కమిషన్ రూపేణా కట్ చేసుకుంటారు. కొత్తగా ఎవరినైనా పరిచయం చేస్తే ఆ పర్సంటేజ్ మనీ కూడా మనకే వస్తుంది. నేను అలా మరో ఇద్దరిని పరిచయం చేశాను. యాప్లో ఉన్నవారందరినీ టెలీగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. ∙∙ రోజూ లాభం చూస్తున్నాను కాబట్టి తర్వాత రూ. 20,000 పెట్టుబడి పెట్టాను. రూ.10,000 కన్నా రూపాయి తక్కువ ఉన్నా ఎలాంటి లాభం రాదు. ఒకసారి ఉదయం నేను డబ్బు అకౌంట్ లో వేసే సమయానికి అమౌంట్ మైనస్లోకి వెళ్లింది. ప్లస్లోకి రావాలంటే అదనంగా డబ్బు కట్టాలన్నారు. అలా రూ.50,000 వరకు కట్టాను. కానీ, అకౌంట్ మైనస్ చూపిస్తోంది. ఇదే విషయాన్ని టెలిగ్రామ్ యాప్ ద్వారా కూడా గ్రూప్లో ఉన్నవారితో మాట్లాడాను. మరికొందరికి కూడా ఇదే సమస్య వచ్చింది. అయితే, ఇదేదో మిస్టేక్ జరిగింది. కంపెనీ వాళ్లతో మాట్లాడి సెట్ చేస్తాం అన్నారు. మరో రూ.10,000 చెల్లిస్తే 20 శాతం, రూ.20,000 చెల్లిస్తే 50 శాతం, రూ.30,000 చెల్లిస్తే వంద శాతం అమౌంట్ తిరిగి మీ మీ అకౌంట్లలోకి వస్తుంది అని చెప్పారు. నేను దాదాపు అలా లక్షన్నరూపాయల వరకు నా క్రెడిట్ కార్డుల నుంచి యాప్ అకౌంట్లో వేశాను. నాతోపాటు మిగతా వాళ్లు కూడా డబ్బు అకౌంట్లో వేశారు. ముందు రూ.40,000 వేలు అకౌంట్లో చూపించింది, కానీ విత్డ్రా ఆప్షన్ లేకపోవడంతో ‘రాత్రి మొత్తం బెట్టింగ్ జరుగుతుంది, మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు డబ్బును విత్డ్రా చేయడం కుదరదు’ అన్నారు. సరే అనుకున్నాను. మరుసటి రోజు ఉదయం అకౌంట్ చూస్తే జీరో బ్యాలెన్స్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ నుంచి యాప్ పోర్టల్ వాళ్లు ఎగ్జిట్ అయిపోయారు. దేశవ్యాప్తం గా దాదాపు 3 వేల మంది లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం అనే విషయం అర్ధమైంది. రోజుకు రూ.500–రూ.700 వరకు వస్తాయనుకుంటే వేలల్లో, లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాం. ఇలా ఎవరూ ఆన్లైన్లో డబ్బులు పెట్టి మోసపోకూడదని ఈ విషయాన్ని చెబుతున్నాను’’ అని వివరించారు రాధిక. ఆశనే ఆసరా చేసుకొని క్రైమ్ సోషల్మీడియాలో బాగా పేరున్నవారిని ఆయుధంగా చేసుకొని, ఇలాంటి మనీ ఫ్రాడ్కి తెరలేపుతారు. వారి మాటలను మిగతా వాళ్లు నమ్ముతారనే ఆశే ఇలాంటి ఫ్రాడ్స్కి పెట్టుబడి. జనం ఆశను ఆసరా చేసుకొని క్రైమ్ చేస్తారు. సోషల్మీడియాలో ఎవరి ద్వారా అయినా సరే.. ► ఏదైనా లింక్ ద్వారా ఏ అప్లికేషన్ మనకు వచ్చినా వాటిని డౌన్లోడ్ చేసుకోకూడదు. ∙ ► యాప్ స్టోర్, ప్లే స్టోర్ నుంచి మాత్రమే యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ► ఆండ్రాయిడ్లో వచ్చే అప్లికేషన్స్ అన్నీ ఎపికె ఫైల్స్ అంటారు. ఐఒఎస్లో వచ్చే ఫైల్స్ అన్నీ డిఎమ్జెడ్ ఫైల్స్ అంటారు. ఈ ఫైల్స్ని లింక్స్ ద్వారా పంపిస్తారు. సోషల్ మీడియాలో పేరున్నవాళ్లను ఎంచుకొని ఈ యాప్స్ గురించి గొప్పగా చెప్పి, వారిని ఇన్ఫ్లూయెన్స్ చేస్తారు. పేరున్నవారు, తెలిసినవారు వీటిని చెప్పారు కదా అని నమ్మి ఆ దొంగ యాప్స్ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఆ యాప్స్లలో డబ్బులు పెట్టించి, గెలిచినట్టుగా 4, 5 సార్లు చూపించి, తర్వాత మైనస్లో అకౌంట్ చూపిస్తారు. డబ్బులు మరిన్ని వేస్తే, మరింత మొత్తం వస్తుందని నమ్మబలుకుతారు. ఇలా రూ.5000 నుంచి 10 లక్షల వరకు పోగొట్టుకున్నవారున్నారు. ఈ ఫ్రాడ్స్ వాట్సప్ కన్నా టెలీగ్రామ్ గ్రూప్ని ఎంచుకుంటారు. దీనికి కారణం టెలీగ్రామ్లో ఎక్కువమందిని గ్రూప్గా యాడ్ చేయవచ్చు. ఎంతమంది ఎక్కువ మొత్తంలో చేరితే జనంలో అంత నమ్మకం పెరుగుతుంది. దాంతో పాటే మోసమూ పెరుగుతుందని గ్రహించి, జాగ్రత్తపడాలి – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
దూసుకుపోతున్న ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ
న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి ఈ పరిశ్రమ నాలుగు రెట్లు పెరిగి రూ.1,100 కోట్లకు చేరుతుందని కన్సల్టెన్సీ సంస్థ ఈవై అంచనా వేసింది. క్రీడాకారుల్లో నైపుణ్యం, కోవిడ్తో ఇంటికే ఎక్కువ సమయం పరిమితం అవటం, మొబైల్ వినియోగం పెరగడం వంటివి పరిశ్రమ వృద్ధికి కారణాలని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఈ–స్పోర్ట్స్ పరిశ్రమ రూ.250 కోట్లుగా ఉంది. వచ్చే నాలుగేళ్ల పాటు ఏటా 46 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుంది. ఆన్లైన్ గేమింగ్ మాదిరిగా కాకుండా ఈ–స్పోర్ట్స్ అనేది నైపుణ్యం కలిగిన ఆన్లైన్ ఆటలుగా పరిగణిస్తారు. జట్లుగా లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీల రూపంలో టోర్నమెంట్లు, లీగ్లు ఆడి టైటిల్స్ను గెలుచుకుంటారు. 2025 నాటికి దేశీయ ఈ–స్పోర్ట్స్ పరిశ్రమలో క్రీడాకారుల సంఖ్య 15 లక్షలకు, 2.50 లక్షల జట్లకు చేరుతుందని తెలిపింది. ప్రస్తుతం 1.50 లక్షల మంది ప్లేయర్లు, 60 వేల బృందాలున్నాయి. ఇదే సమయంలో భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ ఏటా 66 శాతం వృద్ధి రేటుతో రూ.100 కోట్లకు చేరుతుందని పేర్కొంది. ప్రస్తుతం గ్లోబల్ ప్రైజ్ మనీ భారతీయ ఈ–స్పోర్ట్స్ ప్రైజ్ మనీ 0.6 శాతమే ఉందని.. 2025 నాటికి 2 శాతానికి చేరుతుందని తెలిపింది. ప్రేక్షకులు, ఈ–స్పోర్ట్స్ టోర్నమెంట్ల సం ఖ్య పెరగడంతో ప్రకటనదారులు, ఏజెన్సీలు వ్యూ యర్షిప్ను చేరుకునేందుకు ప్రణాళికలు చేస్తున్నా యని తెలిపారు. ఈ–స్పోర్ట్స్ ఆదాయంలో మెజారిటీ వాటా అయిన ప్రకటనల విభాగం 2025 నాటికి ప్రకటనల ఆదాయం నాలుగు రెట్ల వృద్ధితో రూ.650 కోట్లకు చేరుతుంది. టోర్నమెంట్ స్పాన్సర్షిప్, సిండికేషన్ విభాగాల ఆదాయం ఏటా 45 శాతం వృద్ధి రేటుతో రూ.350 కోట్లకు చేరుతుందని ఈవై ఇండియా పార్టనర్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లీడర్ ఆశీష్ ఫెర్వానీ తెలిపారు. చదవండి: సరికొత్తగా టాటా టియాగో.. ధర ఎంతంటే..! -
హైదరాబాద్ హైద్రాస్ వచ్చేస్తోంది..
హైదరాబాద్: ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమింగ్ ఆడాలనుకునే వారికి సరికొత్త వేదిక అందుబాటులోకి వచ్చింది. ఈ స్పోర్ట్స్ ప్రీమియర్ లీగ్(ఈఎస్పీఎల్) పేరిట అభిమానులను అలరించేందుకు ఈ-ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తరహాలో దేశంలోని ఎనిమిది నగరాలు ఫ్రాంచైజీలుగా ఏర్పడి ఈఎస్పీఎల్లో పాల్గొంటాయి. ఇందులో హైదరాబాద్ హైద్రాస్ పేరిట ఓ జట్టు లాంచ్ అయ్యింది. ఈ జట్టుకు బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రచారకర్తగా ఉన్నారు. సరికొత్త ఆవిష్కరణలతో ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులకు సరికొత్త అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో ఫ్రాంచైజీ యజమానులు హైదరాబాద్ హైద్రాస్ జట్టును తీసుకొచ్చారు. ఆన్లైన్ గేమింగ్పై యువతకు ఉన్న ఆకర్షనను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ హైద్రాస్ పని చేస్తుందని ఫ్రాంచైజీ యాజమాన్యం పేర్కొంది. కాగా, ఈఎస్పీఎల్ తొలి సీజన్లో భాగంగా దేశ వ్యాప్తంగా ఎంట్రీల కోసం ఆహ్వానాలు పంపగా లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. అయితే పరిశీలన అనంతరం 96 జట్లను ఫైనల్ చేయగా, అందులో నుంచి ఎనిమిది జట్లు మాత్రమే తుది దశకు అర్హత సాధించాయి. ఇందులో హైదరాబాద్ హైద్రాస్ ఒకటి. నిన్న మొదలైన ఈఎస్పీఎల్ తొలి సీజన్ దాదాపు రెండున్నర నెలల పాటు వర్చువల్ విధానంలో సాగనుంది. ఇందుకు ప్రైజ్మనీని రూ.25 లక్షలుగా ఖరారు చేయగా, విజేతకు రూ.12 లక్షలు, రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లకు వరుసగా రూ.6 లక్షలు, రూ.3 లక్షల నగదు ప్రోత్సాహం లభించనుంది. ఈఎస్పీఎల్లో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న వారు www.indiatodaygaming.com/espl లో రిజిస్టర్ కావచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈఎస్పీఎల్లో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పంజాబ్, రాజస్థాన్ ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. కరోనా వైరస్ దృష్ట్యా వర్చువల్ రీతిలో జరిగే మ్యాచ్లన్నీ డిస్నీ హాట్స్టార్తో పాటు ఇండియాటుడేకు చెందిన అధికారిక యూట్యూబ్, ఫేస్బుక్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. చదవండి: KL RAHUL: ప్రియసఖితో తొలిసారి.. గతంలో విరుష్క జోడీ కూడా ఇలానే -
రికవరీ బాటలో మీడియా, వినోదం
సాక్షి, హైదరాబాద్ ,బిజినెస్ బ్యూరో: మీడియా, వినోద రంగం దేశంలో ఈ ఏడాది వృద్ధిని నమోదు చేస్తుందని ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2019తో పోలిస్తే పరిశ్రమ గతేడాది మహమ్మారి కారణంగా 24 శాతం తగ్గి రూ.1.38 లక్షల కోట్లు నమోదు చేసింది. 2017 స్థాయికి చేరింది. 2020 చివరి త్రైమాసికంలో చాలా విభాగాల్లో ఆదాయాల్లో రికవరీ నమోదైంది. 2021లో మీడియా, వినోద రంగం 25 శాతం వృద్ధి చెంది రూ.1.73 లక్షల కోట్లను తాకుతుంది. ఏటా సగటున 13.7 శాతం అధికమై 2023 నాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరుతుంది. 2025 నాటికి మీడియా, వినోద రంగం ఆదాయం రూ.2.68 లక్షల కోట్లకు చేరనుంది. జోరుగా ఓటీటీ.. పరిశ్రమలో టెలివిజన్ విభాగం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతేడాది 2.8 కోట్ల మంది కస్టమర్లు 5.3 కోట్ల ఓటీటీ చందాలను కట్టారు. దీంతో డిజిటల్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలు 49 శాతం పెరిగాయి. 2019లో 1.05 కోట్ల కస్టమర్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు చేశారు. ప్రధానంగా డిస్నీ ప్లస్ హాట్స్టార్ మూలంగా గతేడాది వృద్ధికి తోడైంది. ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ గ్రూప్నకు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కంటెంట్ కోసం నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో పెట్టుబడులు పెద్ద ఎత్తున చేశాయి. ప్రాంతీయ భాషల్లో ఉత్పత్తులను తీసుకొచ్చాయి. డేటా ప్లాన్స్తో బండిల్గా రావడంతో 28.4 కోట్ల మంది కస్టమర్లు కంటెంట్ను ఆస్వాదించారు. ఆన్లైన్ గేమింగ్ ఇలా.. 2019లో మీడియా, వినోద రంగంలో 16 శాతం వాటా ఉన్న డిజిటల్, ఆన్లైన్ గేమింగ్ 2020లో 23 శాతానికి ఎగసింది. నాలుగేళ్లుగా ఆన్లైన్ గేమింగ్ విభాగం వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2020లో ఈ విభాగం రూ.7,600 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇది రూ.6,500 కోట్లుగా ఉంది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, ఆన్లైన్ తరగతులతో ఆన్లైన్ గేమింగ్ 18 శాతం వృద్ది సాధించింది. ఆన్లైన్ గేమర్స్ 20 శాతం అధికమై 36 కోట్లకు చేరారు. పలు రాష్ట్రాల్లో నియంత్రణలు ఉన్నప్పటికీ లావాదేవీల ఆధారిత గేమ్స్ ఆదాయం 21 శాతం అధికమైంది. సాధారణ గేమ్స్ ఆదాయం 7 శాతం పెరిగింది. థియేటర్ల ద్వారా ఆదాయం.. సినిమా, వీడియో ఆన్ డిమాండ్ 2019లో రూ.11,900 కోట్లు నమోదైంది. గతేడాది ఇది భారీగా తగ్గి రూ.7,200 కోట్లకు పరిమితమైంది. 2020లో థియేటర్ల ద్వారా ఆదాయం 2019తో పోలిస్తే పావు వంతులోపుకు పడిపోయింది. అయితే డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం కాస్త ఊరటనిచ్చింది. డిజిటల్ రైట్స్ ఆదాయం దాదాపు రెండింతలై రూ.3,500 కోట్లు నమోదైంది. సినిమా నిర్మాణాలు ఆరు నెలలకుపైగా నిలిచిపోవడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. టీవీ, సినిమా, సంగీతం రికవరీకి ఒకట్రెండేళ్లు పడుతుంది. చదవండి: ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక వ్యూహం -
లడ్డూ సరే... లక్షలు కావాలా నాయనా!
అనుకుంటాంగానీ ఆన్లైన్ గేమ్స్ అనేవి నిన్నా మొన్నటి మాట కాదు. వాటి మూలాలు పాకెట్ బేస్ట్ కంప్యూటర్ నెట్వర్కింగ్(1970) జమానాలోనే ఉన్నాయి. మడ్ (మల్టీ యూజర్ డంజన్) తొలితరం ఆన్లైన్ కంప్యూటర్ గేమ్స్లో ఒకటి. ‘ఐలండ్ ఆఫ్ కెస్మై’ తొలితరం కమర్శియల్ గేమ్. 1980లో ‘యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా’ విద్యార్థులు జాన్ టేలర్, కెల్టన్లు ఈ సిక్స్ప్లేయర్స్ గేమ్కు రూపకల్పన చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో 1981లో ‘కెస్మై’ పేరుతో గేమ్డేవలప్మెంట్ కంపెనీ స్థాపించారు. ఇంటర్నెట్ విస్తృతస్థాయిలో అందుబాటులోకి రావడంతో వీడియో గేమ్స్ కన్సోల్ హవా మొదలైంది. ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లే నైపుణ్యం పెరిగింది. ఇక 2000 సంవత్సరంలో మాసివ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్స్ (ఎంఎంఒ)లు ఊపందుకున్నాయి. ఈ జానర్లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్’ బాగా క్లిక్ అయింది. ‘ఎంఎంవో’ జానర్లో వచ్చిన ఆన్లైన్ గేమ్స్ స్టార్వార్స్ గెలాక్సీ, సిటీ ఆఫ్ హీరోస్, స్టార్వార్స్: ది ఓల్డ్ రిపబ్లిక్... మొదలైనవి శబ్భాష్ అనిపించుకున్నాయి. 2010 మలిదశలో ‘బ్యాటిల్ రాయల్ గేమ్ ఫార్మట్’ బాగా పాప్లర్ అయింది. ఫొట్నైట్ బ్యాటీ రాయల్(2017), అపెక్స్ లెజెండ్ (2019), కాల్ ఆఫ్ డ్యూటీ: వార్ జోన్ (2020)... మొదలైనవి బ్యాటిల్ రాయల్ గేమ్ ఫార్మట్లో వచ్చినవే. ఆన్లైన్ గేమింగ్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని విడిగా, జట్టుగా ప్లేయర్స్ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, వారి ప్రతిభకు పదును పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్స్ మొదలయ్యాయి. ప్లేయర్స్ ఉత్సాహనికి తగ్గట్టుగానే ప్రైజ్మనీ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ టోర్నమెంట్స్ ప్రత్యక్షప్రసార హక్కుల కోసం చానల్స్ పోటీ పడటం విశేషం. ‘ప్రైజ్మనీ గెలుస్తామా లేదా? అనేది వేరే విషయం. మనలోని నైపుణ్యాన్ని స్వయంగా అంచనా వేసుకోవడానికి గేమింగ్ టోర్నమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి’ అంటున్నారు టెక్ నిపుణుడు జెన్సెన్. ప్రపంచవ్యాప్తంగా పాప్లర్ అయిన కొన్ని టోర్నమెంట్స్: ఏడు సంవత్సరాల క్రితం మొదలైన ‘కాల్ ఆఫ్ డ్యూటీ ఛాంపియన్షిప్’లో సరికొత్త గేమ్స్ కేంద్రంగా పోటీలు జరుగుతాయి. ‘ఇ–స్సోర్ట్స్ వరల్డ్ కన్వెన్షన్’లో రకరకాల జానర్స్ కనబడతాయి. లాస్ వెగాస్లో ప్రతి వేసవిలో మొదలయ్యే ఇవాల్యువేషన్ ఛాంపియన్షిప్ సిరీస్ (ఈవీవో)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. లార్జెస్ట్–లాంగెస్ట్ రన్నింగ్ గేమింగ్ టోర్నమెంట్స్కు ‘ఈవీవో’ ప్రసిద్ధి పొందింది. ‘ఫిఫా ఇ–వరల్డ్కప్’కు ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. మూడు సంవత్సరాల క్రితం మొదలైన ‘ఫోట్నైట్ వరల్డ్ కప్’ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఉద్దండులు పోటీ పడతారు. ఇ–స్పోర్ట్స్ ఒలంపిక్స్గా పిలుచుకునే ‘స్టార్క్రాఫ్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జియో తాజా ప్రకటనతో ఆన్లైన్ గేమింగ్ ప్రియుల్లో ఉత్సాహం రిలయన్స్ జియో, తైవాన్ చిప్మేకర్ ‘మీడియాటెక్’ భాగస్వామ్యంతో ఆన్లైన్గేమ్ ప్రియులు కోసం ‘గేమింగ్ మాస్టర్స్’ పేరుతో టోర్నమెంట్ ప్రకటించింది. జనవరి 10 నుంచి మొదలై మార్చి 7 వరకు 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. జియోగేమ్స్ ప్లాట్ఫామ్లో జనవరి 9 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు, పార్టిసిపెషన్ ఫీజు అంటూ లేవు. జియో యూజర్లు, నాన్–జియో యూజర్లు అందరూ పాల్గొనవచ్చు. డుయోస్, సోలోస్, గ్రాండ్ఫైనల్... మూడు దశలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. విజేతలకు రూ.12.5 లక్షలు ప్రైజ్మనీగా ప్రకటించారు. ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి. ‘గేమర్స్ నైపుణ్యం, ఓర్పు, టీమ్వర్క్ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇండియా కా గేమింగ్ ఛాంపియన్షిప్ గేమింగ్ మాస్టర్స్ ఉపయోగపడుతుంది’ అంటున్నారు నిర్వాహకులు. జియోటీవి హెచ్డి, ఇ–స్పోర్ట్స్ చానల్, యూ ట్యూబ్ చానల్లలో ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. చదవండి: అలర్ట్: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్ -
నేరాల్లో 10% తగ్గుదల..!
సాక్షి హైదాబాద్: టెక్నాలజీ వినియోగం.. నేరాలు కొలిక్కి తీసుకురావడంలో సీసీ కెమెరాల కీలకపాత్ర.. నేరాలు నిరోధించడంలో పీడీ యాక్ట్ ప్రయోగం వంటి చర్యలు.. వెరసి హైదరాబాద్ నగరంలో నేరాలు గణనీయంగా తగ్గాయి. గతేడాదితో పోలిస్తే అన్ని రకాలైన నేరాల్లో కలిపి దాదాపు 10 శాతం తగ్గుదల నమోదైంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి డిసెంబర్ 20 వరకు నమోదైన నేరాల గణాంకాలను సోమవారం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సీపీ అంజనీకుమార్ విడుదల చేశారు. సైబర్ నేరాల సంఖ్య మాత్రం గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం గమనార్హం. తగ్గిన ‘మరణాలు’.. రోడ్డు ప్రమాదాలు, వాటిలో మరణాల సంఖ్య తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసు విభాగం స్పెషల్ డ్రైవ్ చేపడుతోంది. ఫలితంగా ఈ ఏడాది రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రులతో పాటు మృతుల సంఖ్య తగ్గింది. 2018 2019 2020 మొత్తం ప్రమాదాలు 2,431 2,496 1,738 క్షతగాత్రులు 2,435 2,649 1,793 మృతులు 293 271 237 ‘దిశ’ఉదంతం తర్వాత మహిళల భద్రతపై అన్ని విభాగాలు దృష్టి పెట్టాయి. సాధారణ సమయంలోనూ మహిళలు/యువతులపై జరిగే నేరాలను అధికారులు సీరియస్గా తీసుకుంటున్నారు. మహిళలపై నేరాలు.. 2018 2019 2020 మొత్తం కేసులు 2,286 2,354 1,908 వరకట్న హత్యలు 17 3 2 అత్యాచారం 178 281 265 కిడ్నాప్లు 134 95 60 ఆత్మగౌరవానికి భంగం కలిగించడం 373 448 438 వేధింపులు 1,342 1,462 1,043 శిక్షలు ఇలా.. 2018 2019 2020 విచారణ ముగిసిన కేసులు 4,245 4,947 2,688 నేరం నిరూపితమైనవి 1,471 2,092 1,964 శిక్షల శాతం 34 42 73 చోరీ అయిన సొత్తు రికవరీ.. 2018 2019 2020 చోరీ అయిన సొత్తు విలువ రూ.74.05 కోట్లు రూ.27.78 కోట్లు రూ.26.15 కోట్లు రికవరీ రూ.62.97 కోట్లు రూ.16.26 కోట్లు రూ.17.24 కోట్లు శాతం 86 59 66 సైబర్ క్రైం పెరిగింది.. ఈ సందర్భంగా అడిషపల్ సీపీ షిఖా గోయల్ మాట్లాడుతూ.. ‘గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ క్రైం పెరిగింది. 2019లో 1,393 సైబర్ కేసులు నమోదయితే 2020 లో 2,406 కేసులు నమోదు అయ్యాయి. ఇంటర్ నెట్ వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరుగుతున్న సైబర్ క్రైమ్లు రాజస్తాన్లోని జంతారా నుంచే జరుగుతున్నాయి. 25 శాతం ఓటీపీ మోసాలు పెరిగాయి. ఆన్లైన్ గేమింగ్ యువతను ఆకర్షిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకొని ఎంతో మంది అమాయకులను మోసం చేస్తున్నారు. మైక్రో ఫైనాన్స్ వేధింపులు ఈ మధ్య భారీగా పెరిగాయి. 100 యాప్లు గూగుల్ ప్లేస్టోర్ లో ఉన్నాయి. మైక్రో ఫైనాన్స్ ద్వారా అప్పులు ఇచ్చి వేధింపులకు గురిచేస్తున్నారు. డబ్బులు కట్టలేని పరిస్థితుల్లో భాదితుల ఫోటోలు, అలాగే కాంటాక్ట్లకు మెసేజ్లు పంపుతున్నారు. వీరి వేధింపులకు ముగ్గురు ఆత్మ హత్య చేసుకున్నారు. ఇలాంటి యాప్లు ఎవరు డౌన్లోడ్ చేసుకొని మోసపోవద్దు’ అన్నారు. (చదవండి: ఆన్లైన్లో ఏం చేస్తున్నారో గమనించండి) ‘ఈ ఏడాది సైబర్ క్రైమ్ నేరాలు చేసిన 12 రాష్ట్రాలకు చెందిన 259 మంది ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యారు. 19 మ్యాట్రిమోని కేసులు నమోదు అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్పై ప్రత్యేకంగా నిఘా పెట్టాం. చైనా బేస్గా ఆన్లైన్ గేమింగ్పై తెలంగాణలో పలు కేసులు నమోదు అయ్యాయి. ఆన్లైన్ గేమింగ్ తెలంగాణలో నిషేధం. ఆన్లైన్ గేమింగ్ కేసులో 170 బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేశాం. చైనా దేశస్తుడిని అరెస్ట్ చేశాం. ఇప్పటి వరకు 16వందల కోట్ల ట్రాన్సక్షన్ జరిగినట్టు గుర్తించాం’ అని షిఖా గోయల్ తెలిపారు. -
తప్పు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు
-
గ్యాంబ్లింగ్, బెట్టింగ్ సైట్లను నిషేధించండి..
సాక్షి, అమరావతి : పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్సైట్లు, యాప్లను ఏపీలో బ్లాక్ చేసేలా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్ ప్రసాద్ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటి వల్ల డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ కారణంగా మేము ఏపీ గేమింగ్ యాక్ట్–1974లో ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గ్యాంబ్లింగ్, ఆన్లైన్ బెట్టింగ్లను ఒక నేరంగా పేర్కొంటూ ‘ఏపీ ఆర్డినెన్స్–2020’ తెచ్చాం. దాన్ని 2020 సెప్టెంబర్ 25న నోటిఫై చేశాం. ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశం ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్లను నిషేధించడమే. వీటిని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహాయం లేకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ కోరారు. నిషేధించాల్సిన 132 వెబ్సైట్ల వివరాలను లేఖకు జత చేశారు. (రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్ అందేలా చూడాలి) -
యువతకు పిచ్చెక్కిస్తున్న పబ్జీ
సాక్షి, తిరుపతి : ఆన్లైన్ మొబైల్ గేమింగ్ వ్యసనంగా మారుతోంది. ఒకసారి గేమ్లోకి ప్రవేశిస్తే దానికి బానిసగా మార్చేసుకుంటోంది. ప్రత్యేకించి ‘పబ్జీ’ యువతను పిచ్చెక్కిస్తోంది. వారి జీవితాలతో ఆడుకుంటోంది. చివరకు ప్రాణాలను సైతం అలవోకగా తీసుకునేలా ప్రేరేపిస్తోంది. ఎందరో తల్లిదండ్రుల ఉసురుపోసుకుంటోంది. ప్రభుత్వం నిషేధించినా ఇంకా వెర్రితలలు వేస్తూనే ఉంది. పిల్లలు ఈ గేమ్ జోలికి వెళ్లకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక నవాబ్పేటలో నివాసం ఉంటున్న ఓ యువకుడు పబ్జీకి బానిసయ్యాడు. మూడు నెలల క్రితం లాక్డౌన్ సమయంలో పూట జరగడమే కష్టంగా ఉండడంతో తల్లిదండ్రులు పనికి వెళ్లని పురమాయించారు. గేమ్కు దూరం కావాల్సి వస్తుందని ఆ యువకుడు ఇంటి గేటుకి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. మొన్న పోకెమాన్.. నిన్న బ్లూవేల్.. తాజాగా పబ్జీ (ప్లేయర్ అన్నోన్స్ బ్యాటిల్గ్రౌండ్) యువతను ప్రత్యేకించి స్కూలు విద్యార్థులను వెర్రెక్కిస్తున్న ప్రమాదకర ఆన్లైన్ మొబైల్ గేమ్. మరీ గంటల తరబడి ఈ ఆటలో మునిగితేలుతున్నారు. ఈ గేమ్ను ప్రభుత్వం బ్యాన్ చేసినా, వివిధ సర్వర్ల ద్వారా పలువురు ఆడుతుండడం గమనార్హం. ఏమిటీ గేమ్...? పబ్జీ.. దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్ యాప్. దీన్ని డౌన్లోడ్ చేసుకొని గేమ్లో ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ గేమ్లో గరిష్టంగా వంద మంది ఉంటారు. ఆడేవారు ఏర్పాటు చేసుకున్న టీం తప్ప మిగిలిన వారంతా శత్రువుల కిందే లెక్క. దీంతో ఈ గేమ్ ఒక యుద్ధక్షేత్రాన్ని తలపిస్తుంది. పోటీదారులదరినీ చంపుకుంటూ పోవడమే ఈ ఆట. ఆటగాడు చనిపోతే గేమ్ అయిపోనట్లే లెక్క. యుద్ధంలో ఉపయోగించే తుపాకులు, బాంబులతోపాటు శత్రువులకు చిక్కకుండా దాక్కునేందుకు బంకర్లు, గాయపడితే వైద్యం పొందేందుకు మెడికల్ కిట్ వంటివి ఇందులో ఉంటాయి. అందుకే ఎలాగైనా గెలవాలనే కసితో ఈ ఆటలో చనిపోయిన ప్రతిసారీ తిరిగి గేమ్లో ప్రవేశించాలనుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పబ్జీ ఆడేవాళ్లు సుమారు 20కోట్ల మంది వరకు ఉన్నట్లు అంచనా. దీనికి అలవాటు పడిన వారు చదువులో పూర్తిగా వెనుకబడుతున్నారని, నిద్రలేమి, కంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు వెల్లడిస్తున్నారు. -
ఈడీ కస్టడీకి ‘కలర్ ప్రిడెక్షన్’ గ్యాంగ్
సాక్షి, రంగారెడ్డి: ఈ–కామర్స్ పేరుతో సంస్థల ముసుగులో భారీ బెట్టింగ్ గేమింగ్కు పాల్పడిన కలర్ ప్రివెక్షన్ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్ హూ సహా ముగ్గురిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం కస్టడీలోకి తీసుకున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్తోనూ ముడిపడి ఉన్న ఈ వ్యవహారం గుట్టును హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెల 13న రట్టు చేశారు. దీనిపై ఈడీకి ఓ సమగ్రమైన లేఖ రాశారు. ఈ దందాలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగి ఉంటుందని అనుమానిస్తూ పూర్తి వివరాలను సమర్పించారు. వీటి ఆధారంగా ఈడీ ఈ నెల 15న యాన్ హూతో పాటు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. (లాక్డౌన్లోనూ ‘పవర్’ ఫుల్ గేమ్! ) ఆధారాల సేకరణ కోసం ఢిల్లీ, గుర్గావ్, ముంబైల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసి 17 హార్డ్ డిస్క్లు, 5 ల్యాప్టాప్లు, ఫోన్లతో పాటు అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది. చంచల్గూడ జైల్లో ఉన్న ఈ నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన కోర్టు ఎనిమిది రోజుల పాటు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వివిధ వెబ్సైట్ల ఆధారంగా దందా చేసిన దీని నిర్వాహకులు ఈ ఏడాది ఏడున్నర నెల్లోనే రూ.1100 కోట్లు టర్నోవర్ చేయడంతో పాటు రూ.110 కోట్లను విదేశాలకు తరలించేశారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఈడీ నిర్ణయించింది. చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్గా యాన్ హూ పని చేస్తున్నాడు. గుర్గావ్ కేంద్రంగా వ్యవహారాలు నడుపుతున్న ఇతగాడు ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్ తదితరులను డైరెక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నాడు. వీరంతా కలిసి ఈ–కామర్స్ సంస్థల ముసుగులో గ్రోవింగ్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, సిలీ కన్సల్టింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, పాన్ యన్ టెక్నాలజీస్ సర్వీస్, లింక్యన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డాకీపే ప్రైవేట్ లిమిటెడ్, స్పాట్పే ప్రైవేట్ లిమిటెడ్, డైసీలింగ్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్, హువాహు ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఆర్ఓసీలో రిజిస్టర్ చేశారు. ఇవన్నీ కూడా ఆన్లైన్లో వివిధ ఈ–కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. వీటి ముసుగులో కలర్ ప్రిడెక్షన్ గేమ్ను వ్యవస్థీకృతంగా సాగించారు. ఈ గేమ్కు సంబంధించిన పేమెంట్ గేట్ వే అయిన పేటీఎం, గూగుల్ పేల ద్వారా లావాదేవీలు జరిగాయి. బెట్టింగ్కు సంబంధించిన డబ్బు డాకీ పే, లింక్ యన్ సంస్థలకు వెళ్ళింది. అక్కడ నుంచి హెచ్ఎస్బీసీ బ్యాంకు ఖాతాలోకి వెళ్ళినట్లు ఈడీ అధికారులు చెప్తున్నారు. ఇది అంతర్జాతీయ బ్యాంకు కావడంతో ఆ ఖాతాల్లోని నగదు హంకాంగ్, సింగపూర్ల్లోని కొన్ని ఖాతాల్లోకి మళ్ళినట్లు తేల్చారు. ఇలా రూ.1100 కోట్ల టర్నోవర్లో రూ.110 కోట్లు వెళ్ళినట్లు ఆధారాలు లభించాయి. మిగిలిన మొత్తం కూడా విదేశాలకే తరలించేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే హెచ్ఎస్బీసీ బ్యాంకులోని నాలుగు ఖాతాల్లో ఉన్న రూ.46.96 కోట్లను ఈడీ ్రïఫీజ్ చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ను నిగ్గు తేల్చడానికి ఈడీ రంగంలోకి దిగింది. నిందితుల విచారణలో దీనికి సంబంధించి వివరాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు. -
మాయాజూదం 'ఆన్లైన్ రమ్మీ'!
లాక్డౌన్ రోజుల్లో కృష్ణా జిల్లా నూజివీడులో ఓ బ్యాంకు ఉద్యోగి రూ.కోటికి పైగా మోసానికి పాల్పడ్డాడు. అంత పెద్ద మొత్తం ఆయన ఏం చేశారని ఆరా తీసిన పోలీసులు విస్తుపోయారు. ఆయన ఏకంగా రెండు నెలల్లో రూ.కోటికిపైగా ఆన్లైన్ రమ్మీ ఆడి ఓడిపోయారు. విజయనగరంలో ఓ వ్యాపారి పెద్ద ఎత్తున రుణాలు చేసి పరారయ్యాడు. ఆయన షాపు, ఇళ్లు అమ్మినా సరే అప్పులు తీరలేదు. ఆ వ్యాపారి అప్పులన్నీ కూడా ఆన్లైన్ రమ్మీ ఆడటానికే అని తెలిసి ఆ కుటుంబం లబోదిబోమంది. ఆన్లైన్ రమ్మీ మాయాజాలం అంటే అదే మరి. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. దేశంలో కోట్లాది మందిని ఆన్లైన్ రమ్మీ భూతం కమ్మేస్తోంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ల చిన్ని తెరలపై ఆడే ఈ 13 ముక్కల పేకాట వ్యసనం ఎందరో బతుకులను పల్టీ కొట్టిస్తోంది. అటువైపు ఆడుతోంది ఎవరో తెలియని ఈ మాయాజూదంలో ఇటువైపు ఆటగాళ్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిపోతున్నాయి. సాక్షి, అమరావతి: స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్ ఓపెన్ చేయగానే ఆకర్షణీయమైన ప్రకటనలు కనిపిస్తాయి. ‘ఆన్లైన్ రమ్మీ ఆడండి... ఒక్క ఆటతో లక్షాధికారి కండి’ అన్న రీతిలో ప్రకటనలు ఇస్తున్నారు. ఓసారి ఆడి చూద్దాం.. అని పలువురు ఆకర్షితులవుతున్నారు. ముందే బ్యాంకు అకౌంట్, ఇతర వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ► మొదట కొన్ని ఆటలు గెలిచినట్టే ఉంటుంది. ఆ తర్వాత నుంచి వరుసగా ఓడిపోతుంటారు. అవతల ఎవరో వ్యక్తి ఇంత గెలిచారు.. అంత గెలిచారు.. అని స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటుంది. దాంతో తామెందుకు గెలవలేం అని భావిస్తూ ఉన్న డబ్బులతోపాటు అప్పటికప్పుడు అప్పులు చేసి మరీ ఆడి కుదేలవుతున్నారు. మళ్లీ చేరడంలోనే మాయాజాలం ప్రత్యక్షంగా ఆడే రమ్మీ ఆటలో ఒకరు అవుట్ అయిపోతే మళ్లీ పందెం కాసి ఆటలో కలవచ్చు. అలా ఎవరు కలుస్తారో ఆడేవాళ్లకు తెలుస్తుంది. కానీ ఆన్లైన్ రమ్మీలో అక్కడే మతలబు ఉంటోంది. ప్రతి ఆటలో ఒకరో ఇద్దరో త్వరగా అవుట్ అయిపోయి మళ్లీ కలుస్తారు. అక్కడ ఎవరు కలుస్తారో తెలీదు. చివరికి ఆలా కలిసిన వారే ఆట గెలుస్తుంటారు. ► కొన్ని సార్లు ఒకరే ఒకటి కంటే ఎక్కువ ఆటల్లో ఒకేసారి కలిసి ఆడుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ► అసలు అటువైపు మనుషులే ఉండరని, కంప్యూటర్లే ఆడతాయని.. అంతా ఆన్లైన్లో మాయాజాలంతో బురిడీ కొటిస్తారని సైబర్ నిపుణులు చెబుతుండటం గమనార్హం. రాష్ట్రాల వారీగా నిషేధమే మార్గం ► ‘గేమ్ ఆఫ్ స్కిల్స్’ పేరిట ఆన్లైన్ రమ్మీకి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో ముంబయి, బెంగళూరు తదతర కేంద్రాల నుంచి దేశమంతటా ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థలు జోరుగా వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి. ► కావాలని ఆడి మోసపోతుండటంతో బాధితుల నుంచి అధికారికంగా ఫిర్యాదులు తక్కువగా ఉంటున్నాయి. సాంకేతికంగా సంక్లిష్టమైన వ్యవహారం కావడంతో మోసాలను పోలీసులు నిరూపించడం కష్టసాధ్యమవుతోందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కానీ రాష్ట్రాలు తమ పరిధిలో ఆన్లైన్ రమ్మీని నిషేధించడానికి అవకాశం ఉంది. ► కొన్ని రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీని నిషేధించాయి. ఆన్లైన్ రమ్మీ నియంత్రణ విధివిధానాలను రూపొందించాలని మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. ► సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాలు ఆన్లైన్ రమ్మీకి అధికారికంగా ఆనుమతి ఇచ్చాయి. మిగిలిన రాష్ట్రాలు ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం ప్రకటించ లేదు. అంటే ఆ రాష్ట్రాల్లో అనుమతి ఉన్నట్టుగానే పరిగణిస్తున్నారు. నిషేధిస్తే కట్టడి ఇలా.. ► నిషేధించిన రాష్ట్రాల్లోని వారిని ఆన్లైన్ రమ్మీ సంస్థలు ఆడించకూడదు. ఆటగాళ్ల ఐపీ అడ్రస్ చూస్తే వారు ఏ రాష్ట్రానికి చెందిన వారో తెలుస్తుంది. నిషేధిత రాష్ట్రాల వారు ఉంటే వారిని ఆటకు ఆనుమతించకూడదు. ► నిషేధం లేకపోవడంతో తాము మోసపోయామని బాధితులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మోసం చేశారని నిరూపించడం కష్టం. ► నిషేధం విధిస్తే ఆన్లైన్ సంస్థలు ఆ రాష్ట్రాల వారిని అసలు ఆడించనే కూడదు. ఆడించినట్టు తెలిస్తే కేసు నమోదు చేయవచ్చు. ఆన్లైన్ రమ్మీ నిర్వహణ సంస్థ ఏ రాష్ట్రంలో ఉన్నా సరే అక్కడికి వెళ్లి మరీ కేసు దర్యాప్తు చేసి దోషులను శిక్షించవచ్చు. ఏటా రూ.7,500 కోట్లు హుష్కాకీ ► ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ వివరాల ప్రకారం దేశంలో 20కి పైగా సంస్థలు ఆన్లైన్ రమ్మీ యాప్లు నిర్వహిస్తున్నాయి. 2020 జనవరి నాటికి దేశంలో దాదాపు 30 కోట్ల మంది ఆన్లైన్ రమ్మీ ఆడుతున్నారు. ఆన్లైన్ గేమింగ్ ఫెడరేషన్ లెక్కల ప్రకారం దేశంలో ఆన్లైన్ రమ్మీలో ఏటా రూ.7,500 కోట్లు చేతులు మారుతున్నాయి. రమ్మీ సంస్థలు అధికారికంగా దాదాపు రూ.2,500 కోట్లు తమ ఆదాయంగా చూపిస్తున్నాయి. ► మరి మిగిలిన రూ.5 వేల కోట్లు ఎటు వెళ్తున్నాయని సైబర్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఆ మొత్తం ఆన్లైన్ రమ్మీలో గెలిచిన వారికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఆన్లైన్ రమ్మీ ఆడుతున్న 30 కోట్ల మందిలో కనీసం ఒక శాతం మంది అధికారిక ఖాతాలు, ఆదాయ పన్ను వివరాల్లో అయినా ఆ మొత్తం కనిపించాలి కదా అన్నదే సైబర్ నిపుణుల సందేహం. ► తాము ఓడిపోయాం.. అవతల ఎవరో గెలిచారు అని ఆడిన వాళ్లు భావిస్తూ ఉంటారు. అవతల గెలిచిన వారు ఎవరూ ఉండరని, కొన్ని సంస్థలే కంప్యూటర్ల ద్వారానో.. తమ మనుషుల ద్వారానో ఆడిస్తూ మోసానికి పాల్పడుతూ ఆ రూ.5 వేల కోట్లు కొల్లగొడుతున్నాయన్నది సైబర్ నిపుణుల సందేహం. స్వీయ నియంత్రణ, పెద్దల పర్యవేక్షణే మార్గం ఆన్లైన్ రమ్మీ వ్యసనానికి బానిస కాకుండా ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటించడమే ఉత్తమ పరిష్కార మార్గం. ఒకసారి ఆ ఆటకు అలవాటు పడితే బయట పడటం చాలా కష్టం. కాబట్టి ఒక్కసారి కూడా ఆడాలని ప్రయత్నించకూడదు. ఆన్లైన్ ఆటల సందర్భంగా తమ బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదు. ఈ దిశగా పిల్లలకు అవగాహన కల్పించాలి. వ్యసనపరులకు కౌన్సెలింగ్ ఇప్పించాలి. – పీవీ సునీల్ కుమార్, సీఐడీ అదనపు డీజీ -
లాక్డౌన్లోనూ ‘పవర్’ ఫుల్ గేమ్!
సాక్షి, హైదరాబాద్: ‘కలర్ ప్రిడిక్షన్’ పేరుతో భారీ ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడిన బీజింగ్ టీ పవర్ సంస్థ లాక్డౌన్ సమయంలోనూ కాసులవేటను సక్సెస్ ఫుల్గా కొనసాగించింది. గత ఏడాది జరిగిన లావాదేవీల కంటే ఈ ఏడాది తొలి ఏడున్నర నెలల్లో జరిగినవే అత్యధికమని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న చైనా జాతీయుడు యాన్ హూతోపాటు ఢిల్లీకి చెందిన అంకిత్, ధీరజ్లను సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. బీజింగ్ టీ పవర్ సంస్థ గుర్గావ్ కేంద్రంగా 2019–20ల్లో దాదాపు 40 డమ్మీ కంపెనీలను రిజిస్టర్ చేయించింది. వీటిలో 90 శాతం భారతీయ డైరెక్టర్లు ఉండగా.. 10 శాతం చైనావాళ్ళు ఉన్నారు. ఈ 40 కంపెనీల్లోనూ కామన్గా ఉన్న డైరెక్టర్ల సంఖ్యే ఎక్కువ. ఈ సంస్థలు గత ఏడాది రూ.500 కోట్ల మేర దందా చేయగా ఈ ఏడాది ఆగస్టు మొదటి వారానికే రూ.1100 కోట్లకు చేరింది. ఈ కంపెనీలు దళారుల సహకారంతో, వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా అత్యధికంగా యువకులు, గృహిణుల్ని ఆకర్షించి ఉంటారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ సొమ్ము బీజింగ్ టీ పవర్ సంస్థతోపాటు బీజింగ్ టుమారో సంస్థకూ వెళ్ళినట్లు గుర్తించారు. దీంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఎవరు? అనే అంశాన్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. యాన్ హూ అరెస్టు విషయం తెలిసిన వెంటనే చైనాకు చెందిన డైరెక్టర్లు దేశం విడిచి పారిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు చైనా కంపెనీలకు పేమెంట్ గేట్ వేలుగా వ్యవహరించిన పేటీఎం, క్యాష్ ఫ్రీ సంస్థల ప్రతినిధులు సోమవారం దర్యాప్తు అధికారి ముందు హాజరయ్యారు. ఆయా సంస్థలు చట్టబద్ధంగా ఈ–కామర్స్ వ్యాపారం అని చెప్పడంతోనే తాము సేవలు అందించామంటూ వీరు సమాధానం ఇచ్చారు. తమ పేమెంట్ గేట్ వేస్ను ఆ కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నట్లు సమాచారం లేదని వివరించారు. మరోపక్క చంచల్గూడ జైల్లో ఉన్న యాన్ హూ, అంకిత్, ధీరజ్లను నాలుగు రోజుల విచారణ నిమిత్తం సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సంస్థలకు సంబంధించి 30 బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.50 కోట్లను ఫ్రీజ్ చేశారు. -
సైబర్ క్రైమ్కు పేటీఎం వివరణ
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ బెట్టింగ్ గేమ్తో అమాయక ప్రజలను మోసం చేసి వందల కోట్లు వసూలు చేసిన చైనా కంపెనీల వ్యవహారంలో బుధవారం పేటీఎం సంస్థ ప్రతినిధులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు వివరణ ఇచ్చారు. ఈ మేరకు పేటీఎం సౌత్ ఇండియా హెడ్ ధీరజ్ బుధవారం సైబర్ క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్, దర్యాప్తు అధికారి ఎస్సై మదన్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. పేటీఎంకు వివిధ గేట్ వేల ద్వారా డబ్బు పంపిస్తే వాటిని ఒక దగ్గరకు చేర్చి రెండు మూడు రోజులకొకసారి హెచ్ఎస్బీసీ ఖాతాలకు పంపించాలనే ఒప్పందం చేసుకున్నట్టు పేటీఎం అధికారులు వివరణ ఇచ్చారని తెలిసింది. (ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!) డిజిటల్ పేమెంట్లు కావడంతో తాము వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నామని, అలాగే ఈ సంస్థలతోను ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. కలర్ ప్రెడిక్షన్ పేరుతో ఆన్లైన్ బెట్టింగ్ దందా నిర్వహిస్తూ ప్రజలను మోసంచేస్తున్న ఒక చైనీయుడు, ముగ్గురు భారతీయులను ఈ నెల 13న సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రూ.1107 కోట్లు బెట్టింగ్ రూపంలో వసూలు చేయగా.. రూ.110 కోట్లు చైనాకు తరలిపోయాయి. మరో రూ.30 కోట్లను అధికారులు ఫ్రీజ్ చేశారు. మిగతా రూ. 967 కోట్లు ఎక్కడికి వెళ్లాయో ఆరా తీస్తున్నారు. హవాలా ద్వారా ఈ డబ్బు ఇతర దేశాల మీదుగా చైనాకు తరలినట్టు పోలీసులు ఆధారాలు సేకరించారని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు పేటీఎం నుంచి జరుగడంతో పేటీఎంకు నోటీసులు జారీచేసి, ఆయా కంపెనీలతో ఉన్న ఒప్పందాలపై సైబర్ క్రైమ్ పోలీసులు వివరణ కోరారు. (రూ.వెయ్యి కోట్లకుపైగా కొల్లగొట్టిన చైనీస్ కంపెనీ) తమకు వివిధ కస్టమర్లు, పేమెంట్ గేట్వేల ద్వారా డబ్బు జమవుతుందని, కస్టమర్లకు చెల్లింపులు కూడా తమ ద్వారానే జరిగాయని వెల్లడించినట్లు తెలిసింది. ఇలా తమ ద్వారా రూ.649 కోట్ల డిపాజిట్ల్లు రెండు ఖాతాల్లో జమయ్యాయని చెప్పారని సమాచారం. దీంతోపాటు కొంత మొత్తం చెల్లింపులు కూడా చేశామని వివరించారు. చెల్లించిన సొమ్ము బెట్టింగ్లో గెలుపొందినవారికి ఇచ్చారా? అంటూ పోలీసులు ప్రశ్నించడంతో ఆ విషయం తమకు తెలియదని, కంపెనీ నుంచి వచ్చే సూచనలను బట్టి ఆ డబ్బు పంపించామని వివరించారు. సమాచారం సేకరించిన ఈడీ, ఐటీ బుధవారం సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట పేటీఎం సంస్థ ప్రతినిధులు హాజరుకావడంతో, ఈడీ అధికారులు, ఆదాయం పన్ను శాఖ అధికారులు కూడా వారి నుంచి విడిగా వివరాలు సేకరించారు. కాగా పేటీఎం సంస్థతోనే ఒప్పందం కుదుర్చుకోవడంలో చైనా కంపెనీల మతలబు ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది. పేటీఎంలోను చైనా సంస్థ అలీబాబా కంపెనీ షేర్లు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ క్రమంలోనే చైనీయులు పేటీఎంతో ఒప్పందాలు చేసుకుని ఉంటారా? అనే దానిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. -
ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్కు యువతను బానిసలు చేసి, భారీగా డబ్బు కొల్లగొడుతున్న సంఘటనలు ఇటీవల అధికమయ్యాయి. ఈ–కామర్స్ పేరుతో సంస్థల్ని, వెబ్సైట్స్ను రిజిస్టర్ చేస్తున్న చైనా కంపెనీలు.. ఈ ముసుగులో ఆన్లైన్ గేమ్ను ప్రోత్సహిస్తూ ఆదాయం గడిస్తున్నాయి. తాజాగా కలర్ ప్రిడిక్షన్ పేరుతో రూపొందించిన ఓ గేమ్ యువతను నిండా ముంచుతోంది. ఒక్క ఈ ఏడాదిలోనే దేశంలో రూ.1100 కోట్ల టర్నోవర్ చేసిన ఈ గేమ్.. ఇప్పటికే రూ.110 కోట్లను విదేశాలకు తీసుకెళ్లింది. దీనిపై ఫిర్యాదు రావడంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు దర్యాప్తు చేసి ఓ చైనీయుడి సహా నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. గురువారం కొత్వాల్ అంజనీకుమార్ ఈ వివరాలు వెల్లడించారు. ఈ గేమ్ నిర్వహిస్తున్న సంస్థలకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.30 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు. ఎలా ఏ మారుస్తున్నారంటే.. నిర్వాహకులు ఈ గేమ్ను ఓ ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా రూపొందించారు. ఓ కొత్త వ్యక్తి ఇందులోకి ప్రవేశించినప్పుడు అతడి ఐపీ అడ్రస్, ఇతర వివరాలను అది సంగ్రహిస్తుంది. అనంతరం తొలుత కొన్నిరోజులపాటు అతడు పందెం గెలిచేలా చేసి బానిసగా మారుస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు కొన్ని గేమ్లలో ఓడేలా.. పూర్తిగా బానిసగా మారిన తర్వాత అన్నీ ఓడిపోయేలా ప్రోగ్రామింగ్ డిజైన్ చేసి ఉంటోంది. దీంతో దీని వలలో చిక్కి గేమ్ ఆడినవాళ్లు నష్టపోవడమే తప్ప.. లాభపడటం అనేది జరగట్లేదు. ఇలా నష్టపోయినవారిని దళారులుగా మార్చుకుంటూ మరికొంత మందిని తమ వలలో చిక్కేలా గేమ్ నిర్వాహకులు పథకం వేశారు. ఈ గేమ్లో సభ్యులుగా ఉన్నవారు ఎవరైనా కొత్తవారిని ఆకర్షించి వారికి రిఫరల్ కోడ్ ఇస్తే.. రూ.1000 కమీషన్గా ఇస్తున్నారు. అంతేకాకుండా అతడు ఆడి, కోల్పోయే మొత్తం నుంచి 10 శాతం కూడా ఇస్తున్నారు. ఇలా మరింతమందిని ఈ ఉచ్చులో దింపేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు: లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తర్వాత ఈ గేమ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఈ ఉచ్చులో చిక్కి రూ.లక్షల్లో కోల్పో యిన అనేక మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. హైదరాబాద్లో రూ.6 లక్షలు కోల్పోయిన ఎస్సార్నగర్ యువకుడితో పాటు రూ.15 లక్షలు కోల్పోయిన ఆదిలాబాద్ యువకుడు, తమిళనాడులో పలువురు ఆత్మహత్య చేసుకోవడంతో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్కు చెందిన ఓ యువకుడు రూ.97వేలు, మరో యువకుడు రూ.1.64 లక్షలు పోగొట్టుకోవడంతో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు.. ఈ సంస్థలు, వ్యవహారాలను చైనాకు చెందిన బీజింగ్ టి పవర్ అనే సంస్థ పర్యవేక్షిస్తున్నట్లు నిర్ధారిం చారు. ఈ ఆధారాలను బట్టి ఢిల్లీలో ఉంటున్న ఈ సంస్థ సౌత్ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్గా ఉన్న చైనా జాతీయుడు యా హౌతో పాటు డైరెక్టర్లుగా పని చేస్తున్న ఢిల్లీ వాసులు ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్, నీరజ్ తులేలను అరెస్టు చేశారు. వీరిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో 28 కేసులు నమోదు కావడంతో అరెస్టు సమాచారాన్ని ఆయా అధికారులకు తెలపాలని నిర్ణయించారు. ఏమిటీ కలర్ ప్రిడిక్షన్? చైనాకు చెందిన సూత్రధారులు భారత్లో ఉంటున్న యువతను టార్గెట్ చేస్తూ కలర్ ప్రిడిక్షన్ గేమ్ను తయారుచేశారు. ఢిల్లీలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఈ సూత్రధారులు.. ఈ–కామర్స్ లావాదేవీల పేరుతో అక్కడి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో (ఆర్వోసీ) ఎనిమిది సంస్థల్ని నమోదు చేశారు. ఇవన్నీ ఆన్లైన్లో వివిధ ఈ–కామర్స్ వెబ్సైట్లు నడుపుతున్నాయి. ఈ సైట్స్లోకి ప్రవేశించినవారు ఓ మూలన ఉండే లింక్ను క్లిక్ చేయడం ద్వారా కలర్ ప్రిడిక్షన్ గేమ్లోకి వెళ్లొచ్చు. అయితే ఎవరికి వారు నేరుగా ప్రవేశించడానికి వీలు లేదు. అప్పటికే ఈ గేమ్ ఆడుతున్న వారు ఇచ్చే రిఫరల్ ఐడీ ద్వారా గేమ్లోకి ప్రవేశించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. గేమ్లోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఉన్న ఆçప్షన్లో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగుల్లో ఒకటి ఎంచుకోవాలి. దానిపై ఎంత మొత్తం పందెం కాస్తున్నామో పేటీఎం ద్వారా చెల్లించాలి. ఇది పూర్తయిన తర్వాత గేమ్లో ప్రోగ్రామింగ్ రన్ అయి, ఓ రంగు వచ్చి ఆగుతుంది. పందెం కాసినవారు ఎంచుకున్న రంగు వస్తే ఆ మొత్తానికి రెండు నుంచి నాలుగు రెట్ల డబ్బు వారి పేటీఎం ఖాతాలోకి జమ అవుతుంది. రాకపోతే పందెం కాసిన మొత్తం ఆ సంస్థకు చెందుతుంది. -
ఆన్లైన్లో ఏం చేస్తున్నారో గమనించండి
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్ పేరుతో భారీ మోసం చేసిన అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టైంది. ఓ చైనీస్ కంపెనీ రూ.1000 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఆ కంపెనీకి చెందిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నట్లు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు తెలిపారు. ఈ ముఠాపై సైబర్ క్రైంలో రెండు కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. టెలిగ్రాం గ్రూప్ ద్వారా అడ్మిన్ సహాయంతో ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్నారని తెలిపారు. వెబ్సైట్స్ను ప్రతిరోజు కొత్తగా మార్చుతూ.. అందులోని సమాచారాన్ని గ్రూప్లో తెలుసుకుంటారని చెప్పారు. ఈ కంపెనీలో చైనా, ఇండియాకు చెందిన డైరెక్టర్లు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. సుమారు రూ.1,100 కోట్ల నగదు ట్రాన్జాక్షన్ జరిగిందని వెల్లడించారు. (రూ. 1000 కోట్ల హవాలా సొమ్ము: చైనా స్పందన) పలు బ్యాంకు ఖాతాల్లో రూ.30కోట్లు సీజ్ చేశామని వెల్లడించారు. ఒక చైనీయునితో పాటు నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. దీనిపై లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు. ఐటీశాఖకు సమాచారం ఇచ్చామని, ఆన్లైన్ గేమింగ్ తెలంగాణలో రద్దైందని పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్లో మోసపోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారని, పిల్లలపై దృష్టి పెట్టాలని సీపీ తెలిపారు. ఆన్లైన్ తమ పిల్లలు ఏం చేస్తున్నారని తల్లిదండ్రులు గమనించాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. -
ఓటమితో ముగింపు
చెన్నై: నేషన్స్ కప్ అంతర్జాతీయ ఆన్లైన్ చెస్ టోర్నీలో భారత పురుషుల జట్టు తమ పోరాటాన్ని పరాజయంతో ముగించింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్ల్లోనూ భారత జట్టు ఓడింది. తొలుత చైనాతో జరిగిన మ్యాచ్లో 1.5–2.5తో ఓటమి చవిచూసిన టీమిండియా... అనంతరం రష్యాతో జరిగిన మ్యాచ్లో కూడా 1.5–2.5తో ఓడిపోయింది. చైనాతో జరిగిన మ్యాచ్లో హరికృష్ణ, విదిత్, హారిక తమ గేమ్లను ‘డ్రా’ చేసుకోగా... ఆధిబన్ ఓడిపోయాడు. రష్యాతో జరిగిన మ్యాచ్లో హంపి గెలుపొందగా... హరికృష్ణ తన గేమ్ను ‘డ్రా’ చేసుకున్నాడు. విదిత్, ఆధిబన్ తమ గేముల్లో ఓడిపోయారు. ఆరు జట్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో నిర్ణీత పది రౌండ్ల తర్వాత భారత్ ఐదు పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. తొలి రెండు స్థానాల్లో నిలిచిన చైనా, అమెరికా జట్లు నేడు జరిగే సూపర్ ఫైనల్లో టైటిల్ కోసం తలపడతాయి. -
ఆన్లైన్ గేమింగ్ 12 వేల కోట్లు
ముంబై: డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.11,900 కోట్లకు చేరనున్నట్లు కేపీఎంజీ– ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ 2018 రూ.4,400 కోట్లకు చేరింది. ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో 2018– 2023 మధ్యకాలంలో ఈ పరిశ్రమ ఆదాయాలు 22 శాతం వార్షిక వృద్ధితో రూ.11,900 కోట్లకు చేరతాయని నివేదిక వివరించింది. మరోవైపు గేమర్స్ సంఖ్య 2018లో 25 కోట్లకు చేరింది. ఈ రంగం ఆదాయాల్లో సింహభాగం వాటా మొబైల్ ఫోన్స్దే. 2017 ఆర్థిక సంవత్సరంలో ఇది 85 శాతంగా ఉంది. స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతుండటం, వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరుగుతుండటం, డేటా ధరలు తగ్గుతుండటం తదితర అంశాలు మొబైల్ గేమింగ్ పరిశ్రమ వృద్ధికి ఊతంగా ఉంటున్నాయి. పజిల్స్, యాక్షన్ టాప్.. దేశీయంగా టాప్ గేమ్స్లో పజిల్స్, యాక్షన్, అడ్వెంచర్ సంబంధ గేమ్స్ ఉన్నాయి. కొత్త స్పోర్ట్స్ లీగ్స్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్కీ ఆదరణ పెరుగుతోంది. దేశీయంగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఆపరేటర్స్ సంఖ్య 2016లో 10గా ఉండగా.. 2018 నాటికి ఏకంగా ఏడు రెట్లు పెరిగి 70కి చేరింది. ఇక పెద్ద నగరాలతో పోలిస్తే ఫ్యాంటసీ స్పోర్ట్స్ని తరచుగా ఆడే వారి సంఖ్య చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటోంది. 7–8 టాప్ నగరాల్లోని మెజారిటీ యూజర్లు ఫ్యాంటసీ స్పోర్ట్స్ని వారంలో 1–3 సార్లు ఆడుతుండగా.. చిన్న పట్టణాల్లోని 70 శాతం మంది యూజర్లు వారంలో నాలుగుసార్లకు పైగా ఆడుతున్నారు. ఇక అత్యధికంగా 71 శాతం మంది ఫ్యాంటసీ క్రికెట్ ఫ్యాన్స్ కాగా, 54 శాతం మంది ఫుట్బాల్ ఆడారు. యూజర్లు తమ ఫేవరెట్ స్పోర్ట్స్లో మరింతగా పాలుపంచుకునేందుకు ఈ తరహా స్పోర్ట్స్ ఉపయోగపడతాయని కేపీఎంజీ పార్ట్నర్, మీడియా.. ఎంటర్టైన్మెంట్ విభాగం హెడ్ గిరీష్ మీనన్ చెప్పారు. -
ఆన్లైన్ గేమింగ్లో 14 రోజులు...
చైనాకు చెందిన మిస్టర్ జియా ఒకటి, రెండు రోజులు కాదు, ఏకంగా 14 రోజుల పాటు తిండీ తిప్పలు లేకుండా ఓ పక్క ఆన్లైన్ గేమ్ మారథాన్ ఆడుతూ మరోపక్క పెట్టెమీద పెట్టె సిగరెట్లు కాలుస్తూ చివరకు కుప్పకూలిపోయాడు. అన్హుయీ రాష్ట్రంలోని ఓ ఇంటర్నెట్ కేఫ్లోకి సరిగ్గా 15 రోజుల ముందు వెళ్లాడు. అప్పటినుంచి నిద్రహారాలు లేకుండా ఆన్లైన్ వీడియోగేమ్ ఆడుతూనే ఉన్నాడు. సోమవారం తెల్లవారుజామున నీరసంతో కింద పడిపోయాడు. హుటాహుటిన అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు ప్రాణాపాయం తప్పింది. కానీ కంప్యూటర్లో గేమ్ ఆడడం కోసం అతడు చేస్తున్న అల్లరిని డాక్టర్లు భరించలేక పోతున్నారు. నిద్రపోయేందుకు మందులిచ్చినా పెద్దగా ఫలితం లేదట. ప్రపంచంలోకెల్లా చైనాలోని యువకుల్లో ఆనలైన్ వీడీయో గేమ్ల పిచ్చి విపరీతంగా పెరిగిపోతోంది. దాదాపు రెండున్నర కోట్ల మంది యువకులు దీనికి బానిసలైనట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి. వీటి నుంచి యువకులు, పిల్లలను బయట పడేసేందుకు దేశవ్యాప్తంగా 250 బూట్ క్యాంపులను చైనా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. వీటిలో సైనిక తరహా క్రమశిక్షణ నేర్పుతారు. అయినా ఆశించినంత ప్రయోజనం లేకపోవడంతో ప్రతి గేమ్కు కాల పరిమితిని విధించాలని చైనా ప్రభుత్వం గేమ్ డిజైనింగ్ కంపెనీలను వేడుకుంటోంది.