Money laundering
-
ఫార్ములా ఈ-రేస్ కేసులో కొనసాగుతున్న కేటీఆర్ ఈడీ విచారణ
-
37 గుర్రాలను అటాచ్ చేసిన ఈడీ.. విలువ రూ.3.98 కోట్లు!
అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్, మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆరోపణల వల్ల మెట్ టెక్నాలజీస్ యజమాని కునాల్ గుప్తా, తన సహచరుడు పవన్ జైస్వాల్కు చెందిన రూ.5.23 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్యల్లో భాగంగా కేజీ స్టడ్ ఫామ్ ఎల్ఎల్పీకి చెందిన 37 గుర్రాలను సైతం ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గ్రీన్లీఫ్ కాంప్లెక్స్, బాగుయాటి, కోల్కతాలోని రూ.1.08 కోట్ల విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసు ఈ కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 2023లో ఏజెన్సీ రూ.67.23 కోట్లు, జులై 2024లో రూ.85 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.మోసపూరిత వ్యాపార ఒప్పందాలుకునాల్ గుప్తా, అతని సహచరులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కాల్ సెంటర్లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ యాప్ల ద్వారా తప్పుడు రుణ ఆఫర్లు, మోసపూరిత వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ, జీడీ ఇన్ఫోటెక్తో సహా పలు సంస్థల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.రేసింగ్లో వచ్చిన డబ్బు పెట్టుబడిగా..కునాల్గుప్తా, పవన్ జైస్వాల్ నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆస్తులను, గుర్రాలను అటాచ్ చేసింది. సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్ఎల్పీ గుర్రాలను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం, అమ్మడం వంటి చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నిధులను దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. నేరారోపణలతో ముడిపడి ఉన్న గుర్రాల ద్వారా రేస్లో సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో 37 గుర్రాలను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వివిధ రేస్ క్లబ్లు, రైడింగ్ పాఠశాలల్లో ఉంచుతున్నట్లు పేర్కొంది.ఇదీ చదవండి: అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లులెక్కల్లోలేని లావాదేవీలుజీడీ ఇన్ఫోటెక్ ద్వారా పవన్ జైస్వాల్ గ్రీన్లీఫ్ కాంప్లెక్స్లో అక్రమంగా ఆస్తులను సంపాదించినట్లు ఈడీ తెలిపింది. లెక్కల్లోలేని ఆర్థిక లావాదేవీలు, నగదు డిపాజిట్లు, చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకుండా నగదు బదిలీ చేయడం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ వెల్లడించింది. -
4.5 లక్షల ‘మ్యూల్’ ఖాతాలను స్తంభింపజేసిన కేంద్రం
సైబర్ నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించుకునేందుకు వాడే దాదాపు 4.5 లక్షల ‘మ్యూల్’(మనీ లాండరింగ్ కోసం వాడే ఖాతాలు) బ్యాంక్ ఖాతాలను కేంద్రం స్తంభింపజేసింది. సైబర్ మోసగాళ్లు ఈ మ్యూల్ ఖాతాల ద్వారానే లావాదేవీలు జరుపుతున్నట్లు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) అధికారులు తెలిపారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ప్రధానమంత్రి కార్యాలయం అధికారులతో జరిగిన సమావేశంలో ఈమేరకు వివరాలు వెల్లడించారు.బ్యాంకింగ్ వ్యవస్థలో మ్యూల్ ఖాతాలను వినియోగించుకుని సైబర్ నేరస్థులు చెల్లింపులు చేస్తున్నట్లు చెప్పారు. గతేడాది అన్ని బ్యాంకుల్లో కలిపి మొత్తంగా 4.5 లక్షల మ్యూల్ ఖాతాలను స్తంభింపజేసినట్లు తెలిపారు. అందులో అత్యధికంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణంI4C సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్స్ రిపోర్టింగ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన వివరాల ప్రకారం ఎస్బీఐలోని వివిధ శాఖల్లో సుమారు 40,000 మ్యూల్ బ్యాంక్ ఖాతాలు కనుగొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 10,000 (ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా), కెనరా బ్యాంక్లో 7,000 (సిండికేట్ బ్యాంక్తో సహా), కోటక్ మహీంద్రా బ్యాంక్లో 6,000, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లో 5,000 మ్యూల్ ఖాతాలు కనుగొన్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 2023 నుంచి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో సుమారు ఒక లక్ష సైబర్ ఫిర్యాదులు నమోదయ్యాయని చెప్పారు. గత ఏడాదిలో సుమారు రూ.17,000 కోట్ల నగదు మోసం జరిగిందని పేర్కొన్నారు.మ్యూల్ ఖాతాల నిర్వహణ ఇలా..సైబర్ నేరస్థులు బ్యాంకు ఖాతాదారులను నమ్మించి వారికి తెలియకుండా కేవైసీ పూర్తి చేస్తారు. మనీలాండరింగ్కు పాల్పడుతూ ఖాతాదారుల ప్రమేయం లేకుండా లావాదేవీలు పూర్తి చేస్తారు. లీగల్ కేసు అయితే ఖాతాదారులను అదుపులోకి తీసుకుంటారు. కాబట్టి బ్యాంకులోగానీ, బయటగానీ అపరిచితులు, బంధువులకు బ్యాంకు, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఓటీపీలు కూడా ఇతరులతో పంచుకోకూడదని చెబుతున్నారు. -
పరిధిని పట్టించుకోకుండా ‘డిజిటల్ అరెస్టు’ తప్పించాడు!
సాక్షి, హైదరాబాద్: డ్రగ్ పార్శిల్స్, మనీ లాండరింగ్, బ్యాంకు ఖాతా దుర్వినియోగం అంటూ పోలీసుల పేరుతో ఫోన్లు చేస్తున్న సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్టు’ చేస్తున్నారు. వీడియో కాల్ ద్వారా నిఘా గంటల తరబడి నిర్భంధించి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి వారి బారినపడి రూ.లక్షలు, రూ.కోట్లు నష్టపోయిన కేసులు ఇటీవలి కాలంలో అనేకం నమోదయ్యాయి. అయితే సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు చెందిన కానిస్టేబుల్ గణేష్ చొరవతో సైబరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఈ ఫ్రాడ్ బారినపడకుండా బయటపడ్డారు. పరిధులు పట్టించుకోకుండా వేళకాని వేళలో వచ్చిన ఫోన్ కాల్కూ పక్కాగా స్పందించిన గణేష్ను ఉన్నతాధికారులు ఆదివారం అభినందించారు. మియాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగికి శుక్రవారం వాట్సాప్ ద్వారా కొన్ని మెసేజ్లు వచ్చాయి. ఈయన ఆధార్ నెంబర్ వినియోగించి ముంబైలో కొందరు మనీలాండరింగ్కు పాల్పడ్డారని, దీనిపై అక్కడ కేసు నమోదైందని వాటిలో ఉంది. ఆ సందేశాలను బాధితుడు పట్టించుకోలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్చువల్ నెంబర్ల ద్వారా ఫోన్ కాల్స్ మొదలయ్యాయి. ముంబై పోలీసుల మాదిరిగా మాట్లాడిన సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ చేసి యూనిఫాంలో కనిపించారు. కేసు, అరెస్టు అంటూ తీవ్రంగా భయపెట్టి ఇంట్లో ఉంటే స్థానిక పోలీసులూ వచి్చన అరెస్టు చేస్తారని భయపెట్టారు. తాను ఎప్పుడూ ముంబై రాలేదని, ఆ ఆరి్థక లావాదేవీలతో తనకు సంబంధం లేదని చెప్పినా సైబర్ నేరగాళ్లు పట్టించుకోలేదు.శనివారం తెల్లవారుజాము నుంచి రకరకాలుగా భయపెట్టిన వారు సదరు ఐటీ ఉద్యోగి బ్యాంకు ఖాతాలో రూ.13 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. సోమవారం వరకు అతడు ఎక్కడికీ వెళ్లకుండా, ఎవరితో మాట్లాడకుండా చేసి ఆపై ఆరీ్టజీఎస్ ద్వారా ఆ మొత్తం కాజేయాలని పథకం వేశారు. దీంతో ఐటీ ఉద్యోగిని డిజిటల్ అరెస్టు చేస్తున్నట్లు చెప్పిన సైబర్ నేరగాళ్లు ఇంటి నుంచి బయటకు రప్పించారు. కుటుంబీకులతో సహా ఎవరినీ కలవద్దంటూ షరతు విధించి అమీర్పేటలోని ఓ హోటల్లో బస చేయించారు. ఇలా ఆదివారం తెల్లవారుజాము 3 గంటల వరకు ఆడియో, వీడియో కాల్స్ కట్ చేయని సైబర్ నేరగాళ్లు బాధితుడిని హోటల్ గదిలోనే ఉంచారు. ఆ సమయంలో కాల్ కట్ అవడంతో బాధితుడికి కాస్తా అవకాశం చిక్కింది. దీంతో ధైర్యం చేసిన అతడు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణా ఫోన్ నెంబర్ తెలుసుకున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో సదరు నెంబర్కు కాల్ చేయగా... ఆ సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ గణేష్ అందుకున్నారు. సాధారణంగా పోలీసులు తమకు ఫోన్ చేసిన బాధితులు బయటి ప్రాంతాలకు చెందిన వారని చెప్పగానే... అక్కడి అధికారులను సంప్రదించాలని చెబుతుంటారు. అయితే ఈ బాధితుడు మియాపూర్ వాసిని అని చెప్పినా ఆ సమయంలోనూ పక్కాగా స్పందించిన గణేష్ విషయం మొత్తం తెలుసుకున్నారు. అది సైబర్ మోసమంటూ బాధితుడికి కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు మియాపూర్లో వారి ఇంటి పక్కన ఉండే స్నేహితుడి నెంబర్ తీసుకున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పిన గణే‹Ù... బాధితుడి వద్దకు వచ్చి తీసుకువెళ్లేలా చొరవ చూపారు. ఈ అంశంలో కానిస్టేబుల్ గణేష్ స్పందనకు ఉన్నతాధికారులు అభినందించారు. -
ఆన్లైన్ గేమింగ్కు మనీ లాండరింగ్ ముప్పు
న్యూఢిల్లీ: అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశీ ఆన్లైన్ గేమింగ్ రంగానికి మనీలాండరింగ్ నుంచి గణనీయంగా ముప్పు పొంచి ఉందని డిజిటల్ ఇండియా ఫౌండేషన్ ఒక నివేదికలో పేర్కొంది. ఈ నేపథ్యంలో భారీ స్థాయిలో విస్తరించిన డిజిటల్ ఎకానమీని, ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమను కాపాడేందుకు సత్వర చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. చట్టవిరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఆపరేటర్లను కట్టడి చేసేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేయాలని, చట్టబద్ధమైన ఆపరేటర్లతో వైట్లిస్ట్ తయారు చేయాలని, తప్పుదోవ పట్టించే ప్రకటనలకు అడ్డుకట్ట వేయాలని, అంతర్జాతీయంగా పరస్పరం సహరించుకోవాలని పేర్కొంది. అలాగే మోసపూరిత విధానాలు పాటించే ప్లాట్ఫాంల జోలికి వెళ్లకుండా ప్రజల్లో అవగాహన పెంచాలని, పటిష్టమైన ఇన్వెస్టిగేటివ్ బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది. అయిదేళ్లలో 7.5 బిలియన్ డాలర్లకు పరిశ్రమ.. నివేదిక ప్రకారం 2020– 2023 ఆర్థిక సంవత్సరాల మధ్య 28 శాతం వార్షిక వృద్ధితో భారతీయ రియల్ మనీ గేమింగ్ (ఆర్ఎంజీ) రంగం అంతర్జాతీయ మార్కెట్లో కీలక పరిశ్రమగా మారింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగం ఆదాయం 7.5 బిలియన్ డాలర్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి. కోట్ల కొద్దీ గేమర్లు పరిశ్రమ వృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో ఫిన్టెక్, క్లౌడ్ సర్వీసెస్, సైబర్–సెక్యూరిటీ వంటి అనుబంధ రంగాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. నివేదికలోని మరిన్ని విశేషాలు.. → యూజర్కు భద్రత, సైబర్ సెక్యూరిటీపరమైన సవాళ్లు మొదలైనవి పరిశ్రమ పురోగతికి అవరోధాలుగా మారొచ్చు. దేశీయంగా చట్టవిరుద్ధమైన బెట్టింగ్ మార్కెట్లో ఏటా 100 బిలియన్ డాలర్ల డిపాజిట్లు వస్తుండటం ఈ సవాళ్ల తీవ్రతకు నిదర్శనం. → చట్టవిరుద్ధమైన ఆపరేటర్లను కట్టడి చేసేందుకు నియంత్రణ సంస్థలు ఎంతగా ప్రయతి్నస్తున్నప్పటికీ మిర్రర్ సైట్స్, అక్రమ బ్రాండింగ్, అలవిగాని హామీలతో చాలా ప్లాట్ఫాంలు నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పర్యవేక్షణ, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోంది. → దేశీయంగా 400 పైచిలుకు స్టార్టప్లు 10 కోట్ల మంది రోజువారీ ఆన్లైన్ గేమర్లు ఉన్నారు. వీరిలో 9 కోట్ల మంది డబ్బు చెల్లించి గేమ్స్ ఆడుతుంటారు. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒక లక్ష మందికి ఉద్యోగాలు కలి్పస్తోంది. 2025 నాటికి 2,50,000 ఉద్యోగాలను కల్పించే అవకాశాలు ఉన్నాయి. ఇంతటి భారీ పరిశ్రమకు నిర్దిష్టంగా ఒక నియంత్రణ సంస్థ అంటూ లేకపోవడం, పర్యవేక్షణ.. ఏకరూప ప్రమాణాలు లేకపోవడం వంటి అంశాలు సమస్యలుగా ఉంటున్నాయి. -
ఈడీ కేసు ఎలా పెడుతుంది?
బెంగళూరు: మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డెరెక్టరేట్ (ఈడీ) తనపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయడంలో ఔచిత్యం ఏమిటని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘దేని ఆధారంగా మనీలాండరింగ్ కేసు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. మా నుంచి సేకరించిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు. అలాంటపుడు మనీలాండరింగ్ కేసుకు ఆస్కారం ఎక్కడిది? నాకు తెలిసి మనీలాండరింగ్ దీనికి వర్తించదు’ అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.మైసూరులో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని సేకరించిన ముడా పరిహారంగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లకు ఆమెకు కేటాయించింది. ఇందులో అధికార దురి్వనియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, పార్వతిలపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ సోమవారం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్ కేసును నమోదు చేసిన విషయం విదితమే. ఈడీ కేసు నమోదైన కొద్దిగంటల్లోనే 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తానని పార్వతి ముడా కమిషనర్కు లేఖ రాశారు. తన భర్త పరువుప్రతిష్టలు, మానసిక ప్రశాంతత కంటే ఏ ఆస్తి కూడా తనకు ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు. తనపై ద్వేష రాజకీయాలకు పార్వతి బాధితురాలుగా మారారని సిద్ధరామయ్య అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.14 ప్లాట్లు వెనక్కితీసుకున్న ముడా మైసూరు: పార్వతి అభ్యర్థన మేరకు ఆమెకు కేటాయించిన 14 ప్లాట్లను మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) మంగళవారం వెనక్కి తీసుకుంది. పార్వతితో చేసుకున్న సేల్డీడ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్వతి తనయుడు, ఎమ్మెల్సీ డాక్టర్ యతీంద్ర తమకు లేఖను అందించారని, దాన్ని పరిశీలించి ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించామని ముడా కమిషనర్ ఎ.ఎన్.రఘునందన్ వెల్లడించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాట్లను వదులుకుంటే.. వెనక్కి తీసుకోవచ్చనే నిబంధన ముడా చట్టంలో ఉందన్నారు. -
నకిలీ ‘సీఐఏ’ ఏజెంట్ ఎన్ఆర్ఐపై బిగుస్తున్న ఉచ్చు : నవ్వుతూనే ముంచేశాడు!
భారతీయ వ్యాపారవేత్త గౌరవ్ శ్రీవాస్తవ మోసం, మనీ లాండరింగ్ ఆరోపణల వ్యవహారం మరింత ముదురు తోంది. అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) రంగంలోకి దిగింది. అమెరికా పౌరుడిగా చెప్పుకుంటూ, సీఐఏ ఏజెంట్ అని నమ్మించి వివిధ దేశాలకు చెందిన రాజకీయ, వ్యాపార నాయకులను మోసగించడం, తీవ్రమైన తప్పిదాలకు పాల్పడటం ఆరోపణల కేసులో ఎఫ్బీఐ దర్యాప్తు చేస్తోందని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.నకిలీ సీఐఏ ఏజెంట్గా శ్రీవాస్తవ ఏకంగా ప్రెసిడెంట్ జో బిడెన్ను కలిశారని, డెమోక్రటిక్ పార్టీకి 10 లక్షల డాలర్ల పైగా విరాళం ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తడం అక్కడ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. 'నకిలీ సీఐఏ ఏజెంట్' స్కామ్లో శ్రీవాస్తవ, అనేక సంవత్సరాలుగా మోసపూరిత కార్యకలాపాలతో అమెరికా జాతీయ భద్రతకు భంగం కలిగించాడనే ఆరోపణలను ఎఫ్బీఐ విచారిస్తోంది.ఘోరమైన అబద్ధాలతో వాషింగ్టన్ రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీను బురిడీ కొట్టించాడు. వ్యాపార వేత్తలను నమ్మించి, తనఫౌండేషన్కు భారీనిధులను దక్కించుకున్నాడు. అయితే ఇండియాలోని లక్నోకు చెందిన శ్రీవాస్తవ కాలేజీ డ్రాపౌట్ అని కూడా వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా రిపోర్ట్ చేసింది.శ్రీవాస్తవ మోసపూరిత కార్యకలాపాలు అంతర్జాతీయ లావాదేవీలకు కూడా విస్తరించాయని వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. సూడాన్, లిబియాతో సహా ఆఫ్రికాలోని నాయకులను తప్పుదారి పట్టించాడు . అమెరికా ప్రభుత్వ మద్దతు పొందేందుకు తప్పుడు వాగ్దానాలు చేశాడు. వాషింగ్టన్లో, అతను తన చర్యలను చట్టబద్ధం చేయడానికి ఉన్నత అధికారులతో సంబంధాలను మెయింటైన్ చేశాడు. మిస్టర్ జీగా పాపులర్ అయిన శ్రీవాస్తవ బాధితుల్లో నాటో మాజీ కమాండర్ జనరల్ వెస్లీ క్లార్క్ వంటి ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. ఇంకా అట్లాంటిక్ కౌన్సిల్ థింక్ ట్యాంక్, అనేక డెమొక్రాటిక్ నిధుల సేకరణ కమిటీలు, అనేకమంది సెనేటర్లు , కాంగ్రెస్ సభ్యులతో సహా అనేక ఉన్నత స్థాయి వ్యక్తులను మోసగించాడు. నేటర్ మార్క్ వార్నర్, ప్రతినిధి పాట్రిక్ ర్యాన్, జెనీవాకు చెందిన వస్తువుల వ్యాపారి, ఇంకా అనేక మంది ఆఫ్రికన్ నాయకులు ఇండోనేషియా అధ్యక్షుడు కూడా శ్రీవాస్తవ మోసానికి గురి కావడం గమనార్హం. అంతేకాదు తనపై కథనాలను రాసిన మీడియాను కూడా పరువు నష్టం దావాతో బెదరింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాలు మీడియా ద్వారా వెలుగులోకి రావడంతో కొందరు ఆయనకు దూరం కాగా, మరికొందరు సంబంధాలను తెంచుకున్నారు.మరోవైపు శ్రీవాస్తవ, అతని భార్య షరోన్పై కాలిఫోర్నియాలో రెండు వేర్వేరు మోసం కేసులు నమోదైనాయి. అలాగే లీజు గడువు ముగిసిన తర్వాత 12 మిలియన్ల డార్లు శాంటా మోనికా ఇంటిని ఖాళీ చేయడం లేదని, అద్ద కూడా చెల్లించలేదని ఆరోపిస్తూ ఇంటి యజమాని స్టీఫెన్ మెక్ఫెర్సన్, శ్రీవాస్తవపై దావా వేశారు. శ్రీవాస్తవ,అతని భార్య షారోన్ ఆధ్వర్యంలో ‘ది గౌరవ్ & షారన్ శ్రీవాస్తవ ఫ్యామిలీ ఫౌండేషన్’ను కూడా ఉంది. ఆహారం , ఇంధన భద్రత వంటి ప్రపంచ సమస్యలపై ఇది దృష్టి సారిస్తుంది. అయితే తాజా అరోపణల నేపథ్యంలో ఈ ఫౌండేషన్ చట్టబద్ధతపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కాగా శ్రీవాస్తవ మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యాపారి నీల్స్ ట్రూస్ట్కు అనుమానం రావడంతో ఈ భారీ స్కాం బట్టబయలైంది. అయితే ఇవన్నీ కట్టుకథలని శ్రీవాస్తవ న్యాయవాది కొట్టి పారేశారు. కాలిఫోర్నియాలో వ్యాజ్యాలతో సహా కొన్ని ఖచ్చితమైన ఆధారాలున్నప్పటికీ, శ్రీవాస్తవ అతని న్యాయవాదులు అన్ని ఆరోపణలను ఖండిస్తూనే ఉన్నారు. -
చంపై సోరెన్ రాజీనామా..జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్
రాంచీ : జార్ఖండ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర సీఎంగా హేమంత్ సోరెన్ బాధ్యతలు స్వీకరించేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ నియామకానికి జార్ఖండ్ ముక్తా మోర్చా(జేఎంఎం), కాంగ్రెస్, ఆర్జేడీలు సోరెన్ ఏకగ్రీవంగా మద్దతు పలికాయి. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హేమంత్ సోరెన్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను కోరారు.రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలతో ప్రస్తుత జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్కు అందించారు.Champai Soren resigns as Jharkhand CM, Hemant Soren stakes claim to form govtRead @ANI Story | https://t.co/Mc2d74htr5#ChampaiSoren #JharkhandCM #HemantSoren pic.twitter.com/T6fkdW4I2Q— ANI Digital (@ani_digital) July 3, 2024 ఈడీ ఆరోపణలపై కోర్టు తీర్పుమనీల్యాండరింగ్ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో హేమంత్ సోరెన్ను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే తాజాగా జార్ఖండ్ హైకోర్టు సోరెన్కు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై విచారణ ఈడీ ఆరోపించిన విధంగా నేరానికి పాల్పడలేదు’అని తీర్పు వెలువరించింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. అవమానం జరిగిందని మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యే సమయంలో సీఎంగా ఉన్న హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేశారు. చంపై సోరెన్ ఆ పదవి బాధ్యతల్ని స్వీకరించారు. తాజాగా, హేమంత్ సోరెన్కు బెయిల్ రావడం.. చంపై సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడం అంతా చకచకా జరిగిపోయాయి. ఈ అనూహ్య నాటకీయ పరిణామాలతో సీఎం పదవికి రాజీనామా చేయించడం చంపై సోరెన్ తనకు అవమానం జరిగిందని తన సహచరుల వద్ద గోడు వెళ్లబోసుకున్నట్లు తెలుస్తోంది. -
గొర్రెల స్కాం లో అసలు దొంగలు దూకుడు పెంచిన ఈడీ
-
సీజేఐ పరిశీలనకు.. కేజ్రీవాల్ పిటిషన్
న్యూఢిల్లీ: మధ్యంతర బెయిల్ గడువును పొడిగించాలంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఆ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పరిశీలనకు పంపించనున్నట్లు వెల్లడించింది. మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన కేజ్రీవాల్కు అనారోగ్య కారణాలతో సుప్రీంకోర్టు జూన్ ఒకటో తేదీ వరకు బెయిలిచ్చిన విషయం తెల్సిందే.జూన్ 2వ తేదీన తిహార్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాల్సి ఉంది. మంగళవారం కేజ్రీవాల్ పి టిషన్ వెకేషన్ బెంచ్లోని జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ విశ్వనాథన్ల ముందుకు వచ్చింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ కొన్ని అత్యవసర వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుందని, బెయిల్ మరో వారం పొడిగించాలంటూ ఆయన తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి కోరారు. పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టాలని తెలిపారు. అయితే, ధర్మాసనం ‘వాదనలు విన్నాం. తీర్పు రిజర్వు చేశాం. ఈ పిటిషన్ను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచుతున్నాం’ అని తెలిపింది. -
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
రాంచీ: జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి అలంగిర్ అలమ్ను మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. రాంచీలోని ఈడీ హెడ్క్వార్టర్స్లో అలమ్ను మంగళవారం(మే14) తొమ్మిది గంటలు ఏకబిగిన ప్రశ్నించిన అనంతరం ఈడీ ఆయనను అరెస్టు చేసింది.గ్రామీణాభివృద్ధి శాఖలో జరిగిన అక్రమాల్లో జరిగిన మనీ లాండరింగ్ వ్యవహారంలో అలమ్పై ఈడీ కేసు నమోదు చేసింది. కాగా, లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ అలమ్ వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్కుమార్ లాల్ పనిమనిషి ఇంట్లో రూ.37 కోట్ల లెక్కల్లోకి రాని నల్లధనం పట్టుబడిన విషయం తెలిసిందే. పనిమనిషి ఫ్లాట్లో గుట్టలుగుట్టలుగా నల్లధనం పట్టుబడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ విషయాన్ని ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించడం గమనార్హం. -
ఆ చట్టానికి కోరలు ఎక్కువే!
ప్రారంభం నుంచీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) వరుసగా అనేక సవరణలకు గురై మరింత కఠినంగా మారింది. దాంతో చట్ట అన్వయా నికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ మధ్య సాధించాల్సిన సమతూకపు ఆవశ్యకత పెరుగుతోంది. పీఎంఎల్ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని చెప్పడం ద్వారా ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను 2002లో సుప్రీంకోర్టు తీర్పు దృఢపరిచింది. ఈ తీర్పు ఫెడరల్ ఏజెన్సీకి అనవసరమైన వెసులు బాటు కల్పించిందని మానవ హక్కుల న్యాయవాదులు విమర్శించారు. ఏ రుజువూ లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపి, బెయిల్ మీద విడుదలైన ‘ఆప్’ ఎంపీ సంజయ్ సింగ్ కేసు ప్రాథమిక హక్కులపై పీఎంఎల్ఏ కలిగిస్తున్న ప్రభావాలను పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఆర్థిక నేరాలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్ఎల్ఏ) ఒక ముఖ్యసాధనం. 2005 జూలైలో అమలులోకి వచ్చి నప్పటి నుండి ఈ చట్టం సమూల మార్పులకు గురైంది. 2009, 2012, 2015, 2018, 2019, 2023లో ఈ చట్టానికి చేసిన పలు సవ రణలు... అక్రమ ఆస్తులకు వ్యతిరేకంగా దేశం ప్రదర్శిస్తున్న కఠిన వైఖరిని ప్రతిబింబిస్తాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తాజా పరిణామం... కఠినమైన చట్టాన్ని అన్వయించడంలో న్యాయపరమైన పర్యవేక్షణ, జవాబుదారీతనాలకు సంబంధించిన క్లిష్టమైన అవసరాన్ని గుర్తించింది. మనీలాండరింగ్లో తన ప్రమేయం ఉన్నట్లు రుజువు లేకుండానే ఆరు నెలలు నిర్బంధంలో గడిపిన తర్వాత, సింగ్ బెయిల్ పిటీషన్పై సవాలు చేయకూడదని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) నిర్ణయించుకుంది. గత కొన్ని సంవత్సరాలుగా, ప్రత్యేకించి 2022లో ‘విజయ్ మదన్లాల్ చౌదరి’ కేసుపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు తర్వాత, మనీలాండరింగ్ చట్టం నిబంధనలను రాజ్యాంగ సూత్రా లతో సమతుల్యం చేయాలని సుప్రీంకోర్టును ఎక్కువగా కోరడం జరుగుతోంది. పీఎంఎల్ఏ నిబంధనలు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించలేదని నొక్కి చెబుతూ ఈడీకి ఉన్న విస్తారమైన అధికారాలను ఆ తీర్పు దృఢపరిచింది. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం (ఈయన పదవీ విరమణ చేశాక లోక్పాల్ చైర్పర్సన్గా నియమితులయ్యారు), అక్రమాస్తుల నిరోధ సమస్యను పరిష్కరించడానికి కఠినమైన చర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది. పైగా, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) కింద భారతదేశ బాధ్యతలను నెరవేర్చడంలో ఈ చట్టం పాత్రను ధర్మాసనం గుర్తించింది. ఈ తీర్పు ఈడీని బలోపేతం చేసినప్పటికీ, వ్యక్తిగత స్వేచ్ఛలు, విధానపరమైన భద్రతలను పణంగా పెట్టి, ఫెడరల్ ఏజెన్సీకి అనవసరమైన వెసులుబాటు కల్పించిందని న్యాయ నిపుణులు, మానవ హక్కుల న్యాయవాదులు విమ ర్శలు గుప్పించారు. న్యాయం, వ్యక్తిగత హక్కుల ప్రయోజనాలను సమతుల్యం చేయడానికి బదులుగా, ఈ తీర్పు ఈడీ అధికారాన్ని దుర్వినియోగం చేయగలదనే భయాందోళనలకు తావిచ్చింది. ఈ తీర్పు వెలువడిన కేవలం ఒక నెల తర్వాత, మరో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ దానిపై రివ్యూ పిటిషన్లను అంగీకరించింది. నిందితులకు ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) కాపీని తిరస్కరించడం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే బాధ్యత నిందితుడి మీద ఉండటం– రెండు అంశాలను పునఃపరిశీలించడానికి ధర్మాసనం అంగీకరించింది. 2022 తీర్పుపై రివ్యూ పిటిషన్ పెండింగులో ఉండగా, వివిధ ఇతర కేసుల్లో మనీలాండరింగ్ చట్టం నిబంధనలను సుప్రీంకోర్టు వివరించాల్సి వచ్చింది, కొన్నిసార్లు ఎన్ఫోర్స్ మెంట్ అధికారాల పరిధిని న్యాయస్థానం పరిమితం చేసింది. తదనంతరం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులలో కొన్ని విజయ్ మదన్ లాల్ చౌదరి తీర్పునకు విరుద్ధమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. ఉదాహరణకు, 2023 అక్టోబర్లో ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ భిన్నమైన దృక్పథాన్ని తీసుకుంది. మనీలాండరింగ్ కేసుల్లో నిందితులకు వారిని అరెస్టు చేసిన కారణాల కాపీని ఈడీ తప్పనిసరిగా అందించాలని ధర్మాసనం ఆదేశించింది. మౌఖికంగా మాత్రమే సమాచారాన్ని అందించడం రాజ్యాంగ హక్కు ఉల్లంఘనగా పరిగణించబడుతుందని పేర్కొంది. అయితే, 2022 తీర్పు, నిందితు డిని అరెస్టు చేయడానికి గల కారణాలను వెల్లడించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 22(1)కి తగినంత సమ్మతి కలిగి ఉందని చెప్పింది. వారి అరెస్టుకు కారణాలు తెలియజేయకుండా లేదా వారు ఎంచుకున్న న్యాయవాదిని సంప్రదించే హక్కును తిరస్కరిస్తూ, అరెస్టు చేసిన ఎవరినైనా సరే కస్టడీలో ఉంచకూడదని పేర్కొంది. 2023 తీర్పును సమీక్షించాలని కేంద్రం, ఈడీ గతనెలలో చేసిన అభ్యర్థనను కూడా తోసిపుచ్చడమైనది. అదేవిధంగా, 2023 ఆగస్టులో తమిళనాడు మంత్రి వి సెంథిల్ బాలాజీ మెడికల్ బెయిల్ పిటిషన్పై ఇచ్చిన తీర్పులో, అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద అరెస్టు చేసే అధికారాలను జాగ్రత్తగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు నొక్కి చెప్పింది. విధాన పరమైన లేదా ముఖ్యమైన ఉల్లంఘనలు ఉన్నట్లయితే, అరెస్టు చేసిన వ్యక్తిని న్యాయమూర్తులు వెంటనే విడుదల చేయాలని ఈ తీర్పు పేర్కొంది. ఈ తీర్పు అధికార దుర్వినియోగాన్ని నిరోధించడంలోనూ, సరైన కారణం లేకుండా అరెస్టులు శిక్షార్హమైనవి కాదని నిర్ధారించడంలోనూ న్యాయవ్యవస్థ పాత్రను బలపరిచింది. 2023 అక్టోబర్లో, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన మరో తీర్పు, సత్వర విచారణను కోరుకోవడం ప్రాథమిక హక్కుగా నొక్కి చెప్పింది. అదే సమయంలో అక్రమాస్తుల నిరోధక చట్టంలోని సెక్షన్ 45 ఆరోపించినట్లుగా నేరాభియోగాలకు తాము పాల్పడలేదని నిందితులే రుజువు చేసుకోవాలంటూ వారిపై ప్రాథమికంగా మోపే భారం అనేది వారి బెయిల్ మంజూరుకు సంపూర్ణ అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ‘నిందితుడికి నిమిత్తం లేని కారణాల వల్ల విచారణ కొనసాగనప్పుడు, సరైన కారణాలు ఉంటే తప్ప, బెయిల్ మంజూరు చేసే అధికారాన్ని ఉపయోగించుకునేలా న్యాయస్థానం మార్గనిర్దేశం చేయవచ్చు. విచారణకు సంవత్సరాల కాలం పట్టే చోట ఇది నిజం’ అని చెప్పింది. 2023 నవంబర్లో పవన దిబ్బూర్ కేసులో ఇచ్చిన తీర్పులో, మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభించడానికి భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బీ కింద శిక్షార్హమైన నేరపూరిత కుట్ర మాత్రమే సరిపోదనీ, 2002 చట్టం కింద షెడ్యూల్డ్ నేరంగా ఆ కుట్ర ఉండాలనీ ప్రకటించింది. ఈ తీర్పు ఆధారంగానే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై నమోదైన కేసును సుప్రీంకోర్టు గత నెలలో కొట్టేసింది. సంజయ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం, మనీలాండరింగ్ నిరోధక చట్టం విషయంలో పురోగమిస్తున్న న్యాయశాస్త్రానికి మరొక ఉదాహరణ. రాజకీయ లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం చట్టపరమైన యంత్రాంగాలను దుర్వినియోగం చేయకుండా నిరోధించాల్సిన ఆవశ్యకతను ఇది సూచిస్తుంది. ఈ కేసు దృఢమైన న్యాయ పరిశీలన ప్రాముఖ్యతను గుర్తుచేస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని అమలు చేయడంలో, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో ప్రభుత్వ అధికారాల మధ్య సమతుల్యతను తిరిగి అంచనా వేయ డానికీ, పునశ్చరణ చేయడానికీ ఒక విస్తృత ధర్మాసనం ద్వారా 2022 తీర్పును సమగ్రంగా సమీక్షించవలసిన అవసరాన్ని కూడా ఇది గుర్తుచేస్తోంది. ఇతర కేసులతో పాటు సంజయ్ సింగ్ కేసు, మనీలాండరింగ్ చట్టపరిధిలో ఉన్న కీలకమైన అంశాన్ని సూచిస్తోంది. ప్రాథమిక హక్కులపై మనీలాండరింగ్ చట్టం కలిగిస్తున్న ప్రభావాలను పూర్తిగా పునఃపరిశీలించవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. స్వేచ్ఛను కాపాడడానికి ఉద్దేశించిన న్యాయం రాజీ పడకుండా చూసేందుకు ఒక విస్తృత ధర్మాసనం ద్వారా పునఃపరిశీలన చేయాలని ఇది సూచిస్తోంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రాథమిక స్వేచ్ఛలను సవాలు చేస్తూనే ఉన్నందున, అమలు యంత్రాంగాలు న్యాయ, నిష్పక్షపాత సూత్రాలను అధిగమించకుండా చూడటంలో న్యాయవ్యవస్థ జాగ రూకతా పాత్ర అనివార్యమవుతోంది. ఉత్కర్ష్ ఆనంద్ వ్యాసకర్త జర్నలిస్ట్, కాలమిస్ట్ (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
Delhi liquor scam: కేజ్రీవాల్ పిటిషన్పై ఈడీకి సుప్రీం నోటీస్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ సీఎం కేజ్రీవాల్ వేసిన పిటిషన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. కేజ్రీవాల్ను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్గా విచారణ చేపట్టారు. ఏప్రిల్ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్ఎస్ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు. -
బీజేపీపైనా చర్యలు తీసుకోండి
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ ఆరోపణలపై బీజేపీ నేతలపైనా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మంత్రి అతిశి శనివారం ఎన్నికల కమిషన్(ఈసీ)ని డిమాండ్ చేశారు. బీజేపీ కనుసన్నల్లో ఈసీ పనిచేస్తోందని శనివారం ఆమె మీడియా సమావేశంలో ఆరోపించారు. బీజేపీలో చేరడమో, ఈడీ అరెస్ట్ను ఎదుర్కోవడమో తేల్చుకోవాలంటూ ఆ పార్టీ నేత ఒకరు తనను బెదిరించారంటూ అతిశి చేసిన ఆరోపణలపై ఈసీ ఆమెకు శుక్రవారం నోటీసులిచి్చన విషయం తెలిసిందే. ‘మద్యం కుంభకోణంలో డబ్బు చేతులు మారిందనేందుకు ఎలాంటి ఆధారాలు దొరకనప్పటికీ కేవలం అనుమానంతోనే ఆప్ నేతలు సంజయ్ సింగ్, మనీశ్ సిసోడియా, సీఎం కేజ్రీవాల్లను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కుంభకోణంలో నిందితుడొకరు బీజేపీకి కోట్లాది రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో అందజేసినట్లు ఆధారాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదు’అని ఆమె ప్రశ్నించారు. -
‘గురివింద’ బండారం బట్టబయలు
విశాఖ సిటీ/సాక్షి, అమరావతి: రాజ గురివింద రామోజీ బరితెగించారు. ఎన్నికల వేళ పచ్చ పార్టీకి భారీ మొత్తంలో డబ్బు అక్రమ తరలింపునకు తెగబడ్డారు. రాజకీయంగా చంద్రబాబుకు కొమ్ముకాసే రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్ఫండ్స్ లెక్కా పత్రం లేకుండా విశాఖ నగరంలో భారీగా నగదును తరలిస్తూ అడ్డంగా దొరికిపోయింది. రూ.51,99,800 నగదుతో పాటు రూ.36,88,675 విలువైన 51 చెక్కులను అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. దీంతో రామోజీ ఆరి్థక అక్రమాల బండారం మరోసారి బట్టబయలైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విశాఖ పోలీసు బృందాలు, కేంద్ర బలగాలు జిల్లాలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం విశాఖ నగరం ద్వారకానగర్ ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఏపీ31సీజీ 7825 నంబరు స్కూటీపై ఇద్దరు వ్యక్తులు సూట్కేస్తో వెళుతుండగా పోలీసులు వారిని ఆపారు. వారి వద్ద ఉన్న సూట్కేసును తనిఖీ చేయగా అందులో రూ.500 నోట్ల కట్టలు, చెక్కులు కనిపించాయి. వాటిని లెక్కించగా రూ.51,99,800 నగదు ఉన్నట్లు తేలింది. రూ.36,88,675 విలువైన 51 చెక్కులను గుర్తించారు. ఆ డబ్బు ఎవరిదని, ఎక్కడకు తీసుకువెళుతున్నారని పోలీసులు ప్రశి్నంచారు. ఇందుకు వారు పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఆ డబ్బు మార్గదర్శి చిట్స్కు సంబంధించినదని, ఎవరికీ ఇవ్వడానికి కాదని, బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళుతున్నట్లు బుకాయించే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆధారాలు చూపించాలని అడిగినప్పటికీ వారు చూపించలేదు. దీంతో పోలీసులు నగదును స్వా«దీనం చేసుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకొని విచారించారు. అందులో ఒకరు లక్ష్మణరావు మార్గదర్శి చిట్స్లో అకౌంట్స్ అసిస్టెంట్గా, మరొకరు శ్రీనివాస్ ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నట్లు చెప్పారు. వారు ఆ డబ్బుకు ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో పోలీసులు నగదు, చెక్కులను ఎన్నికల అధికారులకు అందజేశారు. వారు ఆదాయ పన్ను శాఖ అధికారులకు అందజేశారు. గత ఎన్నికల్లోనూ ఇదే విధంగా తరలింపు! ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున పెద్ద మొత్తంలో నగదు తరలిస్తే అందుకు ఆధారాలు ఉండాలి. ఈ విషయం పత్రికాధిపతి రామోజీకి చెందిన సంస్థకు తెలియనిది కాదు. అయినా మార్గదర్శి ద్వారా లక్షలాది రూపాయలు ఎటువంటి ఆధారాలు లేకుండా తరలించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలకు డబ్బు చేరవేసేందుకే ఈ నగదును తీసుకువెళుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సమయంలో పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తుండటంతో మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో టీడీపీ అభ్యర్థులకు డబ్బు చేరవేస్తున్నట్లు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా విశాఖలో ఉన్న మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచిల నుంచి భారీ స్థాయిలో నగదు పంపిణీ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే భీమిలిలో ఉన్న ప్రైవేటు పరిశ్రమ నుంచి టీడీపీ నేతలకు రూ.కోట్లు ముట్టినట్లు వార్తలు వినిపించాయి. వాస్తవానికి మార్గదర్శి, ఆ పరిశ్రమ సిబ్బంది చేతుల మీదుగానే రూ.కోట్ల డబ్బు పంపిణీ జరిగిందన్నది బహిరంగ రహస్యమే. ఈ ఎన్నికల్లోనూ అదే పంథాలో డబ్బు పంపిణీకి పూనుకున్నట్లు ఈ వ్యవహారంతో తేటతెల్లమైంది. డిజిటల్ చెల్లింపులేవి రామోజీ! 2022 డిసెంబర్ నుంచి మార్గదర్శి చిట్ఫండ్స్ కొత్త చిట్టీలు వేయడంలేదు. పాత చిట్టీలే కొనసాగుతున్నాయి. కాలపరిమితి ముగియడంతో చిట్టీలు మూసివేస్తున్నారు. దాంతో మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచిల్లో చిట్టీ గ్రూపుల సంఖ్య సగానికంటే తగ్గిపోయింది. అయినప్పటికీ విశాఖపట్నం బ్రాంచిలో ఖాతాదారుల నుంచి 3 రోజుల్లోనే రూ.51 లక్షలు నగదు రూపంలో వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం నెలకు రూ.5.10 కోట్లు వసూలు చేస్తున్నట్టు. ఇక రాష్ట్రంలోని 37 బ్రాంచిల ద్వారా నెలకు సగటున రూ.188.70 కోట్లు వసూలు చేస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా నగదు రూపంలోనే వసూలు చేస్తున్నట్లు కూడా స్పష్టమవుతోంది. ప్రస్తుతం కిళ్లీ దుకాణాలు, బజ్జీ దుకాణాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు కాబట్టి నగదు లావాదేవీలు జరపకూడదని రామోజీ ఈనాడులో పదేపదే వార్తలు రాయిస్తున్నారు. కానీ ఆయన మాత్రం మార్గదర్శి చిట్ఫండ్స్ ద్వారా భారీగా నగదు లావాదేవీలే నిర్వహిస్తుండటం గమనార్హం. చందాదారుల నుంచి డిజిటల్/ఆన్ౖలెన్ చెల్లింపులు ఎందుకు స్వీకరించడం లేదు? నగదు రూపంలోనే ఎందుకు తీసుకుంటున్నారన్నప్రశ్న తలెత్తుతోంది. మార్గదర్శి పేరుతో ఎన్నికల్లో టీడీపీకి డబ్బు తరలింపు, భారీగా నల్లధనం చలామణిలోకి తేవడమే లక్ష్యంగా ఈ దందా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. పక్కా మనీ లాండరింగే.. విశాఖలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడటంతో రామోజీరావు మార్గదర్శి చిట్ఫండ్స్ ముసుగులో భారీగా నల్లధనం దందా మరోసారి ఆధారాలతోసహా వెలుగులోకి వచ్చింది. ఈ డబ్బు ఎక్కడిదని మార్గదర్శి సిబ్బందిని పోలీసులు ప్రశి్నంచగా పొంతన లేని సమాధానాలు చెప్పి తప్పించుకునేందుకు యతి్నంచారు. చివరగా గత మూడు రోజుల్లో మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచి కార్యాలయంలో చందాదారుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కానీ ఆ నగదు, చెక్కులకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలీసులు వాటిని జప్తు చేశారు. మార్గదర్శి చిట్ఫండ్స్ మనీ లాండరింగ్కు పాల్పడుతోందని గతంలో స్టాంపులు–రిజి్రస్టేషన్ల శాఖ, సీఐడీ సోదాల్లో వెల్లడైన విషయం వాస్తవమేనని ఈ ఘటన మరోసారి రుజువుచేసింది. చిట్ఫండ్స్ చట్టం ప్రకారం ఒక బ్రాంచిలో వసూలు చేసే మొత్తాన్ని అదే బ్రాంచి పరిధిలో బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఇతర బ్యాంకుల్లోని ఖాతాల్లోకి మళ్లించకూడదు. రామోజీరావు ఈ నిబంధనలను ఏనాడూ పట్టించుకోలేదు. మార్గదర్శి చందాదారుల సొమ్మును హైదరాబాద్లోని తమ ప్రధాన కార్యాలయం ఖాతాకు మళ్లిస్తూ వచ్చారు. అదే రీతిలో చందాదారుల సొమ్మును సోమవారం విశాఖలో ఇతరత్రా అవసరాలకు మళ్లిస్తూ పోలీసులకు చిక్కినట్లు స్పష్టమైంది. -
నగదు లావాదేవీల సమాచారమివ్వండి: ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ..అక్రమ డబ్బు రవాణాను అరికట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఖాతాదారులు ఎవరైనా రూ.లక్ష కంటే ఎక్కువ డిపాజిట్, విత్ డ్రా చేస్తే జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇవ్వాలని సూచించింది. ఏదైనా బ్యాంకు ఖాతా నుంచి రూ.10 లక్షలకు పైగా నగదును ఖాతాదారుడు తీసుకున్నా జిల్లా ఎన్నికల అధికారికి, ఆదాయపు పన్ను శాఖ నోడల్ అధికారికి తెలపాలని ఆదేశించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల ఖర్చు కోసం తన పేరుతో లేదా ఏజెంట్ పేరుతో కలిపి బ్యాంకు, పోస్టాఫీసుల్లో ప్రత్యేకంగా అకౌంట్ లేదా ఉమ్మడి అకౌంట్ తెరవవచ్చని సూచించింది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్లు తెరవాలని అన్ని బ్యాంకులకు ఈసీఐ ఆదేశాలు జారీ చేసింది. -
Delhi excise policy case: కేజ్రీవాల్కు ఊరట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఎట్టకేలకు ఊరట లభించింది. మద్యం విధానం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించనందున ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు అనుమతివ్వాలంటూ ఈడీ కోర్టులో రెండుసార్లు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, మొదటి ఫిర్యాదుపై విచారణ సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కేజ్రీవాల్ శనివారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈడీ రెండో ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు విచారణ జరిపింది. ఫిర్యాదు పత్రాలను కేజ్రీవాల్కు అందజేయాలని ఈడీని ఆదేశించింది. -
మనీలాండరింగ్ కేసు: టీఎంసీ ఆస్తులు ఈడీ అటాచ్
కోల్కతా: తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. రూ.10.29 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ సోమవారం పేర్కొంది. ఆల్కెమిస్ట్ గ్రూప్, ఇతరులు చేసిన మనీలాండరింగ్ నేరంపై విచారణ సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రూ. 10.29 కోట్లను ఈడీ టెండర్ చేసిన డిమాండ్ డ్రాఫ్ట్(డీడీ) రూపంలో అటాచ్ చేసింది. 2014 లోక్సభ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున స్టార్ క్యాంపెయినర్లు ఉపయోగించిన విమాన/హెలికాప్టర్ సేవలకు పలు విమానయాన కంపెనీలకు ఆల్కెమిస్ట్ గ్రూప్ దాదాపు రూ.10.29 కోట్లు చెల్లించినట్లు ఈడీ పేర్కొంది. ఇక.. అప్పటి ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్లు అయిన.. సీఎం మమతా బెనర్జీ, పార్టీ ఎమ్మెల్యే, మాజీ రైల్వే మంత్రి ముకుల్ రాయ్, నటుడు మూన్మూన్ సేన్, ఎంపీ నుస్రత్ జహాన్ కోసం టీఎంసీ విమాన సేవలు ఉపయోగించినట్లు ఈడీ తెలిపింది. ప్రజల డబ్బులో కొంత సొమ్మును టీఎంసీ ప్రచారంలో విమానయాన కంపెనీలకు చెల్లించేందుకు సదరు ఆల్కెమిస్ట్ గ్రూప్ను ఉపయోగించుకున్నట్లు ఈడీ విచారణలో నిర్ధారణ అయింది. ఈ ఆల్కెమిస్ట్ గ్రూప్.. టీఎంసీ పార్టీకి చెందిన మాజీ ఎంపీ కేడీ సింగ్ది కావటం గమనార్హం. -
Aam Aadmi Party: అతి త్వరలోనే కేజ్రీవాల్ అరెస్ట్
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తోందని శుక్రవారం ఆప్ తెలిపింది. లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్, ఆప్ చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీలో భయం మొదలైందని పేర్కొంది. రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేసేందుకే తమ నేత కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించింది. ఢిల్లీ మంత్రి, ఆప్ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఆప్, కాంగ్రెస్ల మధ్య చర్చలు కొలిక్కి వచ్చిన విషయం తెలియగానే ఈడీ గురువారం కేజ్రీవాల్కు ఏడో విడత నోటీసులిచ్చిందని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ను అరెస్ట్ చేసేందుకు సీబీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు తమ వద్ద విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. శుక్రవారం సాయంత్రానికల్లా కేజ్రీవాల్కు నోటీసులు అందజేస్తుందని, రెండు మూడు రోజుల్లో అరెస్ట్ చేస్తుందని ఆయన అన్నారు. -
గుర్తుపట్టారా? ఒకప్పుడు ‘బాగా రిచ్’.. ఇప్పుడు షార్ప్షూటర్లు మధ్య జైలు జీవితం!
ఓ వ్యక్తి ఫోటో ప్రస్తుతం అటు వ్యాపార ప్రపంచంలో ఇటు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెల్లని గడ్డం.. సాదాసీదా బట్టలు. కళ్లల్లో అన్నీ కోల్పోయామనే బాధ, ఆ చూపులో తప్పు చేశాననే పశ్చాత్తాపం స్పష్టంగా కనపడుతుంది. ఒకప్పుడు విమానయాన రంగంలో రారాజులా వెలిగిన ఓ బడా వ్యాపారవేత్త. వందల్లో విమానాలు, వేల కోట్లల్లో ఆస్తులు. పిలిస్తే పలికే మంది మార్బలం. ప్రపంచ ధనవంతుల జాబితాలో చోటు. ఒక్క చిటికేస్తే ఆయన ఏం కోరుకున్నా క్షణాల్లో జరిగే పవర్స్. కానీ కాలం కలిసి రాకపోతే అది కొట్టే దెబ్బలకు ఎవరూ అతీతులు కారు. అలా కాలం ఈడ్చి కొట్టిన దెబ్బకి ఇప్పడు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. రూ.538.62 కోట్ల రుణాల ఎగవేతకు పాల్పడి కరడు గట్టిన నేరస్థులు, షార్ప్షూటర్లు, గూండాలతో కలిసి జైలు జీవితం అనుభవిస్తున్నారు. కడవరకు ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో తనకే తెలియని దిక్కుతోచని స్థితిలో కోర్టును చావును ప్రసాదించమని కోరారు. సమాజంలో బతకలేక.. జైలులో చనిపోయేందుకు అనుమతి అడిగారు. ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎంతటి శత్రువుకైనా తలెత్తకూడదని కోరుకుంటూ నెటిజన్లు ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఆయనను గుర్తు పట్టారా? ఇంతకీ ఆఫోటో ఎవరిదో గుర్తుపట్టారా? బ్యాంకు రుణాల ఎగవేత కేసులో జైలు పాలైన జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్ది. నాలుగు నెలలుగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. ఈయన ప్రత్యేక కోర్టుకు హాజరయ్యేందుకు జైలు నుంచి బయటకు వస్తున్న సమయంలో జాతీయ మీడియా ఆయనను ఫోటోలు తీసింది. ఇక జనవరి 26న ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యుల సూచనల మేరకు తనని ప్రైవేట్ ఆస్పత్రిలో పలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు అమనుమతి కావాలని పిటిషన్లో కోరారు. ఎస్కార్ట్తో ప్రైవేట్ ఆస్పత్రికి పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎంజే దేశ్పాండే..‘నరేష్ గోయల్ ఆరోగ్య పరిస్థితిని ఇప్పటికే (చివరి విచారణలో) గుర్తించాము. ఎవరి సహాయం లేకుండా తనంతట తానుగా నిలబడలేకపోతున్నారు. కాబట్టి అతని ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఎస్కార్ట్ పార్టీని ఏర్పాటు చేయాలని ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలు సూపరింటెండెంట్ ఆదేశించారు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్తున్నారను కాబట్టి ఎస్కార్ట్ కోసం అయ్యే ఖర్చును గోయల్ చెల్లిస్తారని తెలిపారు. -
ఈడీ ఎదుటకు కార్తీ చిదంబరం
న్యూఢిల్లీ: 2011లో కొందరు చైనీయులకు వీసాల జారీకి సంబంధించిన మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. ఆయన వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. ఈడీ అధికారులు ఈ నెల 12, 16వ తేదీల్లో కూడా కార్తీకి సమన్లు పంపారు. అయితే, అవసరమైన పత్రాల సేకరణకు సమయం కావాలంటూ ఆయన విచారణకు హాజరుకాలేదు. పంజాబ్లో ఏర్పాటవుతున్న ఒక విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కాంట్రాక్టును చైనా కంపెనీ తీసుకుంది. ఈ కంపెనీ గడువులోగా పనులను పూర్తి చేయలేదు. దీంతో, 263 మంది చైనా సిబ్బందికి దేశంలో ఉండేందుకు అవసరమైన వీసాలను మళ్లీ మంజూరు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వీసాల మంజూరు కోసం 2011లో కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరంకు రూ.50 లక్షలు ముట్టినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ప్రశ్నించేందుకే ఈడీ అధికారులు కార్తీకి నోటీసులు పంపారు. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంను వేధించే చర్యల్లో భాగంగానే తనపై కక్షగట్టారని కార్తీ ఆరోపిస్తున్నారు. ఒక్క చైనీయుడి వీసా మంజూరుకు కూడా తాను ఎన్నడూ సాయపడలేదన్నారు. కార్తీ చిదంబరంపై ఐఎన్ఎక్స్ మీడియా, ఎయిర్సెల్–మ్యాక్సిస్ కేసుల్లో మనీలాండరింగ్ ఆరోపణల కింద ఇప్పటికే ఈడీ దర్యాప్తు చేస్తోంది. -
జార్ఖండ్ సీఎం సోరేన్కు ఆరోసారి ఈడీ సమన్లు..
రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)ఆరోసారి సమన్లు జారీ చేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు లావాదేవీలో మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ సోరేన్పై కేసు నమోదు చేసింది.ఈ కేసులో ప్రశ్నించేందుకు తమ ముందుకు రావాల్సిందిగా ఈడీ హేమంత్ సోరెన్కు వరుసగా ఆరోసారి సమన్లు పంపింది. సోరేన్ మంగళవారం తమ ముందు హాజరయ్యే అవకాశం ఉందని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. రాంచీలోని జోనల్ ఆఫీసులో ఆయనను విచారించనున్నట్లు చెప్పారు. గతంలో ఇదే కేసులో ఐదోసారి ఈడీ పంపిన సమన్లపై సోరేన్ సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఈ పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ఈడీ పంపిన సమన్లపై హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఇదీచదవండి..ఎదురెదురుగా ఢీకొన్న హైస్పీడ్,ఎక్స్ప్రెస్ రైళ్లు -
డీకే శివకుమార్ కేసులో కోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : మనీలాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతిచ్చింది. కాప్ 28 లోకల్ క్లైమేట్ యాక్షన్ సదస్సులో పాల్గొనేందుకుగాను డిప్యూటీ సీఎం హోదాలో శివకుమార్ దుబాయ్ వెళ్లనున్నారు. ఈనెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు దుబాయ్లో ఉండేందుకు డీకేకు కోర్టు అనుమతిచ్చింది. డీకే విదేశాలకు వెళ్లేందుకు అనుమతిచ్చే సందర్భంలో కోర్టు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సాధారణంగా ఒక పౌరుడు విదేశాలకు వెళ్లడం అనేది అతని ప్రాథమిక హక్కులో భాగం. అయితే ఇది పరిమితులు లేని హక్కు కాదు. కేసుల్లో నిందితులు విదేశాలకు పారిపోకుండా చూసేందుకు ఈ హక్కుపై పరిమితులు విధించవచ్చు. అయితే ఇక్కడ అనుమతి అడుగున్నది 8 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుత డిప్యూటీ సీఎం శివకుమార్ అయినందున అనుమతిస్తున్నాం. ఎందుకంటే ఇంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఆయన పారిపోయే అవకాశాలు తక్కువ’అని కోర్టు పేర్కొంది. అయితే డీకే దుబాయ్ వెళ్లేందుకు అనుమతిచ్చిన కోర్టు కొన్ని షరతులు పెట్టింది. 5 లక్షల రూపాయల డిపాజిట్తో పాటు ప్రయాణానికి సంబంధిచిన పూర్తివివరాలు, అక్కడ వాడే మొబైల్ నెంబర్ అందించాలని ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన డీకే శివకుమార్కు 2019 అక్టోబర్ 23న కోర్టు ఈడీ కేసులో బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన బెయిల్పైనే ఉన్నారు. ఇదీచదవండి..వర్షంలో శరద్పవార్ స్పీచ్..సెంటిమెంట్ ఏంటంటే.. -
Land-for-jobs case: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం.. లాలూ సన్నిహితుడి అరెస్ట్
న్యూఢిల్లీ: ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’కుంభకోణం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ల సన్నిహితుడు అమిత్ కట్యాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు హాజరు కావాలంటూ పలుమార్లు సమన్లు జారీ చేసినా అతడు తప్పించుకు తిరుగుతున్నాడని ఈడీ తెలిపింది. కోర్టులో హాజరుపరిచి విచారణ కోసం రిమాండ్ కోరుతామని ఈడీ వివరించింది. ఈ కేసులో ఈడీ సమన్లను కొట్టివేయాల్సిందిగా అతడు వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు ఇటీవల కొట్టివేసినట్లు సమాచారం. ఈ ఏడాది మార్చిలో లాలూ, తేజస్వీ యాదవ్, లాలూ కుమార్తెలు తదితరులతోపాటు కట్యాల్ ఇంటిపైనా ఇళ్లపై ఈడీ దాడులు జరిపింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉండగా ఈ కుంభకోణం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. -
పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు విప్పడం లేదు?
గుంటూరు: చంద్రబాబు నాయుడు తనను అరెస్టు చేస్తారని చెప్పుకుంటూ ప్రజల్లో సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుచేశారు కాబట్టే ఆయన భయపడుతున్నారని అన్నారు మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు అధికారంలో ఉండగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన నేరానికి ఐటీశాఖ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో అరెస్టు భయం పుట్టుకున్న చంద్రబాబు ప్రజల వద్ద సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అంబటి రాంబాబు. చట్టం దృష్టిలో చంద్రబాబు అయినా ఒకటే మరో బాబు అయిన ఒకటేనని చట్టం తన పని తాను చేసుకుంటూపోతుందని ఆయన తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నారని నాకు అనిపిస్తోందన్నారు. బహుశా ఆయనను అరెస్ట్ చేస్తారని ఆయనకు కలవచ్చినట్టుంది. చంద్రబాబును అరెస్టు చేయాల్సిన అవసరం ఉంటే అరెస్టు చేస్తారు, అరెస్టు చేయాల్సిన అవసరం లేకపోతే అరెస్టు చేయరని అన్నారు. అలాగని చట్టానికి అడ్డం వస్తే ఆయన్ని తప్పకుండా అరెస్టు చేస్తారని ప్రాథమిక ఆధారాలు లేనిదే ఎవరి మీద ఏ విధమైన కేసులు పెట్టరని అన్నారు. దీనిని అవకాశంగా తీసుకుని చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందే మాటలు మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు దొంగైనా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు. చంద్రబాబు రూ. 118 కోట్లు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలున్నా కూడా పవన్ కళ్యాణ్ నోరు విప్పడు సరికదా ఆయన హీరోనే అంటాడని వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి కొడాలి నాని కామెంట్స్ ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చిన ఇదే అంశంపై మాజీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ తప్పు చేస్తే అరెస్టు చేయక ముద్దుపెట్టుకుంటారా అని ప్రశ్నించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అవినీతి పనులు చేస్తే అరెస్ట్ చెయ్యక ముద్దు పెట్టుకుంటారా? ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. పాలు అమ్మితే పదివేల కోట్ల ఆదాయం వచ్చిందా.. పాలు, పిడకలు అమ్మి దేశంలో ఎవరూ ఇంత ఆదాయం సంపాదించలేదని దోచుకున్న డబ్బును వైట్ చేసేందుకే చంద్రబాబు పాల వ్యాపారం చేస్తున్నార్నయి అన్నారు. . అధికారంలో ఉన్నప్పుడు మనం చేసిన మంచి పనులు ఏవైనా ఉంటే వాటి గురించి ప్రజలు చెప్పాలి.. అంతే తప్ప చంద్రబాబు సెల్ఫీలు తీసుకొని అన్నీ నేనే చేశానని చెప్పుకోవడమేంటో నాకైతే అర్ధం కాలేదన్నారు. మాట్లాడితే హైదరాబాద్ నేనే కట్టానంటారు కానీ చంద్రబాబు అక్కడ పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదన్నారు. పిట్టలదొర లేని లోటుని ఆయన తీరుస్తున్నారని రాష్ట్రంలో ఐదుగురు వ్యక్తులు మాత్రమే సంపదని దోచుకోవాలని కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఇది కూడా చదవండి: మార్గదర్శి మా జీవితాల్ని నాశనం చేసింది: బాధితురాలు -
బాబూ! ఆ డబ్బెక్కడిది?
సాక్షి, అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు చేతికి ముట్టిన రూ.118 కోట్ల అక్రమ ధనం గురించి ఆదాయపు పన్ను శాఖ ప్రశ్నించింది. ఐటీ రిటర్నుల్లో చూపని ఈ రూ.118 కోట్లనూ అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 4వ తేదీన ఈ నోటీసులు జారీ చేసినట్లు ప్రముఖ జాతీయ ఇంగ్లిష్ దినపత్రిక ‘హిందుస్థాన్ టైమ్స్’ శుక్రవారం ఓ కథనాన్ని ప్రచురించింది. ఇన్ఫ్రా కంపెనీల నుంచి ముడుపుల రూపంలో తీసుకున్న రూ.118 కోట్లను లెక్క చూపని ఆదాయంగా పరిగణిస్తూ... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ ఆగస్టు 4న చంద్రబాబుకు జారీ చేసిన ఈ షోకాజ్ నోటీసులపై ఆ పత్రిక సమగ్ర కథనాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రచురించిన కథనం మేరకు వివరాలివీ... మనోజ్ వాసుదేవ్ సోదాల్లో విషయం వెలుగులోకి... మనోజ్ వాసుదేవ్పార్థసాని 2017 నుంచీ షాపూర్జీ పల్లోంజీ సంస్థ పాల్గొనే టెండర్ల ప్రక్రియలో చురుగ్గా ఉంటున్నారు. ఆ సంస్థ తరఫున ఈయనే మధ్యవర్తిగా వ్యవహారాలు నడిపేవారు. ఈయనకు చెందిన మనోజ్ పార్థసాని అసోసియేట్స్ కార్యాలయంలో 2019లో ఐటీ శాఖ అధికారులు జరిపిన సోదాలతో చంద్రబాబు నాయుడు గుట్టుగా సాగించిన అవినీతి బయటపడింది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల పేరుతో షాపూర్జీ పల్లోంజీ నుంచి భారీ ఎత్తున నగదును తరలించినట్లు మనోజ్ వాసుదేవ్ అంగీకరించారని కూడా గతంలో ఐటీశాఖ తన నివేదికలో వెల్లడించింది. సోదాల సమయంలో కొన్ని మెసేజ్లు, వాట్సాప్ చాటింగ్స్, ఎక్సెల్ షీట్లను మనోజ్ వాసుదేవ్ నుంచి స్వాధీనం చేసుకున్నామని, అందులో కొన్ని ప్రముఖ నిర్మాణ రంగ కంపెనీల నుంచి నగదును అక్రమంగా తరలించి ‘మీకు చేరుస్తున్నాం’ అని చంద్రబాబును ఉద్దేశించి పేర్కొన్నట్లు ఐటీ శాఖ వివరించింది. ఆ నోటీసుల ప్రకారం మనోజ్ పార్థసాని చంద్రబాబు నాయుడుకి చెందిన వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాస్తో 2016 నుంచీ సంబంధాలను కొనసాగిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని శ్రీనివాస్ తనను అడిగినట్లు కూడా మనోజ్ వాసుదేవ్ అప్పట్లో వెల్లడించారని ఐటీ పేర్కొంది. అయితే షాపుర్జీ పల్లోంజీ సంస్థ బడా కార్పొరేట్ కంపెనీ కనక... డబ్బును తరలించడానికి వారంతా కలిసి ఓ తెలివైన మార్గాన్ని ఎంచుకున్నారు. వాస్తవంగా ఎటువంటి పనులు చేయకుండానే షాపూర్జీ పల్లోంజీ నుంచి వివిధ ప్రాజెక్టులు చేసినట్లుగా షెల్ కంపెనీల ద్వారా నకిలీ బిల్లులు పెట్టి ఆయా కంపెనీలకు నగదును తరలించారు. ఈ విషయాన్ని 2019 నవంబరు 1న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా మనోజ్ పార్థసాని తెలియజేశారు. కేవలం షాపుర్జీ పల్లోంజీయే కాకుండా ఎల్అండ్టీ వంటి ఇన్ఫ్రా కంపెనీల నుంచి ఫోనిక్స్ ఇన్ఫ్రా, పోర్ ట్రేడింగ్ వంటి షెల్ కంపెనీలకు నకిలీ బిల్లుల ఆధారంగా నగదును తరలించినట్లు ఐటీ శాఖకు అర్థమయింది. ఈ విషయాలన్నీ వివరిస్తూ ఆ డబ్బుకు లెక్కలు చెప్పాలని, అవి ఎలా వచ్చాయో తెలియజేయాలని బాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. శ్రీనివాస్ నుంచి చంద్రబాబు నాయుడుకు నగదు చేరినట్లుగా ధ్రువీకరించే ఆధారాలను, నేరాన్ని ధ్రువపరిచే వివిధ సందేశాలు, చాట్లు, ఇంకా ఎక్సెల్ షీట్లను సైతం సెర్చ్ ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్నట్లు డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఈ సాక్ష్యాలను మనోజ్ వాసుదేవ్కు చూపించి విచారించగా ఇన్ఫ్రా కంపెనీల నుంచి బోగస్ కాంట్రాక్టుల ద్వారా నగదును ఎలా తరలించారన్న విధానాన్ని మొత్తం వివరించినట్లు ఆ నోటీసులో పేర్కొన్నారు. ఈ బోగస్ కంపెనీల ద్వారా తరలించిన నగదు ద్వారా అంతిమంగా లబ్థి పొందింది చంద్రబాబేనని ఐటీ శాఖ పేర్కొంది. మనోజ్ వాసుదేవ్ ద్వారా సబ్కాంట్రాక్టుల ద్వారా అందుకున్న రూ.118,98,13,207 మొత్తాన్ని 2020–21లో వచ్చిన అక్రమ ఆదాయంగా ఎందుకు పరిగణించకూడదో చెప్పాలని నోటీసులో పేర్కొంది. అమిత్ షాను బాబు కలవటంపై అనుమానాలు!! 2024 ఎన్నికల్లో బీజేపీతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరినీ ప్రాధేయపడుతూ నానా తంటాలూ పడుతున్న వేళ ఈ నోటీసులు రావటంపై ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ ఏడాది జూన్లో చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్షాతో సమావేశం కావటాన్ని కూడా హిందుస్థాన్ టైమ్స్ పత్రిక ప్రస్తావించింది. ఈ నోటీసుల విషయమై తాము అటు చంద్రబాబు నాయుడిని, ఇటు కేంద్ర కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖలను ఈ మెయిల్ ద్వారా సంప్రదించామని, ఎవ్వరూ స్పందించలేదని కూడా పత్రిక వెల్లడించింది. లెక్క తేలని మొత్తం రూ.2,000 కోట్లు అమరావతిలో రాజధాని పేరిట తాత్కాలిక భవనాలను నిర్మించిన చంద్రబాబు... అందులో భారీ కుంభకోణానికి తెగబడినట్లు తాజా ఐటీ నోటీసులతో మరోసారి బట్టబయలైంది. తాత్కాలిక నిర్మాణాల పేరుతో పనుల అంచనా విలువలను భారీగా పెంచేసి అడ్డగోలుగా దోపిడీ చేసిన వైనాన్ని అప్పట్లోనే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. తాత్కాలిక సచివాలయాన్ని రూ.181 కోట్లతో పూర్తి చేయాలని తొలుత అంచనా వేసుకుంటే దాన్ని పెంచుకుంటూ రూ.1,151 కోట్లు ఖర్చు చేశారంటే... అంచనాలు ఎన్ని రెట్లు పెంచారో, అడ్డగోలు దోపిడీ ఏ స్థాయిలో జరిగిందో తేలిగ్గానే అర్థమవుతుంది. 2020, ఫిబ్రవరి నెలలో చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల శ్రీనివాస్పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేసి రూ.2,000 కోట్ల వరకు లెక్క చూపని ఆదాయానికి సంబంధించిన లావాదేవీలు బయటకు తీసిన విషయాన్ని ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులతో సహా అప్పట్లోనే ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఒకే కంప్యూటర్ నుంచి ఆయా సంస్థలకు చెందిన బిల్లుల చెల్లింపులు, ఐటీ రిటర్నులు దాఖలు చేశారు. చంద్రబాబు కొండంత అవినీతి చేస్తే మచ్చుకు రూ.2,000 కోట్లు మాత్రమే బయటకు వచ్చాయని, మరింత లోతుగా దర్యాప్తు చేస్తే మరిన్ని భారీ మొత్తాలు వెలుగులోకి వస్తాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అడ్డగోలు వాదన... బాబుకు అలవాటే!! చంద్రబాబు నాయుడికైనా, రామోజీరావుకైనా అడ్డంగా వాదించటం పెన్నుతో పెట్టిన విద్య. ఎందుకంటే వీళ్లను ఎవరైనా ‘మీరు ఈ నేరం చేశారా?’ అని అడిగితే... తాము చేస్తే చేశామనో, లేకపోతే చేయలేదనో వీళ్లు నేరుగా చెప్పరు. చేసిన నేరాన్ని తప్పించుకోవటానికి ముందుగా ఎదుటి వ్యక్తికి తమను అడిగే అర్హత లేదనో, లేకపోతే తమకు ఆ చట్టం వర్తించదనో, లేకపోతే ఫలానా చట్టం ప్రకారం తమను ప్రశ్నించజాలరనో ఎదురు తిరుగుతారు. అలా... కేసును దశాబ్దాల పాటు సాగదీస్తారు. పైపెచ్చు తమపై ఎలాంటి కేసులూ రుజువు కాలేదని, తాము శుద్ధపూసలమని చెబుతుంటారు. అసలు విచారణ జరగనిస్తే కదా... వీళ్లు తప్పు చేశారో లేదో తేలటానికి!!. ఇదే రీతిలో ఐటీ శాఖ నోటీసులకు కూడా చంద్రబాబు నాయుడు విచిత్రమైన సమాధానమిచ్చారు. సోదాల్లో చంద్రబాబు నాయుడి పాత్రను బయటపెట్టే ఆధారాలు లభించటంతో... నేరుగా ఆయన ఖాతాల్లోకి ఎంత ముడుపులు వెళ్లాయనే విషయమై ఒక అంచనాకు వచ్చి... అది ఎలా వచ్చిందో చెప్పాలంటూ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబు దానికి నేరుగా సమాధానమివ్వకుండా... తనకు నోటీసులిచ్చే అధికారం సదరు సెంట్రల్ సర్కిల్ అధికారికి లేదంటూ జవాబిచ్చారు. దాన్ని పరిశీలించిన ఐటీ శాఖ... సెక్షన్లను ఉటంకిస్తూ సదరు కేసును ఆ అధికార పరిధి ఉన్న డిప్యూటీ కమిషనర్కు బదిలీ చేస్తూ... డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని మరోసారి నోటీసులు జారీ చేసింది. దీన్ని అక్రమ ఆదాయంగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ఆగస్టు 4న జారీ చేసిన నోటీసుల్లో ప్రశి్నంచింది. ఇది కూడా చదవండి: ప్రభుత్వ చర్యలు భేష్.. సీఎం జగన్కు యూనిసెఫ్ టీమ్ అభినందన -
సింగపూర్లో భారీ కుంభకోణం.. రూ.4492 కోట్ల ఆస్తులు స్వాధీనం
సింగపూర్: సింగపూర్ అడ్డాగా చేసుకుని హవాలాకు పాల్పడుతున్న ఒక విదేశీ ముఠా అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు సింగపూర్ పోలీసులు. వారి నుంచి బంగ్లాలు, కార్లు, నగదు, నగలు, బంగారు బిస్కెట్లు అన్నీ కలిపి సుమారు 734.32 మిలియన్ సింగపూర్ డాలర్లు(రూ. 4491 కోట్లు) ఆస్తులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు సింగపూర్ పోలీసులు. సింగపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఆర్చార్డ్ రోడ్ షాపింగ్ బెల్ట్ నుండి సెంటోసా రిసార్ట్ ఐలాండ్ వరకు జరిపిన సోదాల్లో సుమారు 400 మంది పోలీసు బలగాలు పాల్గొన్నాయని ఈ ముఠా కోసం నగరమంతా జల్లెడ పట్టామని అన్నారు. ప్రధానంగా తొమ్మిది ప్రాంతాల్లో నిర్వహించిన ఈ సోదాల్లో 94 ఆస్తులు, 110 మిలియన్ సింగపూర్ డాలర్లు (రూ. 672 కోట్లు) ఉన్న బ్యాంక్ అకౌంట్లు, 50 లగ్జరీ వాహనాలు, 23 మిలియన్ సింగపూర్ డాలర్లు(140 కోట్ల) నగదు కట్టలు, వందలకొద్దీ హ్యాండ్ బ్యాగులు, నగలు బంగారు బిస్కెట్లు.. మొత్తంగా రూ. 4491 కోట్ల ఆస్తులు నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఆయా దేశాలకు చెందిన 31 నుండి 44 వయస్సు మధ్యలో ఉన్న పది మంది ముఠాను పట్టుకున్నామని.. వారిని చైనా, కంబోడియా, సిప్రాస్, వణువతు ప్రాంతాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. ఈ ముఠాలో సిప్రాస్ కు చెందిన వ్యక్తి తప్పించుకోబోయి తన బంగ్లా రెండో అంతస్తు నుంచి దూకగా అతడికి స్వల్ప గాయాలయ్యాయని ఆసుపత్రిలో చేర్పించామని చెప్పారు పోలీసులు. ఈ ముఠా ఆన్లైన్లో జూదం, విదేశీ మాఫియా, ఇతర స్కాముల తోపాటు ఇతర క్రిమినల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పక్కా సమాచారం అందడంతో సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు. సింగపూర్ మానిటరీ అథారిటీ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు తెలిపింది. ఈ ముఠాకి సహకరించిన ఆర్ధిక సంస్థలను ఉపేక్షించేది లేదని తెలిపింది. ఈ సందర్బంగా పోలీసు శాఖలోని వాణిజ్య వ్యవహారాల డైరెక్టర్ డేవిడ్ చ్యు మాట్లాడుతూ మీరు దొరికితే మిమ్మల్ని అరెస్టు చేస్తాం, అక్రమంగా సంపాదించిన మీ ఆస్తులు దొరికితే వాటిని సీజ్ చేస్తామని అన్నారు. 2021 గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 12% మాత్రమే విదేశీ నగదు వృద్ధి చెందగా కేవలం సింగపూర్ లోనే విదేశీ ధన ప్రవాహం 16% వృద్ధి చెందింది. అందుకే సింగపూర్ పోలీసులు అక్రమార్కులపై కొరడా ఝళిపించారు. ఇది కూడా చదవండి: భార్యను చంపిన జడ్జి.. ఇంట్లో 47 తుపాకులు, మందుగుండు సామాగ్రి.. -
ఈఎస్ఐ కుంభకోణంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్తో పాటు ఉన్నతాధికారులను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈఎస్ఐలో వందల కోట్ల స్కాం జరిగినట్లు ఈడీ గుర్తించింది. రూ.వందల కోట్ల నిధుల దారి మళ్లింపుపై ఈడీ ఆరా తీస్తోంది. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ కిట్లు, ఫార్మా కంపెనీలకు మందుల సరఫరా కాంట్రాక్టుల అప్పగింతలో జరిగిన అవకతవకల్లో రూ.కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందంటూ గతంలో ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ విచారణ జరిపిన సంగతి తెలిసిందే. చదవండి: కేసీఆర్ మెదక్ పర్యటన వాయిదా.. కారణం ఇదే.. -
బొగ్గు కుంభకోణంలో మహిళా ఐఏఎస్ అరెస్ట్
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శనివారం మహిళా ఐఏఎస్ అధికారి రానూ సాహూను అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖలో డైరెక్టర్గా ఉన్న రానూ సాహూకు అదనపు జిల్లా జడ్జి అజయ్ సింగ్ రాజ్పుత్ మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతించారు. బొగ్గు కుంభకోణం కేసులో అరెస్టయిన రెండో ఐఏఎస్ అధికారి సాహు. రాయ్గఢ్, కోర్బా జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఈడీ లాయర్ సౌరభ పాండే తెలిపారు. ఆమె రూ.5.52 కోట్ల విలువైన చరాస్తులను పోగేశారని తెలిపారు. అయితే, ఈ ఆరోపణలను సాహూ లాయర్ ఖండించారు. ఆమెను కల్పితమైన కారణాలతోనే అధికారులు అరెస్ట్ చేశారన్నారు. -
మనీలాండరింగ్ పై అప్పట్లోనే హెచ్చరించిన వై.ఎస్.ఆర్
-
మావోయిస్టులకు చెందిన రూ.10 లక్షలు స్వాధీనం
బిజాపూర్: నిషేధిత మావోయిస్టు పార్టీ నేతలకు చెందినట్లుగా భావిస్తున్న రూ.10 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను పోలీసులు పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బిజాపూర్లో చోటుచేసుకుంది. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్నార్ గ్రామానికి చెందిన దినేశ్ తాటి(23) శుక్రవారం స్థానిక ట్రాక్టర్ షోరూంకు వచ్చాడు. పోలీసులు అతడిని అనుమానంతో ప్రశ్నించగా గంగలూర్ ఏరియా కమిటీ మావోయిస్టులు ఆ నోట్లను మార్చాలంటూ తనకు ఇచ్చారని వెల్లడించాడు. రూ.2 వేల నోట్లతో ట్రాక్టర్ కొనేందుకు వచ్చానన్నాడు. ఇటీవల రూ.2 వేల నోట్లను చలామణీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన ఆర్బీఐ.. సెప్టెంబర్ 30ని ఆఖరు తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఛత్తీస్గఢ్ పోలీసులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచారు. మే 25న మావోయిస్టు కమాండర్ ఇచ్చిన రూ.6 లక్షల విలువైన 2 వేల నోట్లను పట్టుకుని, బిజాపూర్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ నెల 10న దంతెవాడ జిల్లాలోనూ రూ.1 లక్ష విలువైన రెండు వేల నోట్లను పట్టుకుని, ముగ్గురు మావోయిస్టు సానుభూతి పరులను అదుపులోకి తీసుకున్నారు. -
బొగ్గుపై సుంకం స్కామ్లో ఈడీ దూకుడు
న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో బొగ్గుపై అదనంగా అక్రమ పన్ను కేసులో మనీ లాండరింగ్ కోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణను వేగవంతం చేసింది. తాజాగా రూ.51.4 కోట్లకుపైగా విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ మంగళవారం తెలిపింది. వీటిలో రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవేందర్ యాదవ్, చంద్రదేవ్ ప్రసాద్ రాయ్, పీసీసీ కోశాధికారి రాంగోపాల్ అగర్వాల్లకు సంబంధించిన స్థిరాస్థులు, విలాసవంత వాహనాలు, ఆభరణాలు, నగదు ఉన్నాయి. మహిళా ఐఏఎస్ అధికారి, నాటి రాయ్గఢ్ జిల్లా కలెక్టర్ రాణు సాహూ, బొగ్గు వ్యాపారి, కేసులో ప్రధాన నిందితుడు సూర్యకాంత్ తివారీ, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ ఆస్తులనూ ఈడీ అటాచ్ చేసింది. రాష్ట్రంలో రూ.2,000 కోట్ల మద్యం కుంభకోణం జరిగిందంటూ కాంగ్రెస్ నేత, రాయ్పూర్ మేయర్ సోదరుడు అన్వర్ ధేబర్ను ఈడీ అరెస్ట్చేసిన కొద్దిరోజులకే ఈ ఆస్తుల జప్తు జరగడం గమనార్హం. ఈడీని బీజేపీ ఏజెంట్గా పేర్కొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్ దీనిని తప్పుడు కేసుగా అభివర్ణించారు. -
మనీ లాండరింగ్ పరిధిలోకి సీఏలు
న్యూఢిల్లీ: నల్ల ధనం చలామణీ, మనీ లాండరింగ్ కార్యకలాపాలను నిరోధించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కేంద్రం ఆ దిశగా మరో కీలక చర్య తీసుకుంది. బ్లాక్ మనీ చలామణీకి ఆస్కారం ఉండే అయిదు రకాల ఆర్థిక లావాదేవీలను, వాటిని క్లయింట్ల తరఫున నిర్వహించే చార్టర్డ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను మనీ–లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిధిలోకి చేర్చింది. దీంతో ఇకపై సదరు లావాదేవీలను నిర్వహించే సీఏలు, సీఎస్లు కూడా విచారణ ఎదుర్కొనాల్సి రానుంది. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మే 3న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థిరాస్తుల కొనుగోలు, విక్రయం; క్లయింట్ల డబ్బు, సెక్యూరిటీలు లేదా ఇతర ఆస్తుల నిర్వహణ; బ్యాంక్, సేవింగ్స్ లేదా సెక్యూరిటీస్ అకౌంట్ల నిర్వహణ; కంపెనీల ఏర్పాటు, నిర్వహణ కోసం నిధులు సమీకరించడంలో తోడ్పాటు; వ్యాపార సంస్థల కొనుగోళ్లు, విక్రయం.. మొదలైన అయిదు రకాల ఆర్థిక లావాదేవీలు ఇందులో ఉన్నాయి. పీఎంఎల్ఏ చట్టం 2002ను ప్రయోగించాల్సి వస్తే క్లయింట్ల స్థాయిలోనే సీఏలు కూడా జరిమానా, విచారణ ఎదుర్కొనాల్సి వస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ‘పీఎంఎల్ఏ నిబంధనలను అమలు చేస్తే క్లయింట్లతో సమానంగా సీఏలు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా లావాదేవీ జరిగినట్లుగా భావిస్తే ఆ విషయాన్ని సీఏలు వెంటనే నియంత్రణా సంస్థకు తెలియజేయాలి‘ అని వివరించాయి. రిపోర్టింగ్ అధికారులుగా సీఏలు.. ఆయా లావాదేవీల విషయంలో సీఏలు ఇకపై నియంత్రణ సంస్థలకు తెలియజేయాల్సిన రిపోర్టింగ్ అధికారులుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పేర్కొంది. సదరు లావాదేవీలు నిర్వహించే క్లయింట్లందరి వివరాలను సేకరించి (కేవైసీ), రికార్డులను నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంటుందని తెలిపింది. క్లయింట్ల తరఫున ఏయే ఆర్థిక లావాదేవీలు జరపకుండా నిషేధం ఉందనే దాని గురించి తమ సభ్యుల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఐసీఏఐ వివరించింది. కొత్త మార్పులు సరైన కోణంలో అమలయ్యేలా చూసేందుకు, వృత్తి నిపుణులు పోషించగలిగే పాత్ర అర్థమయ్యేలా వివరించేందుకు నియంత్రణ సంస్థలు, అధికారులతో కలిసి పనిచేయనున్నట్లు ఐసీఏఐ తెలిపింది. నల్లధనం కట్టడికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల పీఎంఎల్ఏ నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు .. రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను రికార్డు చేయడాన్ని తప్పనిసరి చేసింది. అలాగే లాభాపేక్ష రహిత సంస్థల ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు, రిపోర్టింగ్ ఏజెన్సీలు సేకరించాల్సి ఉంటోంది. ఇక వర్చువల్ అసెట్స్ లావాదేవీలు నిర్వహించే క్రిప్టో ఎక్సే్చంజీలు, మధ్యవర్తిత్వ సంస్థలు తమ ప్లాట్ఫామ్లను ఉపయోగించే యూజర్ల వివరాలను సేకరించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. -
అరుణ్పిళ్లైకి 15 కోట్లు ఇచ్చా
సాక్షి, న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరో సంచలన లేఖ విడుదల చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల ఆదేశం మేరకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో రూ.15 కోట్లు ఇచ్చానని అందులో పేర్కొన్నారు. తాను డబ్బులు ఇచ్చింది ఏపీ అలియాస్ అరుణ్పిళ్లైకి అని స్పష్టం చేశారు. సొమ్ము అందినట్లుగా బీఆర్ఎస్ నేత చేసిన మెసేజ్లకు సంబంధించిన పలు స్క్రీన్ షాట్లు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేతకు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కేజ్రీవాల్ను ఉద్దేశించి లేఖ రాసిన సుఖేశ్ దానిని మీడియాకు విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఇది ఆరంభమే..అసలైంది ముందుంది ‘రూ.15 కోట్లు మీ (కేజ్రీవాల్) ఆదేశాల మేరకే అందించానన్న వివరాలు చాట్ రూపంలో స్పష్టంగా ఉన్నాయి. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచించిన టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నేత కూడా సొమ్ములు అందుకున్నట్లు ధ్రువీకరించారు. లిక్కర్ స్కాం కేసులో సౌత్గ్రూప్కు సంబంధించిన టీఆర్ఎస్ నేతతో మీ అనుబంధాన్ని చాట్ స్పష్టంగా వివరిస్తోంది. రూ.15 కోట్లు అలియాస్ 15 కేజీల నెయ్యి ఎవరికి అందించాలో టీఆర్ఎస్ నేత నిర్దేశించిన విధానం కూడా ఇది వివరిస్తుంది. ఆ సూచనల మేరకే ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న బ్లాక్ రేంజ్రోవర్ 6060 నంబరు కలిగిన కారులో నగదు పెట్టెలను అరుణ్పిళ్లైకు అందజేశా. ఆప్, టీఆర్ఎస్, టీఆర్ఎస్ నేత ఏ విధంగా చేతులు కలిపారో, వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు ఎలా చేస్తున్నారో కూడా చాట్ స్పష్టం చేస్తుంది. నేను విడుదల చేస్తున్న ఈ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లు ప్రారంభం మాత్రమే. అసలైంది ముందుంది. టీజర్ కోసం సహచరులతో కలిసి వేచి ఉండండి. మీ అందరితో కలిసి నార్కో పరీక్షలకు సిద్ధం నాపై ఏ కేసు రుజువు కానందున ఎలాంటి వ్యాఖ్యలు చేయకండి. మీ అవినీతి బృందం.. సమస్యను దారి మళ్లించడానికి నా విశ్వసనీయత గురించి మాట్లాడుతోంది. నేను మీ అందరితో కలిసి నార్కో పరీక్షలకు సిద్ధంగా ఉన్నా. 2015–2023 వరకు ప్రతి ప్రకటనకు నా దగ్గర ఆధారం ఉంది. కౌంట్డౌన్ ప్రారంభమైంది. అన్నింటికీ సిద్ధంగా ఉండండి. టీజర్ స్క్రీన్ షాట్–1 విడుదలైన తర్వాత మీరు, మీ స్నేహితుల ఏడుపులు, నిందలు చూడడానికి చాలా ఉత్సుకతతో ఉన్నా. కేజ్రీవాల్ జీ మీ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ నినాదం నా దగ్గర ఉంది. అద్భుతమైన సంగీత బృందంతో సంగీతం కంపోజ్ చేయిస్తున్నా..’ అని సుఖేశ్ పేర్కొన్నారు. -
ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసిన ఈడీ
న్యూఢిల్లీ: దేశంలో అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఐదేళ్లలో 374 మందిని అరెస్టు చేసింది. వీరిలో పలు కార్పొరేట్ సంస్థల డైరెక్టర్లున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభకు ఈ మేరకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ‘‘కార్పొరేట్ మోసాలకు సంబంధించి స్టెర్లింగ్ బయోటెక్ గ్రూప్, విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ తదితరులపై ఈడీ కేసులు పెట్టింది. రూ.33,862.20 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. వీటిలో రూ.15,113 కోట్ల ఆస్తులను ప్రభుత్వ బ్యాంకులు అధీనంలోకి తీసుకున్నాయి. ఈడీ అప్పగించిన ఆస్తులను ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం విక్రయించి రూ.7,975.27 కోట్లు ఆర్జించింది’’ అని మంత్రి వివరించారు. -
మనీలాండరింగ్ ద్వారా ‘స్కిల్’ కుంభకోణం: ఈడీ
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణంలో రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నిర్ధారించింది. అందులో రూ.70 కోట్లు ఎక్కడికి చేరాయో గుర్తించినట్టు తెలిపింది. మిగిలిన మొత్తం ఎక్కడికి చేరిందన్న దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నామని పేర్కొంది. మనీలాండరింగ్ చేస్తూ అక్రమాలకు పాల్పడినట్టు తమ విచారణలో వెల్లడైందని ఈడీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్(చార్టెడ్ అకౌంటెంట్)లను కోర్టు ఆదేశాలతో విచారణ కోసం ఏడురోజుల కస్టడీకి తీసుకున్నట్టు పేర్కొంది. చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్ -
ప్రియాంక గాంధీ పెయింటింగ్కు రూ.2 కోట్లా?.. కాంగ్రెస్పై ఠాకూర్ ఫైర్..
న్యూఢిల్లీ: రూ.2కోట్ల పెయింటింగ్ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి ప్రియాంక గాంధీకి పలు ప్రశ్నలు సంధించారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. యస్ బ్యాంక్ కో-ఫౌండర్ రాణా కపూర్ను ప్రియాంక వద్ద ఉన్న పెయింటింగ్ను రూ.2 కోట్లు పెట్టి కొనాలని ఎవరు బలవంతం చేశారని నిలదీశారు. ఇలా ఎన్ని పెయింటింగ్లను అమ్మారు? ఈ డబ్బు తీసుకుని ప్రతిఫలంగా పద్మభూషణ్ అవార్డులు ఇచ్చారా? ఇలా ఎంత డబ్బు సేకరించారు, ఎన్ని అవార్డులు ఇచ్చారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మనీలాండరింగ్, ఉగ్ర నిధులపై నిఘా వహించే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(FATF) ఓ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారత్లో ఓ ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి పెయింటింగ్ను రూ.2కోట్లు పెట్టి ఓ బ్యాంక్ సీఈఓ కొనుగోలు చేశారని, మనీ లాండరింగ్ ద్వారా ఈ లావాదేవీ జరిగిందని నివేదిక చెప్పింది. ఈ సమయంలో కేంద్రంలో కాంగ్రెసే అధికారంలో ఉంది. అయితే పార్టీ పేరును గానీ, పెయింటింగ్ కొనుగోలు చేసిన వ్యక్తి పేరును గానీ నివేదికలో ఎక్కడా ప్రస్తావించలేదు. అతని పేరు 'మిస్టర్ ఏ' అని మాత్రమే పేర్కొంది. అతను బ్యాంక్ సీఈఓగా ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీలకు కూడా రూ.వేల కోట్ల రుణాలు ఇచ్చాడని తెలిపింది. అయితే ఎస్ బ్యాంకు మాజీ సీఈఓ రానా కపూర్ రూ.2 కోట్లు పెట్టి ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ను ప్రియాంక గాంధీ నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు ఒప్పుకున్నాడని ఈడీ ఛార్జిషీట్లో పేర్కొంది. ఈ డబ్బును గాంధీ కుటుంబం సోనియా గాంధీకి న్యూయార్క్లో చికిత్స కోసం ఉపయోగించిందని ఆయన చెప్పినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఏటీఎఫ్ నివేదిక అనంతరం అనురాగ్ ఠాగూర్ కాంగ్రెస్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ కుటుంబం అవినీతిలో రోజుకో కొత్త మోడల్ బయటపడుతోందని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నేషనల్ హెరాల్డ్, వాద్రా ల్యాండ్ స్కామ్, ఇప్పుడు పెయింటింగ్ వ్యవహారం బయటపడిందని విమర్శించారు. గాంధీ కుటుంబం అవినీతి కథను ఓ కేస్ స్టడీగా ప్రపంచానికి తెలియజేశారని ఎద్దేవా చేశారు. #WATCH | "My question to Priyanka Gandhi is who forced Rana Kapoor to pay Rs 2 cr bribe to purchase a painting? Who is Mr R who was involved, whether it was painting for Padma Bhushan? How many Padma awards, paintings were sold & money was raised?": Union minister Anurag Thakur pic.twitter.com/FcFg5QYu0q — ANI (@ANI) March 13, 2023 చదవండి: భారత ప్రజాస్వామ్యం గురించి లండన్లో ప్రశ్నలా? రాహుల్కు మోదీ చురకలు -
రాజకీయాలతో ప్రమేయమున్నా పీఎంఎల్ఏ పరిధిలోకి..
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాజకీయాలతో ప్రమేయమున్న వ్యక్తుల (పీఈపీ) ఆర్థిక లావాదేవీలను కూడా రిపోర్టింగ్ సంస్థలు (బ్యాంకులు, ఆర్థిక సంస్థలు మొదలైనవి) తప్పనిసరిగా రికార్డు చేసేలా పీఎంఎల్ఏ చట్టానికి సవరణలు చేసింది. అలాగే, లాభాపేక్ష రహిత సంస్థల (ఎన్జీవో) ఆర్థిక లావాదేవీల సమాచారాన్ని కూడా ఆర్థిక సంస్థలు సేకరించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు లేదా దేశాధినేతలు, సీనియర్ రాజకీయ నేతలు, సీనియర్ ప్రభుత్వ ..న్యాయ .. మిలిటరీ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, కీలకమైన రాజకీయ పార్టీల అధికారులు పాటు ఇతర దేశాల తరఫున ప్రభుత్వపరమైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీఈపీల పరిధిలోకి వస్తారని ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. ఆర్థిక సంస్థలు తమ ఎన్జీవో క్లయింట్ల వివరాలను నీతి ఆయోగ్కి చెందిన దర్పణ్ పోర్టల్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆయా క్లయింట్లతో వ్యాపార సంబంధాలు ముగిసిన తర్వాత కూడా అయిదేళ్ల పాటు రికార్డులను అట్టే పెట్టాల్సి ఉంటుంది. ఈ సవరణ కారణంగా పీఈపీలు, ఎన్జీవోల ఆర్థిక లావాదేవీల రికార్డులను రిపోర్టింగ్ సంస్థలు తమ దగ్గర అట్టే పెట్టుకోవడంతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినప్పుడు వాటిని అందించాల్సి ఉండనుంది. ఇప్పటివరకూ రిపోర్టింగ్ సంస్థలు తమ క్లయింట్ల గుర్తింపు ధృవీకరణ పత్రాలు, వ్యాపారపరమైన ఉత్తర ప్రత్యుత్తరాలు, అకౌంటు ఫైళ్లూ, రూ. 10 లక్షల పైబడిన నగదు లావాదేవీలు మొదలైన వివరాలను రికార్డు చేయాల్సి ఉంటోంది. ఇకపై క్లయింట్ల రిజిస్టర్డ్ ఆఫీసు చిరునామా, కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రదేశం వంటి వివరాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. -
జైలులోనే ప్రపోజ్ చేశాడు.. బుల్లితెర నటి సంచలన ఆరోపణలు
రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో కాన్మన్ సుకేశ్ చంద్రశేఖర్పై బాలీవుడ్ తారల ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అతనిపై నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తీవ్ర ఆరోపణలు చేయగా.. తాజాగా మరోనటి అతనిపై విమర్శలు చేసింది. తీహార్ జైలులో ఉన్నప్పుడు సుకేశ్ చంద్రశేఖర్ తనకు ప్రపోజ్ చేశాడని నటి చాహత్ ఖన్నా ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు తీహార్ జైలు వీడియోతో తనను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 లక్షల డిమాండ్ చేశారని చాహత్ పేర్కొన్నారు. సుకేశ్ చంద్రశేఖర్ మనీలాండరింగ్ కేసు విచారణ సమయంలో ప్రముఖంగా వినిపించిన బుల్లితెర నటి పేరు చాహత్ కన్నా. దీంతో ఆమె సుకేశ్ తనను మోసం చేశాడని.. తీహార్ జైలులోనే తనకు ప్రపోజ్ చేశాడని పేర్కొంది. ఎంజెల్ నన్ను మోసం చేసింది సుకేశ్ సహాయకురాలు పింకీ ఇరానీ తనను ఏంజెల్ ఖాన్గా పరిచయం చేసుకుని.. దిల్లీలో ఓ స్కూల్ ఈవెంట్కు తనను ఆహ్వానించినట్లు చాహత్ చెప్పారు. అయితే ఆమె తనను దిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా తీహార్ జైలుకు తీసుకువెళ్లిందని.. అక్కడ ఆమె సుకేష్ను కలిసిందని చెప్పింది. ఏంజెల్ తనకు డబ్బు, ఖరీదైన బహుమతులు ఆశ చూపిందని పేర్కొంది. అయితే ఆ తర్వాత కొంతమంది తెలియని వ్యక్తులు తనను బ్లాక్ మెయిల్ చేశారని ఆమె వెల్లడించింది. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశాడు తనను తీహార్ జైలుకు తీసుకెళ్లినప్పుడు విడిచిపెట్టమని ఏంజెల్ను వేడుకున్నానని చాహత్ తెలిపారు. తీహార్ జైలులోని ఒక చిన్న గదికి తనను తీసుకెళ్లి.. ఖరీదైన ల్యాప్టాప్లు, వాచీలు, లగ్జరీ బ్యాగ్లు ఆశ చూపారని వెల్లడించింది. 'బడే అచ్ఛే లాగ్తే హై' సిరీస్ చూసిన తర్వాత నేను మీ అభిమానిగా మారానని సుకేశ్ అన్నాడని చాహత్ తెలిపింది. సుకేశ్ మోకాళ్లపై నిలబడి వివాహం చేసుకోవాలని తనకు ప్రపోజ్ చేశాడని వివరించింది. చాహత్ ఖన్నా మాట్లాడుతూ..' నాకు పెళ్లయింది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతనితో గట్టిగా అరిచా. నేను చాలా ఆందోళన చెందా. ఆ తర్వాత నేను ఏడవటం మొదలుపెట్టా.'ఆమె నటి చాహత్ పేర్కొంది. -
‘ఈడీ దర్యాప్తు పరిధి.. ఇదే’.. కీలక తీర్పు వెలువరించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ‘‘ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి కేవలం నగదు అక్రమ ప్రవాహ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 3లో పేర్కొన్న నిర్వచనం పరిధిలోకి వచ్చే మనీ లాండరింగ్ నేరాలపై విచారణ, దర్యాప్తు చేసే అధికారాలు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప సదరు నేరానికి సంబంధించిన ఇతర అభియోగాలు, అక్రమాలపై విచారణ జరిపే పరిధి ఈడీకి లేదు’’ అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అలాంటి వాటిపై విచారణ జరపడం ఇతర అధీకృత సంస్థల బాధ్యత అని స్పష్టం చేసింది. తన విచారణలో భాగంగా అలాంటి ఇతర నేరాలకు సంబంధించి సాక్ష్యాధారాలు లభిస్తే దర్యాప్తు నిమిత్తం వాటిని సంబంధిత సంస్థలకు అందజేయాలని న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన తీర్పులో పేర్కొన్నారు. -
రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురుదెబ్బ
జోద్పూర్: భూమి కొనుగోలు వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు రాజస్తాన్ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తును నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం గురువారం తిరస్కరించింది. అయితే, ఆయనకు కొంత ఊరట కల్పించింది. ఇదే కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్ వ్యవహారంలో రాబర్ట్ వాద్రాను అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన స్టేను మరో నాలుగు వారాలు పొడిగించింది. స్కై లైట్ హాస్పిటాలిటీ అనే సంస్థ రాజస్తాన్లోని బికనేర్లో 41 ఎకరాలకు పైగా భూమిని కొనుగోలు చేసింది. ఈ సంస్థతో రాబర్ట్ వాద్రాకు, ఆయన తల్లి మౌరీన్ వాద్రాకు సంబంధాలు ఉన్నట్లు ఈడీ చెబుతోంది. భూకొనుగోలులో మనీ ల్యాండరింగ్ జరిగిందని, ఇందులో రాబర్ట్ వాద్రా పాత్ర ఉన్నట్లు గుర్తించింది. -
లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి.. బీజేపీ మనీలాండరింగ్ ఆరోపణ
కోల్కతా: లాటరీలో ఓ ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్పాట్ తగిలింది. అయితే, అది లాటరీ పేరుతో మనీలాండరింగ్కి పాల్పడటమేనని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్లో జరిగింది. టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య లాటరీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈ క్రమంలో బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విటర్ వేదికగా విమర్శలు గప్పించారు. లాటరీ ద్వారా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మనీలాండరింగ్(అక్రమ నగదు బదిలీ)కి పాల్పడుతోందని ఆరోపంచారు. ‘టీఎంసీకి, లాటరీ సంస్థకు మధ్య సంబంధాలు ఉన్నాయని నేను చెబుతూనే ఉన్నాను. మనీలాండరింగ్కు పాల్పడేందుకు ఇది సులభమైన మార్గం. సామాన్య ప్రజలు టికెట్లు కొంటారు. కానీ, టీఎంసీ నేతలు బంపర్ ప్రైజ్ గెలుస్తారు. తొలుత అనుబ్రాత మొండల్ ఈ జాక్పాట్ గెలిచారు. ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యే వివేక్ గుప్తా భార్య కోటి రూపాయలు గెలచుకున్నారు.’ - సువేందు అధికారి, బీజేపీ నేత ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసినట్లు చెప్పారు సువేందు అధికారి. డియర్ లాటరీకి బెంగాల్లో పెద్ద మార్కెట్ ఉందని, అయితే, లాటరీలు అక్రమమని పేర్కొన్నారు. లాటరీని అక్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.. దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపారు. మరోవైపు.. సువేందు అధికారి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే వివేక్ గుప్తా. తన భార్యపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. I've been saying this all along, that Dear (Bhaipo) Lottery & TMC have a tangled relationship. It's an easy way to launder money. Common people buy tickets but TMC leaders win bumper prize. First Anubrata Mondal won the jackpot & now TMC MLA Vivek Gupta's wife has won 1 crore: pic.twitter.com/owtdGOk6xD — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 27, 2022 ఇదీ చదవండి: ఆజంఖాన్ ఖాన్కు షాక్.. శాసనసభ్యత్వం రద్దు -
లిక్కర్ స్కామ్లో సమీర్ మహేంద్రు అరెస్టు.. నెక్స్ట్ ఎవరు?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బిజినెస్మేన్ సమీర్ మహేంద్రును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. ఇండోస్పిరిట్ సంస్థ ఎండీ అయిన ఆయనను ఇంట్లో కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అనంతరం బుధవారం ఉదయం అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు ఎఫ్ఐఆర్లో సమీర్ పేరును కూడా సీబీఐ చేర్చిన విషయం తెలిసిందే. ఈ స్కీం అమలు, అవకతవకల్లో ఆయన పాత్ర కూడా ఉందని అభియోగాలున్నాయి. కాగా.. లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏఎంఎల్ కంపెనీ సీఈఓ విజయ్ నాయర్ను అరెస్టు చేసిన మరునాడే సమీర్ను అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. అర్జున్ పాండే అనే వ్యక్తి మహేంద్రు నుంచి రూ.2కోట్ల నుంచి 4కోట్ల వరకు తీసుకున్నాడని, అతను విజయ్ నాయర్ మనిషి అని సీబీఐ ఎఫ్ఐర్లో పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి సెప్టెంబర్ 7న దేశవ్యాప్తంగా 35 చోట్ల తనిఖీలు నిర్వహించింది ఈడీ. సమీర్ మహేంద్రు నివాసాల్లోనూ సోదాలు చేసింది. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చిన విషయం తెలిసిందే. ఆయన నివాసంతో పాటు బ్యాంకు లాకర్లలోనూ అధికారులు తనఖీలు నిర్వహించారు. అయితే ఈడీ, సీబీఐకి తన వద్ద ఒక్క ఆధారం కూడా లభించలేదని, కావాలనే తనపై తప్పుడు కేసు పెట్టారని సిసోడియా బీజేపీపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. పీఎఫ్ఐపై నిషేధం -
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు ముమ్మరం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఎక్సైజ్ పాలసీ అమలుకు సంబంధించిన అవినీతి వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం ముగ్గురు నిందితులను తమ ప్రధాన కార్యాలయానికి రప్పించి, ప్రశ్నించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. పూర్తి వివరాలను అధికారులు బహిర్గతం చేయడం లేదు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సహా మొత్తం 15 మంది పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చిన సంగతి తెలిసిందే. సీబీఐ శనివారం కొందరు నిందితులకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం మనీశ్ సిసోడియా నివాసం సహా వివిధ ప్రాంతాల్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నన్లు అధికారులు చెప్పారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరికొందరు నిందితులకు సమన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు. వారందరినీ పిలిపించి, లిక్కర్ కుంభకోణంపై లోతుగా విచారిస్తామని అన్నారు. ఈ కుంభకోణంలో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సైతం దృష్టి పెట్టింది. ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని సీబీఐ.. ఈడీకి అందజేసింది. -
జైలు నుంచే అక్రమాలు.. లక్షల్లో ముడుపులు.. దిమ్మ తిరిగే షాకింగ్ విషయాలు
ఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అరెస్టై జైలుకు వెళ్లినా క్రమంలో.. అక్కడి నుంచే అన్ని కార్యక్రమాలు నడిపించాడు. అందుకోసం ఢిల్లీ రోహిణి జైలులోని 81మంది అధికారులకు సుకేష్ భారీగా లంచాలు ఇచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత సుకేష్ను తిహార్ జైలుకు మార్చారు. ఇలా సుకేశ్ నుంచి లంచాలు పుచ్చుకున్న అధికారులు అతడికి సకల మర్యాదలు చేసినట్లు సమాచారం. జైలు బయట ఉన్న తన అనుచరులతో మాట్లాడేందుకు మొబైల్ ఫోన్ వంటివి అందించినట్లు దిల్లీ పోలీస్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓడబ్ల్యూ) తేల్చింది. సుకేష్ నుంచి ముడుపులు అందుకున్న జైలు అధికారులపై కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. తన భార్య లీనాతో ఉండేందుకు ఒక్క రాత్రికే జైలు అధికారులకు సుమారు రూ.60 లక్షల నుంచి రూ.75 లక్షల వరకు సుకేష్ ఇచ్చినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. ఇటీవలే జైలు ఆసుపత్రికి వెళ్లిన సుకేశ్.. అక్కడి నర్సింగ్ స్టాఫ్ సాయంతో అనుచరులతో మాట్లాడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ దిశగానూ ఆర్థిక నేరాల విభాగం విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా.. తిహార్ జైలులో తమకు ప్రాణహాని ఉందని, దిల్లీ వెలుపలి జైలుకు తమని తరలించాలని గత నెలలో సుప్రీం కోర్టును ఆశ్రయించాడు సుకేష్, ఆయన భార్య లీనా. జైలులో తమకు సాయం చేసినట్లు అనుమానిస్తున్న అధికారుల నుంచే తమకు ముప్పు ఉందని కోర్టుకు విన్నవించారు. దిల్లీ బయటి జైలుకు తమని మార్చాలని కోరారు. 2017లో ఎన్నికల సంఘం అధికారులకు లంచం కేసుకు సంబంధించిన మరో మనీలాండరింగ్ కేసులో గత ఏప్రిల్ 4న సుకేష్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అయితే.. ఇప్పటే ఆరోగ్య విభాగం ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్ సహా పలువురు ప్రముఖ వ్యక్తులను మోసం చేసి కోట్ల రూపాయలు కాజేసిన నేరం కింద అరెస్టై జైలు జీవితం అనుభవిస్తున్నాడు సుకేష్. ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సహా పలువురు మోడల్స్ను ఈడీ ప్రశ్నించింది. ఇదీ చదవండి: జాక్వెలిన్కి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర -
బ్లాక్ లిస్ట్ నుంచి పాక్ బయటపడనుందా?
FATF kept Pakistan on the grey list: ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) పాకిస్తాన్ని గ్రే లిస్ట్(బ్లాక్ లిస్ట్)లో ఉంచిన సంగతి తెలిసిందే. ఐతే ఇప్పుడు తాజాగా పాక్ త్వరలోనే ఆ గ్రే లిస్ట్ నుంచి బయటపడునుందని పాక్ విదేశాంగ వ్యవహారాల మంత్రి హీనా రబ్బానీ ఖార్ చెబుతున్నారు. అంతేకాదు ఆ బ్లాక్లిస్ట్ నుంచి బయటపడేందకు పాక్ కేవలం ఒక అడుగు దూరంలోనే ఉన్నట్లు తెలిపారు. 2018 నుంచి ఎఫ్ఏటీఎఫ్ పాక్ని బ్లాక్లిస్ట్లో ఉంచింది. అప్పటి నుంచి ఇస్లామాబాద్ బయటపడేందకు పలు రకాలుగా కృషి చేసింది. ఈ మేరకు ఎఫ్ఏటీఎఫ్ తీవ్రవాదం, మనీలాండరింగ్కు సంబంధించిన ఫైనాన్సింగ్ విషయాల్లో సాధించిన పురోగతిని ధృవీకరించింది. అంతేకాదు గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ను రక్షించడానికి జీ7 దేశాలు ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ క్రైమ్ వాచ్డాగ్ పాక్ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన మొత్తం 34 అంశాలను కవర్ చేస్తూ.. రెండు కార్యాచరణ ప్రణాళికలను గణనీయంగా పూర్తి చేసింది. దీపిలె భాగంగా అక్టోబర్లో జరిగే తదుపరి ఎఫ్ఏటీఎఫ్ సమావేశాని కంటే ముందే ఇస్లామాబాద్లో పర్యటించనున్నట్లు ఎఫ్ఏటీఎప్ తెలిపింది. ఆ పర్యటనలో ఇస్లామాబాద్లో ఉగ్రవాదం, మనీలాండరింగ్ సంబంధించిన ఆర్థిక విషయాల్లో ఏర్పాటు చేసిన చట్టాలు, తీసుకుంటున్న చర్యలను గురించి ఎఫ్ఏటీఎప్ తనీఖీలు చేయనున్నట్లు పేర్కొంది ఈ క్రమంలో పాక్ విదేశాంగ మంత్రి హీనా రబ్బానీ ఖార్ మాట్లాడుతూ...ఈ జాబితా నుంచి పాక్ కచ్చితంగా తప్పుకుంటుందని విశ్వసిస్తున్నాం. పాక్లో త్వరలో కొత్త సంస్కరణ జరుగుతాయి. ఇది ఒక రకంగా పాక్ ఆర్థిక వ్యవస్థ పై విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది. గ్రే లిస్ట్ నుంచి నిష్క్రమించడం వల్ల విదేశీ పెట్టుబడులు, పెరుగడమే కాకుండా, ఐఎంఎప్ రుణాలను కూడా పొందగలుగుతుంది. మళ్లీ పాక్ ఇలాంటి గ్రే లిస్ట్లోకి వెళ్లకుండా తగు చర్యలు తీసుకుంటాం " అని అన్నారు. (చదవండి: నీతో కలిసి ఉండటం నా వల్ల కాదు, గుడ్బై!) -
మహారాష్ట్ర తలవంచదు
ముంబై: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడికి శివసేన సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ లేఖ రాశారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వాన్ని కూల్చేందుకు సహకరించాలంటూ కొందరు వ్యక్తులు దాదాపు నెల రోజుల క్రితం తనను సంప్రదించాలని లేఖలో పేర్కొన్నారు. సహకరించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావాలన్నదే వారి ఉద్దేశమని తెలిపారు. అలాగే ట్విట్టర్లో శివసేన గుర్తు పులి ఫొటోను పోస్టు చేశారు. జుఖేంగే నహీ.. జై మహారాష్ట్ర (మహారాష్ట్ర తలవంచదు) అని ట్వీట్ చేశారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఏ ప్రభుత్వం పూర్తికాలం.. ఐదేళ్లూ అధికారంలోకి కొనసాగుతుందని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)తోపాటు కేంద్ర దర్యాప్తు సంస్థలను దురుద్దేశపూర్వకంగా ప్రయోగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎంవీఏ సర్కారు ఏర్పాటైన తర్వాత శివసేన నాయకులను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని ఉపరాష్ట్రపతికి రాసిన లేఖలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యులపై వేధింపులను అడ్డుకోవాలని కోరారు. ఈ విషయంలో ఉపరాష్ట్రపతి స్పందించాలని, తగిన చర్యలు తీసుకోవాలని సంజయ్ రౌత్ విన్నవించారు. ఉపరాష్ట్రపతికి తాను రాసిన లేఖ ఒక ట్రైలర్ మాత్రమేనని సంజయ్ రౌత్ అన్నారు. బీజేపీ క్రిమినల్ సిండికేట్ను ముందుండి నడిపిస్తున్న ఈడీ అధికారులు బాగోతం బయటపెడతానని తేల్చిచెప్పారు. మనీ ల్యాండరింగ్ పేరిట వేధింపులు మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద నాతో పాటు మరో ఇద్దరు మహారాష్ట్ర మంత్రులను జైలుకు పంపిస్తామని బెదిరించారని తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన నాయకులందరినీ జైలుకు పంపితే మధ్యంతర ఎన్నికలు వస్తాయని వారు భావించారని చెప్పారు. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం 2003 జనవరి 17న అమల్లోకి వచ్చిందని గుర్తుచేశారు. కానీ, అంతకంటే ముందు జరిగిన డబ్బు లావాదేవీలు కూడా మనీ ల్యాండరింగే అంటూ కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని, వేధింపులకు దిగుతున్నాయని ఆరోపించారు. 2012–13లో తనకు, తన కుటుంబ సభ్యులకు భూమిని విక్రయించిన వారిని ఈడీ బెదిరిస్తోందని, తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని హుకుం జారీ చేస్తోందని ధ్వజమెత్తారు. తన కుమార్తె పెళ్లిలో అలంకరణ పనులు చేసిన వారిని సైతం వెంటాడుతోందని, నేను వారికి రూ.50 లక్షలు ఇచ్చినట్లుగా ప్రకటన చేయాలని భయపెడుతోందని దుయ్యబట్టారు. తనకు సంబం« దించిన ఈడీ, ఇతర దర్యాప్తు సంస్థలు 28 మందిని అదుపులోకి తీసుకొని, ప్రశ్నించాయన్నారు. ఈడీ కనుసన్నల్లో అక్రమాలు స్వేచ్ఛగా భావాలను వెల్లడించే హక్కు తనకుందని, ఆ హక్కుపై దర్యాప్తు సంస్థలు దాడి చేస్తున్నట్లుగా భావిస్తున్నానని సంజయ్ రౌత్ చెప్పారు. సిండికేట్, బ్లాక్మెయిలింగ్, మనీ ల్యాండరింగ్ వంటి అక్రమ వ్యవహారాలు ఈడీ కనుసన్నల్లో సాగుతున్నాయని ఆరోపించారు. తనను జైలుకు పంపిస్తే వెళ్తానని, తన తర్వాత బీజేపీ నాయకులు కూడా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని తేల్చిచెప్పారు. తాము ఎలాంటి తప్పులు చేయలేదని, బీజేపీ నేతలే ఎన్నో పాపాలు చేశారని అన్నారు. తాము భయపడతామని అనుకుంటే అది పొరపాటేనని వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ఎవరు సాయం అడిగారని ప్రశ్నించగా... దానిపై త్వరలో మాట్లాడతానని సంజయ్ రౌత్ బదులిచ్చారు. అది ఢిల్లీ, ముంబైకి చెందిన నాయకుల ఉమ్మడి కుట్ర అని పేర్కొన్నారు. గత ఏడాది ఉప ఎన్నికలో దాద్రా నగర్ హవాలీ ఎంపీ సీటును శివసేన గెలుచుకుందని, అప్పటి నుంచి తమ పార్టీకి ఇక్కట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో మహారాష్ట్రలో బీజేపీదే అధికారం మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్రలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. మార్చి 10న ఫలితాలు బహిర్గతమైన తర్వాత మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం మళ్లీ రావడం తథ్యమని జోస్యం చెప్పారు. శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని విమర్శించారు. -
గతంలోనూ ఇలానే..
సాక్షి, అమరావతి: జగతి పబ్లికేషన్స్ లిమిటెడ్ ఆస్తుల జప్తు చట్టబద్ధం కాదని 2018లోనే మనీ లాండరింగ్ నిరోధక అప్పిలేట్ ట్రిబ్యునల్ తేల్చి చెప్పింది. ఆ ఉత్తర్వులు చట్ట నిబంధనలకు అనుగుణంగా లేనందున, వాటిని ఎత్తివేస్తున్నట్లు అప్పట్లోనే స్పష్టం చేసింది. ఆస్తుల జప్తుపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వులను, ఆ ఉత్తర్వులను సమర్థిస్తూ ఈడీ అడ్జుడికేటింగ్ అథారిటీ జారీ చేసిన ఉత్తర్వులను మనీ లాండరింగ్ నిరోధక అప్పిలేట్ ట్రిబ్యునల్ 2018 ఫిబ్రవరి 13న తప్పు పట్టింది. ఈడీ తాత్కాలిక జప్తు ఉత్తర్వులను, అడ్జుడికేటింగ్ అథారిటీ ఉత్తర్వులను ట్రిబ్యునల్ రద్దు చేసింది. ఆ ఆస్తులను అన్యాక్రాంతం చేయవద్దని హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో వాటి జప్తు ఎంతమాత్రం అవసరం లేదని చెప్పింది. చార్జ్షీట్లోని ఆరోపణలను మనీ లాండరింగ్ చట్టం కింద నేరంగా భావించలేమని స్పష్టం చేసింది. -
నా కమీషన్ ఇప్పించండి
లండన్: భారత్లో మనీ ల్యాండరింగ్, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధాల కొనుగోలు మధ్యవర్తి సంజయ్ భండారీ పదేళ్ల క్రితం నాటి తన కమీషన్ సొమ్ము ఇప్పించండంటూ బ్రిటన్ కోర్టును ఆశ్రయించారు. భారత వాయుసేనకు చెందిన మిరాజ్–2000 రకం యుద్ధవిమానాల నవీకరణ కాంట్రాక్ట్.. ఫ్రాన్స్ దేశానికి చెందిన ఆయుధాల సంస్థ ‘థేల్స్ గ్రూప్’కు దక్కేలా మధ్యవర్తిగా వ్యవహరించానని ఆయన కోర్టులో పేర్కొన్నారు. 2008 నుంచీ థేల్స్ కోసం పనిచేస్తున్నానని, అధునాతన మిరాజ్ విమానాలను భారత్కు విక్రయించేలా మధ్యవర్తిత్వంలో భాగంగా నాటి భారత రక్షణ శాఖ ఉన్నతాధికారితో భేటీని ఏర్పాటుచేశానని పిటిషన్లో ప్రస్తావించారు. భారత్ ప్రతిష్టాత్మంగా కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలను తయారుచేసే దసాల్ట్ ఏవియేషన్కు థేల్స్ సంస్థే కీలకమైన ‘ఏవియోనిక్స్’ ఉపకరణాలను సరఫరా చేస్తుండటం గమనార్హం. 2.4 బిలియర్ యూరోల(దాదాపు రూ.20వేల కోట్ల) విలువైన మిరాజ్ కాంట్రాక్ట్లో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మొత్తంగా 2 కోట్ల యూరోలు(దాదాపు రూ.167 కోట్లు) ఇస్తానని థేల్స్ సంస్థ హామీ ఇచ్చిందని, కానీ కేవలం 90 లక్షల యూరోలే(దాదాపు రూ.75 కోట్లు) ఇచ్చి చేతులు దులిపేసుకుందని ఆయన వెల్లడించారు. సంస్థ నుంచి మిగతా కమిషన్ ఇప్పించాలని ఆయన పారిస్ సమీపంలోని నాంటయర్లోని ‘ట్రిబ్యునల్ డీ కామర్స్’ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని బ్రిటన్కు చెందిన ‘ది డైలీ టెలిగ్రాఫ్’ వార్తా సంస్థ ఇటీవల ఒక కథనం ప్రచురించింది. భారత వాయుసేనకు రఫేల్–బి, రఫేల్–సి రకం యుద్ధవిమానాల సరఫరాకు సంబంధించిన చర్చల్లో ఫ్రాన్స్ కన్షార్షియంలో థేల్స్ ఉంది. యూపీఏ హయాంలో యుద్ధవిమానాల ఆధునికీకరణ ఒప్పందం వేళ భండారీకి, కాంగ్రెస్కు సత్సంబంధాలు కొనసాగాయని బీజేపీ ఆరోపించింది. రక్షణ కొనుగోళ్లు జరిగిన ప్రతీసారి ముడుపులపై కాంగ్రెస్ దృష్టిపెట్టిందని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా వ్యాఖ్యానించారు. ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, భండారీ మంచి మిత్రులని ఆరోపించారు. -
జాక్వెలిన్కి ఖరీదైన గిఫ్ట్లు ఇవ్వడంలో సుకేశ్ భార్యదే కీలక పాత్ర
Actors Jacqueline Fernandez and Nora Fatehi:మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటీమణులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలకు ఐఫోన్ నుండి బిఎమ్డబ్ల్యూ కారు వంటి ఖరీదైన బహుమతులను అదించడంలో అతని భార్య లీనా మారియా పాల్ ప్రధాన పాత్ర పోషించినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్లో పేర్కొంది. అంతేకాదు దర్యాప్తులో ఆ ఇదరూ బాలీవుడ్ నటులు సుకేష్ నుండి అందుకున్న బహుబమతులు గురించి వివరించారు. (చదవండి: ‘మనకెందుకులే’ అని వదిలేయలేదు.. కోతికి ఊపిరి పోశాడు) అయితే ఫెర్నాండెజ్తో స్నేహం చేయడానికి సుకేశ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కార్యాలయ నంబర్ను "స్పూఫ్" కాల్ చేయగా, నోరా ఫతేహిని అతని భార్య ద్వారా పరిచయం చేసుకున్నట్లు వెళ్లడించింది. ఈ మేరకు ఈడీ విచారణలో నోరాకి సుకేశ్ బీఎండబ్ల్యూ కారు, అతని భార్య లీనా ఖరీదైన బ్యాగ్, ఐఫోన్ వంటి బహుమతులను ఇచ్చినట్లు చెప్పారు. అంతేకాదు ఈ ఏడాది రెండుసార్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన ఫెర్నాండెజ్, సుకేశ్ నుండి రూ. 52 లక్షల విలువైన గుర్రం, రూ. 9 లక్షల విలువైన పెర్షియన్ పిల్లి, మల్టి స్టోన్ చెవిపోగులు, బహుమతులతో పాటు 1.5 లక్షల డాలర్ల రుణాన్ని తీసుకున్నట్లు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే సుమారు 14మందిని మోసం చేసి 200కోట్లు కాజేశాడని సుకేశ్పై ఉన్న అభియోగాల నేపథ్యంలో ఈ ఇద్దరు బాలీవుడ్ నటీమణులను ఈడీ విచారించింది. (చదవండి: 77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!) -
గుట్టుగా కోర్టుకు సుజనా
సాక్షి ప్రతినిధి, చెన్నై: మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో భారతీయ జనతా పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి కోర్టుకు హాజరయ్యారు. తప్పుడు పత్రాలను సమర్పించి బ్యాంకుల నుంచి వందలకోట్ల రూపాయలను రుణాలుగా పొంది ఎగవేయడంతో ఈడీ ఈ కేసు నమోదు చేసింది. చెన్నై జిల్లా కోర్టు ప్రాంగణంలో ఉన్న ప్రజాప్రతినిధుల కోర్టుకు సుజనా చౌదరి శనివారం ఉదయం 11.10 గంటలకు న్యాయవాదులు, మరికొందరితో కలిసి వచ్చారు. ఈ కేసులో ఆయన ఆరో నిందితునిగా ఉన్నారు. గతంలో ఇదే కేసులో ఆయన వివిధ కారణాలతో దాదాపు పలుమార్లు విచారణకు గైర్హాజరయ్యారు. తాజాగా అక్టోబర్ 29న చెన్నైలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టుకు సుజనా హాజరుకావాల్సి ఉండగా.. ఆ రోజు కూడా ఆయన రాలేదు. శనివారం మందీ మార్బలంతో ఆయన కోర్టుకు చేరుకున్నారు. ఉదయం సుమారు 11.20 నిమిషాలకు లోనికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం 12.45 గంటలకు బయటకు వచ్చారు. ప్రత్యేక అనుమతితో అత్యంత గోప్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన సుజనాకు ఈ కేసులో వెనువెంటనే బెయిల్ మంజూరయినట్లు తెలిసింది. దౌర్జన్యంగా వీడియో దృశ్యాల తొలగింపు కాగా సుజనాచౌదరి కోర్టు మొదటి అంతస్తులోకి న్యాయవాదులతో కలిసి వస్తున్న దృశ్యాలను ‘సాక్షి’ ప్రతినిధి సెల్ఫోన్లో వీడియో తీశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సుజనా వాటిని తొలగించాల్సిందిగా న్యాయవాదులను పురమాయించారు. నలుగురు న్యాయవాదులు సాక్షి ప్రతినిధిని చుట్టుముట్టి సెల్ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను తొలగించాల్సిందిగా కోరారు. మీ విధులు మీరు నిర్వర్తిస్తున్నట్లే.. నా విధులు నిర్వర్తించడం నా కర్తవ్యం, అడ్డుకునే హక్కు మీకు లేదని విలేకరి వాదించినా వినిపించుకోలేదు. దౌర్జన్యంగా సెల్ఫోన్ను లాక్కుని మరీ వీడియోను డిలీట్ చేశారు. -
Karvy Case: ‘కార్వీ ’ నిందితుల ఇళ్లలో ఈడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: కార్వీ స్టాక్ బ్రోకింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (కేఎస్బీఎల్) వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. మదుపరుల షేర్లను వారి అనుమతి లేకుండా బ్యాంకుల్లో తాకట్టు పెట్టి తీసుకున్న రూ.వందల కోట్ల రుణాలు షెల్ కంపెనీలకు మళ్లించడంలో భారీగా మనీల్యాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ స్కామ్పై సీసీఎస్ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ముందుకెళ్తున్న ఈడీ.. ఇప్పటికే కార్వీ చైర్మన్ సి.పార్థసారథిని జైల్లో విచారించింది. తాజాగా బుధవారం ఏకకాలంలో హైదరాబాద్తోపాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై, చెన్నైల్లో ఉన్న కార్వీ, అనుబంధ సంస్థల కార్యాలయాలతోపాటు ఇప్పటికే అరెస్టు అయిన ఐదుగురు నిందితుల ఇళ్లల్లో ఈడీ బృందాలు సోదాలు చేశాయి. ఐసీఐసీఐ, ఇండస్ఇండ్ తదితర బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను కార్వీ 9 షెల్ కంపెనీల్లోకి మళ్లించిన వ్యవహారంపై కీలక పత్రాలు స్వా«దీనం చేసుకున్నట్టు తెలిసింది. అటు బెంగళూరు పోలీసులు సైతం తమ వద్ద నమోదైన కేసు విచారణ వేగవంతం చేశారు. ఆ కేసులో పార్థసారథిని మూడు రోజులు విచారించనున్నారు. రూ.3 వేల కోట్ల స్కాం కార్వీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజీవ్ రంజన్ సింగ్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జి.కృష్ణ హరి, కంపెనీ సెక్రటరీ వై.శైలజ, రిస్క్ హెడ్గా ఉన్న వైస్ ప్రెసిడెంట్ గురజాడ శ్రీకృష్ణలను ప్రశ్నించాలని ఈడీ నిర్ణయించింది. వీరంతా ప్రస్తుతం జ్యుడీíÙయల్ రిమాండ్లో ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ల్లోని 3 బ్యాంకుల నుంచి దాదాపు రూ.1,100 కోట్ల రుణాలు తీసుకుని మోసం చేసిన ఆరోపణలపై ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి. రూ.35 కోట్ల మోసానికి సంబంధించి సికింద్రాబాద్కు చెందిన వారి నుంచి అందిన ఫిర్యాదుతో హైదరాబాద్ లో మరో కేసు నమోదైంది. కార్వీ ద్వారా డీమ్యాట్ ఖాతాలు తెరిచిన మదుపరులు ఇచి్చన పవర్ ఆఫ్ అటారీ్నని తనకు అనువుగా మార్చుకున్న పార్థసారథి తదితరులు భారీ స్కామ్కు తెరలేపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ స్కామ్ మొత్తం రూ.3 వేల కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేస్తోంది. కార్వీ సంస్థలతోపాటు నిందితుల ఆస్తుల వివరాలు సేకరించి తాత్కాలిక జప్తుకు సన్నాహాలు చేస్తోంది. చదవండి: పంజాబ్కు ‘కార్వీ’ పార్థసారథి -
హర్ష మందర్ ఇళ్లల్లో ఈడీ సోదాలు
న్యూఢిల్లీ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మానవ హక్కుల ఉద్యమకారుడు హర్ష మందర్(66)కు చెందిన ఇళ్లల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగానే ఈ సోదాలు జరిపినట్లు అధికారులు చెప్పారు. ఢిల్లీలో ఇళ్లు, ఎన్జీఓ కార్యాలయంలో సోదాలు జరిపారు. హర్ష మందర్కు సంబంధం ఉన్న రెండు ఎన్జీఓల ఆర్థిక, బ్యాంకింగ్ కార్యకలాపాల పత్రాలను ఈడీ అధికారులు పరిశీలించారు. హర ్షమందర్ గురువారం ఉదయమే తన భార్యతో కలిసి జర్మనీకి పయనమయ్యారు. సామాజిక న్యాయం, మానవ హక్కులపై ఆయన వార్తా పత్రికల్లో సంపాదకీయాలు రాస్తుంటారు. పుస్తకాలు రచిస్తారు. హర్ష మందర్ డైరెక్టర్గా ఉన్న సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్(సీఎస్ఈ) అనే సంస్థపై ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
కార్వీ కేసు: రంగంలోకి దిగిన ఈడీ
సాక్షి, హైదరాబాద్: కార్వీ కేసులో ఈడీ రంగంలోకి దిగింది. పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేసింది. సీసీఎస్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా కార్వీపై అధికారులు కేసు నమోదు చేశారు. కార్వీ ఎండీ పార్థసారథిని 7 రోజుల కస్టడీని ఈడీ కోరింది. జ్యుడిషియల్ కస్టడీలో మూడు రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది. మనీ లాండరింగ్పై కార్వీ ఛైర్మన్ను ఈడీ విచారించనుంది. కస్టమర్స్ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే అంశంపై ఈడీ విచారణ చేపట్టనుంది. బ్యాంకు రుణాల నగదు విదేశాలకు తరలించారని అధికారులు అనుమానిస్తున్నారు. ఇవీ చదవండి: Bigg Boss: బాస్లకే బాస్ అసలైన బిగ్బాస్ ఇతనే కోకాపేట: కొండలెట్లా కరుగుతున్నయంటే.. -
అప్పగింతపై నీరవ్ సవాల్కు లండన్ కోర్టు ఓకే
లండన్: మనీల్యాండరింగ్ ఆరోపణలపై భారత్కు తనను అప్పగించాలంటూ బ్రిటన్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేసే మరో అవకాశం వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి దక్కింది. తాను నిరాశ నిస్పృహలో ఉన్నానని, మానసిక ఆరోగ్యం సరిగాలేదని, ఆత్మహత్య చేసుకోవాలనేంతగా కుంగిపోయానని ఆయన పెట్టుకున్న అభ్యర్థనను లండన్లోని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. నీరవ్ తరఫు లాయర్లు తమ వాదనలను జడ్జికి వినిపించారు. ‘ బ్రిటన్లోని క్రిమినల్ జస్టిస్ యాక్ట్–2003,యూరప్లోని మానవ హక్కుల పరిరక్షణ, జీవించే హక్కులను పరిగణనలోకి తీసుకుని అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నా’ అని జడ్జి వ్యాఖ్యానించారు. -
ప్రాణాలు తీసిన మధ్యవర్తిత్వం
పరకాల: ఉద్యోగాల కోసం చేసిన మధ్య వర్తిత్వం భార్యాభర్తలను బలి తీసుకుంది. ఓవైపు బాధితుల ఒత్తిడి.. మరోవైపు డబ్బు తీసుకున్న వారి బెదిరింపులకు తట్టుకోలేక మానసికంగా కుంగిపోయారు. 4 రోజుల కింద కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీవీడియో తీసుకున్నారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో శుక్రవారం జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం పొనకల్కు చెందిన తాళ్లపల్లి కేశవస్వామి(53) పెస్టిసైడ్స్ కంపెనీలో పనిచేసేవాడు. సినీపరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో ఎనిమిదేళ్ల నుంచి హైదరాబాద్లో నివసి స్తున్నాడు. వీరికి కుమారుడు నిఖిల్, కుమార్తె చందనప్రియ. నిఖిల్ మానసిక వికలాంగుడు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్కు చెందిన విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి పుల్లాబాయ్తో పాటు వాల్ నాయక్, గాడిపల్లి వెంకటేశ్లు కేశవస్వామికి పరిచయమయ్యారు. సబ్స్టేషన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, నిరు ద్యోగులు ఉంటే తెలపాలని కేశవస్వామికి చెప్పడంతో పరిచయం ఉన్న వ్యక్తుల నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి వారి చేతుల్లో పెట్టాడు. డబ్బు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో తమ డబ్బు ఇవ్వాలని బాధితులు ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు. దీంతో కేశవస్వామి పలు మార్లు పుల్లాబాయ్, వాల్నాయక్, వెంక టేశ్ను డబ్బులివ్వాలంటూ కోరినా తిరిగి బెదిరిం పులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో బాధితులను నచ్చజెప్పలేక.. బెదిరింపులను తట్టుకోలేక కేశవస్వామి కుమిలిపోతున్నాడు. మకాం మార్చినా ఆగని వేధింపులు బాధితుల ఒత్తిడి తట్టుకోలేక కుటుంబంతో సహా హన్మకొండకు మకాం మార్చాడు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో చనిపోదామనుకుని హన్మకొండలో అద్దెకు ఉంటున్న గదిలో భార్య, పిల్లలతో కలసి సెల్ఫీ వీడియో తీసుకున్నారు. దాన్ని వరం గల్ పోలీస్ కమిషనర్కు, మిత్రులకు పం పాడు. గురువారం స్థానిక బంగారం దుకా ణంలో కొంత బంగారాన్ని తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో పురుగుల మందు కొని చర్చిలో ప్రార్థనలు చేశారు. భార్యాపిల్లలను అక్కడే ఉంచి కేశవస్వామి బయటకు వెళ్లాడు. అయితే సంధ్యారాణి (50) రాత్రి 10 గంటల సమయంలో బ్యాగులో ఉన్న పురుగుల మందు తాగడంతో స్థానికులు పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించి కేశవస్వామికి సమాచారం ఇచ్చారు. అతడు ఆస్పత్రి చేరుకునేలోపే ఆమె మృతి చెందడంతో కేశవస్వామి కూడా అక్కడే మిగిలిన మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతన్ని 108 వాహనం ద్వారా వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. కాగా, మరో సూసైడ్ నోట్ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేశవస్వామి , సంధ్యారాణి(ఫైల్) పాకాలలో చనిపోదామనుకున్నారా? 4 రోజుల కింద వీరంతా పాకాలకు వెళ్లినట్లు సమాచారం. బిర్యానీలో పురుగుల మందు కలుపుకొని తాగుదామనుకున్నా.. ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు తెలిసింది. కాగా, సంధ్యారాణి పురుగుల మందు తాగిన సమయంలో పిల్లలు అక్కడే ఉన్నారు. వారు మానసికంగా సరిగా లేకపోవడం, ఏది తాగాలో తెలియక ఉండిపోవడంతో ప్రాణాలతో బయటపడినట్లు స్థానికులు తెలిపారు. -
‘న్యూస్క్లిక్’పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు
న్యూఢిల్లీ: న్యూస్క్లిక్ అనే న్యూస్ పోర్టల్కు సంబంధించిన పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం ఏకకాలంలో దాడులు చేపట్టింది. మొత్తం ఎనిమిది చోట్ల దాడులు జరిగినట్లు ఈడీ అధికారులు చెప్పారు. మనీ లాండరింగ్ చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. దీనికోసం ఈడీ అధికారులు ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను పరిగణనలోకి తీసుకున్నారు. వీరు నడుపుతున్న వెబ్సైట్ పేరు న్యూస్క్లిక్.ఇన్ అని తెలిపారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంప్యూటర్ హార్డ్ డిస్క్లు, ఖాతాలకు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. పలువురిని ప్రశ్నించినట్టు సమాచారం. దానికి ప్రబీర్ పుర్కాయస్త ఎడిటర్ ఇన్ చీఫ్గా పని చేస్తున్నారు. తమపై దాడి జరగడంపై ఆయన స్పందిస్తూ.. జర్నలిజాన్ని తొక్కేసేందుకు, నిజాలు బయటకు రాకుండా ఉండేందుకు కేంద్రం ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, ముగిసిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. అయితే ఈడీ అధికారులు మాత్రం.. ఆ న్యూస్ పోర్టల్కు విదేశాల నుంచి వస్తున్న నిధుల్లో అవకతవకలు ఉన్న కారణంగా చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. చదవండి: ఎర్రకోట ఘటన: ‘మోస్ట్ వాంటెడ్’ అరెస్టు! ఇక వారానికి నాలుగే పనిరోజులు! -
నగల కొనుగోళ్లపై ‘పాన్’ పిడుగు!
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలను రూ.2 లక్షలకు మించి కొనుగోలు చేస్తుంటే కేవైసీ వివరాలు ఇవ్వాలన్నది నిబంధన. అయితే, ఆభరణాల విక్రయదారులు (జ్యుయలర్స్) రూ.2 లక్షల్లోపు కొనుగోళ్లకూ కస్టమర్ల నుంచి కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ అడగడం మొదలు పెట్టేశారు. రానున్న బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీని తప్పనిసరి చేయవచ్చని వర్తకులు భావిస్తున్నారు. మనీల్యాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి జ్యుయలరీ పరిశ్రమను తీసుకొచ్చినందున.. భవిష్యత్తులో ఏవైనా అనుమానాస్పద లావాదేవీని గుర్తించినట్టయితే తమపై కఠినచర్యలు తీసుకోవచ్చన్న భయం వర్తకుల్లో నెలకొని ఉంది. బంగారం మినహా ఇతర అన్ని రకాల పెట్టుబడి సాధనాలకూ కేవైసీ తప్పనిసరిగా అమల్లో ఉంది. బంగారానికి వస్తే రూ.2 లక్షలకు మించిన కొనుగోళ్లకే కేవైసీ ప్రస్తుతం అమల్లో ఉంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ మాదిరే బంగారాన్నీ పెట్టుబడి సాధనంగా గుర్తించాలన్న ప్రణాళికతో ప్రభుత్వం ఉందని.. ఇందుకోసం సమగ్రమైన బంగారం విధానాన్ని తీసుకురానుందని జ్యుయలరీ పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఏటా మన దేశం 800–850 టన్నుల బంగారాన్ని వినియోగిస్తోంది. వివరాలను వెల్లడించాల్సిందే.. ఖరీదైన మెటల్స్, ఖరీదైన స్టోన్స్ డీలర్లను పీఎంఎల్ఏ కిందకు తీసుకురావడంతో.. బంగారం, వెండి, ప్లాటినమ్, వజ్రాలు, ఇతర రాళ్లను విక్రయించే జ్యుయలర్లు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్కు లావాదేవీల వివరాలను వెల్లడించాల్సి వస్తుందంటూ ‘ఇండియా బులియన్ అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్’ (ఐబీజేఏ) జాతీయ సెక్రటరీ సురేంద్ర మెహతా చెప్పారు. పీఎంఎల్ఏ కిందకు బంగారాన్ని గత డిసెంబర్ 28 నుంచి ప్రభుత్వం తీసుకొచ్చిందని.. దీంతో బంగారం ఆభరణాల వర్తకులు అనుమానిత లావాదేవీల వివరాలను, ఒక నెలలో రూ. 10 లక్షలకు మించిన నగదు కొనుగోళ్ల వివరాలను ప్రభుత్వ అధికారులకు నివేదించాల్సి ఉంటుందని మెహతా చెప్పారు. ‘‘కుటుంబ సభ్యుల కోసం రూ.2 లక్షల్లోపు కొనుగోలు చేసే వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ఇప్పటివరకు అభిప్రాయం ఉంది. అయితే, ప్రభుత్వ ఏజెన్సీలు మరింత కఠినంగా వ్యవహరించడం ద్వారా.. అన్ని లావాదేవీల వివరాలను అనుసంధానించి జ్యుయలర్లపై చర్యలు తీసుకోవచ్చు’’ అని ఆభరణాల పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అధిక విలువ కొనుగోళ్లకే కేవైసీ పరిమితం: ఆర్థిక శాఖ న్యూఢిల్లీ: అన్ని రకాల బంగారం కొనుగోళ్లకు కేవైసీ వివరాలు ఇవ్వడం తప్పనిసరి కాదని కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. అధిక విలువ కలిగిన బంగారం, వెండి, జెమ్స్ కొనుగోళ్లకు చేసే నగదు చెల్లింపులకు కేవైసీ పత్రాలైన పాన్ లేదా ఆధార్ బయోమెట్రిక్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. పీఎమ్ఎల్ఏ చట్టం కిందకు తమనూ చేర్చడంతో అన్ని రకాల నగదు కొనుగోళ్లకు కేవైసీ తప్పనిసరి చేయవచ్చని ఆభరణాల పరిశ్రమ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన రావడం గమనార్హం. డిసెంబర్ 28న వచ్చిన నోటిఫికేషన్పై కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం స్పందించింది. ‘‘నగదు రూపంలో ఆభరణాలు, బంగారం, వెండి, ఖరీదైన జెమ్స్, రాళ్ల విలువ రూ.2లక్షలు మించి కొనుగోళ్లు ఉంటే కేవైసీ ఇవ్వాలన్నది గత కొన్నేళ్ల నుంచి అమల్లో ఉన్నదే. పీఎమ్ఎల్ యాక్ట్, 2002 చట్టం కింద డిసెంబర్ 28 నాటి నోటిఫికేషన్.. వ్యక్తులు లేదా సంస్థలు బంగారం, వెండి, జ్యుయలరీ, ఖరీదైన రాళ్లను రూ. 10లక్షలు, అంతకుమించి కొనుగోలు చేస్తే కేవైసీ డాక్యుమెంట్లు అవసరం. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)లో భాగమే ఇది’’ అని తెలిపింది. -
రూ. 1000 కోట్ల హవాలా సొమ్ము: చైనా స్పందన
బీజింగ్/న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్తో పాటు హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్న చైనా దేశీయుడు లూ సాంగ్ను ఆదాయ పన్ను శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్న ఘటనపై డ్రాగన్ స్పందించింది. విదేశాల్లో వ్యాపారం నిర్వహించే చైనీయులు స్థానిక చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించింది. అయితే అదే సమయంలో చైనా కంపెనీల సాధారణ కార్యకలాపాల విషయంలో భారత్ పారదర్శకంగా వ్యవహరిస్తూ వివక్షకు తావు లేని మెరుగైన వాతావరణాన్ని కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కాగా చైనా కంపెనీల హవాలా దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఐటీ శాఖ మంగళవారం ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రాం సహా మరో 21 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో వెయ్యి కోట్ల రూపాయాల మేర హవాలా సొమ్ము చేతులు మారినట్లు గుర్తించారు. చైనాకు చెందిన ఓ కంపెనీ, దాని అనుబంధ సంస్థలు భారత్లో రీటైల్ షోరూంల బిజినెస్ పేరిట షెల్ కంపెనీలు సృష్టించి వందలాది కోట్లు వసూలు చేసినట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ) తెలిపింది. ఈ డబ్బును హాంకాంగ్, అమెరికా కరెన్సీలోకి మార్చేందుకు లావాదేవీలు జరిపినట్లు ఆధారాలు లభించాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో మనీల్యాండరింగ్కు ప్రధాన సూత్రధారి అయిన లూ సాంగ్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారించనుంది.(హవాలా లావాదేవీల్లో ఆరితేరిన లూ సాంగ్) ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియాన్ ఓ భారత మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆ కంపెనీలు మనీల్యాండరింగ్ చేశాయా అన్న విషయం గురించి పూర్తిగా తెలియదు. అయితే ఒక్కటి మాత్రం చెప్పగలను. విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనా కంపెనీలు అంతర్జాతీయ, స్థానిక చట్టాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోవాలని చైనా ప్రభుత్వం స్పష్టం గా చెబుతోంది. అయితే అదే సమయంలో మాకు మా పౌరులు, వారి కంపెనీల రక్షణ కూడా ముఖ్యమే. చైనా కంపెనీల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా న్యాయపరమైన, వివక్ష రహిత వాతావరణాన్ని భారత్ కల్పిస్తుందని చైనా ఆశిస్తోంది’’అని పేర్కొన్నారు. కాగా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించడం సహా పలు చైనా యాప్లను భారత్ నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. భారత యువతిని పెళ్లాడి.. హవాలా రాకెట్కు సూత్రధారి అయిన లూ సాంగ్.. భారత పాస్పోర్ట్ను సులభంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నిందితుడు గతంలో మణిపురి యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. చార్లీ పెంగ్కు భారత్లో హవాలా లావాదేవీలు, మనీల్యాండరింగ్కు పాల్పడే క్రిమినల్ గ్యాంగులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 40కి పైగా బ్యాంకు అకౌంట్లు కలిగి ఉన్న లూ సాంగ్.. దేశంలో గుట్టుచప్పుడుగా మనీ ఎక్స్ఛేంజ్ సేవలను అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా గూఢచర్య ఆరోపణలపై 2018లో లూ సాంగ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా వెల్లడైంది. -
మనీల్యాండరింగ్ కేసులో చైనీయుడి అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : మనీల్యాండరింగ్తో పాటు హవాలా లావాదేవీల్లో నకిలీ చైనా కంపెనీల ప్రతినిధిగా అక్రమాలకు పాల్పడుతున్న చైనా దేశీయుడు లూ సాంగ్ను ఆదాయపన్ను శాఖ అధికారులు మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కాగా గూఢచర్య ఆరోపణలపై 2018లో లూ సాంగ్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు వెల్లడైంది. చార్లీ పెంగ్గా భారత్లో చెలామణి అవుతున్న లూ సాంగ్ను సెప్టెంబర్ 2018లో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు గూఢచర్యం ఆరోపణలపై అరెస్ట్ చేశారు. చైనా తరపున నిందితుడు గూఢచర్యం సాగించడంతో పాటు మనీల్యాండరింగ్, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాడని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారత పాస్పోర్ట్ను సులభంగా సంపాదించవచ్చనే ఉద్దేశంతో నిందితుడు గతంలో మణిపురి యువతిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. చార్లీ పెంగ్కు భారత్లో హవాలా లావాదేవీలు, మనీల్యాండరింగ్కు పాల్పడే క్రిమినల్ గ్యాంగులతో సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు దేశంలో గుట్టుచప్పుడుగా మనీ ఎక్స్ఛేంజ్ సేవలను అందిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. విశ్వసనీయ సమాచారం అందడంతో ఐటీ అధికారులు ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన క్రమంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, చైనా జాతీయులు 40కి పైగా బ్యాంకు ఖాతాలను సృష్టించి రూ 1000 కోట్లు పైగా వాటిలో జమచేశారని భావిస్తున్నారు. దేశంలో చైనా పెట్టుబడులపై కఠిన నిబంధనలు విధించి, 59 చైనా యాప్లను నిషేధించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. చదవండి : చైనా ఎంట్రీతో ఇక అంతే.. -
చైనా కంపెనీల మనీలాండరింగ్ రాకెట్
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా విస్తరణ, ఇండో చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో ఒకవైపు చైనాపై తీవ్ర వ్యతిరేకత కొనసాగుతుండగా మరోవైపు చైనా కంపెనీల భారీ హవాలా రాకెట్ను ఆదాయ పన్ను శాఖ ఛేదించింది. 1,000 కోట్ల రూపాయలు మనీలాండరింగ్కు పాల్పడుతున్న చైనీయులు, ఢిల్లీలోని సంబంధిత భారతీయ వ్యక్తులపై ఆదాయం పన్ను (ఐటీ) శాఖ సోదాలు నిర్వహించింది. షెల్ కంపెనీల ద్వారా భారీగా అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై ఈ సోదాలు జరిపినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)తెలిపింది. వివిధ బ్యాంకుల్లో 40కి పైగా అకౌంట్ల ద్వారా హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు సీబీడీటీ అధికార ప్రతినిధి సురభి అహ్లువాలియా ఒక ప్రకటనలో తెలిపారు. చైనా అనుబంధ సంస్థల ద్వారా భారత్లో రిటైల్ షోరూమ్ల బిజినెస్ను ప్రారంభించేందుకు ప్రయత్నించిందనీ, నకిలీ కంపెనీలు, స్థానిక భాగస్వామ్యంతో వెయ్యి కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డట్టు తేలిందని పేర్కొంది. దీనికి సంబంధించిన పత్రాలను, హాంకాంగ్, యుఎస్ డాలర్లతో సంబంధం ఉన్న విదేశీ హవాలా లావాదేవీల సాక్ష్యాలను కూడా వెలికి తీసినట్టు ఐటీ విభాగం వెల్లడించింది. బ్యాంకు ఉద్యోగులు, చార్టర్డ్ అకౌంటెంట్ల సహకారంతో ఈ అక్రమాలకు తెగబడినట్టు పేర్కొంది. -
మాజీ ప్రధానిపై మరో రెండు అవినీతి కేసులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్పై మరో రెండు అవినీతి కేసులను నమోదు చేసేందుకు పాకిస్తాన్ యాంటీ గ్రాఫ్ట్ బాడీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) డైరెక్టర్ జనరల్ షహ్జాద్ సలీం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో మనీలాండరింగ్, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో షరీఫ్తో పాటు, అతని తమ్ముడు షాబాజ్ షరీఫ్, కుమార్తె మరియం నవాజ్తో పాటు మరో 13 మందిపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా, 54 కెనాల్ ల్యాండ్ కేసులో నవాజ్ షరీఫ్, జియో మీడియా గ్రూప్ వ్యవస్థాపకుడు మీర్ షకీలూర్ రెహ్మాన్తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేయడానికి బోర్డు ఆమోదం తెలిపింది. అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయడానికి ముందు ఈ రెండు కేసులను ఎన్ఏబీ లాహోర్ ఛైర్మన్ జస్టిస్ (ఆర్) జావేద్ ఇక్బాల్ అనుమతి కోసం పంపనున్నుట్లు అధికారులు తెలిపారు. ‘షరీఫ్ కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసులు ఎన్ఏబీ చైర్మన్ ఆమోదం పొందిన తరువాత వచ్చే వారం లాహోర్లోని అకౌంటబిలిటీ కోర్టులో దాఖలు చేయబడతాయి’ అని ఒక అధికారి పీటీఐకి చెప్పారు. ‘జియో’ గ్రూప్ గా పిలువబడే జాంగ్ గ్రూప్ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండిపెండెంట్ మీడియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ. షరీఫ్ 1986లో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీర్ షకీలూర్ రెహ్మాన్చకు ట్టవిరుద్ధంగా లాహోర్లో భూమిని కేటాయించారు. ఆ కేసుకు సంబంధించి మీర్ షకీలూర్ రెహ్మాన్ను ఈ ఏడాది మార్చి 12న ఎన్ఎబీ అరెస్ట్ చేసింది. కోర్టు అతనికి ఏప్రిల్ 28 వరకు రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. -
16 కోట్ల ఏజేఎల్ భవనం అటాచ్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఆధ్వర్యంలోని అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.16.38 కోట్ల విలువైన భవనాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. మనీ ల్యాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపిస్తూ ఏజేఎల్తోపాటు, ఆ సంస్థ సీఎండీ, కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరాకు నోటీసులు జారీ చేసింది. ముంబైలోని అత్యంత ఖరీదైన బాంద్రా ఏరియాలోని తొమ్మిదంతస్తుల భవనంలోని కొంత భాగాన్ని అటాచ్ చేసినట్లు శనివారం ఈడీ తెలిపింది. గాంధీ కుటుంబసభ్యులతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతల ఆధ్వర్యంలోని ఏజేఎల్ గ్రూపు ఆ పార్టీకి చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను నిర్వహిస్తోంది.1992లో హరియాణా సీఎంగా ఉన్నపుడు కాంగ్రెస్ సీనియర్ నేత భూపీందర్ హూడా పంచ్కులలోని భూమిని తక్కువ ధరకే ఏజేఎల్కు కేటాయించి, అధికార దుర్వినియోగం, అవకతవకలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది. ఆ భూమి వాస్తవ విలువ రూ.64.93 కోట్లు కాగా కేవలం రూ.59.39 లక్షలకే ఏజేఎల్కు అప్పగించారంటూ ఈడీ ఇప్పటికే ఆ భూమిని అటాచ్ చేసింది. ఈ కేసులో హూడా, వోరాలను ప్రశ్నించింది. ఇందుకు సంబంధించి 2018లో మోతీలాల్ వోరా, భూపీందర్ హూడాపై పంచ్కుల కోర్టులో చార్జిషీటు వేసింది. -
సినిమా జర్నలిస్ట్లకు ఎఫ్సీఏ సాయం
కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సభ్యులందరిMీ ఐదు వేల రూపాయలు చొప్పున ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ (ఎఫ్సీఏ) ఆర్థిక సాయం చేసింది. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి మొత్తం 87 మంది సభ్యులకు బ్యాంక్ అకౌంట్ ద్వారా సోమవారం ఐదు వేల నగదును బదిలీ చేశారు. ‘‘ఎఫ్సీఏ’ అడ్వైజర్ కమిటీ కన్వీనర్ మరియు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లక్ష్మణ్ రావుగారి సలహాల మేరకు, హెల్త్ కమిటీ చైర్మన్ రెడ్డి హనుమంతురావు, మురళి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశాం. ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’’ అని ‘ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. -
రాణా కపూర్ నివాసంలో ఈడీ సోదాలు
ముంబై: మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణలో భాగంగా యస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణా కపూర్ నివాసంలో (ముంబై) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించేందుకు ఈ దాడులు నిర్వహించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఓ కార్పొరేట్ సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలం తీసుకున్నట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని అవకతవకలపైనా ఈడీ విచారణ జరుపుతోంది. -
క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఈడీ రెడీ
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు హయాంలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్పై క్షేత్రస్థాయి దర్యాప్తునకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన శాఖ(సీఐడీ) పంపిన ఆధారాలను పరిశీలించిన ఈడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో జరిగిన అక్రమ లావాదేవీలపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ ల్యాండరింగ్ యాక్ట్(పీఎంఎల్ఏ)–2002, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్(ఫెమా)–1999 కింద కేసులు నమోదు చేసిన ఈడీ కీలక ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. హైదరాబాద్లోని ఈడీ జాయింట్ డైరెక్టర్(జేడీ) అభిషేక్ గోయల్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేసుకుంటోంది. రాజధానిలో పెద్ద ఎత్తున జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్, మనీ ల్యాండరింగ్కు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమికంగా గుర్తించిన ఆధారాలను సీఐడీ అందజేయడంతో వాటిని ఈడీ పరిశీలిస్తోంది. విలువైన భూములు ఎలా కొన్నారో? అమరావతి, పెదకాకాని, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి గ్రామాల్లో 797 మంది తెల్లరేషన్ కార్డుదారులు 761.34 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టు సీఐడీ అధికారులు ఈడీకి ఆధారాలు అందజేశారు. పేద వర్గాలుగా తెల్లకార్డులు పొందిన వారు దాదాపు రూ.276 కోట్లు పెట్టి ఆ భూములు ఎలా కొన్నారనే దానిపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. పచ్చ నేతలకు బినామీలుగా తెల్లకార్డుదారులు భూములు కొన్నట్టు నిర్ధారణ కావడంతో ఇందులో మనీ ల్యాండరింగ్, అక్రమ ఆదాయం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయని ఈడీ నిర్ధారించింది. రూ.కోట్లతో కొనుగోలు చేసిన భూముల వివరాలు, వారి ఆర్థిక పరిస్థితి, వారు ఎవరికి బినామీలు తదితర కోణాల్లో ఈడీ కూపీలాగుతోంది. రికార్డుల పరిశీలన పూర్తయిన అనంతరం ఈడీ అమరావతి ప్రాంతంలో విచారణ ప్రారంభిస్తుందని సీఐడీ అధికారులు తెలిపారు. క్షేత్రస్థాయి దర్యాప్తునకు ముందే సీఐడీ అధికారుల బృందంతో ఈడీ ఉమ్మడి సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా ఈడీ, సీఐడీ ఉమ్మడి సమావేశం ఉంటుందని అధికారులు ధ్రువీకరించారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్లో అక్రమాల 'వరద'
సాక్షి, అమరావతి : రాజధాని భూకుంభకోణంలో తీగలాగితే చంద్రబాబు బృందం డొంక కదులుతోంది. అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ (వరదాపురం సూరి) కూడా ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రూ.400 కోట్ల విలువైన భూములు కొనుగోలు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ, కాంట్రాక్టు సంస్థ నితిన్సాయి కన్స్ట్రక్షన్స్ పేరుతో రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) పరిధిలో భారీగా భూములు కొన్నారు. విజయవాడకు అత్యంత సమీపంలో.. వెలగపూడి సచివాలయానికి కూతవేటు దూరంలో ఉండవల్లిలో 11.34 ఎకరాల భూమి కొనుగోలు చేయడాన్ని దర్యాప్తు సంస్థ సీఐడీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో ఈ భూముల విలువే రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అంచనా. రాజధాని గ్రామాల్లోనూ.. సీఆర్డీఏ పరిధిలోనూ భారీగా భూముల కొనుగోలులో వరదాపురం సూరి మనీల్యాండరింగ్కు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చిన సీఐడీ.. అందుకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికను ఆదాయపు పన్ను (ఐటీ), ఈడీకి అందజేసింది. దీంతో ఈ రెండు సంస్థలు సీఐడీకి సమాంతరంగా విచారణ చేపట్టనున్నాయి. బాబు హయాంలో కేసులు నిర్వీర్యం టీడీపీ అధినేత చంద్రబాబుకు సన్నిహితుడైన సూరి 2014 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. క్వారీల్లో అక్రమ మైనింగ్.. నాసిరకంగా పనులు చేసినందుకు నితిన్సాయి కన్స్ట్రక్షన్స్పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం 2014కు ముందే పలు కేసులు నమోదు చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఈ కేసులను నిర్వీర్యం చేయించుకున్న సూరి.. ఆ తర్వాత చంద్రబాబు బృందంలో కీలక సభ్యుడిగా ఎదిగారు. రాజధాని ఏర్పాటుపై చంద్రబాబు నుంచి ముందే సమాచారం తెలుసుకున్న ఆయన.. తాడేపల్లి మండలం ఉండవల్లిలో సర్వే నంబర్లు 144–2ఏ2, 144–2ఏ3, 149–బీ2, 149–బీ3, 151–2ఏ, 195–ఏ, 196–సీ1ఏ1ఏ, 199–3, 207–3, 207–5ఏలలో తన భార్య గోనుగుంట్ల నిర్మలమ్మ పేరుతో 5.6725 ఎకరాలు, సర్వే నంబర్లు 140–1బీ, 180–1బీ1, 184–ఏ2/3, 196బీ3బీ, 200–ఏ1, 206–1ఏలలో 5.67 ఎకరాలు మొత్తం 11.34 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఇదే రీతిలో సీఆర్డీఏ పరిధిలోని పలు మండలాల్లోనూ 56 ఎకరాలకు పైగా భూమిని కొన్నారు. వీటి విలువ రూ. 400 కోట్లకుపైగా ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో.. సూరి కుటుంబ ఆదాయ మార్గాలపై దృష్టి పెట్టిన సీఐడీ.. ఆదాయానికి మించి ఆస్తులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించింది. అలాగే, మనీల్యాండరింగ్కు కూడా పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి ఆయనపై చర్యలు తీసుకోవాలని ఐటీ, ఈడీలకు నివేదిక అందజేసింది. కాగా, 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం చంద్రబాబు ఆదేశాల మేరకు తనను తాను రక్షించుకోవడానికి బీజేపీ గూటికి చేరారు. -
‘ఈ–టికెట్’ స్కాం బట్టబయలు
న్యూఢిల్లీ: రైల్వేలో భారీ ఈ –టికెట్ కుంభకోణం బయటపడింది. ఈ కుంభకోణం సూత్రధారులకు మనీ ల్యాండరింగ్, ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్నట్లు దీన్ని ఛేదించిన రైల్వే భద్రతా దళం (ఆర్పీఎఫ్) డీజీ అరుణ్ కుమార్ తెలిపారు. మంగళవారం ఇక్కడ మీడియాకు ఆయన వివరాలు వెల్లడించారు. ‘దొడ్డిదారిన ఈ టికెట్ల విక్రయం జరుగుతున్నట్లుగా అనుమానం రావడంతో గత ఏడాది ‘ఆపరేషన్ థండర్స్టార్మ్’పేరుతో దర్యాప్తు ప్రారంభించాం. ఈ సందర్భంగా గులాం ముస్తాఫా(28) పేరు బయటకు వచ్చింది. జార్ఖండ్కు చెందిన ఇతడు 2015 నుంచి ఈ దందా నడుపుతున్నాడు. ఈ నెల మొదటి వారంలో ఇతడిని భువనేశ్వర్లో అదుపులోకి తీసుకున్నాం. ఇతని వద్ద ఐఆర్సీటీసీకి చెందిన 563 మంది గుర్తింపుకార్డులు లభించాయి. వీటి ద్వారా ఇతడు టికెట్లను బుక్ చేసేవాడు. వచ్చిన డబ్బును బ్యాంకు అకౌంట్లకు మళ్లించేవాడు. ఇందుకు సంబంధించి ఇతని వద్ద 3,000 అకౌంట్ల వివరాలు లభించాయి. దీంతోపాటు ఇతని వద్ద రెండు ల్యాప్టాప్లలో ఏఎన్ఎంఎస్ అనే సాఫ్ట్వేర్ ఉంది. దీంతో సాధారణ యూజర్ల కంటే వేగంగా టికెట్లను బుక్ చేయవచ్చు. వచ్చిన డబ్బును డార్క్నెట్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి మారుస్తాడు. ఆ కరెన్సీని మనీ ల్యాండరింగ్కు, ఉగ్రసంస్థలకు సాయం అందించేందుకు వాడుతున్నట్లు మా అనుమానం’ అని డీజీ వెల్లడించారు. ‘పాక్కు చెందిన తబ్లిక్–ఇ–జమాత్ అనే ఉగ్రసంస్థతోనూ, బంగ్లాదేశ్, ఇండోనేసియా, నేపాల్, ఇంకా గల్ఫ్ దేశాల వారితో ఇతనికి సంబంధాలున్నట్లు ల్యాప్టాప్ల్లో సమాచారంతో తేలింది. అతని వద్ద నకిలీ పాన్, ఆధార్ కార్డులను తయారు చేసే సాఫ్ట్వేర్ కూడా ఉంది. ఇతని గ్రూప్ నుంచి డబ్బు అందుకునే సాఫ్ట్వేర్ కంపెనీ మనీల్యాండరింగ్ కు పాల్పడుతోంది. దీనిపై సింగపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’అని డీజీ అరుణ్ కుమార్ చెప్పారు. ‘గురూజీ అనే పేరుగల సాంకేతిక నిపుణుడికి ముస్తాఫా ఇటీవల రూ.13 లక్షలు అందించాడు. తన గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు ఈ గురూజీ యుగోస్లావియా వీపీఎన్ వాడుతున్నాడు. ఈ ముఠా నడిపే అవయవ వ్యాపారం దందాలో భాగంగా వివిధ ఆస్పత్రులకు గురూజీ చికిత్సల పేరుతో బంగ్లాదేశ్ వాసులను పంపిస్తున్నాడు. ఈ రాకెట్ ద్వారా నెలకు రూ.10 నుంచి రూ.15 కోట్ల వరకు ఆర్జిస్తున్నట్లు అనుమానిస్తున్నాం’అని వివరించారు. దుబాయ్లో సూత్రధారి ఈ టికెట్ రాకెట్కు మాస్టర్మైండ్ హమీద్ అష్రాఫ్. 2019 జూలైలో ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలోని ఓ స్కూల్ ఆవరణలో బాంబు పేలుడుకు ఇతడే సూత్రధారి. ఈ ఘటనలో అరెస్టయిన ఇతడు బెయిల్పై బయటకు వచ్చి, నేపాల్ మీదుగా దుబాయ్కి పరారయ్యాడు. పది రోజులుగా ఇంటలి జెన్స్ బ్యూరో, స్పెషల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), కర్ణాటక పోలీసులు ముస్తాఫాను విచారణ చేస్తున్నారు. ముస్తాఫా ఇచ్చిన సమాచారం మేరకు ఇప్పటివరకు 27 మందిని అరెస్టు చేశారు. -
చిదంబరంను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఎయిరిండి యాకు నష్టం కలిగించేలా వ్యవహరించి, మనీ లాండరింగ్కు పాల్ప డ్డారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి చిదంబరానికి ఈడీ గతేడాది ఆగస్టు 23న సమన్లు జారీచేసింది. అయితే ఆ సమయంలో ఆయన ఐఎన్ఎక్స్ మీడియాలో అవినీతి కేసుకు సంబంధించి అరెస్టు అయి సీబీఐ కస్టడీలో ఉన్నారు. -
చింపాంజీలను అటాచ్ చేసిన ఈడీ!
న్యూఢిల్లీ: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మూడు చింపాంజీలు, నాలుగు మార్మోసెట్ల (పొడవాటి తోక గల దక్షిణ అమెరికా కోతులు) ను అటాచ్చేసింది. ఈడీ చింపాంజీలను అటాచ్ చేయడమేంటి అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. పశ్చిమ బెంగాల్కు చెందిన వన్యప్రాణి స్మగ్లర్పై మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా వీటిని అటాచ్ చేసింది. స్మగ్లర్ ఇంటి నుంచి వాటిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకుని కోల్కతాలోని అలిపోర్ జంతుప్రదర్శన శాలలో ఉంచినట్లు కేంద్ర సంస్థ వెల్లడించింది. ఈ చింపాంజీలు సందర్శకులను ఆకర్షించడమే కాకుండా, జూకి ఒక మంచి ఆదాయ మార్గం అని చెప్పింది. కాగా, కోతులను జంతు శాలలో ఉంచినట్లు తెలిపింది. ఈ విధంగా మనీ లాండరింగ్ చట్టంకింద జంతువులను అటాచ్ చేయడం మొదటి సారి అని ఈడీ పేర్కొంది. స్మగ్లర్ ఆ జంతువులను అక్రమంగా రవాణా చేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. మొత్తం ఏడు జంతువుల విలువ రూ.81 లక్షలు ఉంటుందని, ఒక్కో చింపాంజీ విలువ రూ.25 లక్షలు కాగా.. కోతుల విలువ రూ.1.5 లక్షలుంటుందని వెల్లడించింది. అడవి జంతువులను అక్రమంగా నిర్భంధించాడని స్మగ్లర్ సుప్రదీప్ గుహపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. గుహ ‘వ్యవస్థీకృత వన్యప్రాణుల అక్రమ రవాణా రాకెట్ను నడుపుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైనట్లు ఈడీ తెలిపింది. -
డీకేశికి ట్రబుల్
సాక్షి బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరుపొందిన మాజీ మంత్రి డీకే శివకుమార్ తానే సమస్యల్లో పడిపోయారు. పార్టీకి అనేక ఆపరేషన్లలో వెన్నుదన్నుగా ఉంటూ కీలక నేతగా చక్రం తిప్పుతున్న డీకేశితో పాటు కాంగ్రెస్పార్టీకి షాక్ తగిలింది. అక్రమ నగదు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఆయనను ఢిల్లీలో అరెస్టు చేశారు. గత శుక్రవారం ప్రారంభమైన విచారణ ఆదివారం మినహా మంగళవారం వరకు కొనసాగింది. సుమారు 29 గంటల పాటు డీకేశిని ఈడీ విచారించింది. విచారణలో డీకే సహకరించలేదని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కొంతకాలం క్రితం ఐటీ దాడుల్లో ఢిల్లీలోని ఆయన నివాసంలో రూ. 8.59 కోట్ల నగదు లభించడంతో డీకేశిపై ఐటీ శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ డీకేను విచారణ చేస్తూ వస్తోంది. ఢిల్లీలో ఈడీ ఆఫీసులో మధ్యాహ్న 12 గంటలకు ప్రారంభమైన డీకేశి విచారణ రాత్రి 8.30 గంటలసమయంలో అరెస్టుతో ముగిసింది. నాలుగురోజుల నుంచి ఆయనను ఈడీ విచారిస్తుండడం తెలిసిందే. కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన మంగళవారం ఈడీ విచారణకు హాజరయ్యే ముందు డీకే శివకుమార్ మాట్లాడుతూ నాలుగు రోజుల నుంచి విచారణకు హాజరవుతున్నట్లు, ఇంకా ఎన్ని రోజులు రావాలో తెలియదన్నారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. డీకేశి అరెస్టు వార్తలను టీవీలో చూసిన ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈడీ ప్రధాన కార్యాలయం లోకనాయక భవనం ఎదుట ఆందోళనకు దిగారు. డీకేశి అరెస్టు నేపథ్యంలో బెంగళూరుతో పాటు మండ్య, హాసన్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. గొడవలు జరగకుండా నిఘా వేసింది. బుధవారం రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపట్టే అవకాశం ఉంది. -
కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ..!
సాక్షి, అమరావతి : రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు అమాయకపు రైతుల పొట్టకొట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కొద్ది రోజులు ఆగితే అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుందని ట్విటర్ వేదికగా హెచ్చరించారు. ‘ కొద్ది రోజులాగు చిట్టి నాయుడూ? అమరావతి కలల రాజధానో, కులపు రాజధానో తెలుస్తుంది. ఇన్సైడర్ ట్రేడింగుతో అమాయక రైతుల పొట్టకొట్టి మీరూ, మీ బినామీలు లాగేసుకున్న వేల ఎకరాల స్టోరీలన్నీ సీరియల్గా బయటకొస్తాయి. మీరు నిప్పులో తుప్పులో ప్రజలే చెబుతారు. కాండ్రించి ఉమ్ముతారు’ అని విజయసాయిరెడ్డి ట్విట్ చేశారు. సానా సతీశ్తో.. చంద్రబాబు సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి మనీలాండరింగ్ దళారి సానా సతీశ్తో చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ ప్రముఖల సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. చిరుద్యోగం చేసుకునే వ్యక్తి.. అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసని ట్విటర్ వేదికగా వ్యాఖ్యానించారు. ‘‘మనీలాండరింగ్ దళారి సానా సతీశ్తో.. చంద్రబాబు, టీడీపీ ప్రముఖుల సంబంధాలపై కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి... అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి... ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను ఆడగండి నెహ్రు.. పదవి, ప్యాకేజీ కోసం జ్యోతుల నెహ్రూ కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. అసాధ్యమని తెలిసినా 5శాతం రిజర్వేషన్ ప్రకటించినందుకు బాబును నెహ్రూ పొగిడారని విమర్శించారు. ‘కాపులకు ద్రోహం చేసిందెవరో మీ అంతరాత్మను అడగండి జ్యోతుల నెహ్రూ గారూ. పదవి, ప్యాకేజీ కోసం మీరు జాతి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టింది వాస్తవం కాదా? అసాధ్యమని తెలిసీ 5 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తే బాబును పొగిడింది మీరే కదా? ఇప్పుడు ఎవరు ఉసిగొల్పితే విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలుసు’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. -
ఆ నేరగాళ్లకు రాజీ అవకాశం ఉండదు
న్యూఢిల్లీ: నగదు అక్రమ రవాణా, ఉగ్రవాదులకు నిధుల చేరవేత, బినామీ ఆస్తులను, రహస్యంగా విదేశీ ఆస్తులను కలిగి ఉండటం, అవినీతి తదితర నేరాలకు పాల్పడేవారికి ఇక నుంచి ఐటీ విభాగంతో రాజీ కుదుర్చుకునే అవకాశాన్ని కల్పించకూడదని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) నిర్ణయించింది. పై నేరాలకు పాల్పడేవారు రాజీ కుదుర్చుకునే హక్కును కోల్పోతారంది. అయితే నేరస్తుడి ప్రవర్తన, నేరం స్వభావం, తీవ్రత, నేరానికి పాల్పడేందుకు ప్రేరేపించిన పరిస్థితులు తదితరాలను పరిగణనలోనికి తీసుకున్న అనంతరం, అవసరమనుకుంటే ఆ వ్యక్తులు/సంస్థలకు రాజీ అవకాశం ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థిక మంత్రికి ఉంటుందని స్పష్టం చేసింది. -
బెజవాడలో ‘హవాలా’ జోరు!
సాక్షి, అమరావతి బ్యూరో : బెజవాడను హవాలా డబ్బు ముంచెత్తుతోంది. రాజధాని ఏర్పడిన అనంతరం..వివిధ వ్యాపార వర్గాలకు చెందిన బడాబాబులు తమ తమ వ్యాపకాలకు ఈ నగరాన్ని ఆవాసంగా మార్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలకు విజయవాడ నగరం కేంద్రం కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడకు ముంబై రాజధాని నుంచి హవాలా మార్గం ద్వారా తరలించారని అనుమానిస్తున్న రూ. 1.25 కోట్లను మంగళవారం నగర టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఇందుకు ఊతమిస్తోంది. కాగా, గుట్టు చప్పుడు కాకుండా ఎన్నో రెట్ల డబ్బు హవాలా మార్గంలో చేతులు మారుతోందని ‘సాక్షి’ మార్చి 24వతేదీన ‘కోడ్.. డీల్’ పేరిట ఓ కథనాన్ని ప్రచురించింది. అచ్చం ఆ కథనంలో సాక్షి పేర్కొన్నట్లుగానే ..స్వాధీనం చేసుకున్న డబ్బు హవాలా మార్గంలో వచ్చిందేననే అనుమానాన్ని పోలీసులు సైతం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే, హైదరాబాద్కు చెందిన మిర్చి వ్యాపారి అభినవ్రెడ్డి ఇటీవల తన వ్యాపారాన్ని ఏపీ రాజధాని ప్రాంతమైన విజయవాడకు విస్తరించారు. ఈ నేపథ్యంలో తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న విశాఖకు చెందిన నాగరాజుకు విజయవాడలోని వ్యాపారుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే పనిని అప్పగించారు. రోజుకు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు వసూలు చేయాల్సి ఉంటుంది. దీంతో నాగరాజు తనకు పరిచయమున్న విశాఖకు చెందిన రెడ్డిపల్లి కిశోర్ అలియాస్ నాని సహాయం తీసుకున్నాడు. ఇందుకోసం విజయవాడ నగరంలోని ఓ హోటల్లో రూమ్ను అద్దెకు తీసుకున్నారు. రోజూ వసూలు చేసి తీసుకొచ్చిన డబ్బును హోటల్ రూమ్లో ఉంచేవారు. అయితే ఆ డబ్బుకు కాపలా కోసం మరొకరిని పెట్టాలనే ఉద్దేశంతో నానికి తమ్ముడు వరుసైన దాస్ను విశాఖ నుంచి రప్పించి రూమ్లో కాపలా పెట్టారు. అసలే ఎన్నికల వేళ రూ.లక్షల్లో సొమ్మును నగరంలో అటూ ఇటూ తీసుకెళ్లడం ఇబ్బందిగా ఉంటుందని గ్రహించిన అభినవ్రెడ్డి ఓ రోజు నాగరాజుతో మాట్లాడుతూ డబ్బు తరలించే సమయంలో పోలీసులకు పట్టుబడితే రూ.నాలుగైదు లక్షలైతే ఎలాంటి హడావుడి చేయకుండా వదిలేయమని ఫోన్లో చెబుతుండగా నాని విన్నాడు. దీంతో నానికి ఈ డబ్బును కాజేయాలనే ఆలోచన వచ్చింది. వెంటనే తనకు ఇదివరకే పరిచయమున్న మైలవరానికి చెందిన రవీంద్రకు సమాచారమందించాడు. దీంతో రవీంద్ర తన స్నేహితులు హర్షవర్ధన్, భవానీ శంకర్, అమర్చంద్తో కలసి డబ్బు దోచుకునేందుకు పక్కా ప్రణాళిక రచించాడు. ఇందుకోసం పాతబస్తీ ప్రాంతంలో ఖాకీ దదుస్తులు, నల్లబూట్లు కొనుగోలు చేసి.. మార్చి 18, 19వ తేదీల్లో డబ్బు దోచుకునేందుకు రెండుసార్లు యత్నించి విఫలమయ్యారు. అయితే అదేనెల 22వ తేదీన నాగరాజు, నాని కలిసి రూ .30 లక్షలు హైదరాబాద్కు తీసుకెళుతుండగా వీరి వాహనాన్ని కొత్తూరు, తాడేపల్లి సమీపంలో హర్షవర్ధన్ టాస్క్ఫోర్స్ పోలీసులమంటూ నిలిపేశాడు. తర్వాత రవీంద్రను సీఐగా హర్షవర్ధన్ పరిచయం చేయడం.. ఆ తర్వాత అదే వాహనంలో రూ.కోటి డబ్బులున్న బ్యాగు కోసం హోటల్కు చేరుకుని నాగరాజును కొట్టి ఆ బ్యాగును తీసుకెళ్లారు. దాస్ను కూడా వారి వాహనంలో తీసుకెళ్లి మధ్యలో వదిలేశారు. ఇదిలా ఉండగా.. మరోచోట దాచిన రూ.45 లక్షల బ్యాగుతో నాని రైల్వేస్టేషన్కు వచ్చాడు. అయితే ఈ డబ్బును కూడా పోలీసులు పట్టుకెళ్లారని చెప్పి.. మనం పంచుకుందామని నాని ఆశ పెట్టడంతో నాగరాజు ఒప్పుకుని ఆ డబ్బును అంతా కలిసి పంచుకున్నారు. ఏడుగురు అరెస్టు.. టాస్క్ఫోర్స్ పోలీసుల పేరు చెప్పి రూ. 1.70 కోట్లు దోపిడీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దోపిడీలో ప్రధాన నిందితుడు రవీంద్ర పరారీలో ఉన్నాడని.. నాని, భవానీశంకర్, హర్షవర్ధన్, అమర్చంద్, దాసు,నాగరాజును అరెస్టు చేసి రూ. 1.25 కోట్లు రికవరీ చేశామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. అభినవ్ ఫిర్యాదుతో బయటపడ్డ హవాలా మార్గం.. పోలీసుల పేరిట గుర్తు తెలియని వ్యక్తులు రూ. 1.70 కోట్లు దోచుకెళ్లడంతో మిర్చి వ్యాపారి అభినవ్రెడ్డి విజయవాడ రెండో పట్టణ పోలీసులకు మార్చి 26న ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన టాస్క్ఫోర్స్ పోలీసులు అనుమానంతో నాగరాజును పలు దఫాలు విచారించగా.. అసలు డబ్బును ఎలా వసూలు చేసేది.. ఎక్కడ ఉంచేది.. అందుకు ఎవరెవరు సాయం చేశారు అన్న వివరాలు వివరించాడు. ఆ తర్వాత అభినవ్ను విచారించగా.. తాను ముంబైకి చెందిన ఓ కంపెనీకి బ్యాంకు అకౌంట్ నంబరు ద్వారా రూ. కోటి జమ చేస్తే.. ఆ డబ్బును విజయవాడలో ఓ కోడ్ను ఉపయోగించి అందజేస్తారని వివరించాడు. దీంతో ఈ సొమ్ము హవాలా మార్గంలోనే నగరానికి వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. గత పది రోజుల్లో ఈ మార్గం ద్వారా దాదాపు రూ. 7 కోట్లు నగరానికి వచ్చిందని సమాచారం. దీంతో ఈ కేసుకు సంబంధించిన సమాచారాన్ని ఆదాయపన్ను శాఖకు, ఈడీ విభాగానికి తెలియజేస్తామని నగరపోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసును లోతుగా విచారిస్తాని.. ఎన్నికల నేపథ్యంలో పంపిణీ చేయడానికి వచ్చిన సొమ్ముగానే తాము అనుమానిస్తున్నామని.. విచారణలో పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. -
ముగ్గురు ఇండో–అమెరికన్లు దోషులే
న్యూయార్క్: అమెరికాలో మాదకద్రవ్యాల వ్యాపారం ఆధారంగా అక్రమ నగదు చెలామణికి పాల్పడ్డ కేసులో ముగ్గురు ఇండో–అమెరికన్లు సహా ఆరుగురు దోషులుగా తేలినట్లు యూఎస్ న్యాయశాఖ తెలిపింది. టెక్సాస్లోని లారెడోకు చెందిన రవీందర్ రెడ్డి గుడిపాటి(61), హర్‡్ష జగ్గీ(54), నీరూ జగ్గీ(51)తో పాటు ఆండ్రియన్ హెర్నాండేజ్(మెక్సికో), గాల్వన్ కాన్స్టాంటీనీ, లూయిస్మోంటెస్ పాటినో(టెక్సాస్)లను కోట్ల డాలర్ల మోసానికి పాల్పడ్డారని వెల్లడించింది. లారెడోలోని ఫెడరల్ కోర్టు వీరిని దోషులుగా తేల్చిందని పేర్కొంది. ఈ విషయమై అసిస్టెంట్ అటార్నీ జనరల్ బ్రియాన్ మాట్లాడుతూ.. ‘అమెరికాలోని న్యూయార్క్, కెంటకీ, నార్త్ కరోలినా సహా పలు నగరాల్లో 2011–13 మధ్య మాదకద్రవ్యాల అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని కాన్స్టాంటీనీ, పాటినోలు టెక్సాస్లోని లారెడోకు తరలించారు. ఇందుకు కార్లు, కొరియర్లు, బస్సులతో పాటు ప్రైవేటు విమానాలను సైతం వాడుకున్నారు. రవీందర్ రెడ్డికి చెందిన ఎన్వైఎస్ఏ, ఇంపాక్స్ ఎల్ఎల్సీ, హర్‡్ష–నీరూ జగ్గీలకు చెందిన ఎల్రినో ఇంటర్నేషనల్ కంపెనీలతో పాటు లారెడోలోని కొన్ని దుకాణాల ద్వారా ఈ నగదును వాడుకలోకి తెచ్చారు. ఆ తర్వాత లాభాలను మెక్సికో డ్రగ్స్ డీలర్లకు అందించారు’ అని తెలిపారు. -
20 వేల కోట్ల హవాలా గుట్టు రట్టు
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు ఢిల్లీలో దాడులు, సర్వేలు చేసి రూ. 20 వేల కోట్ల మనీ లాండరింగ్ హవాలా రాకెట్ల గుట్టు రట్టు చేసినట్లు సోమవారం వెల్లడైంది. ఐటీ ఢిల్లీ దర్యాప్తు విభాగం అధికారులు గత కొన్ని వారాలుగా పాత ఢిల్లీలోని పలు చోట్ల ఈ సర్వేలు, దాడులు చేసినట్లు ఐటీ విభాగంలోని ఓ అధికారి వెల్లడించారు. మూడు ముఠాలు ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈ దాడుల్లో బయటపడిందని చెప్పారు. నయా బజార్ ప్రాంతంలో రూ. 18 వేల కోట్ల విలువైన నకిలీ బిల్లులును గుర్తించామనీ, ఈ బిల్లులను సృష్టించడం కోసం ఓ ముఠా 12 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసిందని అధికారి తెలిపారు. ఇక రెండో ముఠా పూర్తి వ్యవస్థీకృతంగా మనీ లాండరింగ్కు పాల్పడిందనీ, షేర్ మార్కెట్లలో ప్రస్తుత లావాదేవీలను పాత షేర్ల అమ్మకాలుగా చూపించి క్యాపిటల్ గెయిన్స్ ప్రయోజనాలను పొందారని చెప్పారు. ఈ మోసం విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నామనీ, అయితే చాలా ఏళ్లుగా ఈ మోసం జరుగుతున్నందున ఇంకా భారీ మొత్తంలోనే అక్రమ లావాదేవీలు జరిగి ఉండొచ్చని అధికారి అనుమానం వ్యక్తం చేశారు. మరో ముఠా రహస్యంగా విదేశీ బ్యాంకు ఖాతాలను కలిగి ఉడటంతోపాటు ఎగుమతుల వాస్తవ ధర కన్నా బిల్లుల్లో ఎక్కువ ధర చూపి నకిలీ డ్యూటీ, జీఎస్టీ ప్రయోజనాల పొందిందనీ, ఈ మోసం విలువ రూ. 1,500 కోట్లకు పైగా ఉంటుదని అధికారి తెలిపారు. సోదాల్లో సంతకాలు చేసిన, చేయని కొన్ని పత్రాలు, ఒప్పందాలు, ఆర్థిక వివాదాల పరిష్కార పత్రాలు తదితరాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
రాబర్ట్ వాద్రా స్కామ్ ఏమిటీ ?
సాక్షి, న్యూఢిల్లీ : లండన్లో అక్రమంగా ఆస్తులు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను బుధ, గురు వారాలతోపాటు శనివారం నాడు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాదాపు 15 గంటలపాటు విచారించింది. ఇంతకు ఆయనపై వచ్చిన ఆరోపణలు ఏమిటీ? ఆ ఆరోపణలు ఎలాంటివి, ఇప్పుడు వచ్చాయి ? వాటికి సంబంధించి ఈడీ అధికారుల వద్ద ఉన్న ఆధారాలు ఏమిటీ? ఆయనపై 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా బీజేపీ ఆరోపణలు చేసినప్పటికీ ఆయన్ని విచారించేందుకు ఎందుకు ఇంతకాలం పట్టింది ? ఆయనపై ఎప్పటి నుంచో ఈ ఆరోపణలు ఉన్నా ఆయన్ని ఇప్పుడే ఎందుకు విచారణ జరపాల్సిన అవసరం ఏర్పడింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2005లో ఓ రక్షణ ఒప్పందం, 2009లో ఓ పెట్రోలియం ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాలు, ముఖ్యంగా రక్షణ ఒప్పందం ద్వారా లబ్ది పొందిన ప్రముఖ ఆయుధాల వ్యాపారి సంజయ్ భండారి 2009లో లండన్లోని 12 బ్య్రాన్స్టన్ స్క్వేర్లో ఓ భవనాన్ని తన కంపెనీ ‘వోర్టెక్స్’ ద్వారా 19 లక్షల పౌండ్లకు కొనుగోలు చేశారు. దాన్ని ఆ మరసటి సంవత్సరమే దుబాయ్ వ్యాపారి సీసీ థంపీకి విక్రయించారు. ఆ భవనం పునరుద్ధరణకు సీసీ థంపీ 65 వేల పౌండ్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఆ భవనాన్ని బ్రిటన్లో సంజయ్ భండారీకి సంబంధం ఉన్న ఓ సింటాక్ కంపెనీకి కొన్న రేటుకే అంటే 19 లక్షల పౌండ్లకే విక్రయించారు. అంటే భండారీ కొనుగోలు చేసిన భవనం తిరిగి భండారీ చేతికే వచ్చిందన్న మాట. భండారి, సీసీ థంపీ, వాద్రాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నది ఈడీ అధికారుల వాదన. ఒప్పందాల్లో లబ్ది పొందినందుకుగాను భండారీ ఆ భవనాన్ని రాబర్ట్ వాద్రా కోసం ముడుపుల కింద కొనుగోలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. మరి ఈ ఆరోపణకు రుజువు ఏమిటీ? 2016లో ఢిల్లీలోని సంజయ్ భండారీ ఇంటిపై ఆదాయం పన్ను శాఖ అధికారులు దాడి చేసినప్పుడు ఓ కంప్యూటర్లో భండారి బంధువుకు, వాద్రా కార్యదర్శికి మధ్య నడిచిన ఈమెయిళ్లు దొరికాయి. లండన్లో ఉంటున్న భండారీ మేనల్లుడు సుమిత్ ఛద్దా, లండన్ 12 బ్య్రాన్స్టన్ స్కేర్ భవనం పునరుద్ధరణ బిల్లుల చెల్లింపుల గురించి వాద్రా కార్యదర్శికి ఆ మెయిల్స్ పంపించారు. అందులో ఓ మెయిల్కు వాద్రా స్వయంగా స్పందిస్తూ ‘రేపు ఉదయం ఈ విషయాన్ని పరిశీలిస్తాం. కార్యదర్శి మనోజ్ పరిష్కరిస్తారు’ అని చెప్పారు. భవనం పునరుద్ధర ణకు అయిన 65 వేల పౌండ్లను వాద్రా చెల్లించారనే, అందుకనే భండారి వద్ద కొన్న రేటుకు సీసీ థంపీ తిరిగి విక్రయించారని, తన ఆస్తి కావడం వల్ల వాద్రా పునరుద్ధరణ ఛార్జీలు చెల్లించారన్నది ఈడీ అధికారుల అనుమానం. సంజయ్ భండారీ 2008లో కేవలం లక్ష రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆఫ్సెట్ ఇండియా సొల్యుషన్స్ కంపెనీ కొన్నేళ్లలో కొన్ని కోట్ల రూపాయలకు ఎలా ఎదిగిందో దర్యాప్తు జరపాల్సిందిగా 2014లో అధికారంలోకి రాగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఐబీ అధికారులను ఆదేశించింది. 2012లో భారత ప్రభుత్వంతో దాదాపు మూడు వేల కోట్ల రూపాయలకు శిక్షణ విమానాల ఒప్పందాన్ని చేసుకున్న స్విస్ సంస్థ ‘పిలాటస్’తో భండారీకి సంబంధాలు ఉన్నాయని, ఆ సంస్థ యాజమాన్యంతో రాబర్ట్ వాద్రా కూడా సంబంధాలు ఉన్నాయంటూ ఐబీ అధికారులు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో వెల్లడించారు. లండన్లోని ఆస్తులు, ముడుపులకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు సంజయ్ భండారి, తన ఇంటిపై 2016లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించిన నేపథ్యంలో నేపాల్ మీదుగా లండన్ పారిపోయారు. దాంతో లండన్ ఆస్తుల కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. వాద్రా కార్యదర్శి, భండారి బంధువు మధ్య కొనసాగిన ఈ మెయిళ్లు మినహా మరో సాక్ష్యాన్ని ఈడీ అధికారులు సాధించలేకపోయారు. లండన్లో తనకు ఎలాంటి ఆస్తులు లేవని చెబుతున్న రాబర్ట్ వాద్రాను విచారిస్తున్న అధికారులు, భండారీతో ఆయనకున్న సంబంధాల గురించే గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నారని తెల్సిందే. ప్రియాంక గాంధీ క్రియాశీలక రాజకీయాల్లోకి రాగానే ఆమె భర్త వాద్రాను విచారించడానికి కారణం ఆమె నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీయడానికి లేదా ఆమె పరువు తీయడానికి ప్రయత్నం కావచ్చు. రఫేల్ యుద్ధ విమానాల డీల్లో నరేంద్ర మోదీని ప్రత్యక్షంగా విమర్శిస్తున్న రాహుల్ గాంధీ నోటికి తాళం వేసే ప్రయత్నమూ కావచ్చు. ఏదీ ఏమైనా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడమే అసలు విషయం. -
రూ. 2,000 నోటుకు కళ్లెం!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మరోవైపు, రూ. 2,000 నోట్ల వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు .. వీటి ముద్రణను ’కనిష్ట’ స్థాయికి తగ్గించినట్లు తెలిపాయి. ముద్రించాల్సిన కరెన్సీ పరిమాణంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమేనని వివరించాయి. చలామణీలో ఉన్న నగదును ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే క్రమంగా వీటి ముద్రణ తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘రూ. 2,000 కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా తగ్గించడం జరిగింది. కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి కొత్తేమీ కాదు’ అని వివరించారు. మొత్తం కరెన్సీలో 37 శాతం నోట్లు.. బ్లాక్మనీని కట్టడి చేసే లక్ష్యంతో 2016 నవంబర్లో రూ.1,000, రూ. 500 డినామినేషన్ల పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ స్థాయిలో ఏర్పడిన నగదు కొరతను సత్వరం అధిగమించేందుకు ప్రభుత్వం రూ. 2,000 నోట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2,000 నోట్ల సంఖ్య సుమారు 328.5 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 336.3 కోట్ల నోట్లకు చేరింది. 2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది. గతేడాది మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18.03 లక్షల కోట్లు కాగా ఇందులో సుమారు 37 శాతం (దాదాపు రూ. 6.73 లక్షల కోట్ల విలువ) రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. మరో 43 శాతం (విలువ సుమారు రూ. 7.73 లక్షల కోట్లు) రూ. 500 నోట్లు ఉన్నాయి. మిగతా నోట్లు అంతకన్నా తక్కువ విలువ గలవి. అప్పట్లోనే విమర్శలు.. పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్కు ఉపయోగపడుతోందన్న కారణంతో 2016 నవంబర్లో రూ.1,000 నోట్లను రద్దు చేసిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల రూపంలో అంతకన్నా అధిక విలువ గల నోట్లను ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. పన్ను ఎగవేతదారులకు, మనీల్యాండరర్స్కు ఈ అధిక విలువ కరెన్సీ నోట్లు మరింత బాగా ఉపయోగపడతాయని, మనీల్యాండరింగ్ లాంటివి అరికట్టడమే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్రం లక్ష్యాల సాధనకు ఇవి ప్రతికూలమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వంటి ప్రముఖులు కూడా దీన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే గతేడాది పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నగదు కొరత ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎన్నికలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో చాలా మంది ఈ పెద్ద నోట్లను భారీ స్థాయిలో దాచి పెట్టుకుని ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిని రుజువు చేస్తూ ఆదాయ పన్ను శాఖ సోదాల్లో పలు చోట్ల భారీ ఎత్తున రూ. 2,000 నోట్లు బయటపడ్డాయి. -
చిదంబరంపై ఈడీ చార్జిషీటు
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం చుట్టూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఉచ్చు బిగిస్తోంది. ఎయిర్సెల్–మాక్సిస్ మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టులో ఆయనపై చార్జిషీటు దాఖలు చేసింది. అనుమతులు ఇచ్చే విషయంలో విదేశీ పెట్టుబడిదారులతో కుమ్మక్కయ్యారని అందులో ఈడీ ఆరోపించింది. చిదంబరం కుమారుడు కార్తీ చార్టర్డ్ అకౌంటెంట్ ఎస్.భాస్కరన్ పేరును కూడా స్పెషల్ జడ్జి ఓపీ సైనీ ఎదుట సమర్పించిన ఆ చార్జిషీటులో ప్రస్తావించింది. అయితే సీబీఐ, ఈడీ ఆరోపణలను చిదంబరం, ఆయన కుమారుడు ఖండించారు. ఈ చార్జిషీటులో ఎయిర్సెల్ మాజీ సీఈవో వి.శ్రీనివాసన్, మాక్సిస్కు చెందిన ఆగస్టస్ రాల్ఫ్ మార్షల్, ఆస్ట్రో ఆల్ ఏసియా నెట్వర్క్స్ మలేసియా, ఎయిర్సెల్ టెలీవెంచర్స్ లిమిటెడ్, మాక్సిస్ మొబైల్ సర్వీసెస్, బుమీ అర్మడా బెర్హాద్ పేర్లను కూడా పొందుపరిచారు. నవంబర్ 26న ఈ చార్జిషీటు విచారణకు రానుంది. విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు నిబంధనలను అతిక్రమించి అక్రమంగా ఇచ్చిన అనుమతులను 2006లో కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న చిదంబరం ఆమోదం తెలిపారని, ఈ వ్యవహారంలో రూ.1.6 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
కార్తీ చిదంబరం ఆస్తుల జప్తు
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో దేశ, విదేశాల్లో ఉన్న రూ.54 కోట్ల విలువైన కార్తీ చిదంబరం ఆస్తులను జప్తు చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) గురువారం ప్రకటించింది. తమిళనాడులోని ఊటీ, కొడైకెనాల్లలో ఉన్న సాగు భూమి, బంగళా, ఢిల్లీలో కార్తీ, అతని తల్లి నళిని పేరిట ఉన్న రూ.16 కోట్ల ఖరీదైన ఫ్లాట్, బ్రిటన్లోని సోమర్సెట్లో ఉన్న రూ.8.67 కోట్ల కాటేజీ, ఇల్లు, స్పెయిన్లోని బార్సిలోనాలో రూ.14.57 కోట్ల టెన్నిస్ క్లబ్లను మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) ప్రకారం జప్తు చేస్తున్నట్లు తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది. చెన్నై బ్యాంకులోని కార్తీకి, అతనికి చెందినదిగా భావిస్తున్న అడ్వాంటేజ్ స్ట్రాటెజిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎస్సీపీఎల్) పేరుతో ఉన్న రూ.90 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ను కూడా జప్తు చేస్తున్నట్లు తెలిపింది. ’అటాచ్మెంట్ ఉత్తర్వు చట్ట విరుద్ధం..హాస్యాస్పదం, అనాగరికం. వాస్తవాల ఆధారంగా కాకుండా కేవలం పిచ్చి ఊహాగానాలతో తీసుకున్న చర్య. వార్తల్లోకి ఎక్కటమే దీని వెనుక ఉద్దేశం’ అని కార్తీ అన్నారు.