నంద్యాలలో విషాదం.. నిద్రలోనే కుటుంబం మృత్యువాత | Family Killed After Wall Collapsed in Nandyala District | Sakshi
Sakshi News home page

నంద్యాలలో విషాదం.. నిద్రలోనే కుటుంబం మృత్యువాత

Published Fri, Aug 2 2024 7:25 AM | Last Updated on Fri, Aug 2 2024 8:36 AM

Family Killed After Wall Collapsed in Nandyala District

సాక్షి, నంద్యాల: జిల్లాలోని చాగలమర్రి మండలం చిన్నవంగలిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో దంపతులు, వాళ్ల ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆ కుటుంబ సభ్యులపై మట్టి మిద్దె కూలి ఒక్కసారిగా మీద పడింది. దీంతో ఆ  కుటుంబం అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు తెల్లారి చూసేసరికి దిబ్బల కింద ఆ కుటుంబం సజీవ సమాధి అయ్యి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. బాధిత కుటుంబాన్ని గురుశేఖర్ రెడ్డి కుటుంబంగా పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనతో కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోగా..  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement