న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కారును ట్రక్కు ఢీకొట్టిన దుర్ఘఘనలో ఓ పోలీస్ ఇనస్పెక్టర్ మృత్యువాతపడ్డాడు. మదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం వెలుగుచూసింది. వివరాలు.. ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన సీఐ జగ్బీర్ సింగ్ ప్రయాణిస్తున్న కారు సాంకేతిక సమస్యతో రోహ్తక్ రోడ్డుపై ఆగిపోయింది.
దీంతో కారు దిగి ఆయన పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగ్బీర్ సింగ్ అక్కడికక్కడే మరణించాడు.
ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి నిలిపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేక కావాలనే హత్య కుట్రతో జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కాశ్మీర్లో సెలవుపై వచ్చిన భారత జవాను అదృశ్యం
Delhi | A Delhi Police inspector died after his car was hit by a truck from behind on Rohtak Road, near Madipur metro station. The car had stopped due to some mechanical problem and the deceased was standing outside when his car was hit by the truck. The deceased has been… pic.twitter.com/qDE5aLHP4x