మూడు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప | ACB Officials Caught Lachunayak While Taking Bribe | Sakshi

మూడు లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

Feb 16 2024 1:03 PM | Updated on Feb 16 2024 1:18 PM

ACB Officials Caught Lachunayak While Taking Bribe - Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రూ.3 లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాధితుల వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా అధికారులు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 

వివరాల ప్రకారం.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌ ఏసీబీకి చిక్కారు. రూ.3 లక్షలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఔషధాల టెండర్‌ కోసం వెంకన్న అనే వ్యాపారి నుంచి ఈ మొత్తాన్ని డిమాండ్‌ చేశారు. దీంతో, సదరు బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. 

ఈ క్రమంలో శుక్రవారం ఆయన నివాసంలో వెంకన్న నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేశారు. రెడ్‌హ్యాం​డెడ్‌గా అధికారిని పట్టుకున్నారు. అయితే, ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్లుగా ఔషధాలు సరఫరా చేస్తున్నట్లు వెంకన్న తెలిపారు. కొన్నాళ్లుగా సూపరింటెండెంట్‌ 10 శాతం కమీషన్‌ తీసుకుంటున్నారని, ఇటీవల అధికశాతం కావాలని డిమాండ్‌ చేసినట్లు వెల్లడించారు. నెలరోజుల క్రితం రూ.లక్ష లంచంగా ఇవ్వగా.. నాలుగు రోజుల క్రితం మరో రూ. 3 లక్షలు డిమాండ్‌ చేయడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement