online games
-
ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’
భారతీయ ఈస్పోర్ట్స్ రంగంలో ఔత్సాహిక ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి క్రాఫ్టన్(Krafton) ఇండియా ఈస్పోర్ట్స్(Esports) ‘రైజింగ్ స్టార్’ ప్రోగ్రామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమం ద్వారా ఔత్సాహిక ఈస్పోర్ట్స్ అథ్లెట్లను గుర్తించడం, శిక్షణ ఇవ్వడం, వారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని కంపెనీ తెలిపింది.రైజింగ్ స్టార్ ప్రోగ్రామ్లో పాల్గొనేవారికి సమగ్ర అభివృద్ధి అనుభవాన్ని అందించనున్నారు. గేమింగ్ నైపుణ్యాలను పెంచడంతోపాటు కంటెంట్ సృష్టి, మానసిక శ్రేయస్సు, సమతుల్య జీవనశైలి నిర్వహణపై అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి పరిశ్రమకు చెందిన కొంతమంది టాప్ ఎక్స్పర్ట్స్ నుంచి సలహాలు, సూచనలు అందిస్తారు. వారి సామర్థ్యాలను మెరుగుపరచడానికి, ఈస్పోర్ట్స్ లో దీర్ఘకాలిక విజయాల కోసం బలమైన పునాదిని ఏర్పరుచుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇదీ చదవండి: గగనతలంలోకి 16.13 కోట్ల మందిరైజింగ్ స్టార్ ప్రోగ్రామ్కు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు యూట్యూబ్, ఫేస్బుక్ లేదా ఇతర స్ట్రీమింగ్ సర్వీసెస్ వంటి ప్లాట్ఫామ్ల్లో కనీసం 1,000 మంది ఫాలోవర్లు లేదా సబ్స్క్రైబర్లను కలిగి ఉండాలి. బాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ)కు సంబంధించిన కంటెంట్ను క్రమం తప్పకుండా తయారు చేస్తుండాలి. అభ్యర్థుల వయసు కనీసం 16 ఏళ్లు ఉండాలి. -
‘హాని’లైన్ గేమ్స్!
సాక్షి, వరంగల్: ఆన్లైన్ గేమ్స్ యువత జీవితాలను అగమాగం చేస్తున్నాయి. కరోనా అనంతరం చాలామంది యువత చేతిలో సెల్ఫోన్లు ఉండడం వల్ల కూడా.. తమకు తెలియకుండానే ఆన్లైన్లో పరిచయమయ్యే ఈ గేమ్లకు అలవాటు పడుతున్నారు. తొలుత తక్కువ డబ్బులు చెల్లించి ఆడే ఈ ఆట ద్వారా వందల్లో లాభాలు ఇచ్చి అలవాటయ్యేలా చేసి.. ఆ తర్వాత రూ.వేలు, రూ.లక్షల్లో దండుకుంటున్నారు. అప్పులు చేసి.. కుటుంబసభ్యులకు తెలిస్తే పరువు పోతుందోనన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది. 20 రోజుల వ్యవధిలో వరంగల్ జిల్లాలో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో ఆన్లైన్ గేమ్, బెట్టింగ్ యాప్లపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వరంగల్ జిల్లా కడారిగూడెం గ్రామానికి చెందిన బత్తిని గణేశ్ ఆన్లైన్ గేమ్తో పాటు.. వివిధ బెట్టింగ్ యాప్లలో రూ.ఏడు లక్షల వరకు డబ్బులు పెట్టుబడులు పెట్టి నష్టపోయాడు. అప్పు ఇచి్చన స్నేహితులు అడగడంతో తీవ్ర మనోవేదనకు గురై గత నెల 29న హైదరాబాద్లోని ఘట్ కేసర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. వర్ధన్నపేట మండలం బండౌతాపురం గ్రామానికి చెందిన మరిపట్ల అనుక్ ఆన్లైన్లో పబ్జీలాంటి గేమ్ ఆడుతున్న సమయంలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆన్లైన్ గేమ్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పడంతో అతడికి దఫాలుగా రూ.ఐదు లక్షలు పంపాడు. తిరిగి డబ్బులు రాకపోవడంతో ఈ నెల 15న పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రోజుల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటనలతో చాలా మంది యువత తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ కుమారుల కదలికలపై నిఘా వేయడం కనిపిస్తోంది. మృతుల్లో యువతతోపాటు గృహిణులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు గుర్తించాలిడ్రగ్స్, ఆల్కహాల్ లాగే.. ఆన్లైన్ గేమ్, బెట్టింగ్లకు యువత త్వరగా అలవాటుపడుతోంది. డబ్బులు ఒకసారి రాకపోయినా.. మరోసారి వస్తాయనుకుంటున్నారు. అది సరికాదని చెప్పినా వినరు. అచేతన స్థితికి వెళ్లిపోయి కొందరు చనిపోతున్నారు. ఇంకొందరు నేరాల బాట పడుతున్నారు. దీన్నే బిహేవియరల్ అడిక్షన్ అంటారు. ఇలాంటి వాటిని తల్లిదండ్రులు ముందే గుర్తించాలి. సైకాలజిస్టుతో థెరపీ, మెడిటేషన్ ఇప్పించాలి. గేమ్కు బానిసైన వ్యక్తి అందులోనుంచి బయటకు రావాలని అనుకుంటే సమస్య త్వరగా పరిష్కారమవుతుంది. – అనూష వినేయత, సైకియాట్రిస్ట్ ముందు సరదాగా.. తర్వాత అలవాటై..సులభ సంపాదన కోసం స్మార్ట్ ఫోన్లో వెతికేవారికి ఆన్లైన్ రమ్మీ, బెట్టింగ్, ఫ్రీ మనీ ఎర్నింగ్ యాప్స్, సైట్స్ ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో చాలామంది ఆన్లైన్ గేమ్స్ను సరదాగా మొదలెట్టి, ఆ తర్వాత అలవాటు పడి బయటపడలేక జీవితం అగమాగం చేసుకుంటున్నారు. కొందరు అవి ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ యాప్స్ అని తెలియకుండానే ఊబిలో చిక్కుకుంటున్నారు. ఆన్లైన్లోనే అప్పులు దొరుకుతుండడం ఈ సమస్యను మరింత పెంచుతోంది. నగరాలు, పట్టణాల్లో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివే విద్యార్థులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులు ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. -
ఆశ చూపి బానిసను చేసి..
ధర్మవరం: ఆన్లైన్ మట్కా యాప్లతో నిరుపేద, మధ్యతరగతి ప్రజలు, యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. రూ.100 ఖర్చు పెడితే రూ.9వేలు డబ్బు వస్తుందని ఆశకు పోయి అప్పులు చేసి వడ్డీలు కట్టలేక రుణదాతల ఒత్తిళ్లతో ఊర్లు వదిలి వెళ్లిపోయిన వారు కొందరైతే... అవమాన భారం భరించలేక జీవితం మీద విరక్తి చెంది బలవన్మరణాలకు పాల్పడిన వారి ఉదంతాలు ఉన్నాయి. జిల్లా పరిధిలోని ధర్మవరం, కదిరి, పెనుకొండ, హిందూపురం, రాప్తాడు నియోజకవర్గాలలో ఆన్లైన్ మట్కా యాప్ల ద్వారా జూదం జోరుగా సాగుతోంది. జడలు విప్పుతున్న ఆన్లైన్ మట్కా భూతం ఇటీవల సామాన్యుల నుంచి సంపన్నుల వరకు, నిరక్షరాస్యుల నుంచి విద్యా వంతుల దాకా ప్రతి ఒక్కరికీ ఆండ్రాయిడ్ ఫోన్లు 4జీ, 5జీ నెట్వర్క్తో అందుబాటులోకి వచ్చాయి. ఆన్లైన్ మట్కా యాప్ల ద్వారా జూదం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అత్యాశకుపోయి ప్రజలు ఇళ్లు గుల్ల చేసుకుంటున్నారు. అనధికార మట్కా యాప్లు అనధికారికంగా రా్రïÙ్టయంగా, జాతీయంగా, ప్రాంతీయంగా ఆన్లైన్ మట్కా యాప్లు నిర్వహిస్తున్నారు. కొందరు సైబర్ నేరగాళ్లు సైతం ఇలానే యాప్లను నిర్వహిస్తూ మోసం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే రాష్ట్రంలో మట్కా కింగ్, సత్తా కింగ్ ఏపీ, ఏపీ మట్కా, తిరుమల మట్కా, విజయవాడ మట్కా తదితర యాప్లు ఎక్కువగా చలామణి అవుతున్నాయి. వీటి ద్వారా జిల్లాలో రోజూ లక్షలాది రూపాయల టర్నోవర్ జరుగుతున్నట్లుగా సమాచారం. వీటిలో ఏ ఒక్కటికి కూడా అనుమతి లేదు. ఊర్లు వదులుతున్న బాధితులు ఆన్లైన్ మట్కా యాప్ల కారణంగా అప్పులు చేసి.. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక జిల్లా వ్యాప్తంగా పలు కుటుంబాలు ఊర్లు వదిలి వెళ్తున్నాయి. మరికొంత మంది బాహ్య ప్రపంచానికి ముఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. మరెన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. కట్టడి కష్టతరం మట్కా జూదం మొత్తం ఆన్లైన్లో జరుగుతుండటంతో పోలీసులు కట్టడి చేయడం కష్టతరమౌతోంది. ఎందుకంటే జూదం ఆడేవారిని గానీ, ఆడించే వారిని గానీ కనుగొనడం సాధ్యం కాదు. అయితే సైబర్ క్రైమ్ ఆధ్వర్యంలో ఈ ఆన్లైన్యాప్లు ఇన్స్టాల్ కాకుండా వెబ్సైట్లను బ్యాన్ చేయడం ద్వారా కట్టడి చేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే ఎంతో మంది పేద, మధ్యతరగతి, యువత జీవితాలను కాపాడిన వారవుతారు.ఉక్కుపాదం మోపుతాంఆన్లైన్ మట్కా జూదం ఆడేవారిని, ఆడించే వారిపై ఉక్కుపాదం మోపుతాం. ఈ దిశగా ఇప్పటికే ప్రజలకు అవగాహన పెంపొందిస్తున్నాం. సైబర్క్రైం సహకారంతో ఆన్లైన్ మట్కా యాప్లు, వెబ్సైట్లు నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాం. పేద, మధ్య తరగతి ప్రజలు జూదం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుని వ్యసనాలకు దూరంగా ఉండాలి. – వి.రత్న, ఎస్పీ, శ్రీ సత్యసాయి జిల్లాబానిసగా మారుస్తారు ఇలా.. ఆన్లైన్ యాప్ల ద్వారా మట్కా నిర్వహిస్తున్న పలు అనధికారిక కంపెనీలు, సైబర్ నేరగాళ్లు పేద, మధ్యతరగతి ప్రజలు, యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. 24 గంటలూ అందుబాటులో ఉంటూ గంట గంటకూ ఫలితాలు వెల్లడిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ మట్కా యాప్లలో తొలుత లాగిన్ అయిన తర్వాత ఫోన్పే, గూగుల్పే ద్వారా డబ్బు స్వీకరిస్తారు. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్, త్రీస్టార్ వంటి పేర్లతో జూదం ఆడిస్తారు.ప్రజలు తాము చెప్పిన నంబర్ తగిలితేనే వారికి యాప్ల ద్వారా డబ్బు చెల్లిస్తారు. లక్షలో పది మంది కూడా ఈ యాప్ల ద్వారా లబ్ధి పొందరు. అయితే తొలుత చిన్న చిన్న మొత్తాలు వేసిన వారి వివరాలు సేకరించి యాప్ల నిర్వాహకులు వారు చెప్పిన నంబర్లే తగిలే విధంగా చేస్తారు. నెమ్మదిగా వారు అలవాటు పడగానే జూదానికి బానిసయ్యే విధంగా మార్చేస్తారు.⇒ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని శివానగర్కు చెందిన పట్టుచీరల వ్యాపారి రాము (పేరు మార్చాం) ఆన్లైన్ మట్కా యాప్కు బానిసయ్యాడు. రూ.10 వడ్డీకి అప్పు తెచ్చి మరీ మట్కాలో పెట్టాడు. వడ్డీలు కట్టేందుకు రెట్టింపు అప్పులు చేశాడు. రుణదాతల ఒత్తిళ్లు తాళలేక ఉన్న ఇల్లు, పొలం అమ్మి అప్పులు చెల్లించి బెంగళూరుకు చేరుకుని కూలి పనులు చేసుకుంటున్నాడు. ⇒ జిల్లా కేంద్రమైన పుట్టపర్తిలో ఆన్లైన్ మట్కా యాప్కు అలవాటు పడి బీటెక్ విద్యార్థి శివ తోటి స్నేహితులు, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఎటో వెళ్లిపోయాడు. చివరకు బంధువుల వద్ద ఉన్నాడని తెలుసుకుని తల్లిదండ్రులు రూ.2 లక్షల అప్పులు చెల్లించి తిరిగి తీసుకువచ్చారు. చదువులో ఇంటెలిజెంట్ అయిన శివ ఆన్లైన్ జూదం కారణంగా బాగా వెనుకబడ్డాడు.⇒ బత్తలపల్లి మండలానికి చెందిన వెంకటప్ప కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఆన్లైన్ మాట్కా యాప్ ద్వారా జూదం ఆడుతూ సంపాదన మొత్తం పోగొట్టుకుంటున్నాడు. దీంతో ఆ కుటుంబం దుర్భర పరిస్థితి అనుభవిస్తోంది. పైన చెప్పినవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. -
ఆన్లైన్ గేమింగ్కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడ్డారో.. ప్రమాదమే!
కరీంనగర్: అభివృద్ధి చెందుతున్న సాంకేతికతను కొందరు మంచికి వినియోగించుకుంటే.. మరికొందరు ఆన్లైన్గేమ్స్ ఆడుతూ అదఃపాతాళానికి పోతున్నారు. క్రమంగా ఆన్లైన్ ఆటలకు అలవాటు పడిన యువత ఎవరిమాట వినకుండా తయారవుతున్నారు. లక్షల రూపాయలు నష్టపోయి పెద్దలకు చెప్పుకోలేక కొందరు ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారు. మరికొందరు తల్లిదండ్రుల ఖాతాల్లో నుంచి దొంగతనాన తీసుకొని అప్పులు చెల్లిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో ఇటీవల పెరిగిపోయాయి.నిత్యం ఆన్లైన్లో..ఆండ్రాయిడ్ ఫోన్లు, అన్లిమిటెడ్ డాటా ఉండడంతో ఎవరిని చూసిన నిత్యం ఆన్లైన్లోనే ఉంటున్నారు. రమ్మి, క్యాసినో.. తదితర కొత్తకొత్త పేర్లతో అట్రాక్ట్ చేస్తున్న ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ లక్షల్లో నష్టపోతున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా చేతిలో ఫోన్తోనే గడుపుతున్నారు. ఇలా అలవాటుపడ్డ వాళ్లలో కొందరి మానసిక స్థితి సరిగ్గా లేకుండా పోయింది. మరికొందరైతే పెద్దల మాటలకు ఎదురుచెప్పడం, కుటుంబ సభ్యులపై దాడి చేయడం వంటి స్థితికి చేరుకుంటున్నారు.లాభాలు వస్తున్నాయనే ఆశతో..అప్పుడప్పుడే ఆన్లైన్ గేమ్స్ మొదలుపెట్టిన వారికి మొదటల్లో చిన్నపాటి లాభాలు ఆశచూపుతారు. ఇలా ఆ గేమ్స్కు ఆకర్షితులను చేసి క్రమంగా డబ్బులు గుంజుతుంటారు. జిల్లాలో ఇలా ఆన్లైన్ గేమ్స్ ఆడి కుదేలైన కుటుంబాలు అనేకం ఉన్నాయి. అయితే ఇలా నష్టపోయిన కుటుంబాలకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నాయి. తమ కుటుంబం పరువు పోతుందనే భయంతో ఫిర్యాదు చేయడం లేదు.ఆన్లైన్ గేమ్స్ ఆడి నష్టపోయిన వారు ఇలా..వేములవాడకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రైల్వేశాఖలో విధులు నిర్వర్తించేవాడు. సహచరులతో ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి ఉన్న ఆస్తిని పోగొట్టుకున్నాడు. అప్పుల పాలు కావడంతో మానసికంగా కుంగిపోయి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు రోడ్డున పడ్డారు.ఇటీవల వేములవాడలో రూ.2కోట్లతో ఉడాయించిన పూజారి మహేశ్ కూడా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. ఆన్లైన్ గేమ్స్ ఆడి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడని స్నేహితులు తెలిపారు.వేములవాడకు చెందిన యువకులు రాజు, వెంకటేశ్, రమణ, శ్రీనివాస్.. ఆన్లైన్ గేమ్ పేరుతో క్యాసినో తదితర ఆటలవైపు మొగ్గుచూపారు. దాదాపు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నష్టపోయారు.అవగాహన కల్పిస్తున్నాం..ఆన్లైన్ గేమ్స్, సైబర్క్రైమ్లపై పోలీస్శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తున్నాం. కళాబృందాల ద్వారా గ్రామీణులను చైతన్యం చేస్తున్నాం యువత ఆన్లైన్ గేమ్లకు బానిస కావడం సమాజానికి మంచిది కాదు. తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్కిల్ గేమ్స్ మాత్రమే ఆడాలి. అధిక డబ్బులు వస్తాయని ఆశ చూపే ఏ గేమ్ కూడా వాడొద్దు. అలాంటి గేమ్స్ వాడితే ఆర్థికంగా నష్టపోతారు. ఇలా ంటి వాటిపై జాగ్రత్తగా ఉండాలి. – నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీఇవి చదవండి: -
‘28 శాతం జీఎస్టీ’, సుప్రీం వైపు.. గేమింగ్ కంపెనీల చూపు
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధించాలనే జీఎస్టీ కౌన్సిల్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోదని తెలుస్తోంది.జీఎస్టీ కౌన్సిల్ గతేడాది ఆన్లైన్ గేమింగ్, కాసినో, హార్స్ రేసింగ్లపై 28 శాతం చొప్పున జీఎస్టీ అమలు చేయాలని జీఎస్టీ కౌన్సిల్ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు 2022 నుంచి గతేడాది అక్టోబర్ నాటికి రూ. 1,12,332 కోట్ల జీఎస్టీ చెల్లించాలంటూ గేమింగ్ కంపెనీలకు మొత్తం 71 షోకాజ్ నోటీసులందించింది. అయితే దీనిపై గేమింగ్ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఈ తరుణంలో గేమింగ్ కంపెనీల సమస్యపై రివ్వ్యూ జరగనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. జీఎస్టీ కౌన్సిల్ 28శాతం జీఎస్టీని ఉపసంహరించుకునే అవకాశం లేదు. గతంలో జారీ చేసిన నోటీసులపై కౌన్సిల్ పరిశీలించవచ్చు. ఎందుకంటే అనేక గేమింగ్ కంపెనీలు ఈ నోటీసులపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమస్యపై చాలా రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై సుప్రీం కోర్టు విచారించనుంది. ఈ తీర్పు కోసం గేమింగ్ కంపెనీలు ఎదురుచూస్తున్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. -
ఆన్లైన్ గేమ్లు వద్దన్నా.. వినకపోవడంతో కొడుకును చంపేసిన తండ్రి
కొత్తపల్లి(కరీంనగర్): ఆన్లైన్ గేమ్లు వద్దన్నా విననందుకు.. కన్న కొడుకునే తండ్రి కడతేర్చిన దారుణ ఘటన శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలో చోటుచేసుకుంది. చేతికొచి్చన ఒక్కగానొక్క కొడుకును తండ్రే పొట్టన పెట్టుకోవడంపై గ్రామస్తులు విస్మయానికి లోనయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన పెరుమాండ్ల జ్యోతి–శ్రీనివాస్కు కొడుకు, కూతురు ఉన్నారు. కూతురుకు పెళ్లి కాగా, కొడుకు పెరుమాండ్ల శివసాయి(21) హైదరాబాద్లో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇంట్లో శుభకార్యం కోసం బుధవారం స్వగ్రామానికి వచ్చాడు. కాగా, హైదరాబాద్ వెళ్లి ఆన్లైన్ గేమ్లు ఆడి డబ్బులు పోగొట్టొద్దని, ఇక్కడే ఉండాలంటూ తరచూ తండ్రీకొడుకుల మధ్య వాదనలు చోటు చేసుకుంటున్నాయి. ఈక్రమంలో భూమి అమ్మాలని శివసాయి ఒత్తిడి తెస్తుండటంతో ఆగ్రహానికి గురైన తండ్రి శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిద్రిస్తున్న కొడుకు తలపై రోకలి బండతో మోది కారం చల్లాడు. తీవ్రగాయాలతో శివసాయి మంచంపైనే మృతిచెందగా తండ్రి కొత్తపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. మృతుడి తల్లి ఉపాధి పనులకు వెళ్లగా ఈ దారుణం జరిగింది. తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
యువకుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఆన్లైన్ గేమ్
పరకాల: ఆన్లైన్ గేమ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చి ంది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రాత్రి వెలుగులోకి వచ్చి ంది. బాధితుడి తల్లి పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాలలోని వెలుమవాడకు చెందిన ఎండీ గౌస్పాషా గుడెప్పాడ్లోని జీకే పెట్రోల్ బంక్లో మేనేజర్గా పనిచేస్తున్నాడు. గౌస్పాషా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాందించాలనే ఆలోచనతో రమ్మీ ఆన్లైన్ గేమ్కు అలవాటు పడి బంక్కు సంబంధించిన రూ.6లక్షలు పొగొట్టాడు. దీంతో బంక్ యజమానులు ఈ నెల 18న ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతటితో ఆగకుండా ఆ డబ్బులు రికవరీ చేసేందుకు గౌస్పాషా ఇంటిని రూ.100 స్టాంప్ కాగితంపై రాయించుకున్నారు. అదే రోజు ఇంటికి చేరుకున్న గౌస్పాషా ఎంతో కష్టపడి తన తల్లిదండ్రులు కట్టుకున్న ఇంటిని బంక్ యజమానులు రాయించుకోవడం తెలిస్తే తట్టుకోలేరని మనస్తాపం చెంది ఈ నెల 19న పురుగుల మందు తాగాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని..మీరంతా తనను మరిచిపోవాలని తల్లి, తమ్ముడికి ఫోన్ చేశాడు. దీంతో వారు పోలీసులను సంప్రదించగా, పరకాల బంధం రోడ్డులో క్రిమిసంహారక మందు తాగి ప్రాణపాయ స్థితిలో ఉన్నట్టు గుర్తించారు. వెంటనే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. తన కొడుకు ఆత్మహత్యయత్నానికి బంక్ యాజమానుల వేధింపులే కారణమని బాధితుడి తల్లి ఎండీ ఫర్వీనా పరకాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై పరకాల సీఐ రవిరాజుకు ఫోన్చేయగా స్పందించలేదు. -
ఆన్లైన్ గేమ్ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం.. ఎందుకంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. కష్టపడకుండా ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడితే చాలు..గెలిస్తే డబ్బు లు మీసొంతం అంటూ యూజర్లను ఆకట్టుకుంటుండటంతో చిన్నా పెద్ద తేడా లేకుండా చాలా మంది ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడ్డారు. ఇందులో సంపాదించేది కొందరైతే .. నమ్మి డబ్బు పెట్టి నష్టపోయేవారు ఎందరో.. అటువంటి ఈ ఆన్ లైన్ గేమ్లపై అప్పట్లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మంత్రిత్వ శాఖ కూడా నిబంధనలు ప్రకటించింది. అయితే తాజాగా గేమింగ్ ఇండస్ట్రీ బాడీ ‘ఈ-గేమింగ్ ఫెడరేషన్ (ఈజీఎఫ్)’ బాధ్యతాయుతమైన గేమింగ్ను ప్రోత్సహించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆటగాళ్ల రక్షణకు కట్టుబడి బాధ్యతయుతమైన గేమింగ్ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం, ఆటగాళ్లకు సురక్షితమైన వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం చేసుకుంది. ఆన్లైన్లో ఆడుతున్నప్పుడు మంచి సమాచారంతో నిర్ణయాలు తీసుకునేలా యువతకు అవగాహన కల్పించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: గూగుల్లో వేతనాలు మూడు రెట్లు పెంపు! ఎందుకో తెలుసా? భారత దేశంలోని మొదటి మూడు ఆన్లైన్ గేమింగ్ రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటి. ముంబైలో రెండు ఆన్లైన్ గేమింగ్ యునికార్న్ సంస్థలు ఉన్నట్లు గుర్తించారు. ఇదిలా ఉండగా, ఆన్లైన్ గేమింగ్లపై డాక్టర్లు స్పందిస్తూ బాధ్యతారహితమైన గేమింగ్ వల్ల ఏకాగ్రత తగ్గుతుందని, సులువుగా కోపం, చిరాకు పడడం, దీర్ఘకాలిక ఆందోళన , డిప్రెషన్కు దారి తీస్తుందని చెబుతున్నారు. -
చెల్లి పెళ్లి సొమ్ముతో ఆన్లైన్ గేమ్ ఆడి..
ఉత్తరప్రదేశ్లోని ఇటావా జిల్లాకు చెందిన ఒక బీఎస్సీ విద్యార్థి ఆన్లైన్ గేమ్ ఆడి సుమారు రూ.5.5 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ మొత్తాన్ని అతని సోదరి పెళ్లి కోసం కుటుంబ సభ్యులు ఉంచారు. ఆన్లైన్ గేమ్లో రూ. 5 లక్షలకు పైగా మొత్తాన్ని పోగొట్టుకున్న తర్వాత ఆ కుర్రాడు కిడ్నాప్ నాటకం ఆడాడు. ఆన్లైన్ గేమ్లో భారీగా సొమ్మును పోగొట్టుకున్న తర్వాత అతనిని కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో కిడ్నాప్ నాటకం ఆడి, తప్పుడు కథనాన్ని సృష్టించాడు. ఇటావా జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఈ ఘటన సంచలనం సృష్టించింది. బీఎస్సీ విద్యార్థి కిడ్నాప్పై పోలీసులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు కూడా రంగంలోకి దిగారు. పోలీసుల విచారణలో.. కుటుంబసభ్యులు మందలింపుతో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తేలింది. బీఎస్సీ చదువుకుంటున్న తమ కుర్రాడు కిడ్నాప్కు గురైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిటీ ఎస్పీ, సిటీ సీఓ దర్యాప్తు చేపట్టి ఆ విద్యార్థి ఆచూకీ తెలసుకున్నారు. ఆ కుర్రాడు తాను కిడ్రాప్ అయినట్లు నాటకం ఆడాడని ఇటావా ఎస్పీ సంజయ్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి నెలలో ఈ కుర్రాడి సోదరి వివాహం జరగనుంది. ఈ నేపధ్యంలో కుటుంబ సభ్యులు అతని ఖాతాలో సుమారు రూ.5 లక్షలు జమ చేశారు. ఆన్లైన్ గేమ్ ఆడిన ఆ కుర్రాడు తన దగ్గరున్న సొమ్మునంతా పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆ కుర్రాడిని తీవ్రంగా మందలించారు. దీంతో ఆ కుర్రాడు తన సోదరుడు, ఒక బంధువు సహకారంతో కిడ్నాప్ డ్రామా ఆడాడు. జనవరి ఒకటిన రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇటావా పరిధిలోని ఘూగల్పూర్లో ఉంటున్న ఆ కుర్రాడి బంధువు శివం యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన బంధువు సంజీవ్కుమార్ యాదవ్ కుమారుడు అంకిత్ యాదవ్ను గుర్తుతెలియని దుండగులు కారులో కిడ్నాప్ చేశారని అతను తన మొబైల్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘూఘల్పూర్కు చేరుకున్నారు. ఇటావా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు అదనపు పోలీసు సూపరింటెండెంట్ మార్గదర్శకత్వంలో అంకిత్ యాదవ్ను వెదికేందుకు పోలీసుల బృందం ఏర్పాయ్యింది. వీరికి ఈ ఘటన అనుమానాస్పదంగా కనిపించడంతో శివమ్ యాదవ్, అతని కుటుంబ సభ్యులను పోలీసు బృందం విచారించింది. ఈ నేపధ్యంలో అంకిత్ యాదవ్ను వెదికి పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆన్లైన్ గేమ్స్తో జాగ్రత్త! లేదంటే ఇలా జరుగుతుందేమో!?
మహబూబాబాద్: నేటి సమాజంలో ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ ఫోన్ల కారణంగా పిల్లలు ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతుంటే.. యువకులు, ఆపై పడిన వారు పెడదారి పడుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్లో అనేక క్రీడలకు సంబంధించి బెట్టింగ్లకు పాల్ప డడం, రుణాలు తీసుకోవడం, ఆఫర్ల పేరుతో మోసపోతూ దిక్కుతోచని స్థితికి చేరుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా ఆన్లైన్ బెట్టింగ్, రమ్మీ, లూడో, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్తో పాటు అనేక రకాల ఆన్లైన్ గేమ్స్ ఆడి అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. కొంత మంది తేరుకొని వీటికి దూరమవుతుంటే చాలా మంది తమ ఆస్తులను విక్రయించుకునే దుర్భర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తల్లిదండ్రులకు తెలియకుండా వాహనాలు, ఆభరణాలు కూడా తనఖాలు పెట్టి జూదం ఆడుతున్నారు. నర్సంపేట పట్టణంలోని ఓ బ్యాంకు అధికారి కొద్ది రోజుల క్రితం బ్యాంకుకు సంబంధించిన డబ్బులతో ఆన్లైన్ గేమ్స్ ఆడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నాడు. దీంతో చివరకు జైలు పాలయ్యాడు. ఇలా పట్టణాలు, గ్రామాలు అనే తేడా లేకుండా ఎంతో మంది యువకులు మోసపోతున్నారు. అవగాహన లేక అవస్థలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన యువత నిత్యం స్మార్ట్ ఫోన్లతో గడిపేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ గేమ్స్ బారిన పడుతున్నారు. ఫలితంగా ఆయా కుటుంబాలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఏర్పడుతోంది. కాగా, యువతకు అవగాహన లేకపోవడంతోనే ఆన్లైన్ గేమ్స్ ఆడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఆన్లైన్ గేమ్స్పై యువతకు అవగాహన కల్పించి ఆయా కుటుంబాలను శోకసంద్రం నుంచి రక్షించాలని పలువురు పేర్కొంటున్నారు. ఆన్లైన్ గేమ్స్తో ఎంతో మంది జీవితాలు నాశనమవుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి, ధనిక వర్గాలకు చెందిన యువతతో పాటు మధ్య వయసు కలిగిన వారు కూడా ఆన్లైన్ ఉచ్చులో పడుతున్నారు. కష్ట పడకుండా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో ఆన్లైన్ క్రీడల్లో పాల్గొంటున్నారు. తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ పొందాలనే ఆశతో ఆన్లైన్ జూదం వైపు మరలుతూ చివరకు అప్పులపాలై క్షణికావేశంలో బలవన్మరణలకు పాల్పడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాలు కన్నీటిసంద్రంలో మునుగుతున్నాయి. ఘటనలు..! నెక్కొండ మండలం అప్పల్రావుపేటకు చెందిన బాషబోయిన ఉదయ్(20) ఈ ఏడాది జూన్ 24న అర్ధరాత్రి ఆన్లైన్ గేమ్ ఆడాడు. కాగా, ఉదయ్ మొబైల్ ఫోన్కు తల్లి స్వప్న పేరిట బ్యాంకు ఖాతా అనుసంధానమై ఉంది. ధాన్యం అమ్మిన డబ్బులు రూ.50 వేలు ఆమె బ్యాంకు ఖాతాలో అదే రోజు ఉదయం జమ అయ్యాయి. రాత్రి ఒంటరిగా ఉన్న ఉదయ్(రమ్మీ) ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా రూ.46 వేలు పోగొట్టుకున్నాడు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తారని భయపడిన ఉదయ్.. ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నర్సంపేట పట్టణంలోని మాధన్నపేట రోడ్డులో ఉంటున్న మిట్టపల్లి సాయిబాబా, మమత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరి కుమారుడు ప్రశాంత్ నర్సంపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. సుజాత అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతి చెందింది. సాయిబాబా దర్జీ(టైలర్) పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ ఆన్లైన్ గేమ్తో మోసపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ప్రశాంత్ నవంబర్ 22న ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవి కూడా చదవండి: మృతదేహాల కలకలం! అసలేం జరుగుతుంది? -
డిసెంబర్ 20న మొబైల్ ఫోన్లు స్విచ్ఆఫ్.. ఎందుకంటే..
అన్నం తినకుండా మారాం చేస్తున్నారనో.. అల్లరి ఆపడం కోసమో చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చేతికి ఫోన్ ఇస్తుంటారు. తొలుత సరదాగా ప్రారంభమైనప్పటికీ.. క్రమేపీ వారికి అదో వ్యసనంగా మారుతోంది. దీంతో.. రోజులో ఫోన్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ నెల 20న తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్ఫోన్లను స్విచ్ ఆఫ్ చేయాలని కోరింది. డిసెంబర్ 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు తమ కుటుంబాలతో సరదాగా గడపాలని, పిల్లలు వారి తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలని ప్రజలను కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో.. 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు వివో తెలిపింది. తల్లిదండ్రులకు సైతం ఫోన్ వ్యసనంగా మారిందని పేర్కొంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య అంతరాలు ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం కలుగుతుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. కొన్ని సర్వేల ప్రకారం.. 42 శాతం మంది 12 ఏళ్ల లోపు వయసు పిల్లలు రోజులో రెండు నుంచి నాలుగు గంటలపాటు ఫోన్ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. 12 ఏళ్ల కంటే పైబడిన పిల్లలు రోజులో 47 శాతం సమయం ఫోన్ చూస్తున్నారు. 69 శాతం పిల్లలకు సొంత ఫోన్లు, ట్యాబ్లు ఉన్నాయట. 12 ఏళ్లు, అంతకంటే పెద్ద వయసు పిల్లలకు ఎలాంటి షరతులు లేకుండా ఇంటర్నెట్ యాక్సెస్ పొందుతున్నారని సర్వేల్లో వెల్లడైంది. 74 శాతం మంది పిల్లలు యూట్యూబ్ చూసేందుకు ఫోన్ వాడుతుంటే, 12 ఏళ్ల పైబడినవారు గేమింగ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని తేలింది. ఇదీ చదవండి: ‘కంపెనీని టేకోవర్ చేసే ప్రతిపాదన లేదు’ -
వచ్చే ఐదేళ్లలో భారత డిజిటల్ గేమింగ్ మార్కెట్ ఎంతంటే..
‘ఎప్పుడు చూసినా మొబైల్లో ఆటలేనా. వేరే పనేమీ లేదా?’- పిల్లలున్న దాదాపు అందరిళ్లలోనూ తల్లిదండ్రుల మందలింపు వినిపిస్తుంటుంది. ‘ఐదే నిమిషాలు..!’ అంటూ పిల్లలు బతిమాలటం. ఆ ఐదు నిమిషాలు కాస్తా అరగంట, గంట అవటం సర్వసాధారణం. ‘అసలు ఇంతకీ వాళ్లేమి ఆడుతున్నారో’నని ఒకసారి చూసిన పెద్దోళ్లు సైతం మొబైల్ గేమ్స్ మాయలో పడిపోవటం తరచూ జరిగేదే. ఆడినంత సేపూ అందులోనే మమేకమై, ప్రపంచాన్ని మరిచిపోవడం ఆన్లైన్ గేముల ప్రత్యేకత. డిజిటల్ టెక్నాలజీ విస్తరిస్తున్న కొద్దీ చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ ఆన్లైన్ ఆటల్లో మునిగితేలుతున్నారు. తమకు నచ్చిన క్యారక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసి కేరింతలు కొడుతున్నారు. అందరినీ ఇంతగా ప్రభావితం చేస్తోన్న ఆ ఆటల రూపకల్పన వెనుక ఎందరో నిపుణుల సృజనాత్మకత దాగి ఉంది. దాంతోపాటు ఆన్లైన్ గేమ్ల ద్వారా దేశీయంగా కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న సంస్థలు రోజూ పుట్టుకొస్తున్నాయి. భారత్లోని డిజిటల్ గేమింగ్ మార్కెట్ రానున్న ఐదేళ్లలో 750 కోట్ల డాలర్ల (దాదాపు రూ.62,250 కోట్ల) స్థాయికి చేరుకోనుంది. ప్రధానంగా యాప్ల కొనుగోళ్లు, ప్రకటనల రాబడులు, వినియోగదారుల సంఖ్య పెరగడం ఇందుకు కారణమని గేమింగ్ వెంచర్ క్యాపిటల్ సంస్థ లుమికై తన నివేదికలో వెల్లడించింది. గురువారం హైదరాబాద్లో 15వ ఇండియా గేమ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ) ప్రారంభమైంది. దాదాపు 100కు పైగా సంస్థలు తమ గేమింగ్ ఉత్పత్తులను ఈ కార్యాక్రమంలో ప్రదర్శిస్తున్నాయి. నవంబర్ 4 వరకు జరిగే ఈ కార్యక్రమంలో డిజిటల్ గేమింగ్ రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ సందర్భంగా లుమికై, గూగుల్ సంయుక్త భాగస్వామ్యంలో ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్ 2023’ నివేదికను విడుదల చేసింది. ఇదీ చదవండి: కొన్నే ఉద్యోగాలు.. వందల్లో ఉద్యోగార్థులు.. వీడియో వైరల్ నివేదిక తెలిపిన వివరల ప్రకారం..దేశంలో 56.8 కోట్ల మంది గేమర్లు ఉన్నారు. ఇందులో 25 శాతం మంది చెల్లింపులు చేస్తున్నారు. భారత్లో మొత్తం డిజిటల్ గేమ్లు ఆడేవారిలో మహిళలు 41శాతం, పురుషులు 59 శాతం ఉన్నారు. 18-30 ఏళ్లవారు 50శాతం మంది, 31-45 ఏళ్లలోపు 29శాతం మంది, 45 ఏళ్లు దాటిన గేమర్లు 21శాతం ఉన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ గేమింగ్ పరిశ్రమ 310 కోట్ల డాలర్ల (రూ.26,000 కోట్ల) ఆదాయం సంపాదించింది. రానున్న ఐదేళ్లలో ఇది రెట్టింపు అవుతుందని అంచనా. రియల్ మనీ గేమింగ్ ఆదాయం వృద్ధిరేటు ఏటా పెరుగుతుంది. ఇంటర్నెట్ వినియోగదారుల్లో 50 శాతానికి పైగా వివిధ డిజిటల్ గేమ్లు ఆడుతున్నారు. గత ఏడాది భారత్లో గేమర్ల సంఖ్య 12 శాతం పెరిగింది. చెల్లింపులు చేసే గేమర్ల సంఖ్యలో 17 శాతం వృద్ధి కనిపించింది. 15వందల కోట్ల గేమ్ డౌన్లోడ్లతో భారత గేమింగ్ రంగం అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. -
ఆ కంపెనీలకు రూ.లక్ష కోట్ల జీఎస్టీ నోటీసులు!
పన్ను ఎగవేతలకు పాల్పడిన ఆన్లైన్ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ అధికారులు రూ.లక్ష కోట్ల విలువైన షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ప్రభుత్వం సవరించిన జీఎస్టీ చట్టం ప్రకారం..అక్టోబర్ 1 నుంచి విదేశీ ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు భారతదేశంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. అయితే, అప్పటినుంచి ఎలాంటి సంస్థలు రిజిస్టర్ అవ్వలేదని సమాచారం. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా పెట్టే బెట్టింగ్ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ చెల్లించాలని ఆగస్టులో సవరించారు. కానీ ఇప్పటివరకు పన్ను చెల్లించని గేమింగ్ సంస్థలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పన్ను చెల్లించని కంపెనీలపై ఇప్పటివరకు సుమారు రూ.1లక్ష కోట్ల విలువైన నోటీసులు పంపింది. ఆన్లైన్ గేమ్లు, గుర్రపు పందేలు, క్యాసినోలు ఆడేందుకు డిపాజిట్ చేసిన మొత్తం నిధులపై 28 శాతం జీఎస్టీ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటినుంచి దేశంలోని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొబైల్ ప్రీమియర్ లీగ్ వంటి కొన్ని సంస్థలు ఉద్యోగులను సైతం వదులుకోవడానికి దారితీసింది. జీఎస్టీ స్లాబ్ను తగ్గించాలని, ఇది విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కోల్పోతుందని గేమింగ్ సంస్థలు ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి. అయినప్పటికీ, రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ను నియంత్రించడానికి ప్రభుత్వం అధిక పన్నులతో ముందుకుసాగుతుంది. -
‘నెట్’లో చిక్కుకున్న చిన్నారులు
సాక్షి, హైదరాబాద్: వానల్లు కురవాలి వానదేవుడా/ వరిచేలు పండాలి వానదేవుడా/..వానా వానా వల్లప్ప...వాకిట తిరుగు చెల్లప్ప/ చెట్టుమీద దెయ్యం/ నాకేం భయ్యం / వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమీ...ఇవన్నీ పల్లెటూళ్లలో చిన్నారులు ఆరుబయట ఆటలు ఆడుకుంటూ పాడుకునే పాటలు. బడి నుంచి ఇంటికొచ్చేసి వీధి కూడలిలోనో, ఇంటిముందో పిల్లలు చేరుకుని ఇలా కబడ్డీ, పైలా పచ్చీస్, ఖోఖో, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి వంటి ఆటలు ఆడుకుంటుంటే పెద్దవాళ్లు కూడా ఆ చిన్నారుల్ని చూసి ఆనందపడిపోయేవారు. అదంతా గతం..ఇప్పుడా ఆటల్లేవు పాటల్లేవు...ఆ ఆనందమూ లేదు. ఎందుకంటారా? ఇదిగో ప్రపంచాన్నే కుగ్రామంగా మార్చేసిన అంతర్జాలం(ఇంటర్నెట్)...ఈ మాయ లో పడి నేటితరం పిల్లలు ఆటపాటలూ..ఆనందమూ అందులోనే వెతుక్కుంటున్నారు. నాటితరం ఆటలు శారీరక వ్యాయామానికి, మానసిక వికాసానికి దోహదపడితే నేటితరం ఆన్లైన్ ఆటలు పిల్లల్లో తీవ్ర ఒత్తిడిని, అసహనాన్ని పెంచుతున్నాయి. సర్వేలో వెల్లడైన ఆసక్తికర విషయాలు ఎంతమంది పిల్లలు ఆన్లైన్లో ఎంత సమయం గడుపుతున్నారు? ఎటువంటివి ఎక్కువగా చూస్తున్నారు? వంటి అంశాలపై ‘లోకల్ సర్కిల్స్’అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలోభాగంగా దేశవ్యాప్తంగా 46 వేలమంది తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. తొమ్మిది నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారు ఆన్లైన్లో ఆటలు ఆడటం, టీవీ వీక్షణం, ఓటీటీలు చూడటం వంటి పనుల్లో రోజుకు మూడు గంటలకు పైగానే గడుపుతున్నారని 61% మంది పట్టణ ప్రాంతాలకు చెందిన తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. దీంతోపాటు ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు కూడా వెల్లడయ్యాయి. (కొందరు తల్లిదండ్రులు ఒకటి కంటే ఎక్కువ అంశాలు గమనించినట్లు చెప్పారు) డిజిటల్ ఎడిక్షన్ కాకుండా చూడాలి ఆన్లైన్ తరగతుల కారణంగా పిల్లలకు స్మార్ట్ ఫోన్ల అలవాటు తప్పనిసరైంది. అయితే అది డిజిటల్ ఎడిక్షన్ కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. సైబర్ సెక్యూరిటీ అంశాలను వారికి తెలియజెప్పాలి. అవసరం మేరకు చైల్డ్ రిస్ట్రిక్షన్ ఆప్షన్లు ఎనేబుల్ చేసుకోవాలి – డాక్టర్ ప్రజ్ఞా రష్మీ, మానసిక వైద్యురాలు తల్లిదండ్రులు ఓ కన్నేయాలి స్మార్ట్ ఫోన్లలో పిల్లలు ఏ వీడియోలు చూస్తున్నారు? ఎలాంటి గే మ్లు ఆడుతున్నారు ? వంటి విషయాలపై తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతుండాలి. అవసరం మేరకు మాత్రమే పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం ఉత్తమం. – భాను పద్మజ, రిటైర్డ్ టీచర్ -
ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి.. చివరకు ఇలా..!
రంగారెడ్డి: ఆన్లైన్ గేమ్లు, దురలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా, నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు. కొంత కాలం క్రితం హైదరాబాద్లోని జవహర్నగర్కు వలస వచ్చి చిరుధాన్యాల వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36) స్థానికంగా బఠాణీలు, మరమరాలు వంటివి విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు. ► రామకృష్ణన్ తరుచూ గోవింద్ షాపు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆన్లైన్ గేమ్లు ఆడేవారు. ఇద్దరూ పలు దురలవాట్లకు బానిసయ్యారు. అవసరమైన డబ్బులను సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ► రామకృష్ణన్ తాను చోరీలు చేస్తానని, చోరీ సొత్తును ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని గోవింద్కు పురమాయించాడు. రామకృష్ణకు కీసర, కుషాయిగూడ, జవహర్నగర్ పరిధిలోని ప్రాంతాలపై అవగాహన ఉండటంతో అక్కడ చోరీలు మొదలెట్టాడు. ► వీరికి అదే ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మహేందర్ పవార్(36), బాలాజీనగర్లో జ్యువెలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్న బచ్చు సంతోష్(40) జత కలిశారు. రామకృష్ణన్ చోరీ చేసిన బంగారాన్ని గోవింద్కు ఇస్తే.. దానిని అతను మహేందర్ పవార్, సంతోష్లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. వచ్చిన డబ్బును నలుగురూ పంచుకొనేవారు. ► రామకృష్ణన్ మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో బైక్పై కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి దొంగతనం చేసేవాడు. బంధువుల ఇంట్లోనే దొంగతనం.. మహేందర్ పవార్ తన బంధువుల ఫంక్షన్కు వెళ్లాడు. ఈ విషయంపై రామకృష్ణన్కు సమాచారం ఇచ్చిన అతను బంధువుల ఇంట్లో ఎవ్వరూ లేరని, తాళం వేసి ఉందని చోరీ చేయమని చెప్పాడు. దీంతో రామకృష్ణన్ ఆ ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న బంగారం, వెండి అభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణన్పై 22 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీడీసీపీ వెంకట్రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
TS Crime News: ఆన్లైన్ ఆటలు ఆడుతున్నారా..! జర జాగ్రత్త..!
కుమరం భీం: నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆన్లైన్ బెట్టింగ్ ఆదివాసీ జిల్లా కుమురంభీంలోనూ క్రమంగా విస్తరిస్తోంది. కఠిన చట్టాలు, పోలీసుల నిఘా ఉన్నా బెట్టింగ్ దందాలకు అడ్డుకట్ట పడటం లేదు. సులువుగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో చాలా మంది యువత బానిసలుగా మారుతున్నారు. చివరికి అప్పుల్లో కూరుకుపోయి ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కాగజ్నగర్, ఆసిఫాబాద్, రెబ్బెన, కౌటాల, చింతలమానెపల్లి, పెంచికల్పేట్, వాంకిడి వంటి ప్రాంతాల్లోని యువత తరచూ నిషేధిత ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. కాగజ్నగర్లోని ఓ చిట్ఫండ్లో కలెక్షన్ బాయ్గా విధులు నిర్వర్తించే ప్రమోద్సింగ్ అనే యువకుడు మూడేళ్లుగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నాడు. దాదాపుగా రూ.2.60 లక్షల వరకు ఆన్లైన్ గేమ్స్లో పోగొట్టుకున్నాడు. కస్టమర్ల నుంచి వసూలు చేసిన డబ్బును కూడా ఈ ఆదివారం రాత్రి ఆన్లైన్ బెట్టింగ్లో పెట్టి పోగొట్టుకున్నాడు. కంపెనీ మేనేజర్లను డబ్బు విషయంలో పక్కదారి పట్టించేందుకు ఈ నెల 21న కాగజ్నగర్ మండలం ఈజ్గాం సమీపంలో తనకు తానే మందు బాటిల్స్తో తీవ్రంగా గాయపర్చుకున్నాడు. తనపై ముగ్గురు దాడి చేసి, డబ్బులు ఎత్తుకెళ్లారని పోలీసులకు చెప్పాడు. విచారణలో బెట్టింగ్ విషయం బయట పడింది. కౌటాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఏడాది నుంచి ఆన్లైన్లో కాక్ఫైట్ ఆన్లైన్ గేమ్ ఆడుతున్నారు. చైన్ సిస్టం లాంటి ఈ గేమ్లో ఒకరి నుంచి మరొకరు గేమ్ ఆడటం మొదలెట్టారు. ఈ క్రమంలో దాదాపు పదేళ్లపాటు కష్టపడి సంపాదించిన నగదు ఈ గేమ్లో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. నలుగురు యువకులు ఏకంగా రూ.1.60 కోటికి పైగానే కోల్పోయినట్లు సమాచారం. ఈ ఘటనలు జిల్లాలో ఆన్లైన్ బెట్టింగ్ సంస్కృతి ఎలా విస్తరిస్తుందో తెలియజేస్తున్నాయి. నిఘా ఉన్నా.. ప్రస్తుతం గ్రామాల్లోని ప్రజల చేతుల్లోకి స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే పోలీసులు ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్తోపాటు మూడు ముక్కలాట పేరుతో ముగ్గులోకి దింపి అందినకాడికి దండుకునే ముఠాలపై గట్టి నిఘా పెడుతున్నారు. వరుస బెట్టింగ్లకు పాల్పడుతున్న వారిని గుర్తించి కేసులు సైతం నమోదు చేస్తున్నారు. అయినా ఈ విష సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. యువకులు, చిరు వ్యాపారులు సైతం బెట్టింగ్ మోజులో పడి ఉన్నదంతా పోగొట్టుకుని అప్పుల పాలవుతున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా సాగే ఈ దందాలు.. ఇప్పుడు జిల్లాలోని అన్ని పల్లెలకూ పాకడం కలవరపెడుతోంది. నేరుగా పరిచయం లేకుండానే సెల్ఫోన్లోనే బెట్టింగ్ యాప్లు ఇన్స్టాల్ చేసుకుని యూపీఐ ఐడీలతో నేరుగా నగదు బదిలీ చేస్తున్నారు. రాష్ట్రంలో నిషేధించిన యాప్లను వీపీఎన్ సాయంతో లొకేషన్ మారుస్తూ వినియోగిస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడిపిస్తున్నారు. కొంత మంది మైనర్లు వారి తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలు అనుసంధానం చేసి ఉన్న యూపీ ఐ ఐడీల ద్వారా పందెం కాస్తున్నారు. యువత ఈజీ మనీ కోసం కెరీర్ను సైతం ఇబ్బందుల్లోకి నెట్టి పక్కదారి పడుతున్నారు. తల్లిదండ్రులు దృష్టి సారిస్తేనే.. జిల్లాలో ఎక్కువగా క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ మట్కా ఎక్కువగా సాగుతుంది. ఐపీఎల్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లోనే రూ.లక్షల్లో చే తులు మారుతుంది. ఈ నెలలో ప్రారంభమ య్యే ఆసియా క్రికెట్ కప్తోపాటు అక్టోబర్లో స్వదేశంలో మొదలయ్యే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ల సందర్భంగా బెట్టింగ్ జోరు మరింత పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు, యువత ను తల్లిదండ్రులు నిత్యం గమనిస్తూ ఉండాలి. పెద్ద మొత్తంలో డబ్బులు అడిగిన సమయంలో ఆరా తీయాలి. వారికి కౌన్సెలింగ్ ఇప్పించి అవగాహన కార్యక్రమాలకు పంపించాలి. బెట్టింగ్ నిషేధం.. ఆన్లైన్ బెట్టింగ్ నిషేదం. ఎవరైనా బెట్టింగ్కు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్లైన్ జూదంపై సమాచారం ఇస్తే వెంటనే చర్యలు చేపడుతాం. ఈ విషయమై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నాం. – కరుణాకర్, డీఎస్పీ, కాగజ్నగర్ తల్లిదండ్రులు నిఘా ఉంచాలి.. యుక్త వయసు పిల్లలు ముఖ్యంగా 15 నుంచి 25 ఏళ్ల వారిపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. ఎక్కడికెళ్తున్నారు.. ఎం చేస్తున్నారు.. అనే విషయాలు తెలుసుకోవాలి. బెట్టింగ్ల వైపు మరలకుండా ఇతర వ్యాపకాలు ఉండేలా చూడాలి. ఇతరుల జీవితాలు ఎలా ఛిన్నాభిన్నం అవుతున్నాయో వారికి వివరించాలి. – రామకృష్ణ, డీఎంహెచ్వో అత్యాశతో నష్టం తక్కువ సమయంలోనే రూ.లక్షలు సంపాదించాలనే అనే దురాశ యువతను పక్కాదారి పట్టిస్తోంది. ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, కాక్ఫైట్, తీన్మార్ పేకాట, ఇతర జూదాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ ఆటల్లో రూ.లక్షలు కోల్పోతున్నారు. డబ్బులు పోగొట్టుకున్న వారు తల్లిదండ్రులకు చెప్పలేక.. అప్పులు తీర్చలేక ఆర్థికంగా, మానసికంగా కృంగిపోతున్నాయి. మరో దారి లేకపోవడంతో కొంత మంది ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఈ ఆన్లైన్ ఆటలకు బానిసవుతున్న వారిలో 18 నుంచి 28 ఏళ్ల వారే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జిల్లాలో చోటు చేసుకుంటున్న ఘటనలు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. -
ఆన్లైన్ గేమ్స్పై 28 శాతం జీఎస్టీ.. వారికి మాత్రమే వర్తింపు
న్యూఢిల్లీ: దేశీ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్ఫాంలలో ఆడే విదేశీ ప్లేయర్లకు కూడా 28% జీఎస్టీ వర్తించనుంది. గేమింగ్ సంస్థలు ఆయా ప్లేయర్ల నుంచి ఈ మొత్తాన్ని మినహాయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన సమీకృత జీఎస్టీ (ఐజీఎస్టీ) చట్ట సవరణకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఆన్లైన్ గేమింగ్, కేసినోలు, హార్స్ రేస్ క్లబ్లు మొదలైన వాటిల్లో బెట్టింగ్లపై 28% (జీఎస్టీ) విధించాలని జీఎస్టీ మండలి నిర్ణయించడం తెలిసిందే. -
ఆన్లైన్ స్కిల్ గేమింగ్ను వేరుగా చూడాలి
న్యూఢిల్లీ: గేమింగ్ పరిశ్రమను 28 శాతం జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తూ ఇటీవలే జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని పరిశ్రమలోని కొన్ని వర్గాలు విభేధిస్తున్నాయి. ఏ గేమ్ అన్న దానితో సంబంధం లేకుండా గేమింగ్ పరిశ్రమ మొత్తాన్ని గరిష్ట పన్ను పరిధిలోకి తీసుకురావడం తెలిసిందే. దీన్ని సుమా రు 120 ఆన్లైన్ క్యాజువల్ స్కిల్ గేమింగ్ కంపెనీలు వ్యతిరేకిస్తున్నాయి. పన్ను విషయంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ నుంచి తమను (స్కిల్ గేమింగ్/నైపుణ్యాలను పెంచుకునేవి) వేరుగా చూడాలని కోరు తూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి, జీఎస్టీ కౌన్సిల్ సభ్యులకు లేఖ రాశాయి. అంతర్జాతీయంగా ప్రైజ్ మనీతో కూడిన ఫ్యాంటసీ స్పోర్ట్స్పై పన్ను అనేది ఆన్లైన్ స్కిల్ గేమింగ్తో పోలిస్తే భిన్నంగా ఉన్నట్టు మంత్రి దృష్టికి తీసుకెళ్లాయి. లాటరీలు, ఫ్యాంటసీ స్పోర్ట్స్తో పోలిస్తే ఆన్లైన్ స్కిల్ గేమింగ్ వినియో గం భిన్నంగా ఉంటుందని వివరించాయి. అలాగే, వ్యాపార నమూనా, సామాజిక ఔచిత్యం వేర్వేరు అని పేర్కొన్నాయి. రియల్ మనీ గేమింగ్ పరిశ్రమలో ఫ్యాంటసీ స్పోర్ట్స్ అనేది ప్రత్యేక విభాగమని పరిశోధనా సంస్థలైన కేపీఎంజీ, రెడ్సీర్ సైతం వర్గీకరించినట్టు తెలిపాయి. ఆన్లైన్ స్కిల్ గేమింగ్ పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ అనేది పరిశ్రమకు మరణశాసనంగా మారుతుందని ఈ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. కనుక పరిశ్రమ మనుగడకు వీలుగా తమపై పన్ను భారాన్ని తగ్గించాలని కోరాయి. -
మీ ఇంట్లో పిల్లలు స్మార్ట్ఫోన్ వాడుతున్నారా?.. అయితే ఈ హెచ్చరిక మీకోసమే!
జైపూర్: ప్రస్తుత రోజుల్లో మొబైల్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఏ ఇంట చూసినా స్మార్ట్ఫోన్ దర్శనమిస్తున్నాయి. ఈ మొబైల్ వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. ఇంట్లో పసిపిల్లలు ఉంటే వీటి వల్ల ఎదురయ్యే అనర్థాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొబైల్ తమకు ఇవ్వకపోతే పిల్లలు మారాం చేసి మరీ తల్లిదండ్రుల నుంచి తీసుకొంటున్నారు. చిన్నవయసులో వరకు ఇది ఆమోదమే గానీ కాస్త ఎదిగిన పిల్లలకు ఇది శాపంగా మారుతోంది. వాళ్లు ప్లేస్టోర్ల నుంచి వివిధ రకాల ఆటలు ఇన్స్టాల్ చేసి ఆడుతూ చాలా సమయం వాటితోనే గడుపుతున్నారు. ఇలా ఆడుతూ ఆడుతూ.. స్మార్ట్ఫోన్లకు బానిసైన పిల్లల్లో కొందరు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. రాజస్థాన్లో అల్వార్కు చెందిన దాదాపు పదేళ్ల బాలుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఏకంగా అతడి పరిస్థితి ఎలా మారిందంటే.. ఆన్లైన్ గేమ్ ఆడాలని పట్టుబట్టడం వల్ల చాలాసార్లు బలవంతంగా కట్టివేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఓ బాలుడికి అతని తల్లిదండ్రులు ఏడు నెలల క్రితం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ కొనిచ్చారు. జనవరి 2023 నుండి, అతను ఫోన్తో ఇంట్లోనే ఉంటాడు. తల్లిదండ్రులు ఉదయాన్నే తమ తమ పనులకు వెళ్లేవారు. ఆ తర్వాత 14 ఏళ్ల చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటూ మొబైల్లో 14 నుంచి 15 గంటల పాటు ఫైర్ ఫ్రీ అనే మొబైల్ గేమ్ను ఆడుతుండేది. గత ఆరు నెలలుగా పబ్జీ (PUBG) ఫ్రీ ఫైర్ ఆడుతున్న ఆ బాలుడు తీవ్రమైన మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. అతను మానసిక స్థితి చాలా వరకు క్షీణించింది. చివరికి నిద్రలో కూడా గేమ్ ఆడుతున్నట్లు భావించడం మొదలుపెట్టాడు. మరలా ఆ బాలుడిని మామూలుగా మార్చేందుకే చికిత్సలో భాగంగా అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎటువంటి పురోగతి కనిపించలేదు. చివరికి చేసేదేమిలేక బాలుడి కుటుంబం అతన్ని అల్వార్ మేధో వికలాంగుల రెసిడెన్షియల్ స్కూల్లో చేర్చారు. అక్కడ అతని మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ కౌన్సెలర్లు అతనికి సహాయం చేస్తున్నారు. సైకియాట్రిస్ట్, ఇతర వైద్యుల బృందం కూడా దానిపై పని చేస్తోంది. చదవండి: ఫ్లైట్లో ప్రయాణికుడి వీరంగం.. సిబ్బందిపై దాడి చేసి.. బాత్రూం డోర్ పగులగొట్టి.. -
పబ్జీ ప్రేమ.. ప్రియుడి కోసం నలుగురు పిల్లలతో ఇండియాకు.. చివరికి!
స్మార్ట్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్లు పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ గేమ్లకు అడిక్ట్ అవుతున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మరిచిపోయి అందులో లీనమవుతున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా కొంతమంది ప్రాణాలు తీసుకునే వరకు వెళుతుంది. భారత్లో పబ్జీ వంటి గేమ్లను నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయిన పలువురు ఇతర మార్గాల ద్వారా గేమ్ను డౌన్లోడ్ చేసుకొని ఆడుతున్నారు. తాజాగా పబ్జీ గేమ్ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. పబ్జీలో పరిచమైన యువకుడి కోసం ఓ మహిళ తన పిల్లలతో కలిసి భర్తను వదిలేసి వచ్చింది. ఆన్లైన్ ప్రియుడి కోసం ఏకంగా పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్కు ప్రయాణమైంది. ఈ వింత ఘటన నోయిడాలో చేసుకుంది. నోయిడాకు చెందిన యువకుడు సచిన్కు పాకిస్థాన్కు చెందిన మహిళ సీమా గులామ్ హైదర్తో పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడింది. అప్పటికే మహిళకు వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. పబ్జీలో సీమా, సచిన్ రోజు చాటింగ్ చేసుకునేవారు. ఇలా వీరి పరిచయం కాస్తా ప్రేమకు దారి తీసింది. దీంతో ప్రియుడు కోసం కట్టుకున్న భర్తను విడిచిపెట్టేందుకు సిద్ధంమైంది. ఈ క్రమంలో గత నెల నేపాల్ మీదుగా తన నలుగురు పిల్లలతో ఉత్తర ప్రదేశ్ చేరుకుంది. అటు నుంచి బస్లో గ్రేటర్ నోయిడాకు వచ్చి తన ప్రియుడిని కలుసుకుంది. మహిళ, తన పిల్లలతో కలిసి సదరు యువకుడు రబుపెర ప్రాంతంలో అద్దె ఇంట్లో జీవించడం ప్రారంభించారు. అయితే పాకిస్తాన్ మహిళ నోయిడా అక్రమంగా నివసిస్తుందని స్థానిక పోలీసులకు సమాచారం అందింది. సీమా సంగతి పోలీసులకు పసిగట్టారన్న విషయం తెలుసుకున్న సచిన్ ఆమెతోపాటు పారిపోయాడు. ఎట్టకేలకు నోయిడా అక్రమంగా నివసిస్తున్న సీమా, తన పిల్లలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ఆశ్రయం కల్పించిన నోయిడా యువకుడిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ మహిళ, నలుగురు పిల్లలు, నోయిడా యువకుడి పోలీస్ కస్టడీలో ఉన్నట్లు నోయిడా డీసీపీ సాద్ మియా ఖాన్ పేర్కొన్నారు. ఇద్దరిని విచారిస్తున్నట్లు తెలిపారు. మే నెలలో ఇంటిని అద్దెకు తీసుకున్నారని, తమకు కోర్టు వివాహం జరిగిందని, నలుగురు పిల్లలున్నారని చెప్పినట్లు వారు నివసించిన అపార్ట్మెంట్ యజమాని బ్రిజేష్ పోలీసులకు తెలిపాడు. సదరు మహిళ పాకిస్తాన్కు చెందినామెలా కనిపించలేదని, ఆమె సల్వార్ సూట్, చీరలుధరించేదని యజమాని పోలీసులకు చెప్పాడు. -
ఆన్లైన్ గేమ్లతో ఆనందం ఆవిరి.!
విశాఖ విద్య: ‘పెదవాల్తేరుకు చెందిన అవినాష్ నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. రాత్రి వేళ నిద్రలో కూడా వింత వింత శబ్దాలు చేస్తున్నాడు. బాలుడి పరిస్థితిని చూసిన తల్లిదండ్రులు ఏమైందోననే ఆందోళనతో వైద్యుని వద్దకు తీసుకెళ్లారు. రెండు పర్యాయాల పరిశీలన అనంతరం బాలుడి అసలు సమస్యను వైద్యులు గుర్తించారు. గంటల తరబడి సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్లు ఆడడం వల్ల అబ్బాయి మొదడుపై ప్రభావం చూపిందని తేచ్చిచెప్పారు. స్మార్ట్ ఫోన్కు దూరంగా ఉంచి, కొన్ని రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు’. విశాఖ నగరంలోని ఒక్క అవినాషే కాదు.. వందలాది మంది విద్యార్థులు, యువత ఆన్లైన్ గేమ్లతో రేయింబవళ్లు కాలక్షేపం చేస్తూ మానసిక ఆనందానికి దూరమైపోతున్నారు. స్మార్ట్ ఫోన్తో ప్రపంచం అరచేతిలోకి వచ్చేసింది. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న తరుణంలో ఆండ్రాయిడ్ ఫోన్లు వినియోగం బాగా పెరిగింది. పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాల్సిందే. దీంతో స్మార్టు ఫోన్లు వినియోగం తప్పనిసరైంది. అయితే స్మార్ట్ ఫోన్తో ఎంతటి లాభం ఉందో, అదే స్థాయిలో నష్టాన్ని చేకూరిస్తోంది. బెట్టింగ్కు బలైపోతున్న యువత గుట్టుచప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. విశాఖ కేంద్రంగా సాగుతున్న బెట్టింగ్ మాఫియాను పోలీసులు సైతం గుర్తించారు. వివిధ యాప్స్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పేకాటకు అన్ని వర్గాల వారు బానిసలైపోతున్నారు. దీంతో పాటు డ్రీమ్ యాప్ ద్వారా క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ ఆటలు ఉన్నాయి. గేమ్లో కొంత మందిని ఎంపిక చేసుకుని బెట్టింగ్ పెడతారు. వారు బాగా ఆడినట్లైతే వచ్చే పాయింట్లు బట్టి గెలుపును నిర్ధారిస్తారు. ప్రైజ్ మనీగా రూ.10 నుంచి రూ.లక్ష వరకు ఉండడంతో ఎక్కువ మంది ఈ గేమ్లోనే మునిగి తేలుతూ డబ్బులు పోగొట్టుకోవడమే కాకుండా, సమయం వృథా చేస్తూ వాటికి బానిసలైపోతున్నారు. పబ్జీతో మొద్దుబారుతున్న మెదడు కొన్నేళ్లు బ్యాన్ చేసిన పబ్జీగేమ్ మళ్లీ సరికొత్త గా స్మార్ట్ఫోన్లోకి వచ్చి చేరింది. పబ్జీతో పాటు, ఫ్రీ ఫైర్, కాల్ ఆఫ్ డ్యూటీ వంటి ఆన్లైన్ ఆటలు ఎక్కువ మంది ఆడుతున్నారు. వీటిని నలుగురు కలసి ఒకేసారి ఆడవచ్చు. వేర్వేరు ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారైనా సరే నలుగురు మాట్లాడుకుంటూ గేమ్లో పాల్గొనే అవకాశం ఉంది. దీంతో ఎక్కువగా పాఠశాల, కాలేజీ స్థాయి విద్యార్థులు పబ్జీ గేమ్లకు బానిసలవుతున్నారు. ఆన్లైన్ గేమ్లతో ప్రమాదం పిల్లలు, అందులోనూ చదువుకునే వారు ఆన్లైన్ గేమ్లు ఆడటం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. ఆన్లైన్ గేమ్ల వల్ల మానసిక ఆనందం కోల్పోతారు. మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా అలసట కలిగే ఆటలు ఆడుకోవాలి. పుస్తక పఠనం మంచి పద్ధతి. ఈ విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకమైనదే. – డాక్టర్ రమేష్బాబు, మానసిక వైద్య నిపుణులు, విశాఖపట్నం తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టాలి ఏదో కాలక్షేపం కోసమని కొద్దిసేపు ఆన్లైన్ గేమ్ ఆడితే పరవాలేదు. కానీ అదే పనిగా గంటల తరబడి స్మార్ట్ఫోన్కు అతుక్కుపోతుంటే, ఓ కంట కనిపెట్టాల్సిందే. ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. పిల్లాడి ఆనందం కోసమని స్మార్ట్ఫోన్ ఇచ్చేసి, వదిలేయకూడదు. వారితో రోజులో కొద్దిసేపు అయినా గడిపి, కబుర్లతో కాలక్షేపం చేయాలి. – డాక్టర్ జి.సీతారాం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు -
బ్యాంకు ఉద్యోగి నిర్వాకం.. ఖాతాదారుల సొమ్ముతో ఆన్లైన్లో రమ్మీ ఆట
బెంగళూరు: కర్ణాటకలో ఓ ప్రైవేటు బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ ఖాతాదారుల సొమ్మును కాజేశాడు. ఆన్లైన్లో రమ్మీ వంటి గ్యాంబ్లింగ్ గేమ్స్కు బానిసైన అతడు మొత్తం రూ.2.36 కోట్లు తన స్నేహుతుడి ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. వాటితో తరచూ గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడాడు. బ్యాంకుకు రూ.2.36 కోట్లు నష్టం రావడంతో షాక్ అయిన మేనేజర్ పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. అసిస్టెంట్ మేనేజరే ఈ మోసానికి పాల్పడినట్లు విచారణలో తేలింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. వీరేశ్ కేషిమఠ్(28) కర్ణాటక హవేరిలోని ఓ ప్రైవేటు బ్యాంకు శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో గ్యాంబ్లింగ్ గేమ్స్ ఆడి వాటికి బానిసయ్యాడు. బ్యాంకింగ్ ఆపరేషన్స్ కోసం ప్రతిరోజు రూ.5లక్షలు బదిలీ చేసే అధికారం ఇతనికి ఉంటుంది. దీన్నే అదునుగా తీసుకొని ఖాతాదారుల ఖాతాల నుంచి తరచూ రూ.5లక్షలు తన స్నేహితుడు మహంతేషయ్య పీ హిరేమఠ్కు బదిలీ చేశాడు. వాటితో రమ్మీ, ఇతర ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు. గతేడాది ఆగస్టు నుంచి ఇలా చేస్తున్నాడు. కొన్ని నెలలపాటు ఈ విషయాన్ని బ్యాంకు అధికారులు కూడా గుర్తించలేకపోయారు. అయితే ఇటీవల ఈ బ్రాంచ్లో ఆడిటింగ్ నిర్వహించినప్పుడు రూ.2.36కోట్ల అవకతవకలు జరిగినట్లు తేలింది. దీంతో మేనెజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణలో అసిస్టెంట్ నిర్వాకం బహిర్గతమైంది. గతేడాది ఆగస్టు నుంచి జరగుతున్న ఈ వ్యవహారం గురించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియడం గమనార్హం.మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేషిమఠ్ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రూ.2 కోట్లకు పైగా మోసం జరగడంతో ఈ కేసును రాష్ట్ర సీఐడీకి బదిలీ చేశారు. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్లో శిక్షణ.. -
ప్రేమ అంటూ కంచె దాటింది.. కాపురం పెట్టేలోపే..
ఆమెది పాకిస్తాన్. అతనిది భారత్. అతనితో జీవితం పంచుకోవాలని ఉందంటూ.. దాయాది దేశం నుంచి కంచెదాటి భారత్లో అడుగుపెట్టింది. వివాహ బంధంతో ఒక్కటై కాపురం పెట్టేలోపే.. ఇక్కడి అధికారులు పసిగట్టి గట్టి షాకే ఇచ్చారు. పాకిస్తాన్కు చెందిన ఇక్రా జివాని(19).. ఆన్లైన్ లూడో ద్వారా యూపీకి చెందిన ములాయం సింగ్(26)కు దగ్గరైంది. ములాయం బెంగళూరులో స్థిరపడ్డాడు. ఈ క్రమంలో ఆమెను భారత్కు రావాలని.. ఇక్కడే పెళ్లి చేసుకుని కాపురం పెడదామని ఇక్రాకు సూచించాడు ములాయం. అయితే.. ఆమెకు వీసా సమస్యలు ఎదురయ్యాయి. ఈలోపు ములాయం.. ఆమెను నేపాల్కు రమ్మని చెప్పాడు. కిందటి ఏడాది సెప్టెంబర్లో ఆమె ఖాట్మాండు త్రిభువన్ ఎయిర్పోర్ట్లో దిగింది. అప్పటికే ఆమె కోసం ఎదురు చూస్తున్న ములాయం.. తొలిసారి ఆమెను ప్రత్యక్షంగా చూసి మురిసిపోయాడు. ఆపై ఇద్దరూ ఖాట్మాండులోనే వివాహం చేసుకుని.. అక్కడే వారంపాటు ఉన్నారు. అటుపై సనోలీ సరిహద్దు ద్వారా భారత్లోకి ప్రవేశించించింది ఈ జంట. బెంగళూరుకు చేరుకుని.. ఇక్రా పేరును కాస్త ‘రవ’గా అనే హిందూ పేరుగా మార్చేశాడు ములాయం. ఇక.. కాపురం ప్రారంభమైన కొద్దిరోజులకే ఆమె తీరుపై చుట్టుపక్కల వాళ్లకు అనుమానాలు వచ్చాయి. హిందూ అమ్మాయి.. తరచూ నమాజ్ చేయడం ఏంటని షాక్ తిన్నారు చుట్టుపక్కల వాళ్లు. చివరకు పోలీసులకు సమాచారం అందించగా.. వాళ్లు ములాయం ఇంటిపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆమె పేరిట ఉన్న పాకిస్థానీ పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఇక్రాకు అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు.. ఆమె నుంచి ఏమైనా కీలక సమాచారం దొరుకుతుందేమోనని యత్నించారు. చివరకు ఆమె ములాయం కోసమే వచ్చిందని, గూఢాచారి కాదని నిర్ధారించుకున్నారు. ఆపై ఆమెకు మానసిక నిపుణులచేత కౌన్సెలింగ్ ఇప్పించారు. ఆపై ఆమెను అమృత్సర్కు తరలించారు. అక్కడ సైనికాధికారులు ఆదివారంనాడు అట్టారి సరిహద్దు ద్వారా ఆమెను తిరిగి పాకిస్థాన్కు పంపించేశారు. -
ముల్లును ముల్లుతోనే తీయాలి.. ఆన్లైన్ ‘ఆట’కట్టించిన తల్లిదండ్రులు
బీజింగ్: చైనాలో ఆన్లైన్ వీడియో గేమ్లకు బానిసగా మారిన ఓ ఐదో తరగతి బాలుడిని ఆ వ్యసనం నుంచి బయటపడేసేందుకు తల్లిదండ్రులు అతని ‘దారి’నే ఎంచుకున్నారు! రోజూ గంటల తరబడి వీడియో గేమ్లు ఆడుతున్న తమ కుమారుడు తిరిగి చదువుల బాట పట్టేందుకు వీలుగా ఓ ప్రొఫెషనల్ ఆన్లైన్ గేమర్ను ఆశ్రయించారు!! ఇందుకోసం అతనికి గంటకు సుమారు రూ. 600 చొప్పున ‘సుపారీ’సైతం చెల్లించారు!! ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా తమ కుమారుడిని ఆన్లైన్ గేమర్తో చిత్తుగా ఓడించడం ద్వారా ఈ తరహా ఆటలు ఆడటంలో నిష్ణాతుడినన్న అతడి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలనుకున్నారు. అనుకున్నట్లుగానే వారి వ్యూహం ఫలించింది. బాలుడితో ఐదు గంటలపాటు ఐదు గేమ్లు ఆడిన ఆన్లైన్ గేమర్... అతన్ని చిత్తుగా ఓడించాడు. గేమ్లన్నీ పూర్తి ఏకపక్షంగా సాగడంతో కంగుతిన్న బాలుడు.. ఆ ఆటలపై ఇష్టాన్ని కోల్పోయాడు. దీంతో తమ కొడుకును ఓదార్చిన తల్లిదండ్రులు... ఇక నుంచి అతను తిరిగి చదువుపై దృష్టిపెట్టేలా ఒప్పించారు. ఈ విషయాలను ఆన్లైన్ గేమర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా బయటపెట్టాడు. మరో బాలుడిని సైతం ఇలాగే ఆన్లైన్ ఆటల వ్యసనం నుంచి బయటపడేసినట్లు చెప్పాడు. చదవండి: పాలపుంతలో నీటి గ్రహాలు! కనిపెట్టిన నాసా టెలిస్కోప్.. -
ఆన్లైన్ గేమ్ ఆడి.. రూ.95 లక్షలు ఓడి
షాబాద్: తల్లిదండ్రులకు తెలియకుండా నష్టపరిహారం కింద వచ్చిన రూ.95 లక్షలతో ఆన్లైన్ గేమ్ ఆడి పోగొట్టుకున్నాడు ఒక యువకుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ గురువయ్యగౌడ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. షాబాద్ మండలం సీతారాంపూర్ గ్రామానికి చెందిన చన్వల్లి శ్రీనివాస్రెడ్డి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు హర్షవర్ధన్రెడ్డి నగరంలోని నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. గ్రామంలో శ్రీనివాస్రెడ్డి కౌలు చేస్తున్న 10 ఎకరాల భూమిని ప్రభుత్వం తన అవసరాల కోసం తీసుకొని ఎకరాకు రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. ఈ డబ్బుతో శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద భూమి కొనేందుకు శ్రీనివాస్రెడ్డి దంపతులు ఒప్పందం చేసుకున్నారు. రెండు రోజుల్లో భూ లావాదేవీలు జరగనున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ ఖాతాలో ఉన్న డబ్బును కుమారుడి ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ క్రమంలో హర్షవర్ధన్రెడ్డి కింగ్ 567 అనే ఆన్లైన్ గేమ్ను డౌన్లోడ్ చేసుకుని ఆడాడు.. తన ఖాతాలోని రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న సోదరుడు శ్రీపాల్రెడ్డి, కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సైబర్క్రైమ్ గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
పన్ను ఎగవేతల కట్టడిపై జీఎస్టీ మండలి దృష్టి
న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల మండలి (జీఎస్టీ కౌన్సిల్) శనివారం భేటీ కానుంది. జీఎస్టీ చట్టం కింద కొన్ని నేరాల డీక్రిమినలైజేషన్ (కొన్ని నేరాలను క్రిమినల్ పరిధి నుంచి తప్పించడం), అపీలేట్ ట్రిబ్యునల్స్ ఏర్పాటుపై చర్చించనున్నారు. వీటితో పాటు పాన్ మసాలా.. గుట్ఖా వ్యాపారాల్లో పన్ను ఎగవేతలను అరికట్టే విధానం రూపకల్పనపై ఇందులో చర్చించనున్నారు. జీఎస్టీతో పాటు ఆన్లైన్ గేమింగ్, కేసినోల అంశాలు కూడా 48వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు! -
లూడో గేమ్లో ఓటమి.. తనను తాను కుదువ పెట్టుకున్న మహిళ!
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. చుట్టుపక్కల పరిస్థితులను మర్చిపోయేంతలా అందులో లీనమైపోతున్నారు. సమయం సందర్భం లేకుండా సోషల్ మీడియాను విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ జూద వ్యసనంతో తనను తాను కుదవపెట్టుకుంది. పందెంలో యజమాని చేతిలో ఓడిపోవడంతొ అతనికి సొంతం అయిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రతాప్గఢ్లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రేణు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆరు నెలల క్రితం భర్త పనికోసం రాజస్థాన్లోని జైపూర్కు వెళ్లాడు. అక్కడే ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. అక్కడి నుంచి భార్యకు నిత్యం డబ్బులు పంపేవాడు. భర్త ఇచ్చిన డబ్బుతో వివాహిత తన ఇంటి యజమానితో రోజూ ఆన్లైన్ గేమ్ లూడోకు ఆడేది. మెల్లమెల్లగా ఆమె ఆ ఆటకు బానిసగా మారిపోయింది. అలా ఓ రోజు ఇద్దరి కలిసి ఆడుతూ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక యజమానికి తనను తాకట్టు పెట్టి మరీ లూడో ఆడింది. తనపై తానే పందెం కాసిన ఈ ఆటలోనూ మహిళ ఓడిపోవడంతో చివరికి యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో షాక్కు గురైన ఆమె భర్త ప్రతాప్గఢ్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నిత్యం జూదం, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్లో ఓడిపోవడంతో తన భార్య ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోందని తెలిపాడు. అతన్ని విడిచిపెట్టి రావాలని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోవడం లేదని వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
వీడియోలు, గేమింగ్, సోషల్మీడియా
న్యూఢిల్లీ: ఆన్లైన్ ఆటలు, సామాజిక మాధ్యమాలు, వీడియోల వ్యసనం పిల్లలకు బాగా ఎక్కువైందని పట్టణప్రాంతాల్లోని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆన్లైన్ వేదికగా సర్వేలు నిర్వహించే ‘లోకల్సర్కిల్స్’ సంస్థ చేపట్టిన ఓ సర్వేలో ఇలాంటి పలు అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి–నవంబర్ కాలంలో దేశవ్యాప్తంగా 287 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. సర్వే ఫలితాల ప్రకారం.. ► తమ 9–17 ఏళ్ల వయసు పిల్లలు గేమింగ్, వీడియోలు, సోషల్మీడియాకు అతుక్కుపోయారని పట్టణ ప్రాంతాల్లోని తల్లిదండ్రుల్లో దాదాపు 40 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► తమ 13–17 వయసు పిల్లలు రోజూ సగటున 3 గంటలకుపైగా ఇదే పనిలో ఉంటున్నారని 62 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► 9–13 వయసు చిన్నారులు రోజూ కనీసం మూడు గంటలు సోషల్ మీడియా, వీడియోలు, గేమింగ్తోనూ గడుపుతున్నట్లు 49 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► సోషల్ మీడియా, ఆన్లైన్ గేమింగ్ ఖాతాలు ఓపెన్ చేయాలంటే కనీసం 13 ఏళ్లు వయసుండాలని ఆయా సంస్థలు చెబుతున్నాయి. కానీ, 13 ఏళ్లలోపే అంటే 9–13 ఏళ్ల తమ పిల్లలు వీటిని చూస్తున్నారని 47 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు ► పట్టణప్రాంతాల్లోని 13–17 వయసు పిల్లల్లో ఈ సంస్కృతి మరీ ఎక్కువ ఉందని 44 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు ► సోషల్మీడియా ఖాతా తెరిచేందుకు కనీస వయసును 13 ఏళ్లకు బదులు 15 ఏళ్లుగా సవరించాలని 68 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ► ఆన్లైన్ తరగతులు, కొత్త విషయాలను నేర్చుకోవడంతోపాటు వినోదం కోసం కోవిడ్ తర్వాత ఇంటర్నెట్ను వాడుతున్న పట్టణప్రాంత చిన్నారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. -
ఇండియా గేమింగ్ స్టడీ 2022.. లేడీ ‘గేమ్స్’బాండ్స్
వేగంగా విస్తరిస్తున్న ఆన్లైన్ గేమింగ్ను ఉపాధి మార్గంగా ఎంచుకుంటోంది యువత. ఆన్లైన్ గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, యానిమేషన్ను వృత్తిగా మార్చుకుని డబ్బులు సంపాదించుకుంటున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఈ విషయంలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉంటున్నారు. ప్రముఖ కంప్యూటర్ సంస్థ ‘హెచ్పీ ఇండియా’ దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. సాక్షి, అమరావతి: కేవలం మానసిక ఉల్లాసానికి.. ఆలోచన శక్తి పెంచుకోవడానికి మాత్రమే ఆన్లైన్ గేమింగ్ను పరిమితం చేయకుండా.. దీనిని ఓ వృత్తిగా మలుచుకుంటోంది నేటి యువత. కొందరు గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా మారుతుండగా.. మరి కొందరు గేమింగ్ యానిమేటర్స్గా మారుతున్నారు. ఈ రంగంలో పురుషుల కంటే.. మహిళల శాతమే అధికంగా ఉంటోంది. ఈ రంగంలో 56 శాతం మంది మహిళలు ఉండగా.. 44 శాతం మంది మాత్రమే పురుషులు. ఆన్లైన్ గేమింగ్ను పూర్తిస్థాయిలో కొందరు, పాక్షికంగా మరికొందరు.. గిగ్ వర్కర్గా ఇంకొందరు సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నట్టు హెచ్పీ ఇండియా ‘ఇండియా గేమింగ్ స్టడీ 2022’ పేరిట విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. మరో విషయం ఏమిటంటే.. మిగిలిన ఐటీ జాబ్స్తో పోలిస్తే గేమింగ్ రంగంలోని ఉద్యోగులకు 25 శాతానికి పైగా అధికంగా జీతాలు లభిస్తున్నాయి. ఎందుకంటే.. గేమింగ్ రంగంలో ఆలోచనశక్తి అధికంగా ఉన్నవారు మాత్రమే నిలబడగలుగుతారని, అందుకే వారికి జీతాలు అధికంగా ఇస్తున్నారని ఐటీ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.68,800 కోట్లకు చేరనున్న మార్కెట్ భారత్లో ఆన్లైన్ గేమింగ్ వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం 50.70 కోట్ల మంది ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్నట్టు ఋఇంటరాక్టివ్ మీడియా వెంచర్ క్యాపిటల్ ఫండ్ లుమికియా’ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయ ఆన్లైన్ గేమింగ్ మార్కెట్ విలువ రూ.20,800 కోట్లు ఉండగా.. వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగి రూ.68,800 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇందులో ఉపాధి అవకాశాలపై యువత ప్రత్యేకంగా దృష్టి పెడుతోంది. సాఫ్ట్వేర్ రంగంలోనే 18 శాతం మంది గేమింగ్ సాఫ్ట్వేర్ డెవలపర్స్గా మారుతుండగా.. మరో 2 శాతం మంది గేమింగ్ యానిమేటర్స్గా ఉపాధి పొందుతున్నారు. కాగా, ఆన్లైన్ గేమింగ్ ఆడుతున్న వారిలో అత్యధికంగా 92 శాతం మంది వినోదం, మానసిక ఉల్లాసం కోసం ఆడుతున్నట్టు సర్వేలో తేలింది. మొబైల్ ఫోన్లో కంటే కంప్యూటర్లోనే గేమింగ్ ఆడేవారి సంఖ్య క్రమేపీ పెరుగుతోందంట. మొబైల్ కంటే పర్సనల్ కంప్యూటర్లోనే ఆటలు ఆడటానికి 68 శాతం మంది మొగ్గు చూపుతున్నారు. మొబైల్ కంటే కంప్యూటర్లో ఆడితే అనుభూతి అధికంగా ఉంటోందని, అందుకనే ఈ మధ్య కాలంలో 39 శాతం మంది మొబైల్ నుంచి కంప్యూటర్లోకి ఆటలు ఆడటానికి మారినట్టు సర్వేలో వెల్లడైంది. పీసీ గేమింగ్పై దృష్టి మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ పీసీ గేమింగ్లో మరిన్ని ఆవిష్కరణలు తీసుకువచ్చే దిశగా కృషి చేస్తున్నట్టు హెచ్పీ ఇండియా సీనియర్ డైరెక్టర్ విక్రమ్బేడి తెలిపారు. రాష్ట్రంలో కూడా ఆన్లైన్ గేమింగ్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు ఐటీ సంస్థలు ఏర్పాటవుతున్నాయని, విజయవాడ, రాజమండ్రి, విశాఖ కేంద్రంగా 8కి పైగా ఐటీ సంస్థలు ఆన్లైన్ గేమింగ్లకు వివిధ సేవలను అందిస్తున్నాయని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఐటాప్) ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు లెర్నింగ్ ఆధారిత గేమ్స్కు బాగా డిమాండ్ ఉండటంతో ఈ రంగంలో అవకాశాలను యువత అందిపుచ్చుకుంటోందన్నారు. వీఎఫ్ఎక్స్ యానిమేటర్స్, మెటావర్క్స్లో ఏఆర్, వీఆర్, ఎక్స్ఆర్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ అధికంగా ఉందన్నారు. ఆన్లైన్ గేమ్స్తోనే పిల్లల్లో చురుకు ఈ కాలంలో పిల్లలు బయటకు వెళ్లి ఆడుకోలేని పరిస్థితి ఉండటంతో వారి మెదడు చురుకుగా పనిచేయడానికి కనీసం రోజుకు గంట లేదా గంటన్నర ఆన్లైన్ గేమ్స్ ఆడుకోనివ్వాలి. ఇందుకోసం నీతిఆయోగ్ ఏర్పాటు చేసిన అటల్ థింకరింగ్ ల్యాబ్స్ (ఏటీఎల్) చక్కటి ఫలితాలను అందిస్తున్నాయి. విశాఖలోని శ్రీశారద విద్యాలయంలో గల ఏటీఎల్లో పిల్లలను 3, 4 వారాలపాటు ఆన్లైన్ గేమ్స్ ఆడుకోవడానికి వదిలేసి పరిశీలిస్తున్నారు. ఎవరైతే ముందుకు వెళ్లలేకపోతున్నారో గుర్తించి వాళ్లకు అనుగుణంగా గేమింగ్లో కోడింగ్ మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు మ్యాథ్స్, ఫిజిక్స్ వంటి సబ్జెక్టులను గేమింగ్ రూపంలో చెప్పడం వల్ల పిల్లలకు సులభంగా అర్థమవుతోంది. – రాజశేఖర్ వాసా, ఫౌండర్, స్కెచ్ ఈఏ ఐటీ, వైజాగ్ -
ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ!
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీకే రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సుముఖత చూపిస్తున్నారు. అది గేమ్ లేక నైపుణ్యం లేక మరొకటి అయినా 28 శాతం జీఎస్టీ రేటు ఉండాలని కోరుతున్నారు. 28 శాతం జీఎస్టీ ప్రతికూలమని, తక్కువ పన్ను రేటునే కొనసాగించాలని పరిశ్రమ కోరుతుండడం గమనార్హం. ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉండిపోయిన నేపథ్యంలో.. దీనిపై మేఘాలయ ముఖ్యమంత్రి సంగ్మా మంగళవారం వర్చువల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెజారిటీ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఆన్లైన్ గేమింగ్పై పన్ను రేటును 28 శాతానికి పెంచాలని డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో మంత్రుల గ్రూప్ ఈ సూచనలను జీఎస్టీ మండలికి నివేదించనుంది. తదుపరి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ సూచనలపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆన్లైన్ గేమింగ్పై 18 శాతం జీఎస్టీ రేటు అమల్లో ఉంది. స్థూల గేమింగ్ ఆదాయంపై ఈ పన్ను అమలు చేస్తున్నారు. -
కబళిస్తోన్న స్మార్ట్ ఫోన్.. పౌరుల భవిష్యత్తుపై వైద్య నిపుణుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : కొన్నేళ్ల క్రితం క్రీడా మైదానాలు పిల్లలతో కిటకిటలాడేవి.. ఎక్కువ సేపు మైదానంలో గడిపితే ఇళ్లకు రావాలని తల్లిదండ్రులు మందలించేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ పట్ల మక్కువ చూపుతూ మైదానాలకు, ఆటలకు దూరమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మైదానాలకు వెళ్లి ఆడుకోవాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, కోవిడ్ కాలంలో ఆన్లైన్ పాఠా లు చెప్పడం తదితర కారణాలలో విద్యార్థులు ఆన్లైన్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ గేమ్లు వ్యసనంగా మారాయి. అనేక కొత్త అంశాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్టు వర్క్లు సృజనాత్మకంగా చేసేందుకు ఇంటర్నెట్ ఉపయోగపడుతున్నప్పటికీ.. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో రేపటి పౌరుల భవిత ఏమిటనే ఆందోళనను పలువురు మనస్తత్వ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బాలల దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లోని 3 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10 తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. వారి అభిప్రాయాలను సేక రించింది. ఇందులో 60 మంది బాలురు, 60 మంది బాలికలు ఉన్నారు. జాతిపితపై అభిమానం.. ఆసక్తిలేని రాజకీయాలు స్వాతంత్య్ర సమర యోధుల్లో జాతిపిత మ హాత్మా గాంధీ అంటే అభిమానమని ఎక్కువ మంది విద్యార్థులు మనోభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత స్థానం భగత్ సింగ్కు దక్కింది. రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చలేదు. ఇంజినీరు, వైద్య వృత్తిపై మక్కువ చూపారు. తల్లిదండ్రుల్లో అమ్మకే ఎక్కువ ఓటేశారు. బాల్యం తమ అభిరుచుల మేరకు గడుస్తోందని, చదువును ఇష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గణిత శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. సాఫ్ట్వేర్ వైపే మొగ్గు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలతో దేశ, విదేశాల్లో స్థిరపడవచ్చనే ఆలోచనతో డాక్టర్ చదువుల కంటే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణితంతో కూడిన ఎంపీసీపై శ్రద్ధ పెడుతున్నారు. – ఖాందేశ్ రాజేశ్వర్రావు, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ అవసరానికే వాడాలి కోవిడ్కు ముందు పిల్లలు సెల్ఫోన్లు ముడితే కోపగించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోవిడ్ అనంతరం ఆన్లైన్ తరగతుల కారణంగా సెల్ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది. సెల్ఫోన్ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. విద్యార్థుల చదువుల అవసరానికి మాత్రమే సెల్ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించేలా అవగాహన కల్పించాలి. మా పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. – ప్రవీణ్ పవార్, ప్రధానోపాధ్యాయుడు, విద్య హైస్కూల్, ఆర్మూర్ రోగగ్రస్త యువతగా రేపటి పౌరులు విద్యార్థులు స్మార్ట్ ఫోన్కు బానిసలవుతున్నారు. శారీరక శ్రమ లేకుంటే మానసిక ధృఢత్వం ఉండ దు. విద్యార్థులను జంక్ ఫుడ్కు అలవాటు చేయ డంతో ఊబకాయం, శక్తి, యుక్తి, ఉత్తేజం లేని యువత తయారవుతోంది. స్మార్ట్ ఫోన్లలో పో ర్నోగ్రఫీతో మానసిక రోగగ్రస్తులుగా మారుతున్నారు. తలనొప్పి, కంటిచూపు దెబ్బతినడం, కోపం, చికాకు చిన్నవయస్సులోనే వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి తల్లి,దండ్రుల హత్యకు తెగిస్తున్నారు. ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణులు బాల్యం మీ అభిరుచుల మేరకు గడుస్తోందా? ►అవును 99, కాదు 21 చదువును ఇష్టంగా భావిస్తున్నారా..? ►అవును 98, కష్టంగానా ? : కాదు 22 ఇష్టమైన పని ►చదవడం 58, ఆన్లైన్ గేమ్ ఆడడం 36, మైదానంలో ఆడడం 26 పెద్దయ్యాక ఏమవుతారు ►డాక్టర్ 38, ఇంజినీర్ 42, పోలీస్ 17, కలెక్టర్ 14, సాప్ట్వేర్ 2, ఆర్మీ 2, టీచర్ 3, సీఏ 1, రాజకీయం 1 అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం ►అమ్మ 55, నాన్న 30, ఇద్దరు 35 ఇష్టమైన సబ్జెక్టు ►ఆంగ్లం 25, గణితం 43, రసాయన శాస్త్రం 10, భౌతికశాస్త్రం 11, సోషల్ 20, తెలుగు 11 స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఇష్టమైనవారు ►గాంధీ 53, నెహ్రూ 13, సర్దార్ పటేల్ 19, భగత్సింగ్ 20, సుభాష్ చంద్రబోస్ 15 తల్లిదండ్రుల ప్రభావం ఉంటోంది విద్యార్థుల ఆలోచనలపై తల్లిదండ్రులు, కుటుంబాల ప్రభావం ఎంతో ఉంది. సెల్ఫోన్లు, టీవీ ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాల ల్లో కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా క్రీడలపై ఆసక్తి పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం మానుకోవాలి. ఒక వేళ ఇచ్చినా కొంత సమయమే గడిపే విధంగా వ్యవహరించాలి. –అజారుద్దీన్, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం ఇబ్బందికరంగా సెల్ఫోన్లు సెల్ఫోన్లు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొంత మార్పు వచ్చింది. చదవాలనే పట్టుదల పెరిగింది. బాలుర కంటే బాలికలే ఉంతో ఉత్సాహంగా చదువులో ముందుంటున్నారు. –శేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ముబారక్నగర్ ఉన్నత పాఠశాల, నిజామాబాద్ క్రీడలను ప్రోత్సహించాలి పిల్లలు ఇంటి బయట ఆడు తుంటే ఇంట్లోకి పిలిచి బయటకు వెళ్లకుండా టీవీ చూస్తూ ఆడుకో అనే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో పిల్లలు మానసిక, శారీరక సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో గేమ్స్ పీరియడ్ను విధిగా నిర్వహిస్తూ మైదానంలో క్రీడలు ఆడించాలి. – జాదె శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి ఆన్లైన్ తరగతులతో ప్రతి విద్యార్థి మొబైల్ వాడాల్సి వచ్చింది. క్లాసుల తరువా త పిల్లలు మొబైల్ ఫోన్ల లో గేమ్స్కు అలవాటు పడ్డారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇష్టంగా చదవలేకపోతున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధతో విద్యార్థులు చదువుకునేలా చూడాలి. –బచ్చు రవి, ఉపాధ్యాయుడు, ఘన్పూర్, డిచ్పల్లి మండలం ప్రాథమిక స్థాయి నుంచే .. ప్రాథమిక పాఠశాల దశ నుంచి పిల్లలు సెల్ఫోన్కు అలవాటు పడుతున్నారు. పిల్లల సెల్ఫోన్ వియోగంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.తరగతి గదిలో కాకుండా ఇంటి వద్ద పాఠ్యాంశాలను చదవటంపై ఆసక్తి కనబర్చేందుకు పిల్లలపైప్రత్యేక దృష్టిపెట్టాలి. –మధుకుమార్, టీచర్, ఇందూర్ హైస్కూల్, బోధన్ అభిరుచులు మారుతున్నాయి విద్యార్థుల అభిరుచులు రోజుకో విధంగా మారుతున్నాయి. కొంత మంది అపారమైన జ్ఞానం కలిగి ఉంటే మరి కొందరికి బద్దకం ఎక్కువ. భవిష్యత్తులో ఏమి కావాలో నిర్ణయించుకుని కృషి చేస్తున్నవారూ ఉన్నారు. –శ్యామ్, పీఈటీ, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం మొబైల్ ఫోన్లకే ప్రాధాన్యత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను గాడిలో పెట్టాలి. ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడానికి కృషి చేయాలి. – అబ్దుల్ హఫీజ్, ఘన్పూర్, డిచ్పల్లి మండలం సెల్ను దూరం చేయలేని పరిస్థితి ఆన్లైన్ పాఠాల వల్ల పిల్లలకు సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. బడి నుంఇ ఇంటి రాగానే తల్లిదండ్రుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను తీసుకుంటున్నారు. చదవటం, హోం వర్క్ చాలా వరకు పాఠశాలల్లోనే సాగుతోంది. ఇంటి వద్ద చదవటం గతం కంటే తగ్గింది. పిల్లలను సెల్ ఫోన్ నుంచి దూరం చేయలేని పరిస్థితి ఉంది. –మంజుల, విద్యార్థి తల్లి, బోధన్ -
యూట్యూబ్, గూగుల్కి కోర్టు నోటీసులు.. ఆ గేమ్లు ఎలా వస్తున్నాయ్!
నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ తదితర గేమ్లు మళ్లీ ఆన్లైన్లోకి ఎలా వస్తున్నాయ్.. అని మద్రాసు హైకోర్టు.. మదురై ధర్మాసనం ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని యూ ట్యూ బ్, గూగుల్, కేంద్ర ప్రభుత్వానికి గురువారం నోటీసులు జారీ చేసింది. వివరాలు.. ఆన్లైన్ గేమింగ్పై దాఖలైన పిటిషన్ గురువారం మదురై ధర్మాసనంలో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే నిషేధించిన పబ్జీ, ఫ్రీ ఫైర్ వంటి గేమ్లు మళ్లీ అందుబాటులోకి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గేమ్ల కారణంగా యువత, పిల్లల చదువులు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు. యువత మానసిక పరిస్థితి మరీ దారుణంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పదేపదే నిషేధం విధించినా అనేక వెబ్ సైట్లు మళ్లీ పుట్టుకొస్తుండడంతో పెద్దలు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి శాశ్వతంగా ముగింపు పలికే వరకు విశ్రమించేది లేదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని యూట్యూబ్, గూగుల్తో పాటుగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. ఉత్తర్వులిచ్చారు. -
ఉసురు తీసిన ఆన్లైన్ బెట్టింగ్
ధర్మసాగర్: ఆన్లైన్ గేమ్లో బెట్టింగ్ పెట్టి మోసపోయిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా ధర్మసాగర్ పోలీస్స్టేషన్ పరిధి కాజీపేట మండలం రాంపూర్ శివారులో సోమవారం జరగగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ధర్మసాగర్ మండలం మల్లక్పల్లి గ్రామానికి చెందిన పెసరు రామకృష్ణారెడ్డి (26) రెండేళ్లుగా హనుమకొండలో ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ కమ్రంలో ఆన్లైన్ గేమ్ ఆడుతూ బెట్టింగ్ కట్టి దాదాపు రూ.లక్ష వరకు నష్టపోయాడు. అతడికి మళ్లీ ఓ గేమ్ లింక్ రావడంతో ఆ గేమ్లో దాదాపు రూ.6లక్షలకుపైగా క్యాష్ ,క్రెడిట్కార్డుల ద్వారా పెట్టాడు. ఆన్లైన్ గేమ్ల మూలంగా సంపాదించిన డబ్బుతోపాటు అప్పులు కూడా చేసి నష్టపోయాడు. అప్పటినుంచి మానసికంగా కుంగిపోయి స్వగ్రామంలోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం ఇంట్లోనుంచి బయటికి వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరుడు రాజేందర్రెడ్డి గ్రామంలో వెతుకుతూ ఉండగా రాంపూర్ శివారులో పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. రాజేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ధర్మసాగర్ పోలీసులు తెలిపారు. -
Cyber Talk: పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? డిజిటల్ రాక్షసులుగా మారకుండా..
Cyber Security Tips In Telugu: దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారిని వివిధ రూపాలలో కొలుస్తుంటాం. ఈ పూజలన్నీ మనచుట్టూ, మనలోనూ ఉన్న చెడును సంహరించి, జీవితాలను బాధ్యతగా మలచుకోమని సూచన ఇస్తున్నట్టుగా ఉంటాయి. ఇదే విషయాన్ని టెక్నాలజీ విషయంలో తీసుకుంటే... పిల్లలు డిజిటల్ రాక్షసులుగా మారకుండా, అలాంటి రాక్షసుల నుంచి ఎలా కాపాడుకోవాలో ఇంట్లో అమ్మలూ, స్కూల్లో టీచర్లూ పిల్లలకు సూచనలు ఇస్తే .. ఎన్నో సమస్యలకు అడ్డుకట్ట వేయచ్చు. ఐఫోన్లు, ఆండ్రాయిడ్లు రాకముందు, స్మార్ట్ఫోన్లపై అంతగా చర్చ లేదు. పాఠశాలల్లో సాంకేతికత అనేది ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది. ఆన్ లైన్ ప్లాట్ఫారమ్ల ప్రయోజనాలను ఉపయోగించుకుంటూ విద్యార్థుల డేటాను సురక్షితంగా ఉంచడానికి, డిజిటల్ టెక్నాలజీతో వారి సామర్థ్యాన్ని ఎలా అంచనా వేయాలో, తమను తాము రక్షించుకోవడం ఎలాగో నేర్పడానికి ఉపాధ్యాయులూ సిద్ధంగా ఉండాలి. ప్రమాదాలు పలు విధాలు... స్కూల్లో... (ఎ) సైబర్–సేఫ్ క్లాస్రూమ్ని ఏర్పాటు చేయాలి, విద్యార్థుల ప్రైవేట్ డేటాను రక్షించడంలో ఫస్ట్ లెవల్ రక్షణ వ్యూహాలను కలిగి ఉండాలి (బి) విద్యార్థులకు ఆన్ లైన్ గోప్యత భద్రతలో తీసుకోవాల్సిన ప్రాథమికాంశాలను బోధించాలి (సి) తరగతిలో, ఇంట్లో టెక్నాలజీని వాడటం ప్రయోజనకరంగా ఉండాలే తప్ప, అన్నింటిని దూరం చేసేలా ఉండకూడదు. (డి) టెక్నాలజీని మితిమీరి ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి, అది సంబంధాలు, భవిష్యత్తు కెరీర్లు, వ్యక్తిగత జీవితాలను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేయాలి టీచర్లు పిల్లల తల్లిదండ్రుల అంగీకార పత్రాన్ని తీసుకోవాలి మీ పిల్లలకు ఏదైనా ఇబ్బంది కలిగించే విషయం ఇంటర్నెట్లో కనిపిస్తే ఏమి చేయాలో వారితో మాట్లాడాలి. మీరు వారితో కలివిడిగా లేకపోతే, మీరు వారి సమీపంలోకి వెళ్లినప్పుడు వారు ల్యాప్టాప్ మూసివేస్తారు లేదా స్క్రీన్ను ఆఫ్ చేస్తారు. టీచర్లు తమ పిల్లలకు ఎంత స్క్రీన్ సమయం సరిపోతుందో పరిశీలించడానికి తల్లిదండ్రులతో తప్పనిసరిగా ఇంటరాక్ట్ కావాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు తెలిసుండాలి. అవి.. అన్ని అప్లికేషన్లు, గేమింగ్, బ్రౌజర్లు లోపలే కొన్ని నియంత్రణలను కలిగి ఉంటాయి, ఇవి మీ పిల్లలు ఆన్లైన్లో గడిపే సమయాన్ని పరిమితం చేయడానికి, పెద్దలు వాడే టెక్నాలజీలో పిల్లల జోక్యం పరిమితంగా ఉండాలి. అలాగే, పిల్లలు ఉపయోగించే షాపింగ్, చాటింగ్ వంటి ఫంక్షన్లను స్విచ్ ఆఫ్ చేయడానికి మీకు యాక్సెస్ ఉండాలి. అన్ని అప్లికేషన్లు, గేమింగ్, ఈ కామర్స్ సైట్లు తమ వినియోగదారులకు షాపింగ్, అదనపు పాయింట్లను కొనుగోలు చేయడం, ఇతర అదనపు ప్రయోజనాలను అందిస్తాయి. పిల్లలు పెద్దలకు తెలియకుండానే సులభంగా కొనుగోళ్లు చేయవచ్చు. అందుకని, యాప్ కొనుగోళ్లను ఆపేయాలి. పిల్లలకు ఆన్లైన్ ప్రమాదాల గురించి తెలియదు. మీరు రోజులో కొంత సమయాన్ని పిల్లలతో గడుపుతారు కాబట్టి, ఆ సమయం లో భవిష్యత్తులో కెరీర్ను ప్రభావితం చేసే సైబర్ బెదిరింపు, గోప్యత, ఆన్లైన్ పరువు గురించి తెలియజేయాలి. ఆన్లైన్లో కొత్త గేమ్లు, వెబ్సైట్లకు సైన్ అప్ చేసేటప్పుడు మీ పిల్లలు ఉపయోగించగల సాధారణ ఇ మెయిల్ చిరునామాను సెటప్ చేయండి. (అనగా కుటుంబ సభ్యులందరికీ వారి ఇ మెయిల్ యూజర్నేమ్, పాస్వర్డ్ తెలుసుండాలి) మీ గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ‘గూగుల్ సేఫ్ సెర్చ్’ని యాక్టివేట్ చేయడం ద్వారా సెర్చ్ ప్రశ్నలకు ప్రతిస్పందనగా అనుచితమైన కంటెంట్ను వదిలించుకోవడానికి లేదా పిల్లల కోసం https://www.kiddle.co వంటి సెర్చ్ ఇంజిన్లను ప్రత్యామ్నాయంగా ఉపయోగించండి. యాంటీ ర్యాగింగ్, జెండర్ ఈక్వాలిటీ కౌన్సిల్ మాదిరిగానే ఈ రోజుల్లో డిజిటల్ వెల్బీయింగ్ కౌన్సిల్ తప్పనిసరి. ఈ కౌన్సిల్ పిల్లలకు మంచి డిజిటల్ పరిశుభ్రత, సైబర్ నైతికతను పెంపొందించడానికి సహాయపడుతుంది. తరాలు మారాయి. కొత్త కొత్త సాంకేతికత రూపుకడుతోంది. పిల్లల ఆలోచనా ధోరణి మారుతోంది. అవగాహనారాహిత్యంతో ఉన్న పిల్లల ఎదుగుదలను సరి చేయకపోతే భవిష్యత్తు సమాజం సమస్యాత్మకంగా మారనున్నది. ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పెద్దలే జాగ్రత్త వహించాలి. పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తారు... దాదాపుగా ప్రీ–టీన్స్, టీనేజ్ పిల్లల రోజువారీ జీవితంలో ఇంటర్నెట్ భాగమైపోయింది. చాలా మంది యుక్త వయస్కులు స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్ని ఉపయోగిస్తారు. ఇంచుమించు అందరికీ ఇంటర్నెట్ ఉంటుంది. అనేక రకాల సోషల్ నెట్వర్కింగ్, గేమింగ్ సైట్లను ఉపయోగిస్తున్నారు. పిల్లలు ఇతరుల రహస్యాలను బయటపెట్టడం, లింక్ అప్లు, హుక్ అప్లు, ద్వేషం.. సర్వసాధారణం. వీరిలో మరొక చీకటి కోణం కూడా గమనించాలి. సాధారణంగా సామాజిక ప్లాట్ఫారమ్లలో కన్ఫెషన్ పేజీలు పెద్దవాళ్లు క్రియేట్ చేసినవి ఉంటాయి. దీనిని ఇప్పుడు పిల్లలు టీచర్లు, హెడ్మాస్టర్లపై ప్రేమ, సరస వ్యాఖ్యలను చేయడం చూస్తుంటే వారి భవిష్యత్తుపై ఆందోళన కలుగుతుంది. అందుకని, టీచర్లు – తల్లిదండ్రులు ఈ విషయాలపై మాట్లాడుకొని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ వారి పిల్లల భవిష్యత్తు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో టీచర్లు తెలియజేయాలి. సమాచారం : (ఎ) పిల్లలు వాడే కమ్యూనికేషన్ సాధనాలేమున్నాయి, వాటి సమాచారాన్ని తల్లిదండ్రులు తప్పనిసరిగా చూడాలి. (బి) మూలాన్ని తనిఖీ చేయాలి. (సి) ఇన్ఫర్మేషన్ నుంచి చెక్ చేయాలి (డి) సమాచారాన్ని ధ్రువీకరించాలి. (ఇ) సమాచారాన్ని నమ్మాలి. (ఎఫ్) సమాచారాన్ని పంచుకోవాలి. ప్రభావం : తల్లిదండ్రులు తప్పనిసరిగా పర్యవేక్షించాలి (ఎ) మీ పిల్లల డిజిటల్ కార్యకలాపాలు వారికి మంచి లేదా చెడుగా ఎలా అనిపిస్తాయి. (బి) బ్యాలెన్స్, క్రాస్ చెక్ ఉందా... అని చూడాలి. సూచన: వీటన్నింటి చివరలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన పాఠం మీ సొసైటీలో సాంకేతికంగా సురక్షితంగా ఉండాలంటే .. పిల్లలు ఇతరుల నుండి ఏ సూచనలను తీసుకుంటున్నారు, ఎవరు సూచనలు ఇస్తున్నారు... అనేది తెలుసుకుని జాగ్రత్త పడాలి. ఏమరపాటుగా ఉంటే అది ప్రతి ఒక్కరి భద్రతకు భంగం కలిగించవచ్చు. -ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: జాబ్ కోసం వెతుకుతున్నారా..? జాగ్రత్త.. లింక్డ్ ఇన్ ప్లాట్ఫారమ్లో.. రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు.. న్యూడ్ వీడియోలతో ఎర.. టీనేజర్లే టార్గెట్ -
Bengaluru: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!
ఇండియా గేమింగ్ మార్కెట్లో వెస్ట్రన్ డెవలపర్స్ టాప్లో ఉన్నారు. అయితే అఫ్సర్ అహ్మద్, గోవింద్ అగర్వాల్లు వెస్ట్రన్ గేమింగ్ కంపెనీలకు సవాలు విసురుతూ, సత్తా చాటుతున్నారు. అవును. మన ఆట మొదలైంది... లాక్డౌన్ సమయంలో యూట్యూబ్లో వీడియోలు చూసీచూసీ విసుగెత్తి పోయాడు ముంబైకి చెందిన ప్రభుత్వ ఉద్యోగి సంజీవ్ మెహతా. తన మొబైల్ ఫోన్లో ‘లూడోస్టార్’ గేమ్ ఆడడం మొదలుపెట్టడంతో విసుగు మాయమై హషారు ప్రత్యక్షమైంది. తమ ఫోనే లోకంగా ఎవరికి వారు విడిపోయిన ఆ ఇంట్లో కుటుంబసభ్యులందరినీ ఒకచోట చేర్చింది లూడో స్టార్. బాల్యం నాటి తన ఫేవరెట్ ఆటకు ఆన్లైన్ రూపమైన ‘లుడో స్టార్’ 57 సంవత్సరాల మెహతాకు స్ట్రెస్బస్టర్గా పనిచేసింది. మధ్యప్రదేశ్లోని జబల్పుర్లో ఒక హౌజింగ్ సొసైటీలో వాచ్మన్గా పనిచేసే రాజా సాహు ఇష్టమైన ఆట లుడో స్టార్. ‘లాక్డౌన్ టైమ్లో నేను ఇక్కడ ఉంటే, మా ఆవిడ ఊళ్లో ఉండేది. నేను ఊరికి వెళ్లలేని పరిస్థితి. ఆ సమయంలో లూడో స్టార్ మమ్మల్ని ఒకటి చేసింది. ఒకరిని ఒకరు ఓడించుకుంటూ, ఆటపట్టించుకుంటూ ఉండేవాళ్లం’ ఆ రోజులను గుర్తు చేసుకున్నాడు రాజా సాహు. ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’ ఈ లుడో స్టార్ సృష్టికర్త. ఐఐటీ–ఖరగ్పూర్ గ్రాడ్యుయెట్స్ అఫ్సర్ అహ్మద్, గోవింద్ అగర్వాల్లు బెంగళూరు కేంద్రంగా ఈ కంపెనీ ప్రారంభించారు. ఐఐటీ రోజుల్లోనే రకరకాల గేమ్స్ రూపకల్పన గురించి ఆలోచన చేస్తుండేవారు ఈ ఇద్దరు మిత్రులు. చదువు పూర్తయిన తరువాత ‘మూన్ఫ్రాగ్ ల్యాబ్స్’ కంపెనీలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం చేస్తున్న మాటేగానే వారి మనసంతా ఆన్లైన్ ఆటలతోనే నిండిపోయింది. ఇక ఇలా అయితే కుదరదనుకొని ఒక ఫైన్మార్నింగ్ చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. మొబైల్లో క్లాసిక్ బోర్డ్ గేమ్స్ను ఫ్రెండ్స్, కుటుంబసభ్యులు కనెక్ట్ అయ్యోలా తీర్చిదిద్దడానికి కసరత్తులు ప్రారంభించారు. తమ సేవింగ్స్తో బెంగళూరులో ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’ మొదలుపెట్టారు. కంపెనీకి సంబంధించిన ప్రాడక్ట్, యుఎక్స్ వెర్టికల్స్కు సంబంధించిన వ్యవహారాలను అహ్మద్ పర్యవేక్షించేవాడు. ఇక ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగాలను అగర్వాల్ చూసుకునేవాడు. మొదటి సంవత్సరంలోనే కంపెనీ లాభాల బాట పట్టడం విశేషం. గేమ్ బెర్రీ ల్యాబ్స్కు చెందిన రెండు పాపులర్ సోషల్ మల్టీప్లేయర్ గేమ్స్ లుడో స్టార్, పర్చిసి స్టార్ 200 మిలియన్ డౌన్లోడ్స్తో టాప్లో ఉన్నాయి. ఫ్రీ–టు–ప్లే– బిజినెస్ మోడల్లో మొదలైన ‘గేమ్ బెర్రీ ల్యాబ్స్’కు ఇన్ యాప్ పర్చెజెస్(ఐఏపి), యాడ్స్ ప్రధాన ఆదాయ వనరు. ‘గేమ్ అంటే గేమే’ కాన్సెప్ట్నే నమ్ముకుంటే ‘లుడో గేమ్’ అంత పెద్దహిట్టై ఉండేది కాదు. అహ్మద్, అగర్వాల్ మాటల్లో చెప్పాలంటే ఆటకు అనుబంధాలను జోడించారు. ‘సంప్రదాయంగా లూడోను ప్లేయర్స్ చూసే పద్ధతిని గేమ్బెర్రీ ల్యాబ్స్ మార్చేసింది’ అంటారు సగౌరవంగా ఇద్దరు. ‘ఇండియన్ గేమింగ్ మార్కెట్లో వెస్ట్రన్ డెవలపర్స్ అగ్రస్థానంలో ఉండేవారు. ఇప్పుడు ఆ పరిస్థితిని గేమ్బెర్రీ ల్యాబ్స్, గేమ్షన్లాంటి కంపెనీలు మార్చి మన సత్తా చాటే ప్రయత్నంలో ఉన్నాయి’ అంటున్నారు ఆల్ ఇండియన్ గేమింగ్ ఫెడరేషన్ సీయివో రోలాండ్. రాబోయే పన్నెండు నెలల సమయంలో టీమ్ సభ్యులను రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కంపెని. అంతేకాదు టెక్నాలజీ క్రియేషన్లో పెట్టుబడులను పెంచాలనుకుంటుంది. చదవండి: Gopika Govind: బొగ్గు అమ్మే అమ్మాయి ఎయిర్ హోస్టెస్ Divya Mittal: ఐ.ఏ.ఎస్ పెంపకం పాఠాలు.. మీకు పనికొస్తాయేమో చూడండి -
ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్.. ప్రయాణికుల ప్రాణాలతో క్యాబ్ డ్రైవర్ చెలగాటం
హైదరాబాద్: ఆన్లైన్ గేమ్స్కు బానిసలై ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనివల్ల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కళ్లకు కట్టే ఘటన హైదరాబాద్లో జరిగింది. మొబైల్లో గేమ్స్కు అడిక్ట్ అయిన ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. ప్యాసెంజర్లను సురక్షితంగా గమ్య స్థానాలకు తీసుకెళ్లాల్సిన అతడు ఫోన్లో గేమ్ ఆడుతూ డ్రైవింగ్ చేస్తున్నాడు. అది కూడా ఒకట్రెండు నిమిషాలు కాదు.. చాలా సేపు. వెనకాల కూర్చున్న ప్యాసెంజర్ గేమ్ ఆడకుండా డ్రైవింగ్ చేయమని చెప్పినా అతడు పట్టించుకోలేదు. అలాగే నిర్లక్ష్యంగా కారును ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ తీసుకెళ్లాడు. కనీసం సీట్ బెల్టు ధరించమని చెప్పినా పట్టించుకోలేదు. డ్రైవర్ వెర్రి చర్యకు చిర్రెత్తిపోయిన ప్యాసెంజర్ రాజీవ్ సింగ్ ఈ విషయంపై హైదరాబాద్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులకు ట్విట్టర్ వేదికగా ఫిర్యాదు చేశాడు. @CYBTRAFFIC driving while playing pic.twitter.com/RRUP7GXF2E — Rajiv Singh (@rajusingh0810) August 5, 2022 ఇతని పేరు రాజు. అరుదైన డ్రైవింగ్ స్టైల్ ఉన్నట్టుంది. ఫోన్లో గేమ్ ఆడుతూనే కారు నడపుతున్నాడు. అసలు ఇతడ్ని డెల్ సంస్థ క్యాబ్ డ్రైవర్గా ఎలా తీసుకుంది అని వాపోయాడు. రాజీవ్ షేర్ చేసిన వీడియో చూసి నగర పోలీసులు కూడా వెంటనే స్పందించి ఆ చోటు ఎక్కడని అడిగారు. ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మధ్యలో అని అతడు బదులిచ్చాడు. ఇందులో నిజానిజాలు ఎంతో తెలుసుకుని పోలీసులు ఏ మేరకు చర్యలు తీసుకుంటారో చూడాలి. చదవండి: ‘పోలీసు పరీక్ష’కు నిమిషం నిబంధన.. అభ్యర్థులకు కీలక సూచనలు -
బాలుడి ప్రాణాలు తీసిన పబ్జీ గేమ్
-
మచిలీపట్నంలో విషాదం.. పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: మచిలీపట్నంలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్లో పబ్జీ గేమ్కు అలవాటుపడి మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన ఊటుకూరు ప్రభు (16) తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో శనివారం రాత్రి ఇంట్లో వాళ్లతో కలిసి పబ్జి గేమ్ ఆడాడు. అయితే గేమ్లో ఓడిపోవడంతో ఇంట్లో వాళ్లు ప్రభును కాస్తా ఆటపట్టిస్తూ హేళన చేశారు. దీంతో అవమానం తట్టుకోలేక వేరే గదిలో పడుకుంటానని చెప్పి ప్రభు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఉదయం ఎంత సేపటికి బయటకి రాకపోవడంతో నిద్ర లేపేందుకు తండ్రి తలుపులు తీయడంతో గదిలో ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. కొడుకు ఉరికి వేలాడుతూ కనిపించడంతో అది చూసిన తండ్రి సొమ్మసిల్లి పడిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గదిలో తల్లి శవం.. దోస్తులతో ఎగ్ కర్రీ దావత్
సమాజంలో మైనర్ సంబంధిత నేరాలు పక్కదోవ పట్టడానికి కారణాలు అనేకం. అందునా తల్లిదండ్రుల నిఘా లేకపోవడం వల్లే జరుగుతున్నాయంటూ విమర్శించేవాళ్లు లేకపోలేదు. కానీ, తల్లిదండ్రుల మంచి మాటల్ని పెడచెవిన పెట్టడమే కాదు.. మందలిస్తే వాళ్లపై దాడులకు తెగబడుతోంది ఇప్పటి యువతరం. తాజాగా ఆన్లైన్ గేమ్ ఆడొద్దు అన్నందుకు కన్నతల్లినే కడతేర్చాడు ఓ తనయుడు. యూపీ లక్నోలో జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తల్లి మందలింపుతో క్షణికావేశంలో తండ్రి తుపాకీ తీసుకుని ఘాతుకానికి పాల్పడ్డాడు సదరు టీనేజర్. అయితే ఈ ఘటనలో.. విస్తుపోయే విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో మొబైల్లో పబ్జీ ఆడుతూ కనిపించాడు సదరు మైనర్(16). అది చూసి పట్టరాని కోపంతో తల్లి సాధన(40) మందలించింది. దీంతో అతనిలోనూ కోపం కట్టలు తెంచుకుంది. ఇంట్లో బీరువాలో ఉన్న తన తండ్రి సర్వీస్ రివాల్వర్తో తల్లిని కాల్చేశాడు. తల్లిని చంపాక ఓ గదిలో ఆమె శవాన్ని ఉంచి తాళం వేశాడు. ఆ శబ్దానికి నిద్రిస్తున్న అతని సోదరి(10) లేచింది. భయంతో అరిచే ప్రయత్నం చేసింది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి మరో గదిలో ఉంచి తాళం వేశాడు. ఆపై ఇద్దరు స్నేహితులకు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఆన్లైన్లో ఎగ్కర్రీ, ఫుడ్, కూల్డ్రింకులు ఆర్డర్ చేసుకుని.. సినిమాలు చూస్తూ దోస్తులతో దావత్ చేసుకున్నాడు. తల్లి గురించి అతని స్నేహితులు ఆరాతీయగా.. బంధువుల ఇంటికి వెళ్లిందని కహానీ చెప్పాడు. అలా రెండు రోజులు గడిచింది. మృతదేహాం దుర్వాసన వస్తుండడంతో రూమ్ఫ్రెష్నర్ స్ప్రే చేశాడు. అయినా కూడా కుళ్లిన కంపు పొరుగిళ్లకు చేరింది. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఎంట్రీతో ఈ దారుణం బయటపడింది. గదిలో బంధించడంతో స్పృహ కోల్పోయిన మృతురాలి కూతురిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి బాగానే ఉంది. ఇదిలా ఉంటే.. ఆ కుర్రాడి తండ్రి ఆర్మీ అధికారి. ప్రస్తుతం బెంగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే సర్వీస్ రివాల్వర్ను మాత్రం ఇంట్లోనే ఉంచి వెళ్లారాయన. చదవండి: గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. -
పబ్జీ గేమ్ ఆడొద్దు బిడ్డా అంటే.. కోపంతో ఊగిపోయి, తండ్రి పిస్టల్ తీసుకుని
లక్నో: పిల్లలకి ఆటలంటే చాలా ఇష్టం. అయితే ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ఆన్లైన్ ఆటలను పిల్లలు ఆడటమే కాదు వాటికి బానిసలా మారుతున్నారు. ఎంతలా అంటే వీటి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తాజాగా ఆన్లైన్ గేమ్ పబ్జీ ఆడకుండా అడ్డుకున్నందుకు ఏకంగా తన తల్లినే కాల్చి చంపాడు ఓ మైనర్ బాలుడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇటీవల కొన్ని నెలలుగా ఓ మైనర్ బాలుడు ఆన్లైన్ గేమ్ పబ్జీని ఆడటం ప్రారంభించాడు. అయితే రాను రాను అన్ని పనులను, చదువుని పక్కన పెట్టి ఈ గేమ్ను ఆడుతూ ఉండేవాడు. ఈ విషయాన్ని గమనించిన తల్లి అతడిని పబ్జీ ఆడవద్దని సూచించేది. అయితే బాలుడు ఆడుతున్న ప్రతి సారి తన తల్లి గేమ్ వద్దని వారించడంతో కోపంతో ఊగిపోయాడు. దీంతో బాలుడు క్షణికావేశంలో తన తండ్రి పిస్టల్ తీసుకుని తల్లిని కాల్చి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చదవండి: హైదరాబాద్ టెకీ పాడుపని.. ఇన్స్టాలో యువతులకు వీడియో కాల్ చేసి.. -
‘సన్’ స్ట్రోక్స్! ఆన్లైన్ క్లాస్ల పేరిట గేమ్లకు బానిసగా...
సాక్షి, హైదరాబాద్: నగరంలోని యువకుల తల్లిదండ్రులకు ఇటీవల ‘సన్’ స్ట్రోక్స్ ఎక్కువగా తగులుతున్నాయి. ఆన్లైన్ గేమింగ్కు అలవాటు పడుతున్న యువత వాటిలో గెలవడానికి బానిసలుగా మారిపోతున్నాయి. దీనికోసం ఆయా కంపెనీల ట్రాప్లో పడి యూసీ పాయింట్లు కొంటున్నారు. వాటిని ఖరీదు చేయడానికి తల్లిదండ్రుల క్రెడిట్, డెబిట్ కార్డులు వారికి తెలియకుండా వాడేస్తున్నారు. అంబర్పేట ప్రాంతానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఫ్రీఫైర్ గేమ్ కోసం తన తల్లి, తాతల బ్యాంకు ఖాతాల్లోని రూ.36 లక్షలు వాడిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పథకం ప్రకారం కంపెనీల వ్యవహారం.. కోవిడ్ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఆన్లైన్ క్లాసులే నడుస్తున్నాయి. దీంతో దాదాపు ప్రతి విద్యార్థి చేతికి ఫోన్, ట్యాబ్లు వచ్చి చేరాయి. దీన్ని క్యాష్ చేసుకోవడానికి గేమింగ్ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఆకర్షణీయమైన ప్రకటనలు, లింకుల ద్వారా తమ గేమ్స్ను ప్రమోట్ చేస్తున్నాయి. వీటికి ఆకర్షితులవుతున్న విద్యార్థులు వాటిని ఇన్స్టాల్ చేసుకుని ఆడటం మొదలెడుతున్నారు. ఈ గేమ్స్ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ప్రోగ్రామింగ్ ద్వారా నడుస్తుంటాయి. దీనిప్రకారం గేమ్ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. పాయింట్లతో బలపడతావంటూ... ఇలా తమ గేమ్కు బానిసగా మారిన వారిని ఎంపిక చేసుకునే నిర్వాహకులు అసలు కథ మొదలెడుతున్నారు. కొన్ని రోజుల పాటు వాళ్లు ఆయా గేమ్స్లో ఓడిపోయేలా చేస్తారు. ఆపై గేమ్లో నువ్వు వీక్ అయిపోయావంటూ సందేశాలు పంపి రెచ్చగొడతారు. దీంతో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే భావన యువతలో కలిగిస్తారు. ఆపై అసలు కథ మొదలెట్టి.. కొన్ని రోజుల తర్వాత ఆ యూసీ పాయింట్లు ఉచితంగా ఇవ్వలేమంటూ మెలికపెడతారు. అవి కావాలంటే తమ వద్ద రిజిస్టర్ చేసుకుని, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేయాలని షరతు విధిస్తారు. అప్పటికే ఈ గేమ్స్కు బానిసలుగా మారుతున్న యువత తేలిగ్గా వాటి నిర్వాహకుల ట్రాప్లో పడిపోతున్నారు. అలా తమ తల్లిదండ్రుల కార్డులు తీసుకుని వారికి తెలియకుండా పేమెంట్లు చేస్తున్నారు. యువత అనునిత్యం రూ.2 వేల నుంచి రూ.3 వేలు ఖర్చు చేసేస్తోంది. నేరగాళ్ల పనిగా భావిస్తున్న తల్లిదండ్రులు.. ఇలా అనునిత్యం తమకు తెలియకుండా కార్డులు, ఖాతాల నుంచి చిన్న మొత్తాలు పోతుండటాన్ని తల్లిదండ్రులు తక్షణం గుర్తించలేకపోతున్నారు. కొన్ని రోజుల తర్వాత ఇవి పెద్ద మొత్తాలుగా మారిన తర్వాత తెలుసుకుంటున్నారు. ఆ పని చేసింది సైబర్ నేరగాళ్లుగా భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. యువకులే డబ్బు పెట్టి ఆడుతున్నారు యువకులతో పాటు యువతులూ ఇలాంటి గేమ్స్కు బానిసలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. పిల్లలు ఆన్లైన్ గేమ్స్కు బానిసలు కాకుండా చూసుకోవాలి. – కేవీఎం ప్రసాద్, సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ (చదవండి: అరువుపై ఎరువులు ఇవ్వం) -
కాలక్షేపం కోసం ఆడిన ఆన్లైన్ గేమ్లు...సైబర్ జూదం ఊబిల్లో ..
బనశంకరి: సాంకేతికత అనే కత్తికి ఒకవైపు ఎన్నో ప్రయోజనాలు అయితే, రెండో వైపు ఉన్న నష్టాలు అపారం. ఐటీ సిటీలో ఆన్లైన్ గేమ్స్, జూదాలు క్రికెట్ బెట్టింగ్ వంటివి యువతను పీల్చిపిప్పిచేస్తున్నాయి. వీటి మాయలో పడి డబ్బును కోల్పోయి కుటుంబాలను నిర్లక్ష్యం చేసి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇవి కూడా మద్యం, డ్రగ్స్ మాదిరిగా తీవ్ర వ్యసనాలుగా తయారైనట్లు ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనాతో మరో నష్టం మొదట్లో కాలక్షేపం కోసం మొబైల్ యాప్ల ద్వారా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కొన్నిరోజులకే వాటికి బానిసలుగా మారడం, ఆపై ఇబ్బందుల్లో కూరుకుపోవడం జరుగుతోంది. కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ తరగతులతో అతిగా మొబైల్స్ను వినియోగించడం మొదలయ్యాక సైబర్ జూదాల ఊబిలో చిక్కుకుకోవడం అధికమైంది. పీయూసీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం పీయూసీ ఫస్టియర్ విద్యార్థికి కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల కోసం తండ్రి మొబైల్ ఇచ్చారు. తరగతులు అయిపోయాక అతడు ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. తండ్రి మొబైల్ బ్యాంకింగ్ పాస్వర్డ్ తెలుసుకుని గేమ్స్కు డబ్బు చెల్లించేవాడు. ఇలా రూ.1.25 లక్షల నగదు కట్ అయింది. తండ్రి ఈ తతంగాన్ని తెలుసుకుని మందలిస్తే ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుమారునికి మానసిక వైద్యాలయంలో చికిత్స అందిస్తున్నారు. డబ్బు తగలేసిన టెక్కీ ఒక టెక్కీ పోకర్ అనే ఆన్లైన్ జూదంలో కాలక్షేపం కోసం రూ. వెయ్యి చెల్లించి ఆడాడు. లాభం రావడంతో జూదాన్ని కొనసాగించాడు. కానీ లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ అప్పులను తీర్చడానికి ఇంటిని కుదువ పెట్టాడు, వివిధ బ్యాంకుల్లో రుణాలు చేశాడు. చివరకు అతని భార్య వనితా సహాయవాణి సహాయాన్ని కోరింది. వీధిన పడ్డ క్యాషియర్ బ్యాంక్ క్యాషియర్ ఒకరు ఆన్లైన్ రమ్మీకి బానిసై రెండేళ్లలో రూ.32 లక్షలు డబ్బు పోగొట్టుకున్నాడు. బ్యాంకులో అప్పులు తీసుకున్నాడు. ఒకసారి బ్యాంకులో డబ్బులు కాజేసి పట్టుబడడంతో ఉద్యోగం నుంచి తీసేశారు. ఇదంతా తెలుసుకున్న భార్య తన తల్లిదండ్రుల నుంచి రూ.25 లక్షలు తీసుకువచ్చి అప్పులు తీర్చింది. భర్తలో మార్పు తేవాలని పోలీసులను సంప్రదించింది. ఇలా కౌన్సెలింగ్ కేంద్రాలకు చేరుతున్న దీన గాథలు అనేకం ఉంటున్నాయి. ఆన్లైన్ జూదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని నిపుణులు హెచ్చరించారు. (చదవండి: ఎస్ఐ స్కాంలో దంపతుల అరెస్టు) -
ఆన్లైన్ గేమ్స్పై కేంద్రం జీఎస్టీ బాదుడు! ఎంతంటే!
ఎస్. ఊహించినట్లుగానే జరిగింది. కొద్ది సేపటి క్రితమే కేంద్ర మంత్రుల బృందం ఆన్ లైన్ గేమింగ్, క్యాసినో,రేస్ కోర్స్లపై 28శాతం జీఎస్టీ విధించేలా సిఫార్స్ చేసినట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. దీనిపై త్వరలో మంత్రుల బృందం నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అయితే కేంద్ర మంత్రుల సిఫార్స్లపై స్కిల్గేమింగ్ పరిశ్రమ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతమున్న 18 శాతం జీఎస్టీ రేటునే కొనసాగించాలని డిమాండ్ చేసింది. ప్రతిపాదిత 28 శాతం పన్ను పరిధిలోకి మారిస్తే 2.2 బిలియన్ డాలర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అధిక పన్ను పరిధిలోకి చేర్చడం వల్ల పరిశ్రమ విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని.. ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ, భారత పన్ను చట్టం పరిధిలోకి రాని వాటిని ప్రోత్సహించినట్టు అవుతుందని గేమ్స్ 24ఇంటూ7 సీఈవో త్రివిక్రమ్ తంపి పేర్కొన్నారు. ‘‘ఇది ముప్పేట ప్రభావాన్ని చూపిస్తుంది. పరిశ్రమ నష్టపోతుంది. ప్రభుత్వం పన్ను ఆదాయం రూపంలో నష్టపోతుంది. విశ్వసనీయత లేని ఆపరేటర్ల చేతుల్లో పడి ఆటగాళ్లు నష్టపోతారు’’అని తంపి అభిప్రాయపడ్డారు. 400 సంస్థలతో 45,000 మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమకు 18 శాతం జీఎస్టీనే కొనసాగించాలని ఆన్లైన్ స్కిల్ బేస్డ్ గేమింగ్ ప్లాట్ఫామ్ల సమాఖ్య ఇప్పటికే అధికారులకు వినతిపత్రాన్ని కూడా సమర్పించింది. ఈస్పోర్ట్స్, ఫాంటసీ గేమ్స్, రమ్మీ, పోకర్, చెస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ స్కిల్ గేమ్ల కిందకు వస్తాయి. ఈ తరహా ఆటలు ఉచితంగా లేదంటే ప్లాట్ఫామ్ ఫీజుల రూపంలో నడుస్తుంటాయి. క్యాసినో, రేస్ కోర్స్, ఆన్లైన్ స్కిల్ గేమింగ్ సేవలను 18 శాతం నుంచి 28 శాతం జీఎస్టీ శ్లాబులోకి మార్చాలన్న ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది. చదవండి👉ఇన్సురెన్స్ ప్రీమియంపై జీఎస్టీను తగ్గించండి -
ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు కేంద్రం భారీ షాక్!
రిలాక్సేషన్ కోసం ఆడే ఆన్లైన్ గేమ్స్ ఇకపై మరింత ఖరీదు కానున్నాయి. ఆన్లైన్ గేమ్స్పై ప్రస్తుతం కేంద్రం విధిస్తున్న జీఎస్టీని పెంచనుంది. ఇప్పటికే జీఎస్టీ పెంపు అంశంపై జరుగుతున్న చర్చలు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ది ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( ఐఏఎంఏఐ) ఆన్లైన్ గేమింగ్పై 18శాతం జీఎస్టీని కొనసాగించాలని జీఎస్టీ కౌన్సిల్ను కోరింది. ఒకవేళ జీఎస్టీ రేట్లను ఇంకా పెంచితే ఆ ప్రభావం గేమింగ్ ఇండస్ట్రీతో పాటు దేశ ఎకానమీపై పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే త్వరలో కేంద్రం పెంచనున్న జీఎస్టీ ఏ గేమ్స్కు వర్తిస్తుందనే అంశంపై క్లారిటీ లేదని ఐఏఎంఏఐ తెలిపింది. ఫ్రీగా ఆడే గేమ్స్తో పాటు డబ్బులు చెల్లించే ఆడి ఆన్లైన్ గేమ్స్పై జీఎస్టీ విధిస్తారా అన్న అంశంపై స్పష్టత రావాలంటే కొద్ది రోజు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ ఇండస్ట్రీపై జీఎస్టీ పెంపు అంశం ఇప్పుడు గేమింగ్ ఇండస్ట్రీని కలవరానికి గురిచేస్తుంది. జీఎస్టీని పెంచితే.. గేమింగ్ ఇండస్ట్రీ నష్టపోయే ప్రమాదం ఉందని ఆ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీ షట్ డౌన్ అయితే లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందనే అంచనా వేస్తున్నారు. మే 18లోపు జీఎస్టీపై క్లారిటీ జీఎస్టీ పెంపు అంశంపై సమీక్షించేందుకు మంత్రులతో కూడిన బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ బృందం సభ్యులకు చైర్మన్గా కాన్రాడ్ సంగ్మా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మంత్రుల బృందం ఇప్పటికే మే 2న తొలి సమావేశం నిర్వహించింది. మే18న రెండో దఫా భేటీ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న 18శాతం పన్నును 28శాతానికి పెంచేందుకు మంత్రుల బృందం ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. ఈ సందర్భంగా కాన్రాడ్ సంగ్మా మాట్లాడుతూ..బుధవారం (మే18)న జరగనున్న సమావేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్న గ్రాస్ గేమింగ్ రెవెన్యూ (జీజీఆర్)పై పన్ను వేయాలా..లేదంటే చట్ట ప్రకారం చర్య తీసుకోతగిన మొత్తం ప్రైజ్పై వేయాలా..? అన్నది చర్చిస్తామన్నారు. చదవండి👉నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు! -
ఆన్లైన్ గేమ్స్ వద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
ముదిగుబ్బ: ఆన్లైన్ గేమ్స్ ఓ విద్యార్థి ప్రాణాలను బలిగొన్నాయి. వివరాలు.. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లికి చెందిన సంతోష్కుమార్(20) డిగ్రీ చదువుతున్నాడు. మొబైల్లో ఆన్లైన్ గేమ్లకు బానిసై డిగ్రీ సెకండియర్ మధ్యలోనే మానేశాడు. ఇంటివద్దే ఉంటూ ఆన్లైన్ వీడియో గేమ్లు ఆడేవాడు. ఈ విషయమై తల్లిదండ్రులు గురువారం సంతోష్ను నిలదీశారు. చదువులు మానేసి ఆన్లైన్ గేమ్లు ఆడుతూ కూర్చొంటే ఎలా బతుకుతావంటూ మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ పురుగుమందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి సంతోష్ మృతిచెందాడు. పట్నం ఎస్ఐ సాగర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నట్టింట ‘స్మార్ట్’ చిచ్చు!
మాటల్లేవు... మాట్లాడుకోవడాలు లేవు! ఒక అచ్చట లేదు.. ముచ్చటా లేదు! నట్టింట్లో సందడి, హడావుడి లేనే లేవు... ఉన్నదల్లా భరించలేనంత నిశ్శబ్దం! నలుగురు నాలుగు దిక్కుల్లో మొబైల్ఫోన్ తెరలకు అతుక్కుపోయిన పరిస్థితి. స్మార్ట్ఫోన్ ఇప్పుడు చాలామందిలో వ్యసనమైపోయింది. దీంతోనే నిద్ర... దీంతోనే మేలుకొలుపు. రీల్స్ మత్తులో కొందరు... పబ్జీ ఆడుతూ ఇంకొందరు.. ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్, ఇన్స్ట్రాగామ్, స్నాప్చాట్... పేర్లు ఏవైనా.. అన్నింటి అతి వాడకం పుణ్యమా అని సమాజం విచిత్ర మహమ్మారిని ఎదుర్కొంటోంది. కరోనా మహమ్మారి పీడ ఎలాగోలా వదిలిందని సంబరపడుతున్న ఈ సమయంలో దశాబ్దకాలంగా పట్టిపీడిస్తున్న ఈ స్మార్ట్ఫోన్ మహమ్మారి సంగతులపై ప్రత్యేక కథనం. -కంచర్ల యాదగిరిరెడ్డి సగటున ఏడు గంటలు ఇటీవల ఓ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ దేశంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 2021లో సగటు భారతీయులు రోజుకు సుమారు ఏడు గంటలపాటు ఫోన్కు అతుక్కుపోతున్నారు. ‘నేను మొదట్లో గంట మాత్రమే యూట్యూబ్, ఇతర సామాజిక మాధ్యమాలను చూసేదానిని. ఇప్పుడు ఆ ఊబి నుంచి బయటపడేందుకు మానసిక నిపుణుడి సహాయం తీసుకోవాల్సి వచ్చింది’ అని ముంబైకి చెందిన గృహిణి ప్రమీలారాణి వాపోయారు. ‘ముఖ్యంగా టీనేజ్ పిల్లలు స్మార్ట్ఫోన్కు బానిసలవుతున్నారు. వారిని ఆ వ్యస నం నుంచి దూరం చేయకపోతే భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. నా దగ్గరకు రోజు ఇలాంటి కేసులు అరడజను దాకా వస్తున్నాయి. వారిలో పిల్లలతో పాటు సాధారణ గృహిణులు కూడా ఉన్నారు’అని ఢిల్లీకి చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ రాజేంద్రన్ చెప్పారు. హైదరాబాద్కు చెందిన మానసిక నిపుణుడు డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నిమిషానికి ఒకసారి.. నోటిఫికేషన్లు, మెయిళ్లు, చాట్ మెసేజీలేమైనా వచ్చాయా? అని చెక్ చేసుకోవడం స్మార్ట్ఫోన్ వ్యసన లక్షణాల్లో మొదటిది. ఫోన్ దగ్గర లేకపోతే ఆందోళనలో పడిపోవడం.. నిద్రలేవగానే స్మార్ట్ఫోన్ లాక్ ఓపెన్ చేయడం.. ఇలా అనేక రూపాల్లో మన వ్యవసనం బట్టబయలు అవుతూంటుంది’అని చెప్పారు. భౌతిక, మానసిక సమస్యలు స్మార్ట్ఫోన్ అతి వినియోగం కారణంగా అటు భౌతిక, ఇటు మానసిక సమస్యలు రెండూ తలెత్తుతున్నాయి. మహిళల్లో తలనొప్పి ఎక్కువ అవుతుండగా.. కళ్ల మంటలు, చూపులో అస్పష్టత, మెడ సమస్యలు, జబ్బు పడితే తేరుకునేందుకు ఎక్కువ సమయం పట్టడం వంటి దు్రష్పభావాలు కనిపిస్తాయి. విద్యార్థుల్లో స్మార్ట్ఫోన్ వినియోగం కాస్తా ఏకాగ్రత లోపానికి దారితీస్తున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. ‘బాలల హక్కుల సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లు వినియోగిస్తున్న విద్యార్థుల్లో 37.15 శాతం మంది ఏకా గ్రత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాగే కనీసం 23.80 శాతం మంది పిల్లలు నిద్రపోయేటప్పుడు కూడా స్మార్ట్ఫోన్ను తమ దగ్గరగా ఉంచుకుంటున్నారు’ అని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వయంగా గత నెలలో లోక్సభకు వివరించారు. ‘ప్రాథమిక ఫలితాల ప్రకారం సెల్ఫోన్ రేడియేషన్ కాస్తా మగవారిలో వంధ్యత్వానికి దారితీస్తుంది. అలాగే వీర్యకణాల కదలికలు నెమ్మదించేందుకు, సంఖ్య తగ్గేందుకూ మొబైల్ఫోన్ రేడియేషన్ కారణమవుతుంది’ అని ప్రముఖ రేడియోలజిస్ట్ డాక్టర్ కే.గోవర్దన్ రెడ్డి హెచ్చరించారు. ప్రశ్నించుకోండి... సరిచేసుకోండి! స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని గుర్తించేందుకు కొన్ని సర్వేలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ప్రశ్నలకు నిజాయితీగా జవాబులు చెప్పుకోగలిగితే మీరు స్మార్ట్ఫోన్కు బానిసయ్యారా? లేదా? అన్నది తెలిసిపోతుంది. తదనుగుణంగా సమస్యను అధిగమించే ప్రయత్నం చేయొచ్చు. మానసిక వైద్యులు కౌన్సెలింగ్ ద్వారా ఈ సమస్యలకు పరిష్కారం చూపగలరు కూడా. అతికొద్ది మందికి కొన్ని మందులు వాడాల్సిన అవసరం రావొచ్చు. అయితే స్మార్ట్ఫోన్ వ్యసనాన్ని తొలగించేందుకు నిర్దిష్టమైన పద్ధతి అంటూ ఏదీ లేదన్నది మాత్రం అందరూ గుర్తించాలి. -
ఆయువు తీసిన ఆన్లైన్ గేమ్స్!
టెక్కలి రూరల్(శ్రీకాకుళం): సంబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన నక్కల్ల మణికంఠ(18) అనే విద్యార్థి ఆదివారం రాత్రి తన ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.మణికంఠ ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో తన గదికి వెళ్లి తల్లి చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడు గది నుంచి ఎంతకూ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరిచి చూడగా.. ఫ్యాన్కు వేలాడుతూ కనిపించాడు. దీంతో వారు హుటాహుటిన అతడిని కిందకు దించి టెక్కలి జిల్లా ఆస్పత్రి తరలించారు. వైద్యుడు మధు అతడిని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యార్థి తండ్రి నాగభూషణ్ వ్యవసాయ కూలీగా పనిచేస్తున్నాడు. విద్యార్థి మృతికి ఆన్లైన్ గేమ్సే కారణమని స్థానికులంటున్నారు. టెక్కలి ఎస్ఐ ఎన్ కామేశ్వరరావు టెక్కలి ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. -
పబ్ జీ గేమ్కి బానిసగా మారి.. తల్లిదండ్రులనే మరచిపోయాడు!
సాక్షి, అనంతపురం: ఆన్లైన్ గేమ్ పబ్జీ అంటే యువతతో సహా పిల్లలకు ఎంతో ఇష్టమన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరు ఆ గేమ్కి బానిసగా మారి ప్రాణలు మీదకు తెచ్చుకుట్టుంటే మరి కొందరు ప్రాణాలే పోగుట్టుకుంటున్నారు. తాజాగా పబ్ జీ గేమ్ ఆడుతూ ఓ బాలుడు ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలానికి చెందిన సుబ్బారాయుడు 8 వతరగతి విద్యార్థి చదువుతున్నాడు. గత కొంత కాలంగా అతను ఈ ఆటను ఆడటం ప్రారంభించాడు. అయితే మూడు నెలలుగా పబ్ జీ ఆట వ్యసనంగా మారి అదే పనిగా ఆడటంతో బాలుడు తల్లిదండ్రులను గుర్తించ లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో చికిత్స నిమిత్తం బాలుడి కర్నూలులో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. కొడుకు పరిస్థితిని చూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చదవండి: ఏఎస్ఐని మాట్లాడుతున్న అర్జెంటుగా రూ.10వేలు పంపు.. -
కాసుల వర్షం: రూ.29వేల కోట్లుకు చేరనున్న గేమింగ్ మార్కెట్
న్యూఢిల్లీ: దేశంలో గేమింగ్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. 2025 నాటికి 3.9 బిలియన్ డాలర్లకు (రూ.29,000 కోట్లు సుమారు) చేరుకుంటుందని ఐఏఎంఏఐ వన్ప్లస్, రెడ్సీర్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నాయి. గేమింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్ల నుంచి ఎంతో ఆసక్తి కనిపిస్తోందని.. గడిచిన ఆరు నెలల్లోనే ఈ పరిశ్రమలోకి బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చినట్టు తెలిపింది. ‘‘భారత్లో ప్రస్తుతం మొబైల్ గేమర్లు (మొబైల్పై గేమ్లు ఆడేవారు) 43 కోట్ల మంది ఉన్నారు. 2025 నాటికి ఈ సంఖ్య 65 కోట్లకు పెరుగుతుంది. గేమింగ్ రంగాన్ని ప్రస్తుతం మొబైల్ గేమింగ్ శాసిస్తోంది. ప్రస్తుతం గేమింగ్ పరిశ్రమ 1.6 బిలియన్ డాలర్ల మేర ఉంటే.. ఇందులో మొబైల్ గేమింగ్ వాటా 90 శాతంగా ఉంది’’అంటూ ఈ నివేదిక పేర్కొంది. గేమింగ్ను అమితంగా ప్రేమించే వారిలో 40 శాతం మంది సగటున ప్రతీ నెలా రూ.230 చొప్పున ఇందుకు ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి డిజిటల్ గేమ్స్ వృద్ధికి సాయపడింది. యాప్ డౌన్లోడ్లు 50 శాతం పెరిగాయి’’ అని వివరించింది. గడిచిన కొన్నేళ్లలో ఈ–గేమింగ్ పరిశ్రమ అద్భుతంగా వృద్ధి చెందినట్టు వన్ప్లస్ ఇండియా చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ నవీన్ నక్రా పేర్కొన్నారు. గేమింగ్ పరికరాలకూ పీఎల్ఐ పథకం! ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని గేమింగ్ పరికరాల తయారీకి విస్తరించాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరభ్గౌర్ తెలిపారు. ఐఏఎంఏఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో గౌర్ పాల్గొన్నారు. ‘‘గేమింగ్ కన్సోల్స్కు ఎంతో ఆదరణ ఉంది. ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు ఇతర వనరులుగా ఉన్నాయి. దేశం లో గేమింగ్ వ్యవస్థకు ప్రోత్సాహం, బలోపేతానికి వీలుగా సమాచార శాఖ, సాంస్కృతిక శాఖతో కలిసి చర్యలు తీసుకుంటున్నాం’’ అని గౌర్ చెప్పారు. చదవండి: జస్ట్ ఒక్క మొబైల్ గేమ్తో 75 వేల కోట్లు సొంతం...! -
తైవాన్ ఎక్సలెన్స్ గేమింగ్ కప్లో భారత్ నుంచి 8 వేల మంది..
తైపీ: విభిన్న రకాల ఆన్లైన్ గేమ్స్లో పోటీపడేందుకు రూ.10లక్షల దాకా ప్రైజ్ మనీని పొందేందుకు అవకాశం అందించే ఆన్లైన్ ఆటల సందడి మొదలైంది. అత్యధిక సంఖ్యలో ఆన్లైన్ గేమింగ్ ప్రియుల ఆదరణ పొందిన తైవాన్ ఎక్స్లెన్స్ గేమింగ్ కప్ (టిఇజిసి) క్వాలిఫైర్స్ 2వ రౌండ్ అక్టోబరు 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని టిఇజిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ తైవాన్ ఎక్స్లెన్స్ మార్క్ వ్యూ తెలిపారు. గత 16వ తేదీన ప్రారంభమైన ఈ గేమింగ్ సందడి డిసెంబరు 5తో ముగుస్తుందనీ, ఈ స్పోర్ట్స్ ప్రియులు అత్యధిక సంఖ్యలో ఈసారి భారత్ నుంచి పాల్గొన్నారని వివరించారు. ఈ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు భారత్ నుంచి 8వేల మందిపైగా నమోదు చేసుకున్నారన్నారు. ఈ ఏడాది పలు ప్రాచుర్యం పొందిన కొత్త గేమ్స్ తాము పరిచయం చేశామని, అత్యాధునిక గేమింగ్ టెక్నాలజీని అందిస్తున్నామని తెలిపారు. చదవండి: తెలుగు క్రికెటర్పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్వెల్, కోహ్లి -
ఓటీటీలో సినిమా, వెబ్సిరీస్లేకాదు..గేమ్స్ కూడా..!
కరోనా రాకతో ఓటీటీ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అదేస్థాయిలో ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య కూడా భారీగా వృద్ది చెందింది. దీంతో ఆన్లైన్ గేమింగ్పై నెట్ఫ్లిక్స్ లాంటి ఓటీటీ సంస్థలు దృష్టిసారించాయి. గతంలో నెట్ఫ్లిక్స్ ఆన్లైన్ గేమ్స్ను కూడా తీసుకువస్తోదనే ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా నెట్ఫ్లిక్స్ ప్రముఖ గేమింగ్ దిగ్గజం నైట్ స్కూల్ స్టూడియోను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. నైట్ స్కూల్ స్టూడియోకు చెందిన ఐదు మొబైల్ గేమ్స్ను యూరోపియన్ మార్కెట్లలో నెట్ఫ్లిక్స్ రిలీజ్ చేసింది. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! నైట్ స్కూల్ స్టూడియో అభివృద్ధిపరిచిన తొలి గేమ్ ‘ఆక్సెన్ఫ్రీ’ వీడియో గేమ్ నెట్ఫ్లిక్స్లో వస్తోంది. సోనీ ప్లేస్టేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్, నింటెండో స్విచ్ , కంప్యూటర్లలో అందుబాటులో ఉన్న నైట్ స్కూల్ స్టూడియో గేమ్స్ నెట్ఫ్లిక్స్తో కలిసి తొలి సారిగా మొబైల్ స్మార్ట్ఫోన్స్లో గేమ్స్ను లాంచ్ చేసింది.నెట్ఫ్లిక్స్ సభ్యత్వం ఉన్న వారికి యాప్లో ఎలాంటి కొనుగోలు లేకుండా, యాడ్స్ లేకుండా యూజర్లు గేమ్స్ను ఆడుకోవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. స్పెయిన్ ,ఇటలీలోని నెట్ఫ్లిక్స్ సభ్యులకు ఆండ్రాయిడ్లో "స్ట్రేంజర్ థింగ్స్: 1984", "స్ట్రేంజర్ థింగ్స్ 3: ది గేమ్", "కార్డ్ బ్లాస్ట్", "టీటర్ అప్" "షూటింగ్ హూప్స్" గేమింగ్ టైటిళ్లను ఇప్పటికే ప్రవేశపెట్టినట్లు కంపెనీ తెలిపింది. కాగా ఈ సదుపాయం త్వరలోనే భారత్లోను లాంచ్ చేసేందుకు ప్రయత్నాలను చేస్తోన్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. స్ట్రీమింగ్ స్పేస్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఆదాయవనరులను పెంచుకునేందుకుగాను గేమింగ్ రంగంపై నెట్ఫ్లిక్ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. చదవండి: వర్క్ వాట్ వర్క్స్ పాలసీ.. ఎంప్లాయిస్ ఫుల్ హ్యాపీ -
ఈ గేమ్స్ ఆడుతున్నారా..! అయితే జర భద్రం..!
Thousands Of Gamers Targeted In A New Cyberattack: మన నిత్యజీవితంలో స్మార్ట్ఫోన్స్, ఇంటర్నెట్ ఓక భాగమైపోయింది. చౌక ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్స్ రాకతో తరుచూ ఆన్లైన్లో ఉంటూ..ఎప్పుడు ఎదో ఒక అంశంపై బ్రౌజ్ చేస్తు కాలక్షేపం చేస్తున్నాం. దీంతో ఇంటర్నెట్ వాడే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఆన్లైన్ గేమ్స్ ఆడే వారి సంఖ్య బాగా పెరిగింది. అదేస్థాయిలో సైబర్ నేరస్తులు యూజర్లపై దాడిచేస్తున్నారు. హ్యకర్లు కూడా కొత్త పుంతలను తొక్కుతూ...రకరకాలుగా దాడులకు పాల్పడుతున్నారు. సైబర్ నేరస్తులు రూట్ మార్చి గేమ్స్ ఆడే వారిపై విరుచుకుపడుతున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ కాస్పర్స్కై పరిశోధకులు తన నివేదికలో వెల్లడించారు. చదవండి: Xiaomi: బెల్ట్తో పేమెంట్స్...! టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణ..! ఆన్లైన్ గేమ్స్ ఆడే వారేలక్ష్యంగా దాడులు..! సైబర్ నేరగాళ్లు బ్లడీస్టీలర్ అని పిలువబడే కొత్త మాల్వేర్తో ఎక్కువగా గేమర్స్ను, వారి ఖాతాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారని కాస్పర్ స్కై పేర్కొంది. బ్లడీస్టీలర్ మాల్వేర్తో సెషన్ డేటా , పాస్వర్డ్స్, కుకీ ఎక్స్ఫిల్ట్రేషన్ను హ్యకర్లు పొందుతున్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. ఆన్లైన్ గేమ్స్ ఆడే యూజర్ల బ్యాంక్ కార్డ్ వివరాలను, బ్రౌజర్ ఆటోఫిల్డేటా, స్మార్ట్ఫోన్స్, కంప్యూటర్ల నుంచి స్క్రీన్ షాట్లను హ్యాకర్లు సేకరిస్తున్నట్లు తెలిసింది. కాస్పర్ స్కై నివేదిక ప్రకారం... ఎపిక్ గేమ్స్, స్టీమ్, ఆరిజిన్, గాగ్. కామ్(GOG.com), బెథెస్డా, టెలిగ్రామ్, వైమ్ వరల్డ్ వంటి ఫ్లాట్ఫామ్స్ యూజర్ల సెషన్ వివరాలను హ్యకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ స్టోర్లలో అత్యంత ప్రాచుర్యం పొందిన జీటీఏ ఫైవ్, ఫార్ట్నైట్, బ్యాటిల్ ఫీల్డ్,ఫిఫా 2022 గేమ్స్ ఉన్నాయి. రష్యన్ ఫోరమ్లో బ్లడీస్టీలర్ అనే మాల్వేర్ తొలిసారిగా మార్చి 2021లో కాస్పర్స్కై గుర్తించింది. ఈ మాల్వేర్ సహాయంతో గేమర్స్ నుంచి టెలిగ్రామ్ యాప్ ద్వారా యూజర్ల నుంచి డబ్బులను వసూలు చేస్తోన్నట్లు కాస్పర్స్కై పేర్కొంది. చదవండి: జియో ఫోన్ లాంచ్కు ముందు..మరో కంపెనీపై ముఖేశ్ అంబానీ కన్ను..! -
జీవితం నాశనం.. ఆన్లైన్ గేమ్స్ రీచార్జ్ కోసం..
సాక్షి,తాడిపత్రి: ఆన్లైన్ గేమ్స్ ఓ చిన్నారి భవితను నాశనం చేశాయి. గేమ్స్ ముందుకు సాగేందుకు అవసరమైన రీచార్జ్ డబ్బుకోసం ఏకంగా దొంగను చేశాయి. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం పట్టణ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వీఎస్కే చైతన్య తెలిపారు. ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన నార్పలకు చెందిన ఓ బాలుడు 8వ తరగతితోనే చదువుకు స్వస్తి చెప్పాడు. నిరంతరం ఆన్లైన్ గేమ్స్ ఆడేవాడు. అయితే ముందుకు వెళ్లాలంటే రీచార్జ్ చేయాల్సి రావడంతో... సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో నార్పలలోనే మూడు ఇళ్లలో చోరీ చేశాడు. ఆ తర్వాత ఈనెల 1వ తేదీన తాడిపత్రిలో, 4వ తేదీన రూరల్ పరిధిలో వరుస చోరీలు చేసి రూ.3.79 లక్షల నగదు, రూ.3 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పట్టణ, రూరల్ పోలీసులు కేసులు నమోదు చేసుకుని గాలింపు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో బుధవారం ఆటోనగర్లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు..ఆ దారి గుండా వెళుతున్న బాలుడిని ప్రశ్నించారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం వెలుగు చూసింది. దీంతో బాలుడి వద్ద ఉన్న రూ.3.79 లక్షల నగదుతో పాటు రూ.3 లక్షల విలువైన బంగారు నగలను స్వాదీనం చేసుకుని అరెస్టు చేసినట్లు డీఎస్పీ వీఎన్కే చైతన్య తెలిపారు. నార్పలలో జరిగిన చోరీ ఘటనల్లోనూ మూడు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. చదవండి: మచ్చా అన్నందుకు డబుల్ మర్డర్ -
ఏడుగురి స్నేహితుల మధ్య ‘లూడో గేమ్’ వివాదం
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ గేమ్ విషయంలో స్నేహితుల మధ్య వివాదం ఏర్పడింది. ఆ వివాదం కాస్త తీవ్ర దాడికి దారి తీసింది. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకునేంత స్థాయికి చేరింది. ఒకరి ప్రాణం మీదకు వచ్చింది. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రస్తుత వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన హైదరాబాద్లోని మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. చదవండి: మంత్రుల ముందు ‘ఈటల’ గడియారాలు ధ్వంసం పోలీసుల వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి.. గంగాబౌలి ప్రాంతానికి చెందిన మోహమ్మద్ అనీఫ్ (25), టప్పాచబుత్ర ప్రాంతానికి చెందిన రషీద్ (30), మంగళ్హాట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముస్తఫా (24)తో పాటు అదే ప్రాంతానికి చెందిన నలుగురు యువకులతో లూడో గేమ్ గెలుపోటములపై వివాదం ఏర్పడింది. ఈ సమయంలో ఒకరినొకరు అసభ్య పదజాలంతో దూషించుకున్నారు. అప్పటికే వారందరూ మద్యంమత్తులో ఉన్నారు. ఒకరినొకరు దాడి చేసుకొని పిడిగుద్దుల వర్షం కురిపించుకున్నారు. కొద్దిసేపటి తరువాత బయటికి వెళ్లివచ్చిన యువకులు మహమ్మద్ అనీఫ్పై తమ వెంట తెచ్చుకున్న కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో హనీఫ్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనలో మహమ్మద్ ముస్తఫా (24), రషీద్ (30)లకు కత్తిపోట్లకు గురయ్యారు. అక్కడినుంచి బయటకు తప్పించుకుని పారిపోయారు. దీంతో స్థానికంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. భయాందోళనతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని హనీఫ్, మరో ఇద్దరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ముస్తఫా, రషీద్ కోలుకుంటున్నారని మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ రణీశ్వర్రెడ్డి తెలిపారు. పారిపోయిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హనీఫ్, హాజీ స్నేహితులు. వీరిద్దరూ లూడో గేమ్ ఆడుతుంటారు. అయితే డబ్బులు పెట్టి ఆడుతున్నారు. ఈ సమయంలో వారిద్దరి మధ్య డబ్బు విషయమై గొడవ ఏర్పడింది. పరస్పరం దాడి చేసుకున్నారు. అయితే తీవ్ర గాయాలపాలైన హనీఫ్ అక్కడికక్కడే మృతి చెందాడు. హాజీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మంగళ్హాట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక -
కంటి చూపుతో కాదు కత్తితో..
న్యూ మినీగేమ్స్, న్యూ టెక్నిక్స్, న్యూ ఎనిమీ టైప్స్తో యాక్షన్ ఎడ్వెంచర్ గేమ్ ‘ఘోస్ట్ ఆఫ్ తుషిమా డైరెక్టర్స్ కట్’ నేడు విడుదలవుతుంది. ఇకీ ద్వీపం నేపథ్యం ఉన్న ఈ బ్రాండ్ న్యూ ఎడిషన్ను మోస్ట్ రిక్వెస్టెడ్ ఫీచర్స్తో తీర్చిదిద్దారు. ఇక కత్తి యుద్ధాల గురించి చెప్పాల్సిన పని లేదు. మనకు ఇష్టమైన జిన్ సకై సమురాయ్ ఉండనే ఉన్నాడు. కొత్త విలన్లు కూడా పరిచయం అవుతున్నారు. ‘మీకు సవాలుగా నిలిచే గేమ్ ఇది’ అంటున్నాడు ఆర్ట్ డైరెక్టర్ జాసన్ కనెల్. ప్లాట్ఫామ్స్: ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ 5 -
పిల్లలపై నజర్ పెట్టాలి.. లేకుంటే ఇలాంటివే జరుగుతాయి
ఆన్లైన్ క్లాసుల వంకతో స్మార్ట్ ఫోన్లు పిల్లల చేతికే వెళ్లిపోతున్నాయి. అయితే తరగతులు అయిన తర్వాత కూడా చాలా సమయం ఫోన్లలలోనే గడిపేస్తున్నారు చాలామంది. ఆ టైంలో తల్లిదండ్రుల నిఘా ఉండకపోతే.. అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అలా పిల్లలపై నజర్ పెట్టక.. వీడియో గేమ్ వల్ల లక్ష రూపాయల దాకా పొగొట్టుకుంది ఉత్తర ప్రదేశ్కి చెందిన ఓ జంట. లక్నో: ఆ భార్యాభర్తలది ఉత్తర ప్రదేశ్ గోండా జిల్లాలోని ఓ గ్రామం. 12, 14 ఏళ్ల వయసున్న పిల్లలున్నారు ఆ జంటకి. ఆన్లైన్ క్లాసులు నడుస్తుండడంతో పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చారు. భర్త బయట పనులకు వెళ్లగా.. భార్య ఇంటి పనుల్లో మునిగిపోయింది. అయితే క్లాసులు ముగిశాక కూడా. ఫోన్ వాళ్ల చేతుల్లోనే ఉండనిచ్చారు. ఇంకేం సరదాగా ఆన్లైన్ గేమ్ ఇన్స్టాల్ చేసుకుని.. అందులో మునిగిపోయారు ఆ అన్నదమ్ములు. ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుతూ.. ఓసారి ఏడువేలు, మరోసారి 90 వేల రూపాయలు ఖర్చు పెట్టారు. అంతా ఖర్చుపెట్టి ఆటలో డైమండ్స్, క్యారెక్టర్ల కోసం బట్టలు కొన్నారు వాళ్లు. విషయం తెలియని ఆ పిల్లల తండ్రి.. వాళ్ల ఫీజుల కోసం డబ్బు డ్రా చేయడానికి బ్యాంక్కి వెళ్లాడు. అకౌంట్లో డబ్బులు లేవని బ్యాంక్ సిబ్బంది చెప్పడంతో కన్నీళ్ల పర్యంతమయ్యాడు. ఆపై అసలు విషయం తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. అయితే గేమ్కు సంబంధించి లీగల్ ట్రాన్జాక్షన్ కావడంతో ఏం చేయలేమని పోలీసులు చెప్పారు. ఈ విషయం తెలిసిన గోండా ఎస్పీ సంతోష్ మిశ్రా.. ఆ పేరెంట్స్కి కొంత ఆర్థిక సాయం చేస్తానని మాటిచ్చాడు. అంతేకాదు ఆయన స్థానికంగా ఉండే కొందరు పేరెంట్స్ను పిలిపించుకుని స్మార్ట్ ఫోన్లలో పిల్లల యాక్టివిటీపై నజర్ పెట్టాలని స్వయంగా కౌన్సెలింగ్ ఇస్తున్నాడు. -
పిల్లల చేతుల్లో ఫోన్లు.. ఏం చూస్తున్నారో ఇలా తెలుసుకోండి!
సాక్షి, మహబూబ్నగర్ : కోవిడ్ మహమ్మారికి అడ్డుకట్ట వేసే క్రమంలో పాఠశాలల్లో ప్రత్యేక్ష బోధనకు అవకాశం లేని పరిస్థితి. అన్ని తరగతుల బోధన ఆన్లౌన్లోనే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఒకప్పుడు మొబైల్ పట్టుకుంటే తప్పు అని చెప్పే తల్లిదండ్రులే.. నేడు ఫోన్ చూడక తప్పదూ అనే ధోరణి నెలకొంది. ఆన్లైన్ తరగతుల పేరుతో విద్యార్థులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఫోన్లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఫోన్లు వారి చేతికి ఇచ్చి వారి పనులు వారు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులు ఏం చూస్తున్నారు?ఏం విటున్నారు? అనే అంశంపై పెద్దగా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫోన్లో ఉండే నిషేధిత వీడియోలు, అపరిచితులతో పరిచయాలు తదితర అంశాలు విద్యార్థుల మానసిక స్థితి, భవిష్యత్తు పరిణామాలపై తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పలు చర్యలు తీసుకుంటే చిన్నారుల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫోన్ వినియోగంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. ఆన్లైన్ తరగతులపై పర్యవేక్షణ.. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు రికార్డు చేయబడిన వీడియోలు టీసాట్తో పాటు నిపుణ వంటి తదితర వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రతి రోజు చూసే విధంగా వెసలుబాటు ఉంటుంది. ఇందుకు సంబందించి షెడ్యూల్ను సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు వాట్సాప్, మెసేజ్ల రూపంలో పంపిస్తారు. వాటిని అనుసరించి తరగతులు వినాల్సి వస్తుంది. హోంవర్కు, వర్కుషీట్లు వంటివి పూర్తి చేయాలని సూచిస్తుంటారు. ఇక ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు చాలా వరకు లైవ్గా, యాప్ల ద్వారా తరగతులు బోధిస్తున్నారు. అయితే, కొందరు తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో విద్యార్థులు ఏం చూస్తున్నారని పట్టించుకోవడం లేదు. కరోనా నేపథ్యంలో తరగతులన్నీ ఆన్లైన్లోనే కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మక్తల్లో ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న విద్యార్థికి తండ్రి ఆన్లైన్ తరగతుల కోసం సెల్ఫోన్ కొనిచ్చాడు. పాఠాలు విన్న తర్వాత కూడా మొబైల్ చేతిలో ఉండడంతో పలు గేమ్స్కు ఆడడం మొదలెట్టాడు. ఎక్కువ సేపు ఫోన్లో ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని తల్లిదండ్రులు సెల్ఫోన్ తీసుకోవడంతో సదరు విద్యార్థి మనస్థాపానికి గురయ్యాడు. శనివారం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తల్లిదండ్రులు అందర్నీ ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. పరిశీలించాల్సినవి ఇవీ.. ► పిల్లలు ఆన్లైన్ తరగతుల్లో సూచించినవే వింటున్నారా లేదా ఇతర అంశాల జోలికి వెళ్తున్నారా తప్పకుండా దృష్టిసారించాలి. ► గూగుల్, య్యూట్యూబ్లలో నిషేధిత వీడియోలు, షార్ట్ఫిల్మ్లతో కాలక్షేపం చేస్తుంటారు. ఆయా యాప్ల సెట్టింగ్స్లో హిస్టరీని పరిశీలిస్తే ప్రారంభం నుంచి ఏ టైమ్లో ఏం సెర్చ్ చేశారు, అవి తరగతులకు సంబంధించినవేనా అని తెలిసిపోతుంది. మరుసటి రోజు జాగ్రత్త పడొచ్చు. ► సోషల్ మీడియాకు, యాప్స్కు దూరంగా ఉంచాలి. ► ఎంత పనిలో ఉన్నా అప్పడప్పుడూ పిల్లల స్మార్ట్ఫోన్, ట్యాబ్లో చేస్తున్న కార్యకలాలపై నిఘా వేయాలి. ► గాడ్జెట్లలో యాప్, గేమ్, ఇతర పైళ్లను డౌన్లోడ్లు చేయకుండా తల్లిదండ్రులు నియంత్రించాలి. అందుకు ప్రత్యేక యాప్లను ఇన్స్టాల్ చేయడమో.. డివైజ్ సెట్టింగ్లను మార్చడమో చేయాలి. ► ఇంటర్నెట్లో అశ్లీల లింక్లు వాటంతటవే ఓపెన్ అవుతుంటాయి. వాటిపై నియంత్రణ విధించాలి. ► ఎవరైన వేధింపులు, బెదిరింపులకు దిగితే.. తక్షణమే సమచారం ఇచ్చేలా సూచనలు చేయాలి. ► చాలావరకు మీకు సమీప గదుల్లోనే ఫోన్లు, కంప్యూటర్లు ఉంచండి. -
రూ.40 వేలు మాయం: బాలుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమింగ్
భోపాల్: ఎప్పుడూ ఫోన్లో ఆటలు ఆడుతూ ఉండడంతో తల్లి మందలించింది. పైగా ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పెట్టడంతో తల్లి ఆగ్రహం వ్యక్తం చేసింది. తల్లి తిట్టడంతో మనస్తాపానికి గురైన కుమారుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ చత్తార్పూర్ జిల్లాలో జరిగింది. శాంతినగర్కు చెందిన 13 ఏళ్ల బాలుడు ఫ్రీ ఫైర్కు బానిసగా మారాడు. ఈ గేమ్ తరచూ ఆడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఆ ఆటలో రూ.40 వేలు ఖర్చు చేశాడు. ఇంట్లో సోదరితో ఉండి కుమారుడు గేమ్ ఆడుతూ ఉంది. పొలం పనులకు వెళ్లిన తల్లికి ఓ మెసేజ్ వచ్చింది. బ్యాంక్ ఖాతాలో రూ.1,500 మాత్రమే ఉందని ఆ సందేశంలో ఉంది. ఇది చూసిన తల్లి వెంటనే కుమారుడిని తన వద్దకు పిలిపించింది. డబ్బులు ఏం చేశావని కుమారుడిని అడిగింది. తల్లి కోపంతో అడగడంతో కుమారుడు తడబడ్డాడు. మెల్లగా అడగడంతో డబ్బులు ఆన్లైన్ గేమ్ కోసం ఆడినట్లు తెలిపాడు. రూ.40 వేలు ఆన్లైన్ గేమ్తో వృథా చేశాడని తల్లి తీవ్రంగా మందలించింది. దీంతో కుమారుడు మనస్తాపానికి గురయ్యాడు. వెంటనే తల్లి మందలించిందనే కోపంతో ఇంటికొచ్చి సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లోనే ఉన్న సోదరి వెంటనే తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు కుమారుడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రూ .3 వేల కోట్ల కుంభకోణం: రాజ్ కుంద్రాపై సంచలన ఆరోపణలు
సాక్షి, ముంబై: పోర్నోగ్రఫీ కేసులో పీకలదాకా మునిగిపోయి, పోలీసు కస్టడీలో ఉన్న రాజ్కుంద్రాపై బీజేపీ నేత రామ్ కదం ఆరోపణలు ప్రకంపనలు రేపాయి. ఒక మోడల్ని శారీరకంగా వేధించడమేకాకుండా, ఆన్లైన్ గేమ్ పేరుతో దాదాపు 3 వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆన్లైన్ గేమ్తో లక్షలాది మంది ప్రజలను మోసగించారని, దీని ప్రమోషన్ కోసం నటి శిల్పా శెట్టిని వాడుకున్నాడంటూ ఆయన మండిపడ్డారు. ముంబైలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి రామ్ కదం మాట్లాడుతూ, ఈఏడాది ఏప్రిల్ 14 న జుహు పోలీస్ స్టేషన్లో రాజ్కుంద్రాపై ప్రముఖ మోడల్, కమ్-నటి శారీరక వేధింపుల ఫిర్యాదు చేసిందనీ, పోలీసులు కేసు నమోదు చేయక పోగా, ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించారు. ఆమెపై ఒత్తిడి తెచ్చింది ఎవరు, కుంద్రాపై చర్యలు ఎందుకు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్ కుంద్రా సంస్థ వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ‘గేమ్ ఆఫ్ డాట్’అనే ఆన్లైన్ గేమ్ను ప్రారంభించి, సామాన్య జనంనుంచి వేల కోట్లు వసూలు చేసిందని రామ్ ఆరోపించారు. భార్య, నటి శిల్పా శెట్టి ఫోటో ద్వారా ఆన్లైన్ గేమ్ కోసం జనాన్ని ఆకర్షించాడని విమర్శించారు. ప్రభుత్వం గుర్తింపున్న ఆన్లైన్ గేమ్ అని చెప్పి వయాన్ ఇండస్ట్రీస్ రూ .2500 నుండి 3000 కోట్ల కుంభకోణానికి పాల్పడిందన్నారు. ఇలా దేశవ్యాప్తంగా అనేకమంది మోసపోయారన్నారు. డిస్ట్రిబ్యూటర్లు అనేకమంది రూ. 30 లక్షలు, మరికొందరు 10 లక్షలు వరకు నష్టపోయారని పేర్కొన్నారు. దీన్ని ప్రశ్నించిన వారిపై దాడి చేశారని బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేశారని రామ్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయం కోసం తాము హోంమంత్రి, ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నాగరాలేను కలుస్తామన్నారు. -
చదువుకుంటారని ఫోన్ ఇస్తే.. పిల్లలు చేసిన పనికి తల్లి షాక్!
తిరువనంతపురం: ఆన్లైన్ గేమ్స్కు బానిసైన పిల్లలు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఆటల మోజులో పడి విద్యార్థులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరు శారీరక, మానసిక వ్యాధులతో ఆస్పత్రులపాలైతే మరికొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు తల్లిదండ్రుల కళ్లుగప్పి డబ్బులను లూటీ చేస్తున్నారు. ఆటల మోజులో విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలు మూతపడి కేవలం ఆన్లైన్ విద్యా బోధన జరుగుతుండటంతో ఈ వైపరీత్యం మరింత ఎక్కువైంది. తాజాగా కేరళలోని ఓ ఘటన ఆన్లైన్ గేమ్స్ వల్ల తలెత్తే అనర్థాలను మరోసారి వెలుగులోకి తెచ్చింది. కోజికోడ్లోని ఇద్దరు పిల్లలు ఆన్లైన్ క్లాసులు వినేందుకు ప్రతీరోజూ తన తల్లి స్మార్ట్ఫోన్ను తీసుకునేవారు. అయితే ఆన్లైన్ క్లాసులు సాకుతో పబ్జీకి గేమ్ అడిక్ట్ అయ్యారు. ఎంతలా అంటే.. తమ తల్లికి తెలియకుండా బ్యాంకు ఖాతా నుంచి పబ్జీ మొబైల్ అకౌంట్ అప్గ్రేడ్, ఇన్-యాప్ కొనుగోళ్ల కోసం ఏకంగా రూ.లక్ష ఖర్చు చేశారు. అయితే ఈ విషయం తెలియని తల్లి తన ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యాయని.. కోజికోడ్ సైబర్ క్రైమ్ పోలీసులును ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా ఇంటిదొంగల పని బయటపడింది. ఆమె పిల్లలే ఆ డబ్బులు విత్ డ్రా చేసినట్లు పోలీసులు గుర్తించారు. పబ్జి కోసం వారు ఈ డబ్బును పే చేసినట్లు కనుగొన్నారు. అసలు విషయం తెలిసి ఆ మహిళ ఖంగుతిన్నది. -
ఆన్లైన్ గేమ్ వ్యసనమై.. తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతూ..
సాక్షి, ఆత్మకూర్(సూర్యాపేట): ఆన్లైన్ గేమ్ సరదా ఓ యువకుడి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్ (ఎస్) మండలంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని ఏపూరు గ్రామానికి చెందిన కాకి వెంకటరెడ్డి, కవితలకు కుమార్తె, కుమారుడు సంతానం. ఏడాది క్రితమే కుమార్తె వివాహం చేయగా కుమారుడు మధురెడ్డి (20) బీటెక్ మూడో సంవత్స రం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో కొంతకాలంగా ఇంటివద్దనే ఉంటున్న మధురెడ్డి ఆన్లైన్ గేమ్ మోజులో పడ్డాడు. ఇటీవల తల్లి కవిత ఖాతానుంచి రూ.1.20లక్షలు కట్ కావడంతో ఆందోళన చెందింది. దీంతో ఆమె సాయంత్రం వివరాలు తెలుసుకోవడానికి స్థానిక బ్యాంక్కు వెళ్లింది. విషయం బయటపడుతుందని భయాందోళనకు గురైన మధురెడ్డి ఇంట్లో చీరతో ఉరేసుకున్నాడు. తల్లి తిరిగి వచ్చే సరికి విగతజీవుడిగా వేలాడుతున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లింగం తెలిపారు. -
ఆన్లైన్లో ఆడేస్తున్నారు!!
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్లు, కర్ఫ్యూల కారణంగా ఇళ్లకే పరిమితమవ్వాల్సిన పరిస్థితుల్లో చాలా మంది.. కాస్త టైమ్ పాస్ కోసం ఆన్లైన్ గేమ్స్ వైపు మళ్లుతున్నారు. ప్రస్తుతం దేశీయంగా ప్రాథమిక స్థాయిలోనే ఉన్న గేమింగ్ రంగానికి ఇది వరంగా మారుతోంది. కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ నివేదిక ప్రకారం 2020 తొలి త్రైమాసికంలో దేశీయంగా మొబైల్ గేమ్స్ డౌన్లోడ్స్ 200 కోట్ల లోపే ఉండగా.. మూడో త్రైమాసికంలో ఏకంగా 290 కోట్లకు పెరిగాయి. ఇక 2018 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి 25 కోట్లుగా ఉన్న గేమర్స్ సంఖ్య గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నాటికి 40 కోట్లకు పెరిగింది. తద్వారా చైనా తర్వాత అత్యధికంగా ఆన్లైన్ గేమ్స్ ఆడేవారున్న రెండో దేశంగా భారత్ నిల్చింది. తొలి సారి విధించిన లాక్డౌన్ సడలింపు తర్వాత కార్యకలాపాలు యథాప్రకారం ప్రారంభమయ్యాక.. గేమర్స్ దూకుడు కాస్త తగ్గినప్పటికీ, ఈ ధోరణి మాత్రం కొనసాగే అవకాశాలే ఉన్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. నెలవారీ యాక్టివ్ యూజర్ల (ఎంఏయూ) సంఖ్య ఇప్పటికీ కోవిడ్–పూర్వ స్థాయికి మించి నమోదవుతుండటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. 2025 నాటికి 66 కోట్లకు యూజర్లు.. ఇదే ధోరణి కొనసాగితే 2025 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్లో గేమింగ్ యూజర్ల సంఖ్య 65.7 కోట్లకు చేరుతుందని అంచనా. అలాగే ఈ రంగానికి సంబంధించిన ఆదాయాలు ప్రస్తుతం రూ. 13,600 కోట్లుగా ఉండగా 2025 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 29,000 కోట్లకు చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభ్యమవుతుండటం, డేటా చార్జీలు చౌకగా ఉండటం తదితర అంశాలు గేమింగ్ రంగం మరింత విస్తరించడానికి తోడ్పడుతున్నాయి. మెట్రో నగరాలు, ప్రథమ శ్రేణి నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లోకి కూడా ఆన్లైన్ గేమ్స్ క్రమంగా చొచ్చుకుపోతున్నాయి. ఆన్లైన్ గేమింగ్పై సామాజికంగా ఉండే విముఖత తొలగిపోతోందని, మహిళా గేమర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందని కేపీఎంజీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక కొత్త యూజర్లకి చేరువయ్యేందుకు డెవలపర్లు స్థానిక కంటెంట్కు ప్రాధాన్యమిస్తుండటం కూడా గేమింగ్ సంస్కృతి విస్తరించడానికి దోహదపడుతోందని వివరించాయి. ఆక్ట్రో సంస్థకు చెందిన తీన్ పత్తీ, గేమెషన్ తయారు చేసిన లూడో కింగ్ లాంటి ప్రాచుర్యం పొందిన గేమ్స్ను హిందీ, గుజరాతీ, మరాఠీ లాంటి ప్రాంతీయ భాషల్లోనూ ఆడే సౌలభ్యం ఉంటోందని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల ఆసక్తి.. గేమింగ్కి ప్రాచుర్యం పెరిగే కొద్దీ .. గేమ్ డెవలపర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో ఇన్వెస్టర్లు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. 2020 ఆగస్టు – 2021 జనవరి మధ్య కాలంలో దాదాపు 544 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు గేమింగ్ రంగంలోకి వచ్చాయి. స్థానిక కంపెనీలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు, అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా ప్రవేశించేందుకు ఈ నిధులు తోడ్పడగలవని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 5జీ టెక్నాలజీ గానీ అందుబాటులోకి వచ్చిన పక్షంలో క్లౌడ్ గేమింగ్ కూడా ప్రాచుర్యంలోకి రాగలదని వారు తెలిపారు. -
యువకుడి ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
పాడేరు: ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన ఓ యువకుడు ఆదివారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాడేరు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాలు.. విశాఖ ఏజెన్సీ పాడేరులోని నీలకంఠంనగర్(చాకలిపేట)లో నివాసముంటున్న ఆర్ఎంపీ వైద్యుడు సంకు శంకరరావు కుమారుడు జయకుమార్(19) పబ్జీ గేమ్తో పాటు ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడ్డాడు. వీటి వల్ల గతేడాది మానసిక సమస్యలు ఎదుర్కొన్నాడు. దీంతో తల్లిదండ్రులు అతన్ని విశాఖ కేజీహెచ్కు తీసుకెళ్లి మానసిక నిపుణులతో చికిత్స చేయించారు. మందులు వాడుతుండడంతో అతని ఆరోగ్యం కాస్త కుదుటపడింది. మళ్లీ ఇటీవల ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడిన జయకుమార్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతుండేవాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5.30 గంటలకు జయకుమార్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. రాత్రికి కూడా ఇంటికి రాకపోవడంతో తండ్రి పలుచోట్ల గాలించినా.. ఆచూకీ లభించలేదు. సోమవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న పెద్ద బావిలో జయకుమార్ మృతదేహం బయటపడింది. బావి గట్టుపై జయకుమార్ ఫోన్ ఉండడంతో స్థానికులు పోలీస్స్టేషన్కు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని.. మృతదేహాన్ని బయటకు తీయించి ఆస్పత్రికి తరలించారు. ఎస్ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. కాగా, జయకుమార్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కె.భాగ్యలక్ష్మి గ్రామానికి చేరుకొని.. కుటుంబసభ్యులను పరామర్శించారు. చదవండి: రా‘బంధువులు’: వివాహితను నగ్నంగా వీడియో తీసి.. వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది.. -
ఆన్లైన్ గేమ్.. విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని
తిరువళ్లూరు: సెల్ఫోన్ ఆన్లైన్ గేమ్కు బానిసైన ఎనిమిదవ తరగతి విద్యార్థి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో శుక్రవారం వి«షాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా పొన్నేరి ఎన్జీఓ కాలనీకి చెందిన బాబు కుమారుడు రాకేష్(14). ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాకేష్ పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఆన్లైన్ క్లాస్ వుందని చెప్పి మొదటి అంతస్తులోకి వెళ్లాడు. చాలా సేపటికీ రాకపోవడంతో బంధువులు పైకెళ్లి చూడగా ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. పోలీసుల విచారణలో రాకేష్ తరచూ సెల్ఫోన్లో ఆన్లైన్ గేమ్ ఆడేవాడని తెలిసింది. ఆన్లైన్ గేమ్ బాలుడి మృతికి కారణమై వుండొచ్చన్న పోలీసులు అనుమానిస్తున్నారు. -
రికార్డులు సృష్టిస్తున్న భారత పబ్జీ ‘ఫౌజీ’
చైనా యాప్ అని 'పబ్జీ’ని నిషేధించడంతో దానికి పోటీగా ‘ఫౌజీ’ (ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్) తీసుకొచ్చారు. విడుదలైన మూడు రోజుల్లోనే ఈ గేమ్ రికార్డ్ సృష్టించింది. మల్టీప్లేయిర్ ప్లేయర్ యాక్షన్ గేమ్గా భారత సైనికుల వీరోచిత పోరాటాలు ప్రతిబింబించేలా బెంగళూరుకు చెందిన ఎన్కోర్ గేమ్స్ ‘ఫౌజీ’ రూపొందించారు. భారత పబ్జీగా పిలువబడే ఫౌజీ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నేతృత్వంలో రూపొందింది. గణతంత్ర దినోత్సవ కానుకగా జనవరి 26వ తేదీన అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. తొలిరోజు 24 గంటల్లో 3 లక్షల డౌన్లోడ్లు సాధించగా.. మూడు రోజుల్లోనే ఫౌజీ గేమ్ 50 లక్షల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. (చదవండి: రివ్యూ: ఫౌజీ గేమ్ ఎలా ఉందంటే?) గూగుల్ ప్లే స్టోర్లో అత్యంత ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకున్న గేమ్గా ఫౌజీ నిలవనుంది. అందరికంటే ముందుగా ఫ్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్న వినియోగదారుల మొబైల్ లలో ఆటోమేటిక్ గేమ్ డౌన్లోడ్ అయ్యింది. ఈ గేమ్ను సుమారు 500ఎంబీ సైజ్లో తీసుకొచ్చారు. ఫౌజీ గేమ్ని ఓపెన్ చేశాక మొదటి దశలో మూడు రకాల మోడ్స్ (క్యాంపెయిన్, టీమ్ డెత్ మ్యాచ్, ఫ్రీ ఫర్ ఆల్) కనిపిస్తాయి. ప్రస్తుతం క్యాంపెయిన్ మోడ్ మాత్రమే అందుబాటులో ఉంది. తర్వాత దశలో అప్డేట్స్ రూపంలో మిగిలిన మోడ్స్ అందుబాటులోకి తీసుకురానున్నారు. గేమ్ స్టార్ట్ చేసినప్పుడు గ్రాఫిక్ సెట్టింగ్స్ మీడియంలో ఉన్నాయి. మీ అవసరాన్ని బట్టి అల్ట్రా వరకు పెంచుకోవచ్చు. (చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా? ) ప్రస్తుతం పబ్జీ గేమ్లో మాదిరి మల్టీ ప్లేయర్కి సపోర్ట్ చేయకపోయినా తర్వాత దశలో మల్టీ ప్లేయర్ సపోర్ట్ తీసుకురానున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఇది ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో ఆధారంగా పనిచేస్తుంది. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలకు కారణమైన గల్వాన్ లోయ థీమ్తో ఈ గేమ్ రూపొందింది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20 శాతం భారత్ కే వీర్ ట్రస్ట్కు వెళ్తుంది. -
లడ్డూ సరే... లక్షలు కావాలా నాయనా!
అనుకుంటాంగానీ ఆన్లైన్ గేమ్స్ అనేవి నిన్నా మొన్నటి మాట కాదు. వాటి మూలాలు పాకెట్ బేస్ట్ కంప్యూటర్ నెట్వర్కింగ్(1970) జమానాలోనే ఉన్నాయి. మడ్ (మల్టీ యూజర్ డంజన్) తొలితరం ఆన్లైన్ కంప్యూటర్ గేమ్స్లో ఒకటి. ‘ఐలండ్ ఆఫ్ కెస్మై’ తొలితరం కమర్శియల్ గేమ్. 1980లో ‘యూనివర్శిటీ ఆఫ్ వర్జీనియా’ విద్యార్థులు జాన్ టేలర్, కెల్టన్లు ఈ సిక్స్ప్లేయర్స్ గేమ్కు రూపకల్పన చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్ రావడంతో 1981లో ‘కెస్మై’ పేరుతో గేమ్డేవలప్మెంట్ కంపెనీ స్థాపించారు. ఇంటర్నెట్ విస్తృతస్థాయిలో అందుబాటులోకి రావడంతో వీడియో గేమ్స్ కన్సోల్ హవా మొదలైంది. ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లే నైపుణ్యం పెరిగింది. ఇక 2000 సంవత్సరంలో మాసివ్లీ మల్టీప్లేయర్ ఆన్లైన్ గేమ్స్ (ఎంఎంఒ)లు ఊపందుకున్నాయి. ఈ జానర్లో వచ్చిన ‘వరల్డ్ ఆఫ్ వార్ క్రాఫ్ట్’ బాగా క్లిక్ అయింది. ‘ఎంఎంవో’ జానర్లో వచ్చిన ఆన్లైన్ గేమ్స్ స్టార్వార్స్ గెలాక్సీ, సిటీ ఆఫ్ హీరోస్, స్టార్వార్స్: ది ఓల్డ్ రిపబ్లిక్... మొదలైనవి శబ్భాష్ అనిపించుకున్నాయి. 2010 మలిదశలో ‘బ్యాటిల్ రాయల్ గేమ్ ఫార్మట్’ బాగా పాప్లర్ అయింది. ఫొట్నైట్ బ్యాటీ రాయల్(2017), అపెక్స్ లెజెండ్ (2019), కాల్ ఆఫ్ డ్యూటీ: వార్ జోన్ (2020)... మొదలైనవి బ్యాటిల్ రాయల్ గేమ్ ఫార్మట్లో వచ్చినవే. ఆన్లైన్ గేమింగ్ క్రేజ్ను దృష్టిలో పెట్టుకొని విడిగా, జట్టుగా ప్లేయర్స్ నైపుణ్యాన్ని వెలికి తీయడానికి, వారి ప్రతిభకు పదును పెట్టడానికి ప్రపంచవ్యాప్తంగా పలు ఆన్లైన్ గేమింగ్ టోర్నమెంట్స్ మొదలయ్యాయి. ప్లేయర్స్ ఉత్సాహనికి తగ్గట్టుగానే ప్రైజ్మనీ కూడా పెరుగుతూ వస్తుంది. ఈ టోర్నమెంట్స్ ప్రత్యక్షప్రసార హక్కుల కోసం చానల్స్ పోటీ పడటం విశేషం. ‘ప్రైజ్మనీ గెలుస్తామా లేదా? అనేది వేరే విషయం. మనలోని నైపుణ్యాన్ని స్వయంగా అంచనా వేసుకోవడానికి గేమింగ్ టోర్నమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయి’ అంటున్నారు టెక్ నిపుణుడు జెన్సెన్. ప్రపంచవ్యాప్తంగా పాప్లర్ అయిన కొన్ని టోర్నమెంట్స్: ఏడు సంవత్సరాల క్రితం మొదలైన ‘కాల్ ఆఫ్ డ్యూటీ ఛాంపియన్షిప్’లో సరికొత్త గేమ్స్ కేంద్రంగా పోటీలు జరుగుతాయి. ‘ఇ–స్సోర్ట్స్ వరల్డ్ కన్వెన్షన్’లో రకరకాల జానర్స్ కనబడతాయి. లాస్ వెగాస్లో ప్రతి వేసవిలో మొదలయ్యే ఇవాల్యువేషన్ ఛాంపియన్షిప్ సిరీస్ (ఈవీవో)కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. లార్జెస్ట్–లాంగెస్ట్ రన్నింగ్ గేమింగ్ టోర్నమెంట్స్కు ‘ఈవీవో’ ప్రసిద్ధి పొందింది. ‘ఫిఫా ఇ–వరల్డ్కప్’కు ఉన్న ఆదరణ ఇంతా అంతా కాదు. మూడు సంవత్సరాల క్రితం మొదలైన ‘ఫోట్నైట్ వరల్డ్ కప్’ ఛాంపియన్షిప్ టైటిల్ కోసం ఉద్దండులు పోటీ పడతారు. ఇ–స్పోర్ట్స్ ఒలంపిక్స్గా పిలుచుకునే ‘స్టార్క్రాఫ్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జియో తాజా ప్రకటనతో ఆన్లైన్ గేమింగ్ ప్రియుల్లో ఉత్సాహం రిలయన్స్ జియో, తైవాన్ చిప్మేకర్ ‘మీడియాటెక్’ భాగస్వామ్యంతో ఆన్లైన్గేమ్ ప్రియులు కోసం ‘గేమింగ్ మాస్టర్స్’ పేరుతో టోర్నమెంట్ ప్రకటించింది. జనవరి 10 నుంచి మొదలై మార్చి 7 వరకు 70 రోజుల పాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. జియోగేమ్స్ ప్లాట్ఫామ్లో జనవరి 9 వరకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు, పార్టిసిపెషన్ ఫీజు అంటూ లేవు. జియో యూజర్లు, నాన్–జియో యూజర్లు అందరూ పాల్గొనవచ్చు. డుయోస్, సోలోస్, గ్రాండ్ఫైనల్... మూడు దశలలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది. విజేతలకు రూ.12.5 లక్షలు ప్రైజ్మనీగా ప్రకటించారు. ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ఉంటాయి. ‘గేమర్స్ నైపుణ్యం, ఓర్పు, టీమ్వర్క్ సామర్థ్యాన్ని వెలికి తీయడానికి ఇండియా కా గేమింగ్ ఛాంపియన్షిప్ గేమింగ్ మాస్టర్స్ ఉపయోగపడుతుంది’ అంటున్నారు నిర్వాహకులు. జియోటీవి హెచ్డి, ఇ–స్పోర్ట్స్ చానల్, యూ ట్యూబ్ చానల్లలో ‘గేమింగ్ మాస్టర్స్’ ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. చదవండి: అలర్ట్: కొత్త ఏడాదిలో వాట్సాప్ నుంచి బిగ్ అప్డేట్ -
ఆన్లైన్ గేమ్స్కు సీఏ విద్యార్థి బలి
మంచిర్యాలక్రైం: ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన ఓ విద్యార్థి అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై రాజమౌళిగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... నస్పూర్కు చెందిన రవి–లలిత దంపతుల రెండో కుమారుడు అభిలాష్ (25) సీఏ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కరోనా నేపథ్యంలో ఇంటి వద్దనే ఉండడంతో సరదాగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటుపడ్డాడు. తర్వాత సరదా కాస్త..వ్యసనంగా మారి అప్పుల పాలై బలవంతంగా తనువు చాలించాడు. హైదరాబాద్ వెళ్తున్నాని ఇంట్లో నుంచి వెళ్లి పోయిన అభిలాష్ ఈ నెల 27న స్థానిక తోళ్లవాగు శివారులో పురుగుల మందు తాగి పడి ఉన్నాడు. అటువైపు వెళ్లిన వారు అభిలాష్ను గమనించి దగ్గరికి వెళ్లి చూడగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. అభిలాష్ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో తన చేతిపై ఉన్న ఓ సెల్ నంబర్కు సమాచారం అందించారు. అది అభిలాష్ అన్నయ్య ఆకాష్ది కావడంతో వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. (రాచకొండలో 12 శాతం తగ్గిన క్రైమ్ రేట్ ) -
క్రికీతో జియో కొత్త రియాలిటీ గేమింగ్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ అగ్మెంట్ రియాలిటీ మొబైల్ గేమింగ్ సంస్థ క్రికీ, జియోతో కలిసి కొత్తగా రియాలిటీ గేమింగ్ యాప్ యాత్రను భారత్లో ప్రారంభించింది. ఇందుకోసం జియో కూడా సిరీస్ ఎ ఫండింగ్ రౌడ్కు నాయకత్వం వహించి దాదాపు 22 మిలియన్ డాలర్లను క్రికీకు ఇచ్చింది. ఈ యాప్లో జియోతో కలిసి భారతదేశంలో ప్రారంభించిన సందర్భంగా క్రికీ వ్యవస్థాపకులు జాన్వీ, కేతకి శ్రీరామ్లు మాట్లాడుతూ.. ‘ఆన్లైన్ గేమింగ్ ప్రియులకు మరింత వినోదాన్ని అందించేందుకు మా క్రికీ యాప్ ప్రేరణ ఇచ్చింది. అందుకే ఆన్లైన్ ఆటగాళ్ల కోసం కొత్తగా యాత్ర యాప్ను ప్రారంభించాం. మీ మొబైల్లో గేమ్ ఆడుతున్నసమయంలో ఈ యాప్ మిమ్మల్ని ఆటలో లీనం చేస్తుంది. ఎ విధంగా అంటే ఈ యాప్ను త్రిడీలో రూపోందించినందున ఇందులో గేమ్ మీకు వాస్తవిక భావన కలిగిస్తుంది. కేవలం మీ మొబైల్ కెమెరాతో ఆటగాళ్లను యాక్షన్, ఆడ్వెంచర్లతో ఫాంటసీ ప్రపంచాన్ని మీ ఇంటికే తీసుకువస్తుంది. అయితే అగ్మెంట్ రియాలిటీ గేమ్లో రాక్షసుడు సైన్యాన్ని ఓడించే ప్రయత్నం చేయడం, బాణం, విల్లు చక్రం, మెరుపు, ఫైర్ బోల్ట్ వంటి ఆయుధాలను ఉపయోగించి ఆటగాళ్లంతా ఇందులో పాల్గొనవచ్చు. ఈ రియాలిటీ గేమ్ అంతా త్రీడిలో ఉన్నందున యాత్ర యూజర్లంతా ఈ ఆటలో వాస్తవంగా పాల్గొన్న అనుభూతిని ఇస్తుంది’ అని వారు చెప్పుకొచ్చారు. ఇక ఆటగాళ్లు తమ ఆటను స్నేహితులతో పంచుకునే ఆప్షన్ కూడా ఉంది. మీ గేమ్ పూర్తి కాగానే వీడియో ఫేరింగ్ ఆప్షన్తో పాటు ఇతరులు పోస్టు చేసిన గేమ్ వీడియోను కూడా చూడటానికి వీడియో ఫీడ్ ఆప్షన్ ఉంటుంది. అలాగే తిరిగి అదే గేమ్ను ఆడేందుకి డిజిటల్ గ్రౌండ్ ఆప్షన్ సౌకర్యం కూడా ఉందని వారు పేర్కొన్నారు. అయితే జియో మొబైల్ యూజర్లకు మాత్రం కొన్ని అదనపు ఫిచర్లను అందిస్తున్నట్లు వారు స్పష్టం చేశారు. అవి: 3డీ అవతార్ ఫీచర్, గెమ్ప్లే టోకెన్లు(అదనపు ఆయుధాలు, పవన్ ఆన్లాక్ చేయడం), గేమ్ ప్లేస్లు. అదే విధంగా దీనిపై జియో డైరెక్టర్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ.. ‘‘ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్తో క్రికీ ఒక తరం భారతీయులను ప్రేరేపిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అనుభవనాలను భారతీయులకు అందించేందుకు ఈ యాత్ర యాప్ మా దృష్టి ఆకర్షించిందన్నారు. ఈ యాప్ వినియోగాదారులంతా రియాలిటి గేమ్లో మంచి అనుభూతిని పొందుతారని, కాబట్టి ఆన్లైన్ గేమ్ ప్రియులంతా ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకుని ఫాంటసీ అనుభవాన్ని పొందాలని పిలుపునిచ్చారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమింగ్తో ఆటగాళ్లంత తమ స్వంత ప్రపంచ అనుభూతిని పొందడానికి యాత్ర యాప్ ఆక్సెస్ను జియో యూజర్లతో పాటు, జియోతర మొబైల్ యూజర్లకు కూడా కల్పిస్తున్నాం’ అని ఆకాష్ తెలిపారు. అయితే ఈ క్రికీ యాప్ ఇప్పడు ఐఓసీ(ios) యాప్ స్టోర్లతో పాటు గూగుల్ ప్లే స్టోర్లలో ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. -
గంగూలీ, కోహ్లికి మధురై బెంచ్ చురకలు!
చెన్నై: ఆన్లైన్ గేమ్లను నిషేదిస్తూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆన్లైన్లో నగదు లావాదేవీలతో బెట్టింగులను ప్రోత్సహించే గేమ్స్ నిర్వహించేవారికి జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఆన్లైన్ రమ్మీ, క్రికెట్ తదితర గేమ్లు ఆడుతూ దొరికిని వారికి రూ.5 వేల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. ఆన్లైన్ గేమ్ సెంటర్లను నిర్వహిస్తూ పట్టుబడితే రూ.10 వేల జరిమానాతో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించనున్నారు. కరోనా కట్టడికి గత మార్చి నెలలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఆన్లైన్ గేమ్స్కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. తమిళనాడులో ఆన్లైన్లో పేకాట ఆడుతూ డబ్బులు కోల్పోయి, ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి ఘటనలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఈ అంశంపై అక్కడి హైకోర్టుకు చెందిన మదురై బెంచ్లో పిల్ దాఖలైంది. పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ఆన్లైన్ ఆటలపై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరణ కోరుతూ పలు ప్రశ్నలను సంధించింది. ఈ నేపథ్యంలో పళనిస్వామి ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టార్డమ్ను ఇందుకేనా వాడేది ఇర ఆన్లైన్ గేమ్స్పై నిషేధం విధించాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన మదురై బెంచ్ తాజా, మాజీ టీమిండియా ఆటగాళ్లపైనా విమర్శలు చేసింది. లక్షలాది మంది అభిమానులు ఉన్న ఆటగాళ్లు ఆన్లైన్ గేమ్స్ని ప్రోత్సహిస్తూ అడ్వర్టయిజ్మెంట్లలో పాల్గొనడమేంటని ప్రశ్నించింది. వారిపై అభిమానంతో అమాయక జనం ‘ప్రమాదకర’ ఆన్లైన్ గేమ్స్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించింది. మరికొంత మంది అప్పులపాలై ప్రాణాలు తీసుకుంటున్నారని తెలిపింది. ప్రజల్ని ఇబ్బందులకు గురిచేసే యాడ్స్లో పాల్గొనేటప్పుడు ఆలోచించుకోవాలని చురకలు వేసింది. ఆన్లైన్ గేమ్స్ ప్రమోట్ చేయడంపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. కాగా, డ్రీమ్ 11, ఎంపీఎల్ ఆన్లైన్ గేమ్స్కి గంగూలీ, కోహ్లి ప్రమోటర్లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆన్లైన్ గేమ్స్ కట్టడికి ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయి. -
పబ్జీలో లీనం.. ప్రాణాలు తీసింది!
కామారెడ్డి క్రైం: పబ్జీ ఆటపై మోజు ఓ యువకుడి ప్రాణం బలి తీసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మజీద్ గల్లీకి చెందిన సాయికృష్ణ (20) కొంత కాలంగా పబ్జీ ఆటకు బానిస య్యాడు. అయితే, ఈ గేమ్పై కేంద్రం నిషేధం విధించడంతో థర్డ్పార్టీ యాప్ ద్వారా కొరియన్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకున్నాడు. సోమ వారం ఉదయం నుంచి బంగ్లాపై గదిలో కూర్చొని పబ్జీ ఆడుతున్నాడు. ఆటపై ధ్యాసతో ఒత్తిడికి లోను కావడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సాయంత్రమైనా అతడు కిందకు దిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పైకి వెళ్లి చూడగా పడిపోయి కనిపించాడు. వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. (చదవండి: సడన్గా లేచి.. కాల్చండని కేకలు) -
బెట్టింగ్లపై పోలీస్ బెత్తం
సాక్షి, అమరావతి: సమాజంలో వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమ్లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్లపై సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిషేధించింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్లు నిర్వహించే 135 వెబ్సైట్లపై ఆన్లైన్ నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు. సీఎం ఆదేశాలతో బెట్టింగ్లపై పోలీసులు బెత్తం ఝుళిపిస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేసి క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. క్లబ్లు, కల్చరల్ క్లబ్లు, అతిథి గృహాల్లో పేకాట, కోతాట, గ్యాంబ్లింగ్ వంటివి నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంతో అవి మూతపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా వినకుండా వాటిని నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ఫలితంగా గత ఐదేళ్ల కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. -
సడన్గా లేచి.. కాల్చండని కేకలు
ఆన్లైన్ మొబైల్ గేమ్స్ ఒక ప్రమాదకరమైన వ్యసనంలా మారాయి. ఆటల పేరుతో యువతను బానిసలుగా మార్చేసి, పిచ్చోళ్లను చేస్తూ కొన్ని కంపెనీలు రూ.కోట్లు దండుకుంటున్నాయి. ఆట మత్తులో హైస్కూల్ విద్యార్థుల నుంచి యువకుల వరకూ అంతా బానిసలై తల్లిదండ్రులకు తెలియకుండా రూ.వేలకు వేలు తగలేస్తున్నారు. అడిగిన వెంటనే సొమ్ములు ఇవ్వకుంటే తల్లిదండ్రులను బెదిరిస్తూ ఆత్మహత్యలకు సిద్ధమై, అలవోకగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వాలు ఆన్లైన్ గేమ్స్పై నిషేధం విధించినా యువత లెక్క చేయడం లేదు. సాక్షి, శృంగవరపుకోట: క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని, మానసిక వికాసాన్ని అందించేవిగా ఉండాలి. ఆరోగ్యం కోసం ఆటలాడాలంటూ పెద్దలు పిల్లల్ని ప్రోత్సహించేవారు. ఇప్పుడు క్రీడలు అంటే పిల్లలు ఏమైపోతారో అనే ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్కు సంబంధించి మొన్న పోక్మాన్, నిన్న బ్లూవేల్స్, ఇప్పడు పబ్జీ, ఫ్రీ ఫైర్ గేమ్స్ విద్యార్థులను, యువతను వెర్రెక్కించి, ప్రమాదంలోకి నెడుతున్నాయి. విద్యార్థులు, యువకులు గంటల పాటు ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్స్లో మునిగితేలుతున్నారు. ప్రభుత్వాలు కొన్ని గేమ్స్ను బ్యాన్ చేసినా, కొన్ని సర్వర్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుని వేలాది మంది డేంజర్గేమ్స్లో భాగస్వాములు కావడం గమనార్హం. ఏమిటీ గేమ్స్.. పబ్జీ దక్షిణ కొరియాకు చెందిన ఓ వీడియో గేమింగ్ కంపెనీ తీసుకొచ్చిన ఆన్లైన్ మల్టీప్లేయన్ గేమింగ్ యాప్. ఇదే తరహాలో మరో ఆన్లైన్ గేమ్ ఫ్రీ ఫైర్. ఈ గేమ్స్ను ఆండ్రాయిడ్ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని గేమ్లో ప్రవేశించాలి. గేమ్ను సింగిల్గా లేదా గ్రూప్గా ఆడొచ్చు. గేమ్లో 100 మంది వరకూ ఉంటారు. ఆడేవారు తప్ప మిగిలిన వారంతా శత్రువులు గానే లెక్క. గేమ్ని వార్ ఫీల్డ్లా భావించి ఎదురుపడ్డ పోటీదారులను చంపుకుంటూ పోవాలి. మిగిలిన వాడు విజేత. ఇందులో మనం ఎంచుకున్న ఆటగాడికి కావాల్సిన దుస్తులు, ఆయుధాలు, బాంబులు, బంకర్లు, మెడికల్ కిట్లు అన్నీ అమ్మకానికి ఉంటాయి. దీంతో తమ ఆటగాడికి కావాల్సిన సామగ్రి కొనాలంటే వెంటనే ఆన్లైన్లో పేమెంట్ చేయాలి. ఇలా తమను ఊహించుకుంటూ ఓడిన (చనిపోయిన) ప్రతిసారీ గెలవాలన్న కసితో వేల రూపాయలు తగలేస్తున్నారు. పట్టించుకోని ఉన్మాదం.. ప్రస్తుతం కరోనా ప్రభావంతో స్కూల్స్, కాలేజీలు మూతపడటం, ఆన్లైన్ క్లాసుల కోసం అని ఇంచుమించుగా ప్రతి విద్యార్థికి ఆండ్రాయిడ్ మొబైల్ని తల్లిదండ్రులు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ గేమ్స్ ఆడేవారి సంఖ్య మరింతగా పెరిగింది. ఆన్లైన్ గేమ్స్లో బానిసలుగా మారిన విద్యార్థులు, యువకులు చదువుల్లో పూర్తిగా వెనుకబడుతున్నారు. నిద్రలేమి, కంటి సమస్యలు, మానసిక ఒత్తిళ్లు, ఆందోళన, ఓటమిని భరించలేక పోవడం, సొమ్ము కోసం తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం వంటి నేర ప్రవృత్తికి లోనవుతున్నారని, డిప్రెషన్కు లోనై ఆత్మహత్యకు తెగిస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కొందరు బాధితులు.. ఎస్.కోటకు చెందిన విజయ్సాయి(పేరు మార్చాం) కొద్ది నెలల క్రితం పబ్జీ, ఫైర్ ఫ్రీ గేమ్స్ ఆడేందుకు అలవాటు పడ్డాడు. క్రమంగా గేమ్స్లో మునిగితేలాడు. ఆటలో మదుపు పెట్టేందుకు తండ్రికి తెలియకుండా రూ.వేలల్లో ఖర్చు పెట్టాడు. డబ్బులు పోయి, డబ్బులు ఖర్చులకు లేక వింత పోకడతో వ్యవహరించడంతో ఆ యువకుడి తల్లిదండ్రులు వైద్యుణ్ని సంప్రదించారు. సైక్రియాటిస్ట్ అతడిని గేమ్స్కు దూరంగా ఉంచాలని, ప్రస్తుతం ఏ విషయంపై ఒత్తిడి చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి మందులు ఇచ్చారు. ఎస్.కోటకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి అభిజ్ఞకుమార్ (పేరు మార్చాం) ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. ఇప్పుడు రాత్రివేళ నిద్రలో సడన్గా లేచి పరుగెడుతున్నాడు.. ‘కాల్చండి.. కాల్చండి’ అంటూ కేకలు పెడుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి ఆన్లైన్ గేమ్స్ ఆడకుండా పిల్లలను నియంత్రించాలి. వారి భవిష్యత్ దెబ్బతినే పరిస్థితి రాకుండా గమనించాలి. అవసరం లేకుండా ఫోన్లు కొని ఇ వ్వకూడదు. గంటలకొద్దీ ఫోన్లతో గడిపేటప్పు డు వారి మానసికి స్థితిని గమనించాలి. ఆన్లైన్ గేమ్స్ వల్ల పిల్లలు, యువకుల్లో ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. ఆత్మహత్యలకు సిద్ధమౌతున్నారు. – బి.శ్రీనివాసరావు, ఎస్.కోట సర్కిల్, సీఐ మానసికంగా బలహీనులౌతారు మొబైల్ గేమ్స్ ఆడడంతో ఒత్తిడికి గురై మానసికంగా బలహీనం అవుతారు. దృష్టిలోపం, ఆత్మన్యూనత, జ్ఞాపకశక్తి కోల్పోవడం, భయం, ఆందోళనకు గురవడం, కోపానికి గురికావడం, స్వీయ నియంత్రణ కోల్పోవడం జరుగుతాయి. వీలైనంత త్వరగా వారిని ఆ వ్యససం నుంచి బయటకు రప్పించేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. – డాక్టర్ జి.మృదుల, హోమియో వైద్యాధికారి, ఎస్.కోట ఆన్లైన్ గేమ్స్తో సమస్యలు ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కదలకుండా ఒకే చోట ఎక్కువ సమయం గడపడం వల్ల కండరాల వృద్ధి ఆగిపోతుంది. నరాల వ్యవస్థ దెబ్బతింటుంది. జ్ఞాపకశక్తి కోల్పోతారు. ఏకాగ్రత దెబ్బతింటుంది. కోపం, ఉద్రేకం అధికమౌతాయి. శారీరక, మానసిక రుగ్మతలకు గురౌతారు. వాళ్లని గమనించి ఆన్లైన్ గేమ్స్కు దూరంగా ఉంచాలి. – డాక్టర్ ఎస్.వి.సత్యశేఖర్, జనరల్ సర్జన్ -
మన ఆట మొదలైంది
గోరో మజిమా తెలుసా? ఎందుకు తెలియదు, జపాన్ డిజిటల్ గేమ్ ‘యకుజ’లో ఒక క్యారెక్టర్. ‘క్రొటాస్’ ఎవరో చెప్పుచూద్దాం? ‘గాడ్ ఆఫ్ వార్’ గేమ్లో వారియర్. అమెరికా నుంచి జపాన్ వరకు ఏ ‘డిజిటల్ గేమ్’ గురించి అడిగినా చెప్పగలిగే మన ‘జ్ఞానం’ ఇప్పుడు సృజనాత్మకత వైపు పరుగులు +తీస్తోంది. ‘గేమ్’ను ఆస్వాదించడమే కాదు మనవైన దేశియ గేమ్స్ను రూపొందించడానికి యువత సై అంటోంది.... కోవిడ్ చాస్తున్న కోరలకు చిన్నా,పెద్దా పరిశ్రమలు తుఫాను ముందు చిగురుటాకులా వణికిపోయాయి. గేమింగ్ కంపెనీలు మాత్రం తడబడకుండా అరేబియన్ గుర్రంలా దూసుకెళ్లాయి. లాక్డౌన్ సమయంలో ఇంట్లో ఉన్న ప్రజలకు వినోదాన్ని కలిగించడానికి వీలుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లాంటి సంస్థలు ప్రముఖ గేమింగ్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం, సినిమాలు, టీవీ షోల కంటే రాబోయేకాలం ‘గేమింగ్’ పరిశ్రమదే అని రిలయన్స్ అధినేత అనడం....వాటి శక్తి ఏమిటో ఊహించుకోవచ్చు. గూగుల్–కెపీఎంజీ రిపోర్ట్ ప్రకారం 2021 నాటికి మన దేశంలో ఆన్లైన్ గేమింగ్ బిజినెస్ ఏడు వేల కోట్లు, 2023 నాటికి పదకొండువేల కోట్లు దాటుతుందట. అమెరికన్, జపాన్ కంపెనీల స్ఫూర్తితో డిజిటల్ గేమ్ రంగంలోకి దిగిన ధృవ, నజర, గేమ్స్ 2 విన్...మొదలైన సంస్థలు ‘లోకల్ కంటెంట్’ను తమ అస్త్రంగా చేసుకున్నాయి. అయితే అప్పట్లో స్మార్ట్ఫోన్ల హవా లేకపోవడం, వేరే దేశాల్లోలాగా గేమింగ్ యాప్స్ను కొనడం లేదా చందాల రూపంలో డబ్బు వెచ్చించడానికి సుముఖంగా ఉండకపోవడం, గేమింగ్ అనేది పనిపాటలేని వ్యవహారం అనుకోవడంలాంటి పరిమితులు ఉండేది. స్మార్ట్ఫోన్ల ప్రభంజనంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. మరోవైపు గేమింగ్ అనేది మరీ అంత తీసిపారేయతగినది కాదని, మల్టీటాస్కింగ్ నైపుణ్యం పెరుగుతుందనే స్పృహ వచ్చింది. ఒకప్పుడు పిల్లల పత్రిక ‘చందమామ’ను పెద్దలు కూడా పిల్లలై చదివినట్లే, ఇప్పుడు పిల్లలు, యువతే కాకుండా పెద్దలు కూడా గేమింగ్ పట్ల ఆసక్తి చూపడం మరో సానుకూల అంశంగా మారింది. గేమింగ్ రంగంలో ఉజ్వల భవిష్యత్ స్పష్టంగా కనిపిస్తోంది. ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కలిపించడానికి ద్వారాలు తెరిచింది గేమింగ్ ఇండస్ట్రీ. బార్డర్స్ల్యాండ్, సూపర్ మారియో, రాకెట్ లీగ్, లీగ్ ఆఫ్ లెజెండ్స్,లెజెండ్ ఆఫ్ జెల్డా....ఇంకా ఎంత కాలం మనవి కాని ఆటలు! మన ఆట మొదలుపెట్టడానికి ఇదే సరిౖయెన టైమ్. ‘డిజిటల్ గేమింగ్ సెక్టర్లో అద్భుత అవకాశాలు ఉన్నాయి.మన సంస్కృతి,జానపదకథల్లో నుంచి సబ్జెక్ట్లను డెవలప్ చేయండి’ అని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. గేమింగ్ అంటే ఇష్టం ఉందా? కొత్తగా ఆలోచించే సృజనాత్మకత మీ సొంతమా? ...ఇక మీరు గేమింగ్ ప్రియులుగా మాత్రమే ఉండనక్కర్లేదు. మీకు ఇష్టమైన రంగంలోనే కాలరెత్తుకోదగ్గ ఉద్యోగాలతో పదిమంది మెప్పు పొందవచ్చు. అటు చూడండి...గేమ్ప్రొగ్రామర్, గేమ్ డిజైనర్, నెరెటీవ్ డిజైనర్, టెక్చర్ ఆర్టిస్ట్, గేమ్ రైటర్, ఆర్ట్ డిజైనర్,టూల్ డెవలపర్...ఇలా రకరకాల అవకాశాలు ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ,పీజీ స్థాయిలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పదండి...మీ ఇష్టాన్నే పెట్టుబడిగా పెట్టి గేమింగ్ స్టార్గా ఎదగడానికి. గేమింగ్ స్టార్స్ ఆన్లైన్ గేమింగ్ సెక్టర్లో వుమెన్ ఎంటర్ప్రెన్యూర్లు పెరుగుతున్నారు.వీరిలో కొందరు: కీర్తిసింగ్– హిట్ వికెట్(క్రికెట్ స్ట్రాటజీ గేమ్), హర్ష సచ్దేవ–ఫనీయరన్(మనీ గేమింగ్ ప్లాట్ఫాం),అర్పిత కపూర్–మెక్ మోకా(మల్టీ ప్లేయర్ సోషల్ గేమింగ్ ప్లాట్ఫాం), నేహా పాండే–లీగ్స్ఎక్స్ (ఫాంటసీ ఫుట్బాల్ గేమింగ్ ప్లాట్ఫాం) సరిలేరు మీకెవ్వరు కథల గురించి ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. మన పురాణాల నుంచి స్ఫూర్తి పొందవచ్చు. ఆ పనే చేసింది ఓగ్రి హెడ్ స్టూడియో. ఓగ్రి వారి ‘అసుర’ బంపర్హిట్ అయింది. తాజాగా ఇండియన్ గేమ్ డెవలపింగ్ కంపెనీ ఎన్కోర్, ఫౌజీ(ఫీయర్లెస్ అండ్ యునైటెడ్) అనే యాక్షన్ గేమ్ను ప్రకటించింది.మన సైనికుల సత్తా చాటే షూటింగ్ గేమ్ ఇది. ► టెక్...టాక్ apple ipad air 4 టస్క్రీన్ సైజ్: 10.9 అంగుళాలు టరెజల్యూషన్: 2360x1640 పిక్సెల్స్ టస్టోరేజ్: 64జీబి, 256జీబి కలర్స్: సిల్వర్, స్పేస్ గ్రే, రోజ్ గోల్డ్, గ్రీన్, స్కై బ్లూ టచ్ ఐడీ సెన్సర్ స్టీరియో స్పీకర్స్ యాపిల్ పెన్సిల్ 2 సపోర్ట్ మ్యాజిక్ కీ బోర్డ్ సపోర్ట్ రిలీజ్: అక్టోబర్ jebjuke bar జెబ్రోనిక్స్ jeb-juke సౌండ్బార్ ఇండియాలో లాంచ్ అయింది. మల్టీపుల్ కనెక్టివిటీ ఆప్షన్స్, సింపుల్ సెటప్తో వస్తున్న ఈ సౌండ్బార్ శబ్దసౌందర్యాన్ని మరింత దగ్గర చేస్తుంది, 2.1 స్పీకర్ సెటప్ 5.0 బ్లూటూత్, రిమోట్ సౌకర్యం ధర: రూ:17,999 ► గ్యాడ్జెట్ బజార్ పే–పవర్డ్ వాచ్ ప్రముఖ వాచ్ కంపెనీ టైటాన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా ‘టైటాన్ పే’ పేరుతో పే–పవర్డ్ వాచ్ని లాంచ్ చేసింది. డెబిట్ కార్డు ఉపయోగించాల్సిన పనిలేకుండానే ‘టైటాన్ పే’ను టాప్ చేసి పాయింట్–ఆఫ్–సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా పేమెంట్స్ చేయవచ్చు. వాచ్ ‘స్ట్రాప్’లో ఉండే ఎన్ఎఫ్సి (నియర్ ఫీల్డ్ కమ్యునికేషన్) సాంకేతికతతో ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సౌకర్యం స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డు హోల్డర్లకు పరిమితం. పురుషులు(రూ.2,995), స్త్రీలకు(రూ.3,895) వేరు వేరు ధరల్లో ఈ వాచ్లను తయారుచేశారు. ► రైడర్ యువర్ హైనెస్... ఇటీవల హార్నెట్ 2.0 లాంచ్ చేసిన హోండా మోటర్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా(హెచ్ఎంఎస్ఐ) ఈ నెలాఖరులో తమ బ్రాండ్ న్యూ మోటర్ సైకిల్ను లాంచ్ చేయనుంది. ‘యువర్ హైనెస్...గెట్ రెడీ ఫర్ మెజెస్టిక్ లాంచ్’ అంటూ టీజర్ కూడా రిలీజ్ చేసింది. సరికొత్త అప్డెట్స్తో ఇండియన్ మార్కెట్కు అనుగుణంగా క్రూయిజర్ స్టైల్లో రాబోతున్న ఈ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ అంటున్నారు. కొత్త బైక్కు సంబంధించి అధికారికంగా మాత్రం ఇంకా పూర్తి వివరాలు ప్రకటించలేదు. ► సోషల్ మీడియా ఫేస్బుక్ క్యాంపస్ ఫేస్బుక్ అనేది క్యాంపస్లోనే పుట్టిన ఆలోచన. ఎఫ్బీ తన మూలాలను వెదుక్కుంటూ క్యాంపస్లోకి వెళుతుంది. ‘ఫేస్బుక్ క్యాంపస్’ పేరుతో తాజాగా కొత్త ఫీచర్ను ప్రకటించింది కంపెనీ. క్లాస్మెట్లతో కనెక్ట్ కావడానికి, గ్రూపులలో చేరడానికి, క్యాంపస్ ఈవెంట్స్కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి, క్యాంపస్ డైరెక్టరీ ద్వారా క్లాస్మెట్లతోనే కాకుండా తమ విద్యాసంస్థలోని ఇతర విద్యార్థులు, మాజీ విద్యార్థులతో స్నేహం చేయడానికి ప్రైవేట్ స్పేస్గా ఎఫ్బీ క్యాంపస్ ఉపయోగపడుతుంది. ‘కరోనా ప్రభావంతో చాలామంది విద్యార్థులు క్యాంపస్కు రావడం లేదు. ఇప్పుడు క్యాంపస్ను కళ్ల ముందుంచడానికి మా ఫీచర్ ఉపయోగపడుతుంది’ అంటుంది ఫేస్బుక్ క్యాంపస్ ప్రొడక్ట్ మెనేజర్ ఛార్మిన్ హంగ్. యంగ్ జెనరేషన్పై ఎఫ్బీ పట్టుకొల్పోతుందని కొన్ని ‘స్టడీ’లు చెబుతున్న నేపథ్యంలో ఆ లోటును భర్తీ చేసుకోవడానికే ‘ఫేస్బుక్ క్యాంపస్’ ఫీచర్తో ముందుకు వస్తుందనేది కొందరి అంచనా. అమెరికాలో ప్రస్తుతం 30 విశ్వవిద్యాలయాల్లో ‘పైలట్ప్రాజెక్ట్’గా పరీక్షించబడుతున్న ‘ఫేస్బుక్ క్యాంపస్’లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. -
చైనా యాప్స్: రంగంలోకి ఎన్ఐఏ
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్లో గేమ్స్ పేరుతో చైనా యాప్స్ నిధుల మళ్లింపుపై ఎన్ఐఏ రంగంలోకి దిగింది. హైదరాబాద్లోని సీసీఎస్లో చైనా యాప్పై కేసు నమోదు చేశారు. ఇందులో ఉగ్రవాద కుట్రకోణం ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీఎస్ నుంచి ఎన్ఐఏ అధికారులు పూర్తి వివరాలను తీసుకున్నారు. రూ. 2వేల కోట్లకు పైగా నగదును సదురు కంపెనీ చైనాకు తరలించినట్లు గుర్తించారు. యాప్స్ పేరుతో భారతీయులు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించినట్లు ఎన్ఐఏ అనుమానిస్తోంది. అనధికారికంగా వేలకోట్లు చైనాకు కంపెనీలు తరలించినట్లు గుర్తించారు. కాగా.. ఇప్పటికే ఆన్లైన్ చైనా యాప్స్పై ఈడీతో పాటు ఐటీ విచారణ కొనసాగుతోంది. (దేశ రక్షణ సమాచారం చైనాకు?) -
క్రికెట్ ప్రేమికులకు జియో శుభవార్త
హైదరాబాద్ : ఐపీఎల్ మజాను ఆస్వాధించే ప్రేక్షకులకు జియో నెట్వర్క్ ఒక శుభవార్త చెప్పింది. జియో యూజర్లతో పాటు నాన్ జియో యూజర్లు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' యాప్ ద్వారా విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం కల్పించింది. దీంతో పాటు గేమ్లో పాల్గొనేవారు తమ నైపుణ్యతను మెరుగుపరుచుకునేలా ప్రశ్నలను రూపొందించడంతో పాటు ఎంటర్టైన్మెంట్ను అందించనుంది. దీనికి అదనంగా ప్రీ-మ్యాచ్ ప్రశ్నలు, పోల్స్, క్విజ్లతో పాటు మీ ఫేవరెట్ టీమ్కు స్టికర్ చాట్ ఏర్పాటు, స్కోర్లు, మ్యాచ్ షెడ్యూల్లు, ఫలితాలను యాక్సస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. ‘డైలీ రివార్డ్స్’ ద్వారా పాల్గొనేవారు ప్రతిరోజూ బహుమతులు గెలుచుకోవచ్చు.. అంతేగాక ‘డైలీ ఛాలెంజెస్’ పూర్తి చేసిన తర్వాత బంపర్ బహుమతులు కూడా అందుకోవచ్చు. గేమ్ ప్రారంభమయ్యే ముందు రోజువారీ టాస్క్ల్లో భాగంగా గెలిచినవారికి అందించే బంపర్ ప్రైజ్ ఎంటనేది ముందే ప్రదర్శించడం జరుగుతుంది. కరోనా నేపథ్యంలో క్రికెట్ సీజన్ను ఎంజాయ్ చేస్తూ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్'తో గెలుద్దాం! ఈ 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్' గేమ్ను మై జియో యాప్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మై జియో యాప్ను గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్రికెట్ సీజన్లో జియో యూజర్లతో పాటు జియోయేతర యూజర్లు గేమ్ను ఆడి మంచి బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. -
ఆన్లైన్ గేమ్స్ ఆడొద్దని మందలించినందుకు..
సాక్షి, విశాఖపట్నం : మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడవద్దని మందలించారని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ఆరిలోవలో అక్క ఇంట్లో ఉంటున్న వంశీకృష్ణ అనే 13 సంవత్సరాల యువకుడు మొబైల్లో ఆన్లైన్ గేమ్లకు బానిసయ్యాడు. గత రాత్రి అక్క తీవ్రంగా మందలించడంతో మొబైల్ విసిరేసిన వంశీ ఇంటి నుంచి పారిపోయి బయటకు వచ్చేసాడు. ఈ క్రమంలో ఈ రోజు(బుధవారం) ఉదయం ముడ సర్లోవ పార్క్ ఎదురుగా మామిడి చెట్టుకు వంశీకృష్ణ ఉరిపవేసుకుని విగతా జీవిగా కనిపించాడు. (రాష్ట్రంలో పలుచోట్ల ఏసీబీ సోదాలు) మొబైల్ ఆటలకు అలవాటు పడ్డ వంశీకృష్ణ కుటుంబ సభ్యులు వద్దనే మందలించడంతో ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అమ్మ నాన్న చనిపోవడంతో తన వద్ద ఉంటున్న తమ్ముడు వంశీకృష్ణ ఈ రకంగా అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇలాంటి ఆన్లైన్ గేమ్లకు బానిసలైన యువకులకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు కింగ్ జార్జ్ ఆసుపత్రిలో ఓ ప్రత్యేక సెల్ను కూడా ఏర్పాటు చేశారు. -
నమ్మినందుకు ‘డైరెక్టర్’ని చేశాడు, ఇంకేముంది
సాక్షి, హైదరాబాద్: ఈ–కామర్స్ వెబ్సైట్స్ ముసుగులో కలర్ ప్రిడిక్షన్ గేమ్ పేరుతో భారీ బెట్టింగ్ దందాకు పాల్పడిన చైనాకు చెందిన బీజింగ్ టీ పవర్ సంస్థ.. డైరెక్టర్ల ఎంపికలోనూ పథకం ప్రకారం వ్యవహరించింది. తమకు అనుబంధంగా ఏర్పడిన కంపెనీల్లో డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుంది. నగర సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న నీరజ్ తులీ విచారణలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజింగ్ టీ పవర్ సంస్థ సౌత్ ఈస్ట్ ఏషియా ఆపరేషన్స్ హెడ్గా వ్యవహరించిన యాన్ హో ఢిల్లీకి చెందిన హేమంత్ను ఆడిటర్గా నియమించుకున్నాడు. అయితే ఎక్కడా అధికారికంగా రికార్డుల్లో దీన్ని పొందుపరచలేదు. ఇతడి సహకారంతోనే ఢిల్లీలోని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో పలు సంస్థల్ని రిజిస్టర్ చేయించాడు. వీటిలో 90 శాతం మంది చైనీయులు డైరెక్టర్లుగా ఉండగా.. పది శాతం మంది మాత్రం ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. (చదవండి: కలర్ ప్రిడెక్షన్.. మనీ లాండరింగ్!) కిరాణ దుకాణం నిర్వాహకుడూ డైరెక్టరే.. ఢిల్లీలోని కరోల్బాగ్ ప్రాంతానికి చెందిన చిన్న కిరాణ దుకాణం నిర్వాహకుడు నీరజ్ తులీ ఓ నాలుగు కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఈ విషయం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెళ్లి పట్టుకునే వరకు అతడికే తెలీదు. కలర్ ప్రిడిక్షన్ గేమింగ్ యాప్ గుట్టురట్టు చేసిన అధికారులు యాన్ హో, ధీరజ్ సర్కార్, అంకిత్ కపూర్లతో పాటు ఇతడినీ అదుపులోకి తీసుకోవడంతో షాక్కు గురయ్యాడు. కలర్ ప్రిడిక్షన్ ఏమిటో, ఆ చైనా సంస్థ ఏమిటో, బీజింగ్ టి పవర్ కంపెనీ ఏమిటో... తనకు తెలియదంటూ లబోదిబోమన్నాడు. తన ఇంటికి సమీపంలో ఉండే హేమంత్ అనే చార్టెడ్ అకౌంటెంట్ తనకు ఆడిటింగ్ చేస్తుండేవాడని చెప్పాడు. గతంలో ఆడిటింగ్కు అవసరం అంటూ కొన్ని పత్రాలపై సంతకాలు తీసుకున్నాడని, నో యువర్ కస్టమర్ (కేవైసీ) దాఖలు చేయాలంటూ గుర్తింపు పత్రాలు తీసుకువెళ్లాడని వెల్లడించాడు. వీటి ఆధారంగా నాలుగు కంపెనీల్లో తులీని డైరెక్టర్గా చేసిన హేమంత్ తన ఫోన్ నంబర్, ఈ–మెయిల్ అడ్రస్లు అందులో పొందుపరిచాడు. తులీ పేరుతో ఇతడే ఆయా కంపెనీల కార్యకలాపాలు సాగించేవాడని తేలింది. ఇలానే మరికొందరు డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసుకుని, చైనీయులకు అనుకూలంగా బోర్డు తీర్మానాలు చేసినట్లు అధికారులు అనుమానిస్తూ ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. తులీతోపాటు మరో ముగ్గురినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు తులీకి సీఆర్పీసీ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. పరారీలో ప్రధాన నిందితుడు హేమంత్... యాన్ హో తదితరులు అరెస్టుతో అప్రమత్తమైన హేమంత్ కరోల్బాగ్లోని అతడి ఇంటికి తాళం వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ కేసు వివరాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ట్యాక్స్ డిపార్ట్మెంట్లతోపాటు సీబీఐ, కేంద్ర హోంశాఖ, విదేశీ వ్యవహారాల శాఖలకు నగర పోలీసులు అందించారు. ఆయా కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న చైనీయులపై అన్ని విమానాశ్రయాలకు లుక్ఔట్ సర్క్యులర్లు జారీ చేయాలని నిర్ణయించారు. తదుపరి విచారణ కోసం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితుల్ని తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. (ఈ గేమ్ ఆడితే ‘రంగు’ పడుద్ది!) -
ఎర వేసి ఉచ్చులోకి!
సాక్షి, హైదరాబాద్ : ఆన్లైన్ గేమ్స్ పేరిట చైనా మనవాళ్లతో ఆడుకుంటోంది. అమాయకుల్ని చేసి డబ్బులు దండుకుంటోంది. ప్రధానంగా యువత, గృహిణులు లక్ష్యంగా రూపొందించిన కలర్ ప్రిడిక్షన్ గేమ్ ద్వారా భారీ ఎత్తున కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటివరకు ఏకంగా రూ.1100 కోట్ల మేర టర్నోవర్ చేసింది. దీనికి సంబంధించి నలుగురు నిందితులను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేసి కేసు వివరాలను వెల్లడించిన విషయమూ విదితమే. ఈ నేపథ్యంలో అసలు ఈ గేమ్ పూర్వాపరాలు ఏమిటి? యువత దీనికి బానిసగా చిక్కి ఎలా భారీమొత్తంలో సొమ్ములు పొగొట్టుకుంటుందో చూస్తే పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దళారుల్ని ఏర్పాటు చేసుకుని దందా రిఫరల్ ద్వారా ఈ గేమ్లోకి ప్రవేశించిన తర్వాత కనీసం రూ.200 రీచార్జ్ చేసుకోవాలి. ఇలా మీరు 20 మందిని ఆకర్షించి వారితో రూ.200 చొప్పున రీచార్జ్ చేయిస్తే మీకు రూ.500 కమీషన్ ఇస్తామని చెబుతారు. దీంతో అప్పటికే ఈ గేమ్కు బానిసై డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తులు తమకు తెలియకుండానే మల్టీ లెవల్ మార్కెటింగ్ చేయిస్తారు. అలా మరికొందరు ఈ ఊబిలో చిక్కుకుంటున్నారు. మరోవైపు ఈ గేమ్స్ను కంప్యూటర్, ల్యాప్టాప్ ద్వారా అడటానికి ఆస్కారం ఇవ్వరు. కేవలం లింకు ద్వారా ఓపెన్ చేసి, ఫోన్లో అడేలా ప్రోత్సహిస్తారు. దీనికి సంబంధించి ప్రస్తుతం 27 వెబ్సైట్స్ యాక్టివ్గా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అసలు కిటుకంతా ఆఖరి 30 సెన్లలోనే ఈ గేమ్ యాప్లో ‘జాయిన్ గ్రీన్’, ‘జాయిన్ వైలెట్’, ‘జాయిన్ రెడ్’పేరుతో మూడు అంశాలు ఉంటాయి. వీటి కింద 0 నుంచి 9 వరకు అంకెలు రెండు వరుసల్లో ఉంటాయి. ఓ రంగును ఎంచుకుని, నిర్దారిత మొత్తం బెట్టింగ్ పెట్టి, కింద ఉండే అంకెల్లో దేన్ని ఎంచుకుంటే.. అన్ని రెట్ల మొత్తం పందెం కాసినట్లు. అంటే, రూ.100 బెట్టింగ్ పెట్టి, 4 అంకెను ఎంచుకుంటే ఆ రంగు మీద రూ.400 పందెం కాసినట్లు. ఒక్కో బెట్టింగ్ సమయం 3 నిమిషాలు మాత్రమే. దీన్ని సూచిస్తూ ఓ కౌంట్డౌన్ టైమర్ ఉంటుంది. ఆఖరి 30 సెకన్లకు వచ్చే లోపే బెట్ వేయాలి. ఈ 30 సెకన్లలోనే అసలు గుట్టు దాగి ఉంటుంది. నిగూఢంగా ఉండే ప్రోగ్రామింగ్.. ఈ సమయంలో ఎక్కువ మంది ఏ రంగుపై బెట్ వేశారు? తక్కువ మంది ఏ రంగును ఎంచుకున్నారో గుర్తిస్తుంది. అనంతరం తక్కువ మంది పందెం కాసిన రంగు వచ్చేలా చేస్తుంది. ఫలితంగా ఎక్కువ మంది ఓడిపోతారు.. తక్కువమంది గెలుస్తారు. ఇలా పెద్ద మొత్తం లో సొమ్ము నిర్వాహకుల పరమవుతుంది. మరోవైపు గెలిచినవారి నుంచి కూడా పన్ను రూపేణా కొంత మొత్తం మినహాయించుకుంటారు. ఇలా రెండు వైపుల నుంచీ నిర్వాహకులు పెద్దమొత్తంలో ఆర్జిస్తున్నారు. టెలిగ్రాం గ్రూపుల ద్వారా బ్రెయిన్ వాష్ నాకు కలర్ ప్రిడిక్షన్ గేమ్ సంగతి నా స్నేహితుడి ద్వారా తెలిసింది. అతడే నా నంబర్ను ఓ టెలిగ్రాం గ్రూపులో చేర్చాడు. దళారి అయిన దాని అడ్మిన్ ప్రతి ఒక్కరినీ బ్రెయిన్ వాష్ చేస్తుంటాడు. నేను చేరిన గ్రూప్లో 7 వేలమంది సభ్యులు ఉండగా.. మరో దాం ట్లో 65వేల మంది ఉన్నారు. కనీసం ఐదుసార్లు డబ్బు పెడితే కచ్చితంగా ఒక్కసారైనా గెలుస్తామని, ఫలానా రంగును ఎంచుకున్నవారికి డబ్బు వస్తుందని టెలిగ్రాం, వాట్సా ప్ ద్వారా సందేశాలు వస్తూనే ఉంటాయి. మొదట నేను రూ.4వేలు నష్టపోయా. ఆ మొత్తం రాబట్టుకోవాలని కొనసాగించి రూ. 97వేలు పొగొట్టుకున్నా. ఈ విషయం టెలి గ్రాం గ్రూప్లో పోస్టు చేశానని అడ్మిన్ నన్ను బ్లాక్ చేశాడు. గతంలో నేరుగా ఆ యాప్లో గూగుల్ పే, పేటీఎం ద్వారా రీ–చార్జ్ చేసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు వాళ్లు పంపే లింకు ఆధారంగా గూగుల్ పే లేదా నెట్ బ్యాకింగ్తో రీ–చార్జ్ చేసుకుని ఆడేలా మార్చారు. – సీతాఫల్మండి -
ఆన్లైన్లో మీ పిల్లలు ఏం చేస్తున్నారో గమనించండి