
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్ ముగింపుతో పోలిస్తే బుధవారం స్థిరంగా కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:37 సమయానికి నిఫ్టీ(Nifty) 19 పాయింట్ నష్టపోయి 22,817కు చేరింది. సెన్సెక్స్(Sensex) 58 పాయింట్లు దిగజారి 75,241 వద్ద ట్రేడవుతోంది.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 103.3 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్ఆయిల్ బ్యారెల్ ధర 70.38 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్లు 4.29 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్లో నష్టాల్లో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్తో పోలిస్తే 1.07 శాతం నష్టపోయింది. నాస్డాక్ 1.71 శాతం దిగజారింది.
ఇదీ చదవండి: విమాన ప్రయాణాలు మరింత భారం
జాతీయ, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో మంగళవారం దేశీయ స్టాక్ సూచీలు ఒకటిన్నర శాతం ర్యాలీ అయ్యాయి. అమెరికా కరెన్సీ డాలర్ బలహీనత, క్రూడాయిల్ ధరలు దిగిరావడం వంటి అంశాలూ కలిసొచ్చాయి. గడిచిన రెండు రోజుల వరుస లాభాలతో స్టాక్ మార్కెట్లో రూ.8.67 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.399 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్ మారకంలో రూపాయి విలువ 25 పైసలు పెరిగి 86.56 వద్దకు చేరింది.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)
Comments
Please login to add a commentAdd a comment