పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక.. | Married Woman Commits Suicide In Hyderabad Over Conflicts | Sakshi

జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..

Published Sat, Oct 30 2021 8:31 AM | Last Updated on Sat, Oct 30 2021 9:22 AM

Married Woman Commits Suicide In Hyderabad Over Conflicts - Sakshi

సాక్షి, జియాగూడ: పెళ్లయిన నాటి నుంచి ఇంట్లో తరచూ గొడవల కారణంగా మనస్థాపం చెందిన ఓ గృహిణి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళ్‌హాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం జరిగింది. ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. పోలీస్‌ స్టేషన్‌ ఇంద్రానగర్‌లో ఉంటున్న కరణ్‌ ఖాళీ ఇంట్లోనే ఉంటున్నాడు. ఏడాదిన్నర క్రితం సికింద్రాబాద్‌ పాటిగడ్డ అస్మత్‌పేట్‌ ప్రాంతానికి చెందిన శ్వేత(22)తో వివాహం జరిగింది.

ఇటీవల వారికి కూతురు కూడా జన్మించింది. అయినా గొడవలు తగ్గకపోవడంతో మనస్థాపం చెందిన శ్వేత శుక్రవారం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement