యూబీఐ ఎంఎస్ఎంఈ రుణమేళా
కొరిటెపాడు(గుంటూరు): యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు రీజియన్ పరిధిలో జీటీ రోడ్లోని ప్రాంతీయ కార్యాలయంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) రుణమేళా మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జీటీ రోడ్లోని యూబీఐ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ రుణమేళాలో యూబీఐ చీఫ్ జనరల్ మేనేజర్ బిజు వాసుదేవన్ మాట్లాడుతూ ఖాతాదారుల ఉన్నతికి యూబీఐ కృషి చేస్తోందన్నారు. ఖాతాదారుల ప్రయోజనాలే లక్ష్యంగా సేవలందిస్తున్నామని చెప్పారు. తక్కువ వడ్డీకే రుణాలు సకాలంలో ఇవ్వడంతో పాటు, డిపాజిట్ దారులకు లాభదాయకమైన వడ్డీ అందిస్తున్నట్లు వివరించారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యూబీఐ సేవలు విస్తరిస్తున్నామని, వీటిని ఖాతాదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాలో గుంటూరు ఆటోనగర్, తెనాలి, మంగళగిరి పరిధిలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల దారుల(ఎంఎస్ఎంఈ)కు రూ.150 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూబీఐ గుంటూరు రీజియన్ రీజినల్ హెడ్ ఎస్.జవహర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment