కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే ఇద్దరు కలిసి.. | Love Failure: Young Couple Ends Their Life Orissa | Sakshi

కలిసి బతకలేమని అర్థమైంది.. అందుకే ఇద్దరు కలిసి..

Jan 23 2022 9:21 AM | Updated on Jan 23 2022 9:36 AM

Love Failure: Young Couple Ends Their Life Orissa - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

కొరాపుట్‌/నవరంగపూర్‌: ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నవరంగపూర్‌ జిల్లాలోని రాయిఘర్‌ సమితి, తురు(యువీ) గ్రామంలో శనివారం కలకలం రేపింది. తురు గ్రామానికి చెందిన దర్బార్‌ గోండో(20), కంగ గ్రామానికి చెందిన సునీత గోండో(18) గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను నిరాకరించారు.

దీంతో తాము జీవితంలో కలిసి ఉండలేమని భావించిన వారు చనిపోయేందుకు నిర్ణయించుకున్నారు. తురు గ్రామంలోని దర్బారు నివాసానికి 200 మీటర్ల దూరంలో ఓ చెట్టుకు ఇద్దరూ ఉరేసుకుని చనిపోయారు. దీనిపై రాయిఘర్‌ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement