Police Boss Said No to Mutual Transfer of Two Inspectors Under Warangal Police Commissionerate - Sakshi

అయోమయంలో ఆ.. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు

Jul 21 2023 1:24 AM | Updated on Jul 21 2023 2:27 PM

- - Sakshi

వరంగల్‌: వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పనిచేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ఇద్దరు ఇన్‌స్పెక్టర్లకు చుక్కెదురైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖలో బదిలీలు ముమ్మరమయ్యాయి. తాము కూడా ఎన్నికల ఎఫెక్ట్‌ బదిలీలో ఉంటామని భావించిన ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు నియోజకవర్గంలోనే మ్యూచువల్‌ ట్రాన్స్‌ఫర్‌కు సిద్ధమయ్యారు.

ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నందున మ్యూచువల్‌ బదిలీ ప్రణాళికకు సదరు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి ఓకే అన్నారు. ఇందుకు ఆ ఇన్‌స్పెక్టర్లు చెరో రూ.10లక్షలు మొత్తం రూ.20 లక్షలు సమర్పించుకున్నట్లు తెలిసింది. ఆతర్వాత ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు పోస్టింగ్‌లు ఖాయమనుకుని రెట్టింపు ఉత్సాహంతో సదరు ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో పోలీస్‌ బాస్‌ను కలిశారు.

అసలు ట్విస్ట్‌ ఇక్కడే మొదలైంది. ఇటీవల ఆ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఇతర సమీకరణాల కారణంగా పోలీస్‌ పోస్టింగ్‌లను సైతం ప్రభుత్వ పెద్దలే నిశితంగా చూస్తుండడం.. దీంతోపాటు ఆ ప్రజాప్రతినిధి ‘పెత్తనం’ నడవకపోవడంతో మ్యూచువల్‌ బదిలీకి పోలీస్‌ బాస్‌ నో అని చెప్పినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు చేసేది లేక ఒకరి ముఖం ఒకరు చూసుకుని లబోదిబోమని మొత్తుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆ ఇద్దరు ఇన్‌స్పెక్టర్లపై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరిపై ఎస్‌బీ అధికారులు.. సీపీకి నివేదికలను సైతం సమర్పించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement