Viral: Karnataka Persons Cheated Finance Company Employee For Money - Sakshi

వామ్మో.. కిలాడీ గ్యాంగ్‌.. ఫైనాన్స్‌ ఉద్యోగికి మాయమాటలు చెప్పి..

Jul 20 2021 1:50 PM | Updated on Jul 20 2021 4:26 PM

Woman Elude Finance Employee In Karnataka - Sakshi

సాక్షి, మైసూరు(కర్ణాటక): మండ్యకు చెందిన సౌమ్య (29), చామరాజనగరకు చెందిన ప్రసాద్‌(30) అనే ఇద్దరిని మైసూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ ఓ ఫైనాన్స్‌ కంపెనీ ఉద్యోగి సురేష్‌తో పరిచయం పెంచుకున్నారు. తమ బంగారం వేరొకరి వద్ద కుదువలో ఉందని మాయమాటలు చెప్పారు. అంతటితో ఆగకుండా డబ్బులు కావాలని కోరారు.

మీరు డబ్బులిస్తే విడిపించి మీకే అమ్ముతామని సురేష్‌ను నమ్మించి రూ.1.75 లక్షలను తీసుకున్నారు. తరువాత ఇద్దరూ మొబైల్‌ఫోన్లను స్విచ్చాఫ్‌ చేయడంతో బాధితుడు సాలిగ్రామ పోలీసులకు ఫిర్యాదు చేయగా, గాలించి ఇద్దరినీ అరెస్టు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement