![Fire Accident At Sangareddy Industrial Area - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/23/pic4.jpg.webp?itok=KIBfsE6B)
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని ఓ గోదాములో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చోసుకుంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. 10 మంది ఫైర్ సిబ్బంది సుమారు 2 గంటలు శ్రమ పడి మంటలను అదుపు చేశారు. అదే విధంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి విద్యుత్ అధికారులు ప్రయత్నం చేశారు. ఇక పరిశ్రమ యజమానిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధంచిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment