constables selection
-
ఉద్యోగ పరుగులో ఆగిన ఊపిరి
కోనేరుసెంటర్(మచిలీపట్నం): ఉద్యోగ పరుగులో ఓ యువకుడి ఊపిరి ఆగిపోయింది. కానిస్టేబుల్ సెలక్షన్స్లో భాగంగా 1,600 పరుగులో పాల్గొన్న ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం జీలగొండి గ్రామానికి చెందిన దరావతు చంద్రశేఖరరావు (21) డిగ్రీ, డీఈడీ పూర్తి చేశాడు. నిరుపేద కుటుంబానికి చెందిన చంద్రశేఖరరావు తండ్రి చనిపోవటంతో తల్లి కష్టపడి చదివించింది. అతను ప్రభుత్వ ఉద్యోగం పొందాలనే లక్ష్యంతో డీఎస్సీ(పీఈటీ) కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గతంలోనే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష పాసయ్యాడు. ఈ క్రమంలో మచిలీపట్నంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ)కు హాజరయ్యాడు. ఇందులో భాగంగా 1,600 మీటర్ల పరుగు పందెంలో పాల్గొని గ్రౌండ్లో మూడు రౌండ్లు పూర్తి చేసిన చంద్రశేఖరరావు... నాలుగో రౌండ్ పూర్తి చేయడానికి కొద్ది దూరంలో ఒక్కసారిగా అస్వస్థతకు గురై పక్కకు పడిపోయాడు. పోలీసు అధికారులు వెంటనే అతన్ని పక్కకు తప్పించి అక్కడ ఉన్న వైద్య సిబ్బందితో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం మచిలీపట్నం సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొద్దిసేపటికే చంద్రశేఖరరావు మృతిచెందాడు. ఆస్పత్రిలో విగతజీవిగా ఉన్న కుమారుడిని చూసి ‘నాకింక దిక్కెవరయ్యా...’ అంటూ చంద్రశేఖరరావు తల్లి రోదిస్తున్న తీరు అక్కడ ఉన్న అందరినీ కలచివేసింది. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు చిలకలపూడి పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
ఇన్ఫోసిస్, విప్రోలాంటి సంస్థల్లో ఉద్యోగం కాదనుకుని కానిస్టేబుల్గా..!
ఇన్ఫోసిస్, విప్రోలాంటి పెద్ద సంస్థల నుంచి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వెదుక్కుంటూ వస్తే... ఏ అమ్మాయికైనా సంతోషమే. అయితే సౌమ్య మాత్రం ఆ సంతోషాన్ని కాదనుకుంది. కారణం... పోలిస్ ఉద్యోగంపై ఆమెకు ఉన్న ఇష్టం. ప్రస్తుతం పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తోంది. సౌమ్య ఉద్యోగ ఎంపిక చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఆమె మాత్రం... ‘ఇది తొలి అడుగు. ఐపీఎస్ నా లక్ష్యం’ అంటుంది....జనగామ జిల్లా తిరుమలగిరికి చెందిన ఉప్పునూతల సౌమ్య ఒకవైపు చదువులో రాణిస్తూనే దుక్కి దున్నడం, పురుగు మందు పిచికారీ చేయడం, కలుపు తీయడంలాంటి వ్యవసాయ పనుల్లో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేది. కానిస్టేబుల్ శిక్షణ సమయంలో బెస్ట్ ఆల్రౌండర్, ఇండోర్ ట్రోఫీలను గెలుచుకున్న సౌమ్య 2024 బ్యాచ్ స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసింగ్ అవుట్ పరేడ్లో 1,211 మంది మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్గా వ్యవహరించింది.అమ్మ బడిలో...‘మా అమ్మకు చదువుకోవాలని ఉండేది. కానీ కుటుంబ సమస్యలతో సాధ్యపడలేదు. అందుకే మా చదువులపై ఎప్పటికీ రాజీపడలేదు. మాకు రోజూ లెక్కలు చెప్పేది. గూడూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో నేషనల్ క్యాడెట్ కార్పస్ను ప్రవేశపెట్టినప్పుడు పోలీస్ యూనిఫాం పట్ల ఇష్టం ఏర్పడింది. నేను పదవ తరగతి చదివే సమయానికి నా స్నేహితుల్లో చాలామందికి పెళ్లి జరిగింది. అయితే పెళ్లి విషయంలో తల్లిదండ్రులు నన్ను ఎప్పుడూ బలవంతం చేయలేదు. నేను ఎంత చదివితే వారికి అంత సంతోషం. మా గ్రామం నుంచి ఎవరూ పాఠశాల స్థాయి దాటి ముందుకు సాగలేదు’ అంటుంది బీటెక్ చేసిన సౌమ్య. తెలంగాణలో కానిస్టేబుల్గా పనిచేయడానికి ముందు సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా ఎంపికైంది సౌమ్య. ఢిల్లీలో కొంత కాలం పాటు పనిచేసింది. ఎలాంటి కోచింగ్లపై ఆధారపడకుండా స్వతంత్రంగా పారామిలిటరీ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించడం తన మీద తనకు ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది.ఢిల్లీ నుంచి తిరిగి ఇంటికి...‘తల్లిదండ్రులకు చాలా దూరంగా ఉంటున్నాను. వారు ఎలా ఉన్నారో ఏమిటో!’ అనే దిగులుతో తిరిగి సొంత ఊరికి వచ్చింది సౌమ్య.మళ్లీ..ఎంతోమందికి ఆశ్చర్యం!‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ఇలా వచ్చావేమిటి’ అని అడిగిన వాళ్లకు సౌమ్య ఏం జవాబు చెప్పిందో తెలియదుగానీ... అదే సమయంలో మరో అవకాశం ఆమెను వెదుక్కుంటూ వచ్చింది. తెలంగాణలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇంట్లోనే ఉంటూ రాత్రింబవళ్లు కష్టపడి చదువుకుని కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. ‘ఐపీఎస్ కచ్చితంగా సాధిస్తాను. ఇది గొప్ప కోసం చెబుతున్న మాట కాదు. ఆత్మవిశ్వాసంతో చెబుతున్న మాట’ అంటుంది సౌమ్య స్వరంతో ఉప్పునూతల సౌమ్య.నా బిడ్డ సాధించింది... ఇంకా ఎంతో సాధిస్తుంది!పోలిస్ అకాడమీలో మహిళా ట్రైనీలకు పరేడ్ కమాండర్గా వ్యవహరించిన సౌమ్యను చూసి పొంగిపోయాను. నాలాగా నా పిల్లలు చదువుకు దూరం కావద్దు అనుకున్నాను. చదువులోనే కాదు వ్యవసాయ పనుల్లోనూ కూడా సౌమ్య కష్టపడి పనిచేస్తుంది. నా బిడ్డ సాధించింది. ఇంకా ఎంతో సాధిస్తుంది.– అరుణ, సౌమ్య తల్లి – కొత్తపల్లి కిరణ్ కుమార్, సాక్షి, జనగామఫొటోలు: గోవర్ధనం వేణుగోపాల్ -
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మహిళా కానిస్టేబుల్ పరువు హత్య
-
సవాళ్లకు అనుగుణంగా శిక్షణలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: క్షేత్రస్థాయిలో మారిన నేరసరళి, పోలీస్ విధుల ఆధారంగా నూతన కానిస్టేబుళ్ల శిక్షణలో పలు మార్పు లు చేసినట్టు తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, శిక్షణ విభాగం డీజీ అభిలాష బిస్త్ తెలిపారు. రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల నియంత్రణకు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ అంశాలు, మత్తుపదార్థాల రవాణాకు అడ్డుకట్ట వేసేలా యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్కు సంబంధించిన అంశాలను ఈసారి కానిస్టేబుల్స్ శిక్షణలో అదనంగా చేర్చినట్టు వెల్లడించారు. లింగ వివక్షకు తావులేకుండా శిక్షణలో పలు కీలక అంశాలపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 8,047 మంది కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో బిస్త్ పలు అంశాలను పంచుకున్నారు. సిలబస్లో సైబర్ సెక్యూరిటీరాష్ట్రవ్యాప్తంగా మొత్తం 19 పోలీస్ శిక్షణ కేంద్రాల నుంచి 8,047 మంది కానిస్టేబుళ్లు పాసింగ్ అవుట్ పరేడ్లో పాల్గొననున్నారు. వీరిలో 4,116 మంది సివిల్ కానిస్టేబుళ్లు, 3,685 మంది ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్), 228 మంది ఐటీ కమ్యూనికేషన్స్, 18 మంది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీఓ) కానిస్టేబుళ్లు ఉన్నారు. శిక్షణ సిలబస్లో సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు, యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్ అంశాలను తొలిసారిగా చేర్చి అవగాహన కల్పించాం. సైబర్ నేర విధానం (మోడస్ అపరెండీ) ఎలా ఉంటుంది, ఇతర అంశాలపై కనీస పరిజ్ఞానం ఉండేలా తరగతులు నిర్వహించాం. యాంటీ నార్కోటిక్స్ ఆపరేషన్స్లో పాల్గొనడం, దర్యాప్తులో పై అధికారులకు సహకరించడం తదితర అంశాల్లో తర్ఫీదు ఇచ్చాం. సెల్ఫ్ డిఫెన్స్కు ప్రాధాన్యత ఇన్డోర్తో పాటు ఔట్డోర్ శిక్షణలో సెల్ఫ్ డిఫెన్స్కు ప్రాధాన్యత పెంచాం. పని ఒత్తిడి తట్టుకునేలా శారీరకంగా, మానసికంగా ధృఢంగా ఉండేలా కొన్ని మార్పులు చేశాం. క్షేత్రస్థాయిలో విధుల్లో ఉండే సివిల్ కానిస్టేబుళ్లకు కూడా నూతన నేర చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక తరగతులు నిర్వహించాం. నేర దర్యాప్తు, కేసుల నమోదు, క్షేత్రస్థాయి విధుల్లో తరచూ అవసరమయ్యే చట్టాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాం. అదేవిధంగా నేరం జరిగిన ప్రాంతానికి చేరుకోగానే ఏం చర్యలు తీసుకోవాలి, పై అధికారి వచ్చే వరకు క్రైం సీన్ను కాపాడడం వంటి అంశాలపై శిక్షణ ఇచ్చాం. ఈ బ్యాచ్లో 5,470 మంది గ్రాడ్యుయేట్లు, 1,361 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు. 15 మంది ఎల్ఎల్బీ పూర్తి చేసిన వారున్నారు. -
డిసెంబర్లో ‘కానిస్టేబుల్’ దేహదారుఢ్య పరీక్షలు
సాక్షి, అమరావతి: కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పోలీసు నియామక మండలి (ఎస్ఎల్పీఆర్బీ) తెలిపింది. 2023, జనవరి 21న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 4.59 లక్షల మంది హాజరుకాగా వారిలో 95,208 మంది అర్హత సాధించారు. న్యాయపరమైన అంశాలతో దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ వివాదాలు పరిష్కారం కావడంతో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని ఎస్ఎల్పీఆర్బీ నిర్ణయించింది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన వారిలో 92,507 మంది దేహదారుఢ్య పరీక్షల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేశారని, మిగిలిన వారూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తులు నవంబర్ 11–21 వరకు slprb.ap.gov.in లో అందుబాటులో ఉంటాయని పేర్కొంది. పూర్తి వివరాలకు హెల్ప్లైన్ నంబర్లు 9441450639, 9100203323ను సంప్రదించాలని సూచించింది. -
అమ్మో! 'ఆడపిల్ల' అనుకునే తల్లిదండ్రులకు..ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి!
టెక్నాలజీ పెరిగి ఎంతో ముందుకు వెళ్లిపోతున్నప్పటికీ లింగ వివక్షత మాత్రం అలానే ఉంది. మహిళలు కూడా తాము మగవాళ్లకు ఎందులోనూ తీసిపోము అన్నట్లుగా ప్రతీ రంగంలో దూసుకుపోతున్నా.. 'ఆడపిల్ల' అనంగానే చాలా మంది తల్లిదండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంటుంది. వారసుడుగా కొడుకుకి ఉన్నంత ఆదరణ కూతుళ్లకు ఎందుకు ఉండదనేది తరతరాలుగా వేధిస్తున్న చిక్కు ప్రశ్న. అందులోనూ ఇద్దరు ఆడపిల్లలున్న తల్లిదండ్రులంటే సమాజం సైతం తెగ జాలి చూపించేస్తుంది. అమ్మో! ఇద్దరూ ఆడపిల్లలే!.. అంటూ పదేపదే గుర్తు చేసి ఆయా తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. దీంతో ఆయా తల్లిదండ్రుల కూడా తాము కన్నది ఆడపిల్లలు కదా! అని భయంభయంగా గడుపుతారు. కానీ ఇక్కడొక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే గాదు, శభాష్ ఇలా పెంచాలి ఆడపిల్ల అని అందరిచేత ప్రశంసలందుకున్నాడు. ఈ తండ్రి గాథ కచ్చితంగా ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది, గొప్ప మార్పు తెప్పిస్తుంది. వివరాల్లోకెళ్తే...బిహార్లోని సరన్ జిల్లాకు చెందిన రాజ్కుమార్ సింగ్ పిండి మిల్లు కార్మికుడు. ఆయన కూడా అందరిలా తనకి వారుసుడు పుట్టాలని ఎంతగానో అనుకున్నాడు. అయితే మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టడంతో ఇంటికి మహాలక్ష్మీ వచ్చిందనుకున్నాడు. ఆ తర్వాత రెండవ కాన్పులో వారసుడు పుడతాడని కొండంత ఆశతో ఎదురుచూడగా మళ్లీ ఆడపిల్లే జన్మించింది. అయినప్పటికీ రాజ్ కుమార్ సింగ్ బాధపడలేదు. ఇలా ఏడుగురు పిల్లల్ని కన్నాడు. అయితే అందరూ ఆడపిల్లలే పుట్టారు. అయితే ఏంటీ? మంచి చదువులు చెప్పించి శివంగుల్లా పెంచాలనుకున్నాడు. అందరిలా ఇతను కూడా తన కూతుళ్లను ఓ వయసు వచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టేయాలనుకోలేదు. తన తాహతకు మించి ఏడుగుర్ని ఉన్నత చదువులు చదివించాడు. ఇక్కడ రాజసింగ్ సింగ్ని కూతుళ్ల పెళ్లిళ్ల గురించి ఇరుగుపొరుగు వారు పదేపదే గుర్తు చేస్తూ భయపెడుతూనే ఉండేవారు. కానీ ఆ తండ్రి మాత్రం కూతుళ్లను వాళ్ల కాళ్లమీద నిలబడి గలిగేలా పెంచితే చాలు అనే సూత్రాన్ని గట్టిగా నమ్మేవాడు. అదే నిజమయ్యేలా చేశారు ఏడుగురు కూతుళ్లు కూడా. వారంతా పోలీసు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ప్రభుత్వోద్యోగాలు సాధించి తండ్రి ఆలోచనను నిజం చేశారు. ఇక పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తోంది. రెండవ కూతురు హాని ఎస్ ఎస్ బి లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కూతురు సోనీ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తోంది. ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఇలా ఏడుగురు కూతుర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం గొప్ప విషయం అయితే.. వారిని ఆ దిశగా ప్రేరేపించడం మరింత గొప్ప విషయం. ఇన్నాళ్లు రాజ్ కుమార్ని ఆడిపిల్లలు అని భయపెట్టే ఇరుగుపొరుగు అంతా అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. పైగా పెంచితే అతడిలా పెంచాలి అని మెచ్చుకుంటున్నారు. కూతురిని భారంగా భావించే వారికి ఈ తండ్రి కథ తగిన సమాధానమిస్తుంది. (చదవండి: నవజాత శిశువులకు బ్లడ్ ఎక్కించాల్సి వస్తే.. ఏ గ్రూప్ రక్తాన్ని ఇస్తారంటే..!) -
కానిస్టేబుల్ నియామకాలకు లైన్క్లియర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలో 15,750 కానిస్టేబుల్ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. ఎంపిక పరీక్షలో అభ్యర్థులకు నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు ప్రకటించాలన్న సింగిల్ జడ్జి తీర్పును ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలకు సంబంధించి నిపుణుల కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ)ను ధర్మాసనం ఆదేశించింది. ఆ కమిటీల నివేదికలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, వెంటనే నియామక ప్రక్రియ ప్రారంభించి నాలుగు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి తీర్పుతో.. రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం 2022 ఆగస్టు 30న తుది రాతపరీక్ష జరిగింది. అందులో దాదాపు 23 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్టు అభ్యర్థులు పేర్కొన్నారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతోపాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సింగిల్ జడ్జి.. ‘‘ఈ పరీక్షలో నాలుగు ప్రశ్నలను మినహాయించి అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలి. 122, 130, 144 ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదు. 57 ప్రశ్న తప్పుగా ఉంది. వాటిని ప్రశ్నపత్రం నుంచి తొలగించాలి. ఈ మార్పులతో పేపర్లను మళ్లీ మూల్యాంకనం చేసి, ఫలితాలను ప్రకటించాలి. తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’’అని తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి అన్ని అంశాలను పరిశీలించలేదని, ఆ తీర్పును కొట్టివేయాలని కోరింది. ఆ పని నిపుణుల కమిటీలే చేయాలి రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్పై జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ నామవరపు రాజేశర్వర్రావుల ధర్మాసనం విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును పక్కనపెడుతున్నట్టు పేర్కొంది. రిక్రూట్మెంట్ బోర్డులు నిర్వహించే నియామక పరీక్షల్లో తలెత్తే సమస్యల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకుని ప్రశ్నలు తొలగించడం సరికాదని స్పష్టం చేసింది. ఇలాంటి పనులను నిపుణుల కమిటీలే చేయాలంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఈ సందర్భంగా ప్రస్తావించింది. ప్రశ్నల తప్పిదాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో స్వతంత్ర కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించింది. అభ్యర్థులలో విశ్వాసం పెంపొందించేలా పారదర్శకంగా రెండు కమిటీలను ఏర్పాటు చేయాలని.. ఆ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలని నియామక బోర్టును ఆదేశించింది. ఒక కమిటీలో ఉన్న సభ్యులు మరో కమిటీలో ఉండకూడదని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లోగా నియామక ప్రక్రియను పూర్తిచేయాలని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు ఊరట రిక్రూట్మెంట్ బోర్డు కానిస్టేబుల్ పరీక్షలకు సంబంధించి గత ఏడాది అక్టోబర్ 4వ తేదీనే ఫలితాలు ప్రకటించింది. మొత్తం 16,604 పోస్టులకు గాను 15,750 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ.. జాబితాను విడుదల చేసింది. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళలు ఉన్నారు. వారందరికీ హైకోర్టు ధర్మాసనం తీర్పుతో ఊరట లభించింది. -
హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు...!
-
తెలంగాణ కానిస్టేబుల్ సెలక్షన్స్కి లైన్క్లియర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అడ్డంకి తొలగింది. కానిస్టేబుల్ నియామకంపై గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. నెలలోపు కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో.. 15,640 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ అయ్యింది. కానిస్టేబుల్ ప్రశ్న పత్రం లో నాలుగు ప్రశ్నలకు మార్కులు కలపాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీంతో.. సెలక్ట్ అయిన అభ్యర్థులు సింగిల్ బెంచ్ తీర్పు ను సవాలు చేశారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. గత తీర్పును కొట్టేసింది. సింగిల్ ప్రశ్నల తప్పిదాలపై ఇండిపెండెంట్ ఎక్సపర్ట్ కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూనే.. నాలుగు వారాల్లో కానిస్టేబుల్ సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేయాలనీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
TS: కానిస్టేబుల్ మెడికల్ టెస్టులు నిలిపివేయాలి.. హైకోర్టు ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు నిలిపివేయాలని ఎస్పీలు, కమిషనర్లకు టీఎస్ఎల్పీఆర్బీ కీలక ఆదేశాలు జారీ చేసింది. పలు ప్రశ్నలు తప్పుగా రావడంతో నాలుగు మార్కులు కలపాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొన్ని రోజుల క్రితం ఆదేశించినా.. నియామక ప్రక్రియ కొనసాగుతోందని పిటిషనర్లు మరోసారి హైకోర్టుకు వెళ్లారు. దీంతో మెడికల్ టెస్టులు వెంటనే నిలిపివేయాలని కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఎలాంటి మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని టీఎస్ఎల్పీఆర్బీకి ఆదేశాలు ఇచ్చింది. ఈ క్రమంలో బోర్డు మళ్లీ ఆదేశాలు ఇచ్చే వరకు మెడికల్ టెస్టులు నిర్వహించొద్దని నియామక బోర్డు తెలిపింది. చదవండి: అబ్రహంకు బీఫామ్ ఇవ్వని కేసీఆర్.. కలవకుండా కారెక్కి వెళ్లిపోయిన కేటీఆర్ -
మళ్లీ ప్రకటించండి
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. మార్కులను లెక్కించి, మళ్లీ ఫలితాలు వెల్లడించాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డును హైకోర్టు ఆదేశించింది. 122, 130, 144వ నంబర్ ప్రశ్నలను తెలుగులోకి అనువదించలేదని, 57వ ప్రశ్న తప్పుగా ఉన్నందున వాటిని తొలగించాలని తేల్చిచెప్పింది. 2022, ఆగస్టు 30న జరిగిన కానిస్టేబుల్ నియామక తుది రాత పరీక్షలో 23 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపుతూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వినతిపత్రం సమర్పించినా ఎలాంటి బదులివ్వకపోవడంతో కోర్టును ఆశ్రయించినట్లు పిటిషనర్లు తెలిపారు. తప్పుగా రూపొందించిన ప్రశ్నలు, ఇచ్చిన తప్పు సమాధానాలను తొలగించాలని కోరడంతో పాటు తెలుగులోకి అనువదించని కొన్ని ప్రశ్నలను సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు రమేశ్ చిల్ల, ఎన్ఎస్ అర్జున్ వాదనలు వినిపించారు. వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వు చేసిన న్యాయమూర్తి.. సోమవారం తీర్పు వెలువరించారు. ‘పోలీసు కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కోసం నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో 4 ప్రశ్నలను మినహాయించి, అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు ఇవ్వాలని పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుని ఆదేశిస్తున్నాం. పేపర్లను మూల్యాంకనం చేసి, ఆ తర్వాత ఫలితాలను ప్రచురించి, తదుపరి నియామక ప్రక్రియ కొనసాగించాలి’అని తీర్పులో పేర్కొన్నారు. కానిస్టేబుల్ అభ్యర్థుల్లోనూ గందరగోళం.... కానిస్టేబుల్ నియామక పరీక్షల తుది ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు గత బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులు ఎంపికయ్యారు. అయి తే తాజా తీర్పు మళ్లీ ఫలితాలు వెల్లడించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఫలితాల్లో కానిస్టేబుల్గా ఎంపికైన అభ్యర్థుల్లో ఇది తీవ్ర గందరగోళానికి దారితీసింది. నాలుగు మార్కులు కలిపి మళ్లీ ఫలితాలు వెల్లడిస్తే ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గ్రూప్–1 ప్రిలిమ్స్ రెండుసార్లు రద్దు కాగా, ఇప్పుడు కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు మళ్లీ వెల్లడించే అవకాశం రావడంతో నియామక బోర్డుల తీరుపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
TS: ఆ గ్రామం నుంచే కానిస్టేబుల్కు 17 మంది ఎంపిక
రంగారెడ్డి: ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీసుకానిస్టేబుల్ ఉద్యోగాల్లో మారుమూల ప్రాంత మైన మంచాల మండలం నుంచి 76 మంది ఉద్యోగాలు సాధించారు. వీరిలో చాలామంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారే. ఒక్క మంచాల గ్రామం నుంచే 17 మంది ఎంపిక కావడం విశేషం. ఆరుట్ల పంచాయతీ పరిధిలో 11 మంది ఉద్యో గాలు సాధించారు. అన్నదమ్ములు పృథ్వీధర్రెడ్డి, శరత్చంద్రారెడ్డిని సత్కరించిన కౌన్సిలర్ చల్లూరి మురళీధర్రెడ్డి ఆగాపల్లి నుంచి నలుగురు, బండలేమూర్ నుంచి నలుగురు, అజ్జిన తండా నుంచి ఇద్దరు, చెన్నారెడ్డిగూడ నుంచి ఇద్దరు, లోయపల్లి నుంచి నలుగురు, ఎల్లమ్మ తండా నుంచి ముగ్గురు, బోడకొండ నుంచి ఐదుగురు ఉన్నారు. సత్తి తండా నుంచి ఇద్దరు, కొర్రం తండా నుంచి ఇద్దరు, చీదేడ్ నుంచి ముగ్గురు, రంగాపూర్ నుంచి ముగ్గురు, వెంకటేశ్వర తండా నుంచి ఒకరు చొప్పున ఎంపికయ్యారు. లింగంపల్లి నుంచి ఒకరు, నోముల నుంచి ఇద్దరు, తిప్పాయిగూడ నుంచి ముగ్గురు, తాళ్లపల్లి గూడ నుంచి నలుగురు, చిత్తాపూర్ నుంచి ముగ్గురు చొప్పున ఉన్నారు. అన్నదమ్ముల ఎంపిక అబ్దుల్లాపూర్మెట్: పెద్దఅంబర్పేట పురపాలక సంఘం 9వ వార్డుకు చెందిన కర్తాల కృష్ణారెడ్డి, సుజాత దంపతుల ఇద్దరు కుమారులు పృథ్వీధర్రెడ్డి, శరత్ చంద్రారెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. స్థానిక వార్డు కౌన్సిలర్ చల్లూరి మురళీధర్రెడ్డి శుక్రవారం వారిని అభినందించి సత్కరించారు. సంతోషంగా ఉంది మాది మధ్యతరగతి కుటు ంబం. కష్టపడి చదివాను. పోలీసు ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉంది. పట్టుదలతో మరింత కష్టపడి ఉద్యోగంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాను. – చెనమోని సందీప్, మంచాల, ఏఆర్ కానిస్టేబుల్ కష్టానికి ఫలితం మాది నిరుపేద కుటుంబం.రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి. కష్టపడి చదివాను. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాను. చాలా ఆనందంగా ఉంది. – కుండె పల్లవి, మంచాల, సివిల్ కానిస్టేబుల్ -
తాను మరణించలేదు.. కానిస్టేబుల్ ఉద్యోగ ఫలితాల్లో.. బతికే ఉన్నాడు!
వరంగల్: రెండు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన నూనావత్ వేణు కానిస్టేబుల్ రాత పరీక్ష రాశాడు. ఫలితాలు వచ్చేంత వరకు ఇంటి వద్ద ఖాళీగా ఎందుకు ఉండాలని తండ్రితో కలిసి సూర్యాపేటలో సెంట్రింగ్ కూలీ పనులకు వెళ్లాడు. 2 నెలల క్రితం పనులు ముగించుకొని తండ్రితో కలిసి బైక్పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. గురువారం ప్రకటించిన కానిస్టేబుల్ ఫలితాల్లో వేణు ఏఆర్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కుమారుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక అయిన విషయం తెలిసిన తల్లిదండ్రులు భద్రు, కేవూల్య కన్నీరు మున్నీరయ్యారు. ఒక్కగానొక్క కుమారుడు బతికుంటే తమను సాకేవాడని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు.. ఒకే ఇంట్లో నలుగురు సెలెక్ట్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ నియామకాల ప్రక్రియ పూర్తైంది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్ఎల్పీఆర్బీ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో ఒకే కుటుంబంలో నలుగురికి కొలువులు వచ్చాయి. దీంతో, ఆ కుటుంబ సభ్యులు, అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సిర్దాపూర్ మండలం జమ్లా తాండకు చెందిన ఒకే కుటుంబంలో నలుగురికి పోలీస్ కానిస్టేబుల్ కొలువులు వచ్చాయి. గ్రామానికి మెగావత్ నెహ్రు నాయక్, మారోని బాయి దంపతుల ఇద్దరు కుమారులు మెగావత్ రమేష్, సంతోష్, కూతురు రేణుక, కోడలు మలోత్ రోజా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. వీరంతా కలిసి పరీక్షలకు సన్నద్ధం కావడంతో విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు. ఇంట్లో నలుగురికి జాబ్ రావడం సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు.. పోలీసు నియామక ఫలితాల్లో ఖమ్మం జిల్లాలోని తల్లాడ మండలం మల్లవరం నుంచి 13మంది కానిస్టేబుళ్లు ఎంపికయ్యారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్లుగా ఉపేందర్, హరీష్, సివిల్లో సైదులు, శ్రీకాంత్, ఎఆర్లో తిరుపతిరావు, కటికి ప్రవళిక, టిఎస్ఎస్పీలో రవీందర్,పవన్, దుగ్గిదేవర వంశీ, యర్రి లక్ష్మణరావు, శ్రీహరి, వరుణ్, ఎస్పీఎఫ్ లో రాంమోహన్ లు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. అలాగే చింతకాని మండలంలో ఏడుగురు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చి గవర్నమెంట్ జాబ్ సాధించడం పట్ల గ్రామస్థులు అభినందిస్తున్నారు. మునుముందు ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. వరంగల్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన ప్రత్యూష, వినూష అక్కాచెల్లెళ్లు. తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు విడుదల చేసిన తుది ఫలితాల్లో ఈ అక్కాచెల్లెళ్లు ఒకేసారి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వీరి తండ్రి మర్థ శ్రీనివాస్. ఈయన వరంగల్ జిల్లాలోని కొత్తూరు గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. తల్లి అంజలి. వీరి కుమార్తెలు ప్రత్యూష, వినూష. -
‘కానిస్టేబుల్’ తుది ఫలితాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపికకు సంబంధించిన తుది ఫలితాలు వెలువడ్డాయి. అన్ని పరీక్షల అనంతరం పోలీస్కానిస్టేబుళ్లుగా ఎంపికైన వారి వివరాలు గురువారం ఉదయం టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్లో ఉంచుతామని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామకబోర్డు (టీఎస్ఎలీ్పఆర్బీ) వెల్లడించింది. మొత్తం 13 కేటగిరీల్లో 16,604 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, దరఖాస్తు చేసుకున్న వారిలో 15,750 మందిని ఎంపిక చేసినట్టు టీఎస్ఎలీ్పఆర్బీ చైర్మన్ వీవీ.శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైనవారిలో 12,866 మంది పురుషులుకాగా, 2,884 మంది మహిళలు ఉన్నారు. ఈ ఏడాది జూన్ 3, 4 వారాల్లో రాష్ట్రంలోని 18 కేంద్రాల్లో నిర్వహించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్లో భాగంగా అభ్యర్థుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, స్థానికత, వయసు మినహాయింపు, ఇతర అంశాలు పరిశీలించామని, దీంతోపాటు శారీరక సామర్థ్య పరీక్ష, ట్రేడ్ టెస్టు, తుది రాత పరీక్ష అనంతరం అన్నింటిని పరిగణనలోకి తీసుకొని వీరిని ఎంపిక చేసినట్టు ఆ ప్రకటనలో శ్రీనివాసరావు తెలిపారు. కోర్టు కేసులు, ఇతర సాంకేతిక కారణాలతో 854 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయలేదు. అటెస్టేషన్ ఎలా చేయాలంటే...! బోర్డు వెల్లడించిన ప్రకారం తుది ఫలితాల్లో ఎంపికైన అభ్యర్థులు ఆన్లైన్లో అటెస్టేషన్ ఫారం తీసుకోవాలి. టీఎస్ఎలీ్పఆర్బీ వెబ్సైట్లో అభ్యర్థుల లాగిన్లో ఈనెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు వెబ్ టెంప్లేట్ రూపంలో ఈ ఫారంలు అందుబాటులో ఉంటాయి. వీటిని డిజిటల్గా పూర్తిచేసిన తర్వాత పీడీఎఫ్ రూపంలో మూడు సెట్లు ప్రింట్లు ఏ4 సైజు పేపర్పై ఒకవైపు మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్న మూడు సెట్లపై అభ్యర్థులు సంతకాలు చేసి, రెండు పాస్పోర్టు ఫొటోలు అతికించి, గెజిటెడ్ ఆఫీసర్తో ధ్రువీకరణ సంతకం తీసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం సంబంధిత డాక్యుమెంట్లను పొందుపరిచి ఈనెల 12,13 తేదీల్లో నిర్దేశిత కేంద్రాల్లో సమర్పించాలి. సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లు ఈనెల 12న ఎస్పీ/ కమిషనర్ కార్యాలయాల్లో, ఎస్పీఎఫ్, ఎస్ఏఆర్, మెకానిక్, ట్రాన్స్పోర్టు (హెచ్ఓ) కానిస్టేబుళ్లు ఈనెల 13న హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ కార్యాలయంలో, మిగిలిన అభ్యర్థులు 13న ఆయా జిల్లాల ఎస్పీ, పోలీస్ కమిషనర్ కార్యాలయాల్లో అటెస్టేషన్ ఫారంలు సమర్పించాలి. సందేహాల నివృత్తికి అవకాశం తుది రాత పరీక్షలు క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎంపిక ప్రక్రియలో సందేహాలు, వాటిని నివృత్తికి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అవకాశం కల్పించింది. ఈనెల 5వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అభ్యర్థుల లాగిన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణ స్థానికులైన ఎస్సీ, ఎస్టీలు రూ.1000, ఇతరులు రూ.2000 ఫీజు చెల్లించాలి. కేవలం ఆన్లైన్ ద్వారానే ఎంపిక ప్రక్రియకు సంబంధించిన సందేహాలు నివృత్తి చేసుకోవాల్సి ఉంటుందని, ఎలాంటి వ్యక్తిగత వినతులకు అవకాశం లేదని బోర్డు స్పష్టం చేసింది. -
ప్రతిభను కనబరిచి.. పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల్లో గెలిచి..
ఆదిలాబాద్: పోలీసు కానిస్టేబుల్ ఫలితాలు ప్రభుత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. జిల్లాకు చెందిన 330 మంది అభ్యర్థులు కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. ఇది వరకే దేహదారుఢ్య పరీక్షలు, ప్రిలిమినరీలో అర్హత సాధించి తుది పరీక్ష రాశారు. ఫలితాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు 149 మంది, ఏఆర్కు 84 మంది, తెలంగాణ స్పెషల్ పోలీసు (టీఎస్ఎస్పీ)కి 97 మంది అర్హత సాధించి ఉద్యోగాలు పొందారు. కుటుంబీకులు, బంధువులు వారిని అభింనందించారు. అలాగే ఆదిలాబాద్ పట్టణంలోని డీఈవో కార్యాలయంలో సబార్డినెట్గా పనిచేస్తున్న రాథోడ్ కవిత కూతురు రాథోడ్ సింధు సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైంది. సింధు తండ్రి శివాజీ పోలీస్ కానిస్టేబుల్గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందాడు. తండ్రి ఆశయాన్ని ఆమె కొనసాగిస్తోంది. అలాగే భీంపూర్ మండలంలోని కరంజి(టి) గ్రామానికి చెందిన అంకిత కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది. వీరిని వారి వారి గ్రామస్తులు అభినందించారు. ఎంపికైన యువకులు.. కానిస్టేబుల్ ఫలితాల్లో మండల కేంద్రానికి చెందిన ఇద్దరు యువకులు ప్రతిభ కనబరిచి ఉద్యోగానికి ఎంపికయ్యారు. తాంసి గ్రామానికి చెందిన చిలుకూరి సాయిచరణ్రెడ్డి, బట్టు రాహుల్ ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భీంపూర్, కరంజి(టి) గ్రామానికి చెందిన రవి ఏఆర్ కానిస్టేబుల్కి ఎంపిక కాగా, ఉద్యోగాలు సాధించిన యువకులను గ్రామస్తులు అభినందించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు పలువురి ఎంపిక.. కానిస్టేబుల్ ఫలితాల్లో మండలంలోని బాలాపూర్కు చెందిన వై. ప్రశాంత్, జి.బబ్లు, జి.వంశీ, మాకోడ గ్రామానికి చెందిన బి.అఖిల్, బెల్లూరికి చెందిన దశరథ్, ప్రణయ్, కూర గ్రామానికి చెందిన అఖిల్రెడ్డి ఎంపికయ్యారు. -
ఏం కష్టం వచ్చిందో ఏమో... అప్పటి వరకు స్నేహితులతో మాట్లాడి..
విజయనగరం: ‘ఏం కష్టం వచ్చిందో ఏమో.. కనీసం ఎవరితో చెప్పుకోలేదు.. అటు స్నేహితులకుగాని ఇటు కుటుంబ సభ్యులకుగానీ ఎవరికీ తెలియదు... అర్థరాత్రి వరకు స్నేహితులతో ఫోన్లో మాట్లాడాడు. అంతలోనే ఏమైందో తెలియదుగానీ లోకాన్ని విడిచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు.. తన గదిలో ఉరి వేసుకుని సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు.’ అధికారులు ద్వారా విషయం తెలుసుకున్న భార్య, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పట్టణంలోని రుంకానవీధికి చెందిన సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ దాసరి నాగేశ్వరరావు ఢిల్లీలో ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా కలచివేసింది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, బంధువులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు నాగేశ్వరరావు ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం అర్థరాత్రి ఢిల్లీలోని తన క్వార్టర్స్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 2017లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్గా విధుల్లో చేరిన నాగేశ్వరరావుకు రేణుకతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల పాప ఉండగా, భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉన్నారు. నెల రోజుల సెలవు కోసం ఇటీవల కుటుంబంతో చీపురుపల్లి వచ్చాడు. సెలవులు పూర్తవ్వడంతో వారం క్రితమే నాగేశ్వరరావు భార్య, పాపను చీపురుపల్లిలోనే ఉంచి విధులకు ఢిల్లీ వెళ్లాడు. త్వరలో పాప పుట్టినరోజు ఉండడంతో భార్య, కుమార్తెను చీపురుపల్లిలో ఉంచి, ఆ సమయానికి తిరిగి రావాలనుకునే విధులకు వెళ్లాడు. కానీ ఏం జరిగిందో తెలియదుగానీ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నాడు. సోమవారం అర్థరాత్రి ఆత్మహత్యకు పాల్పడగా మంగళవారం ఉదయం విధుల్లోకి రాకపోవడంతో అక్కడి అధికారులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుడు అన్నయ్య మన్మధరావు, స్థానిక ఎంపీటీసీ ముల్లు పైడిరాజు ఢిల్లీ వెళ్లారు. అక్కడ నుంచి మృతదేహాన్ని విమానంలో చీపురుపల్లి తీసుకొస్తున్నారు. గురువారం చీపురుపల్లిలో కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు జరగనున్నాయని ముల్లు పైడిరాజు తెలిపారు. -
పాత విధానంలోనే టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్ (నాంపల్లి) : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుల్ పోస్టులను 2016, 2018 నోటిఫికేషన్లో మాదిరిగా పాతపద్ధతిలోనే భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. జీవో 46 ప్రకారం కంటిజ్యుయస్ డిస్ట్రిక్ట్ కేడర్లో ఉన్న రిజర్వేషన్ మేరకు టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకే 53 శాతం వెళుతున్నాయని, మిగతా 26 జిల్లాలకు 47 శాతం మాత్రమే పోస్టులు దక్కుతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీని వల్ల గ్రామీణ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కొందరు కానిస్టేబుల్ అభ్యర్థులు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ పరిసరాల్లో పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ డీజీపీ కార్యాలయం వైపు దూసుకు వస్తున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘జిల్లాల నుంచి పోటీ పడుతున్న అభ్యర్థులకు టీఎస్ఎస్పీ పోస్టులు 130, ఆపై మార్కులు సాధించినా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొంది. అదే హైదరాబాద్ జిల్లా నుంచి పోటీలో ఉన్నవారికి 80 ప్లస్ మార్కులు వచ్చినా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది’అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి జీవో 46ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ అభ్యర్థుల డీజీపీ కార్యాలయ ముట్టడి యత్నంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అభ్యర్థులు ఒక్కసారిగా దూసుకురాగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. శాంతియుత నిరసన తెలుపుతామంటూ బయల్దేరి.. అసెంబ్లీ ముందు నుంచి డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీశారు అభ్యర్థులు. దీంతో వాళ్లను అడ్డుకుని స్టేషన్కు తరలించారు పోలీసులు. జీవో నెంబర్ 46 నుంచి టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ అభ్యర్థులకు మినహాయింపు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జీవో నెంబర్ 46తో హైదరాబాద్కు 53 శాతం రిజర్వేషన్.. మిగతా ప్రాంతాలకు 47 శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. తద్వారా ఇతర జిల్లాల వాళ్లకు మార్కులు ఎక్కువ ఎంపిక కాకపోవచ్చు. పైగా ఈ జీవో వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వానికి విన్నవించుకున్నా.. ప్రయోజనం లేకుండా పోతోందని చెబుతున్నారు. -
కానిస్టేబుల్స్ కక్కుర్తి.. కారులో డబ్బులున్నాయని తెలిసి దొంగతనం!
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: జాతీయ రహదారిలో సినీ ఫక్కీలో జరిగిన రూ.2 కోట్ల దారి దోపిడీ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. దోపిడీకి పథకం వేసింది ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... ఈనెల 22న ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన రూ.3 కోట్ల నగదును కొందరు రెండు కార్లలో తీసుకుని బెంగళూరు నుంచి హైదరాబాదు బయలు దేరారు. రూ.కోటి నగదు బ్యాగుతో వెళ్తున్న కారు డ్రైవరు.. కడపకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్కు మరొక కారులో తీసుకొస్తున్న రూ.2 కోట్ల నగదు తరలింపుపై సమాచారం చేరవేశాడు. ఎలాగైనా ఆ సొమ్మును దోపిడీ చేయాలని సదరు కానిస్టేబుల్ పథకం వేశాడు. మరో ఇద్దరు వ్యక్తుల(ఒక కానిస్టేబుల్, మరొక వ్యక్తి)తో కలసి పోలీసు దుస్తుల్లో జాతీయ రహదారి–44లోని గార్లదిన్నె మండలం కలగాసిపల్లి వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచే వాహనాల సమాచారం గురించి రూ.కోటితో వస్తున్న కారు డ్రైవర్కు ఫోన్ చేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు వెనుకగా వస్తున్న సదరు డ్రైవర్ గార్లదిన్నె సమీపంలో రూ.2 కోట్లతో వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసేశాడు. కలగాసిపల్లి వద్ద మాటు వేసిన కానిస్టేబుల్ అండ్కోకు సంకేతాలు పంపాడు. నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్న మరొక కారును ఆపి.. తమకందిన సమాచారం, ఆనవాళ్ల ఆధారంగా కారు డిక్కీలో నగదు ఉంచిన బ్యాగును లాగేసుకున్నారు. ప్రశ్నించబోయిన కారులోని వ్యక్తులపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో బాధితులు తమ ముందు వెళ్లిపోయిన రూ.కోటి కారులోని వ్యక్తులకు జరిగిన విషయం తెలియజేశారు. అనంతరం గార్లదిన్నె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీతో దర్యాప్తు ముందుకు.. రూ.2 కోట్ల నగదుతో ఉడాయించిన వ్యక్తులు ఇన్నోవా వాహనంలో అనంతపురం వచ్చారు. దోపిడీ చేసే కొన్ని గంటల ముందు అనంతపురం వద్ద వాహనం నంబరు ప్లేట్కు స్టిక్కర్ అతికించారు. ఈ దృశ్యాలు సీసీ ఫుటేజీలో పోలీసులు పసిగట్టారు. దీంతో చోరీకి తెగబడింది వీరేనన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. స్టిక్కర్ అతికించిన వ్యక్తి జంగిల్ షూ, జంగిల్ ప్యాంట్ ధరించి ఉండటంతో వైఎస్సార్ జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్గా గుర్తించారు. అనంతరం అతని మొబైల్కు వచ్చిన కాల్ డిటైల్స్ పరిశీలించగా.. ఎస్ఆర్ఆర్ కంపెనీకి చెందిన ఓ డ్రైవరు నంబరుతో ఎక్కువగా సంభాషించినట్లు తెలిసింది. కాల్ డీటైల్స్తో దొరికిపోయిన డ్రైవర్.. బెంగళూరు నుంచి రూ.3 కోట్ల నగదుతో హైదరాబాద్కు వెళ్తున్న విషయాన్ని ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ నిర్వాహకులు దాచిపెట్టారు. దోపిడీకి గురైన రూ.2 కోట్ల గురించి మాత్రమే పోలీసులకు చెప్పారు. మరో రూ.కోటి ముందు వెళ్లిన కారులో తరలించారని దర్యాప్తులో తేలింది. రూ.కోటిని సురక్షితంగా తీసుకెళ్లిన కారు డ్రైవర్ను ఆరా తీయగా... ప్రస్తుతం తాను కళ్లకలక వల్ల డ్యూటీకి వెళ్లడం లేదని బుకాయించాడు. అయితే అతడి సెల్ఫోన్ నుంచి వైఎస్సార్ జిల్లా ఏఆర్ కానిస్టేబుల్కు కాల్స్ వెళ్లినట్లు తేలడంతో.. అతడిని అదుపులోకి తీసుకున్నాడు. దోపిడీలో పాలుపంచుకున్న మరొక కానిస్టేబుల్, ఇంకొక నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దోపిడీ అయిన సొమ్ములో కొంతమేర మాత్రమే రికవరీ చేసినట్లు సమాచారం. నిందితుల అరెస్ట్కు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. -
సెప్టెంబర్లో కానిస్టేబుల్స్ ఫలితాలు?
నిజామాబాద్ : కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితాను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు సెప్టెంబర్ రెండో, లేదా మూడో వారంలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. అక్టోబర్లో ఎ న్నికల కోడ్ వస్తున్న నేపథ్యంలో ముందుగానే పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పోలీస్శాఖతో పాటు వివి ధ విభాగలైన జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ(రవాణా), ఎకై ్సజ్ శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేయనున్నారు. జిల్లాలో 266 సివిల్ కానిస్టే బుల్స్, ఏఆర్ పోస్టులు 134 ఉన్నాయి. వివిధ విభాగాల సంఖ్య హైదరాబాద్ కమిషనర్ పరిధిలో ఉంది. జిల్లాకు కేటాయింపుల ప్ర కారం జైళ్లశాఖ, ఫైర్, ఆర్టీఏ (రవాణా), ఎకై ్సజ్శాఖలో కానిస్టేబుల్లను భర్తీ చేస్తారు. కానిస్టేబుల్ మెయిన్ పరీక్ష ఫలితాల ను మే 30న పోలీస్ నియామక మండలి ప్రకటించింది. జూన్ 1న ధ్రువపత్రాల పరిశీల న ప్రక్రియ పూర్తి చేశారు. ఇదిలా ఉండగా ఎస్సై పరీక్ష ఫలితాల్లో బాసర జోన్ పరిధిలోని 35 ఎస్సై పోస్టులకు ఎస్సైలను ఎంపిక చేశారు. ఎస్సై పోస్టులకు ఎంపికై న వారి వివరాలను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు(ఎస్బీ) ఎంకై ్వరీ చేశారు. ఎస్సైగా ఎంపికై న అభ్యర్థులకు మెడి కల్ టెస్ట్లు కొనసాగుతున్నాయి. ఎస్సైల ఎంపిక పూర్తి కావడంతో పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కానిస్టేబుళ్ల ఎంపికపై దృష్టి సారించింది. జిల్లాలో 5313 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు సర్టిఫి కెట్ల వెరిఫికేషన్ చేశారు. మిగితా విభాగాల పోస్టులు కాకుండా సివిల్, ఏఆర్ పోస్టులకు జిల్లాలోని ఒక్కో పోస్టుకు 13 మంది పోటీ పడుతున్నారు. వీరికి సంబంధించిన అన్ని రికా ర్డులు, ఆయా జోన్లు, పోలీ స్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్న ట్లు తెలిసింది. ఈ ప్రక్రియ మొత్తం జరిగే వరకు రెండు నుంచి మూడు వారాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సెప్టెంబర్ మూడోవారంలో ‘కానిస్టేబుల్’ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ‘కానిస్టేబుల్ తుది ఎంపిక జాబితా’ సెప్టెంబర్ మూడోవారంలో విడుదల కానున్నట్టు విశ్వసనీయ సమాచారం. వివిధ విభాగాల్లోని కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిపై పోలీస్ నియామక మండలి కసరత్తు ముమ్మరం చేసింది. పోలీస్శాఖలోని వివిధ విభాగాలు, జైళ్లశాఖ, అగ్నిమాపకశాఖ, రవాణా, ఎక్సైజ్శాఖల్లో కలిపి మొత్తం 16,929 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇప్పటికే తుదిరాత పరీక్షలో అర్హత సాధించిన వారి ఫలితాలు మే 30న పోలీస్ నియామకమండలి వెల్లడించడం తెలిసిందే. జూన్ 1వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. గత కొన్ని రిక్రూట్మెంట్ల మాదిరిగానే ఈసారి కూడా ముందుగానే ఎస్ఐ పోస్టుల తుది ఎంపిక జాబితాను బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం వారి నియామక ప్రక్రియ తుదిదశలో ఉంది. ప్రస్తుతం ఎస్బీ ఎంక్వైరీ, మెడికల్ టెస్ట్ నడుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఎస్ఐల శిక్షణ ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో రిక్రూట్మెంట్ బోర్డు అధికారులు కానిస్టేబుల్ ఫలితాలపై దృష్టి సారించారు. మొత్తం 1,01,600 మంది అభ్యర్థులు తుది అర్హత సాధించిన వారిలో ఉన్నారు. వీరికి సంబంధించిన అన్ని రికార్డులు, ఆయా జోన్లు, పోలీస్, రెవెన్యూ జిల్లాలు, సామాజికవర్గాల వారీగా ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. తుది పోటీలో ఉన్న వారిలో ప్రతి ఆరుగురు అభ్యర్థుల్లో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. మొత్తం ప్రక్రియ ముగిసేందుకు మరో మూడు నుంచి నాలుగు వారాలు సమయం పడుతుంది. -
గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి
రాయచూరు రూరల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జిల్లాలోని మస్కిలో చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా గంగావతి తాలూకాలోని అగోలికి చెందిన మల్లనగౌడ(34) మస్కి పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్నాడు. రక్తపోటు, చక్కెర వ్యాధులతో బాధపడుతున్న ఇతను శుక్రవారం రాత్రి నిద్రలో ఉండగానే మరణించినట్లు తెలిసింది. -
చావుబతుకుల మధ్య కానిస్టేబుల్ సతీమణి అనిత
అనంతపురం శ్రీకంఠంసర్కిల్/ఆత్మకూరు: రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్కుమార్ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కానిస్టేబుల్ సతీమణి అనిత ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్లు బెంగళూరు వైద్యులు తెలిపారు. ఆమెకు ఆపరేషన్ చేస్తే కోలుకునే అవకాశం ఉందని, రూ.10 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారు. ఇంటి పెద్ద కిరణ్ చనిపోవడంతో వారి పిల్లలు చిన్నారులు కావడంతో చేతిలో డబ్బులు లేక ఆ కుటుంబం చేయూత కోసం ఎదురుచూస్తోంది. రూ.3 లక్షలు సాయం చేసిన ఎస్పీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్కుమార్ కుటుంబానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు అండగా నిలిచారు. కానిస్టేబుల్ భార్య అనిత చికిత్స నిమిత్తం రూ.3 లక్షలు చెక్కును అనిత కుటుంబ సభ్యులకు శుక్రవారం అందజేశారు. ప్రత్యేకంగా కానిస్టేబుల్ను నియమించి అనితకు వైద్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కరుణించిన ఖాకీలు ఏఆర్ కానిస్టేబుల్ కిరణ్ మృతిని పోలీసుశాఖ జీర్ణించుకోలేకపోయింది.. చాలా మందితో సన్నిహితంగా మెలిగిన కిరణ్కుమార్ ప్రమాదంలో మృతిచెందడంతో కన్నీరు పెట్టుకోని ఖాకీలేడు. ఈ క్రమంలోనే అతని భార్య అనిత ఆరోగ్యం విషమంగా ఉన్న విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు చేయి చేయి కలిపి సాయం చేసేందుకు ముందుకు కదిలారు. ఇందులో భాగంగానే పీటీసీలో పనిచేస్తున్న డీఎస్పీ మల్లికార్జున వర్మ రూ.25 వేలు ఆర్థిక సహాయం చేశారు. కియా పోలీసు స్టేషన్ సిబ్బంది రూ.10 వేలు సహాయం చేశారు. ఫోన్పే, గూగుల్ పే ద్వారా గంటల వ్యవధిలోనే రూ.2.50 లక్షలను పంపి బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. -
మహిళలపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ తమపై దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించాడని, అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ పోలీస్స్టేషన్ ఎదుట మహిళలు బుధవారం ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. వింజమూరు గంగమిట్టకు చెందిన మహిళలు మంగళవారం అర్ధరాత్రి స్థానిక సబ్స్టేషన్కు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేతపై సిబ్బందిని నిలదీసి ఆందోళన చేశారు. దీంతో కొందరు కానిస్టేబుళ్లు సబ్స్టేషన్ వద్దకు చేరుకొని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కానిస్టేబుల్ కృష్ణ మహిళలనుద్దేశించి అసభ్య పదాలు ఉపయోగించాడు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుమణిగేలా చేశారు. అయితే తీవ్ర కలత చెందిన మహిళలు, వారి బంధువులు బుధవారం ఉదయం పోలీస్స్టేషన్ వద్దకు చేరుకొని కానిస్టేబుల్ను సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఎస్సై కోటిరెడ్డి వారికి సర్దిచెప్పి కానిస్టేబుల్పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు విజయకుమార్రెడ్డి, కొండారెడ్డి, కాలేషా తదితరులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. విద్యుత్ సమస్యను ఏఈ శ్రీనివాసరావు దృష్టికి సాక్షి తీసుకెళ్లగా గంగమిట్టలో లోఓల్టేజీ సమస్య ఉందని, దీనివల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరైందని, రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
వ్యవసాయం చేస్తూనే.. మూడు ఉద్యోగాల ఘనత తనది..
ఆదిలాబాద్: ఆయనది వ్యవసాయ కుటుంబం. అటు చదువుతూనే, ఇటు పొలం పనులు చేస్తూనే మూడు ఉద్యోగాలు సాధించాడు. అయినా అవి తనకు సరిపోదని సివిల్ ఎస్సైగా ఉద్యోగం సాధించాడు సారంగపూర్ మండలంలోని మలక్చించోలికి చెందిన సామ శ్రీనివాస్. ఆదివారం వెల్లడించిన ఎస్సై ఫలితాల్లో సత్తా చాటాడు. సామ హన్మంతు–పర్వవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్దవాడైన ప్రవీణ్, రెండోకు మారుడు నవీన్. మూడో కుమారుడు శ్రీనివాస్ చదువుతూనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. మొదట వీఆర్వో రాగా, ప్రభుత్వం వేరే శాఖల్లో విలీనం చేయడంతో ఆయనకు ఫైర్ సర్వీసెస్లో ఉద్యోగం వచ్చింది. రెండోసారి ఎక్సైజ్ కానిస్టేబుల్గా సెలక్ట్ అయ్యాడు. ఇది నచ్చక ఎస్సైగా ప్రిపేర్ అయి పరీక్ష రాస్తే సివిల్ ఎస్సైగా బాసర జోన్ సర్కిల్లో ఉద్యోగాన్ని సాధించాడు. -
టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం..
విశాఖపట్నం: వన్టౌన్ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ రమేష్ మృతి విషయంలో తొలి నుంచి అనుమానిస్తున్నదే జరిగింది. శివజ్యోతి అలియాస్ శివానీయే ఆమె ప్రియుడితో కలిసి తన భర్త రమేష్ హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మ శుక్రవారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. 2009 బ్యాచ్కు చెందిన బర్రి రమేష్(35) ఆదర్శనగర్లో ఉంటూ వన్టౌన్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. బుధవారం ఉదయం అతను చనిపోయినట్లు ఎంవీపీ పోలీసులకు సమాచారం వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బెడ్పై విగతజీవిగా ఉన్న రమేష్ ను పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. రాత్రి మద్యం సేవించి పడుకున్నాడని, తెల్లవారి లేచి చూసేసరికి చనిపోయి ఉన్నాడని అతని భార్య పోలీసులకు చెప్పింది. అతని ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించడంతో అసలు వాస్తవాలు బయటకొచ్చాయి. పోస్టుమార్టం నివేదికలో సైతం అతను ఊపిరాడక చనిపోయినట్లు తేలింది. దీంతో పోలీసులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయడంతో కుట్రకోణం వెలుగుచూసింది. రామారావు అనే టాక్సీ డ్రైవర్తో వివాహేతర సంబంధం పెట్టుకున్న రమేష్ భార్య శివాని.. అతని మోజులో కట్టుకున్న భర్తను మట్టుబెట్టింది. రామా రావు విషయంలో గతంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. కాగా.. మంగళవారం రాత్రి ఆమె రమేష్తో బాగా మద్యం తాగించి.. దాన్ని వీడియో కూడా తీసింది. కొంతసేపటికి అతను నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అక్కడ మాటు వేసిన ఆమె ప్రియుడు రామారావుకు సమాచారం ఇవ్వడంతో.. అతని స్నేహితుడు నీలాతో కలిసి ఇంట్లోకి వచ్చాడు. ఆమె సమక్షంలోనే అతనిని వీరు హత్య చేశారు. నీలా రమేష్కి ఊపిరాడకుండా దిండుతో నొక్కిపట్టుకోగా.. రామారావు కదలకుండా అతని కాళ్లు పట్టుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక రమేష్ మృతి చెందాడు. ఇలా పక్కాగా రమేష్ను హతమార్చిన శివాని, అతని ప్రియుడు రామారావు దీన్ని సాధారణ మృతిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే తొలుత మద్యం తాగి చనిపోయాడని శివాని పోలీసులకు చెప్పినట్లు సీపీ వెల్లడించారు. ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టినట్లు తెలిపారు. శివానీని ఏ1గా, ప్రియుడు రామారావును ఏ2గా, వారికి సహకరించిన నీలాను ఏ3గా నిర్ధారించి కేసు నమోదు చేశారు. అనంతరం వారిని రిమాండ్కు తరలించారు. తొలి నుంచి శివానీది నేర స్వభావమే.. రమేష్ భార్య శివానీది తొలి నుంచి నేర స్వభావమే అని సీపీ తెలిపారు. తల్లిదండ్రులతో సైతం ఆమె పలుమార్లు గొడవ పడినట్లు చెప్పారు. ప్రియుడి విషయంలో భార్యను పలుమార్లు రమేష్ మందలించాడని వెల్లడించారు. ఆమె తీరు కారణంగా విసిగిపోయి ఒక దశలో ఇద్దరు కుమార్తెలను తన వద్ద వదిలేసి ప్రియుడితో వెళ్లిపొమ్మని కూడా ఆమెకు చెప్పాడన్నారు. అయితే పిల్లలు, ప్రియుడు ఇద్దరూ కావాలనే ఉద్దేశంతో శివాని రమేష్ హత్యకు కుట్ర పన్నింది. ఈ హత్యలో సహకారానికి శివానీ, ప్రియుడు రామారావు అతని స్నేహితుడు నీలాకు రూ.లక్ష సుపారి కూడా ఇచ్చినట్లు సీపీ వెల్లడించారు. -
కానిస్టేబుల్ ఆత్మహత్య
రామచంద్రాపురం (పటాన్చెరు): ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన నాగేంద్రనాథ్(42) మూడేళ్లుగా చందానగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సాయినగర్లో నివాసం ఉంటున్నాడు. 2014లో మొదటి భార్య లక్ష్మి మృతి చెందింది. కాగా, నాగేంద్రనాథ్ 2020లో మహబూబ్నగర్కు చెందిన మనీషాతో రెండో పెళ్లి జరిగింది. గతంలో కంట్రోల్ రూం, మైలార్దేవ్పల్లిలో విధులు నిర్వహించాడు. కొద్దిరోజుల క్రితమే హెడ్ కానిస్టేబుల్ ట్రైనింగ్కు వవెళ్లి వచ్చాడు. సోమవారం రాత్రి చందానగర్ పోలీస్స్టేషన్లో విధులు నిర్వహించి మంగళవారం ఉదయం 10గంటలకు ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రమైనా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో భార్య మనీషా తలుపులు కొట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుంచి లోపలికి చూడగా.. గదిలో ఫ్యాన్కు చీరతో ఉరేసుకున్నాడు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి అతని స్థానిక ప్రైవేట్ అసుత్రికి తరలించారు. అప్పటికే నాగేంద్రనాథ్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏలూరులో అమ్మమ్మ దగ్గర ఉంటున్న మొదటి భార్య కుమారులు భానుప్రకాశ్, రామ్దత్త పది రోజుల క్రితమే తండ్రి వద్దకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. నాగేంద్రనాథ్ మృతదేహాన్ని మియాపూర్ ఏసీపీ పి.నరసింహరావు, చందానగర్ ఇన్స్పెక్టర్ పాలవల్లి, రామచంద్రాపురం ఇన్స్పెక్టర్ నరేందర్ రెడ్డిలు సందర్శించారు. కాగా నాగేంద్రనాథ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కానిస్టేబుల్ కుమార్తెకు కాన్పూర్ ఐఐటీ సీటు
గుంటూరు: మార్టూరు పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న పూర్ణాంజనేయరాజు చిన్న కుమార్తె అనుపమ ప్రతిష్టాత్మక కాన్పూర్ ఐఐటీలో ఇంజినీరింగ్ సీటు సాధించింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ కుటుంబాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ గురువారం తమ కార్యాలయానికి పిలిపించుకొని అనుపమను శాలువాతో సత్కరించి రూ.10 వేలు నగదు పురస్కారం బహుమతిగా అందించారు. ప్రస్తుతం కాన్పూర్ ఐఐటీ కళాశాలలో మూడో ఏడాది ఇంజినీరింగ్ చదువుతున్న కానిస్టేబుల్ పూర్ణాంజనేయరాజు పెద్ద కుమార్తె జాహ్నవి గతంలో ర్యాంకు సాధించిన సందర్భంగా ఎస్పీ మల్లికా గర్గ్ రూ.25 వేలు నగదు పురస్కారం అందించి అభినందించినట్లు కానిస్టేబుల్ గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో కానిస్టేబుల్ భార్య సునీత కుమార్తెలు జాహ్నవి, అనుపమ పాల్గొన్నారు. -
తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కానిస్టేబుల్ అభ్యర్థులు నూతన సెక్రటేరియట్ను ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటూ కానిస్టేబుల్ అభ్యర్థులు డిమాండ్ చేశారు. కాగా, కానిస్టేబుల్ అభ్యర్థులు బుధవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా సచివాలయం గేటు వద్దకు దూసుకొచ్చారు. ఈ క్రమంలో సెక్రటేరియల్ గేటు ముందు బైఠాయించి జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, తక్షణమే అలర్ట్ అయిన పోలీసులకు, అభ్యర్థులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్ అభ్యర్థులు మాట్లాడుతూ.. రిక్రూట్మెంట్ను పాత పద్దతితోనే చేపట్టాలని, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జీవో 46 వల్ల తాము తీవ్రంగా నష్టపోతామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: కేసీఆర్కు అన్ని విషయాలు తెలుసు: జలగం వెంకట్రావ్ కీలక వ్యాఖ్యలు -
రూ.10లక్షలు పాయె.. బదిలీ కాకపాయె!
వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న ఇద్దరు ఇన్స్పెక్టర్లకు చుక్కెదురైంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలీస్శాఖలో బదిలీలు ముమ్మరమయ్యాయి. తాము కూడా ఎన్నికల ఎఫెక్ట్ బదిలీలో ఉంటామని భావించిన ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు నియోజకవర్గంలోనే మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు సిద్ధమయ్యారు. ఇద్దరు ఒకే నియోజకవర్గంలో పనిచేస్తున్నందున మ్యూచువల్ బదిలీ ప్రణాళికకు సదరు స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి ఓకే అన్నారు. ఇందుకు ఆ ఇన్స్పెక్టర్లు చెరో రూ.10లక్షలు మొత్తం రూ.20 లక్షలు సమర్పించుకున్నట్లు తెలిసింది. ఆతర్వాత ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు పోస్టింగ్లు ఖాయమనుకుని రెట్టింపు ఉత్సాహంతో సదరు ప్రజాప్రతినిధి ఇచ్చిన సిఫార్సు లేఖతో పోలీస్ బాస్ను కలిశారు. అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇటీవల ఆ నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఇతర సమీకరణాల కారణంగా పోలీస్ పోస్టింగ్లను సైతం ప్రభుత్వ పెద్దలే నిశితంగా చూస్తుండడం.. దీంతోపాటు ఆ ప్రజాప్రతినిధి ‘పెత్తనం’ నడవకపోవడంతో మ్యూచువల్ బదిలీకి పోలీస్ బాస్ నో అని చెప్పినట్లు ఆ శాఖ వర్గాల ద్వారా సమాచారం. దీంతో ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లు చేసేది లేక ఒకరి ముఖం ఒకరు చూసుకుని లబోదిబోమని మొత్తుకున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఆ ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఇప్పటికే తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీరిపై ఎస్బీ అధికారులు.. సీపీకి నివేదికలను సైతం సమర్పించినట్లు సమాచారం. -
ఏసీబీ వలలో ఎస్సై దీపిక, కానిస్టేబుల్ నరసింహ
ప్రకాశం: ఘర్షణ కేసులో నిందితులుగా పేర్లు లేకుండా చేయాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి రూ.45 వేలు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు కానిస్టేబుల్, ఓ మహిళా ఎస్సై. కొనకనమిట్ల పోలీస్స్టేషన్లో బుధవారం జరిగిన ఘటనకు సంబంధించి ఏసీబీ డీఎస్పీ పి.శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కొనకనమిట్ల మండలంలోని కాట్రగుంట ఎస్సీ కాలనీకి చెందిన జల్లి చిన్న చెన్నయ్య, అంజలి భార్యభర్తలు. మే నెల 20వ తేదీ వీరి మధ్య వివాదం జరిగింది. మధ్యవర్తిగా బంధువు అయిన గొట్టిముక్కల నరసింహులు సర్దిచెప్పారు. ఈక్రమంలో చెన్నయ్య కొట్టడంతో అంజలికి గాయాలయ్యాయి. అంజలి తరఫున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అంజలి తన భర్తతో పాటు, గొట్టిముక్కల నరసింహారావు, జిల్ది కేశవులు, జల్ది మాచర్ల అనే వారిపై కేసు పెట్టింది. మే 20వ తేదీన కేసు నమోదు చేసిన ఎస్సై దీపిక విచారణ జరిపి అంజలి భర్త చెన్నయ్యను మే 31వ తేదీ రిమాండ్కు పంపించారు. మిగిలిన ముగ్గురికి కొట్లాటతో సంబంధం లేదని గ్రామస్తులు విచారణ సందర్భంగా పోలీసులకు చెప్పారు. దీనిని నమోదు చేసుకుని, వారిపై కేసులేనట్లుగా రికార్డుల్లో పోలీసులు నమోదు చేశారు. అయితే ఈ విషయం కేసులో పేర్లు ఉన్న పై ముగ్గురికి తెలియకుండా, మీ మీద కేసు లేకుండా పేర్లు తీసి వేయాలంటే రూ.60 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మధ్యవర్తి ద్వారా రూ.45 వేలకు బేరం కుదుర్చుకున్నారు. తాను అందుబాటులో లేకుంటే, కానిస్టేబుల్కు ఇవ్వాలని ఎస్సై దీపిక చెప్పారు. గొట్టిముక్కల నరసింహులు అనే వ్యక్తి లంచం ఇవ్వటం ఇష్టం లేక ఏసీబీ అధికారులను సంప్రదించారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ డీఎస్పీ సూచనల మేరకు ఫిర్యాది గొట్టిముక్కల నరసింహులు.. కానిస్టేబుల్ నరసింహకు రోడ్డుపై రూ.45 వేలు ఇస్తుండగా మాటు వేసి పట్టుకున్నారు. ఎస్సై దీపికను కూడా అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం నెల్లూరు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు అపర్ణ, టీవీ.శ్రీనివాస్, సీహెచ్.శేషు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్పై సస్పెన్షన్ వేటు
కర్నూలు: ఆలూరు సర్కిల్ పరిధిలోని ఆస్పరి పీఎస్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ విజయకుమార్ (పీసీ 2910)పై సస్పెన్షన్ వేటు పడింది. నకిలీ నోట్ల పేరుతో చీటింగ్ చేస్తున్న ముఠాతో చేతులు కలిపి భారీగా డబ్బులు వసూలు చేశాడన్న ఫిర్యాదు నేపథ్యంలో పోలీస్ ‘బాస్’ విచారణ జరిపించారు. కై రుప్పల, ములుగుందం, కారుమంచి, ఆస్పరి, ఆలూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు, ఎల్ఐసీ ఏజెంట్లు, ఆయా ప్రాంతాల్లోని ప్రముఖుల నుంచి దాదాపు రూ.30 లక్షల దాకా డబ్బులు దండుకున్నట్లు బాధితుల్లో ఒకరైన కారుమంచి గ్రామానికి చెందిన అంజనయ్యతో పాటు మరికొంతమంది స్వయంగా ఎస్పీ కృష్ణకాంత్కు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుల్ను విచారణలో భాగంగా మొదట వీఆర్కు రప్పించి ఆ తర్వాత శాఖాపరమైన చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. బళ్లారి ముఠాతో చేతులు కలిపి... లక్ష అసలు నోట్లకు మూడు లక్షలు నకిలీ నోట్లు (ఫేక్ కరెన్సీ) ఇస్తామని నమ్మబలికి బళ్లారికి చెందిన ఓ అజ్ఞాత వ్యక్తితో కానిస్టేబుల్ విజయకుమార్ చేతులు కలిపి భారీగా వసూలు చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వెంగలాయదొడ్డి గ్రామానికి చెందిన ఎరువుల వ్యాపారి ఒకరు బళ్లారిలో స్థిరపడ్డారు. దొంగనోట్ల పేరుతో చీటింగ్కు పాల్పడుతున్న ఈ ముఠా వెనుక అతని హస్తం ప్రధానంగా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అరెస్టుకు రంగం సిద్ధం... కానిస్టేబుల్ విజయకుమార్పై ఆస్పరి పోలీస్స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. ఆదోని డీఎస్పీ శివనారాయణస్వామి పర్యవేక్షణలో ఆలూరు సీఐ వెంకటేశ్వర్లు ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. పనిచేస్తున్న స్టేషన్లోనే కానిస్టేబుల్పై చీటింగ్ కేసు నమోదు కావడం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దాదాపు 50 మందికి పైగా కానిస్టేబుల్ చేతిలో మోసపోయినట్లు సమాచారం. దీంతో ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు రంగం సిద్ధమైంది. కాగా మోసం చేసిన వారిలో విజయకుమార్తో పాటు ఇద్దరు తెలియని వ్యక్తులు కూడా ఉన్నారని, విచారణ కొనసాగుతుందని ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు. వాట్సాప్, సోషల్ మీడియాలో వచ్చే అనవసరమైన ప్రకటనలు చూసి నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి
మిర్యాలగూడ అర్బన్: గ్రూప్–4 పరీక్ష రాసేందుకు శనివారం ఇంటికి వచ్చిన కానిస్టేబుల్ ఆదివారం తిరిగి డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈ ఘటన మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణకాలనీ బైపాస్ వద్ద చోటుచేసుకుంది. మిర్యాలగూడ టూటౌన్ ఎస్ఐ ఎస్. క్రిష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ పట్టణంలోని బాబూ జీనగర్ కాలనీకి చెందిన కుంచం వెంకన్న, ఇద్దమ్మ దంపతులకు కుమారుడు సైదులు(30), కుమార్తె సుచరిత సంతానం. తన పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలనే ఆశయంతో వెంకన్న ఆటో నడుపుతూ ఇద్దరినీ కష్టపడి చదివించాడు. తండ్రి ఆశయాన్ని నిజం చేస్తూ కుంచం సైదులు కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి గత రెండేళ్లుగా నల్లగొండలోని 12వ బెటాలియన్లో విధులు నిర్వహిస్తున్నాడు. శనివా రం గ్రూప్–4 పరీక్ష రాసేందుకు సైదులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. పరీక్ష రాసిన సైదులు తిరిగి ఆదివారం ఉదయం 6:30 గంటల సమయంలో బైక్పై డ్యూటీకి వెళ్తుండగా మిర్యాలగూడ పట్టణంలోని కృష్ణకాలనీ బైపాస్ వద్ద వెనుక నుంచి లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. లారీ సైదులు నడుముపై నుంచి వెళ్లడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులు సైదులు నేత్రాలను కుటుంబ సభ్యులు మిర్యాలగూడ లయన్స్ క్లబ్ సహకారంతో ఖమ్మం నేత్ర నిధికి అందజేశారు. తన చెల్లెలు సుచరితకు వివాహం చేసిన తర్వాతే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన కుమారుడు విగతజీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
గ్రూప్-4 పరీక్షలో 'బలగం' సినిమాపై అడిగిన ప్రశ్న ఇదే!
చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలై.. ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టించి.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన చిత్రం 'బలగం'. 'పిట్టకు పెట్టుడు' అనే నేపథ్యంలో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వేణు యెల్దండి ఈ చిత్రాన్ని నిర్మించారు.. టాలీవుడ్లో పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఓటీటీలో సైతం ఈ సినిమాకు భారీగా ఆదరణను పొందింది. ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడానికి కారణం. ఇందులోని పాత్రలు ప్రతి ఇంట్లో ఉండేవిగా.. మనుషుల బంధాలను, వారి మధ్య ప్రేమలను తెలిపేదిగా తెరకెక్కడమే. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 పరీక్షలో బలగం సినిమాపై ఒక ప్రశ్న అడిగారు. అదేమిటంటే ► 'బలగం' చిత్రానికి సంబంధించి క్రింది జతలలో ఏవి సరిగ్గా జతపరచబడినవి? అనే ప్రశ్నకు... A. దర్శకుడు: వేణు యెల్దండి, B. నిర్మాత: దిల్ రాజు/హన్షితా రెడ్డి/ హర్షిత్ రెడ్డి, C. సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో, D. కొమరయ్య పాత్రను పోషించినారు: ఆరుసం మధుసుధన్ అనే ఆప్షన్స్ను జోడించారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో సినిమా రావడంతో 'బలగం' మూవీకి ఇలాంటి ప్రాముఖ్యత దక్కింది అని చెప్పవచ్చు. గతంలో 'బలగం' నుంచి అడిగిన ప్రశ్న ఇదే ఇదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షలో కూడా ఒక ప్రశ్న అడిగారు.. ► 2023లో ఒనికో ఫిలిమ్స్ (ONYKO Films) అవార్డులలో 'బలగం' సినిమాకి ఏ విభాగంలో పురస్కారం (Award) లభించింది? అనే ప్రశ్నకు... 1. ఉత్తమ దర్శకుడు చలనచిత్ర విభాగం, 2. ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగం, 3. ఉత్తమ నాటకం చలనచిత్ర విభాగం, 4. ఉత్తమ సంభాషణ చలనచిత్ర విభాగం.. అనే ఆప్షన్స్ను జోడించారు. ఆ సమయంలో ఇదే విషయాన్ని దర్శకుడు వేణు యెల్దండి ట్విటర్లో పోస్ట్ చేశాడు. అప్పుడు పలు విమర్శలు కూడా వచ్చాయి. సినిమాను మరో రెండుసార్లు అయినా చూస్తాం. కానీ ఈ పరీక్షకు గానీ, కానిస్టేబుల్ చేసే ఉద్యోగానికి గానీ అక్కడ అడిగిన ప్రశ్నతో ఏమైనా సంబంధం ఉందా? ఇలా ఎలా ఆలోచిస్తారు? అంటూ దర్శకుడి వాల్పై నెటిజన్లు కామెంట్లు చేశారు. వివాదాలు పక్కనపెడితే ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసేమో మీరు కూడా చెక్ చేసుకోండి. -
కానిస్టేబుల్పై దుండగుల దాడి
కర్ణాటక: గొడవను విడిపించడానికి వెళ్లిన కానిస్టేబుల్పై దాడి జరిగిన ఘటన హాసన జిల్లా సకలేశపుర తాలూకా ఎస్ హొన్నేనహళ్లి గ్రామంలో జరిగింది. శరత్ యసళూరు పోలీసుస్టేషన్లో కానిస్టేబుల్గా పని చేస్తున్నాడు. గురువారం శరత్ సెలవు పెట్టి అదే గ్రామానికి చెందిన దీపక్ కుటుంబంతో కలిసి హొళెనరసిపుర తాలూకా మాకలి దేవస్థానానికి వెళ్లారు. మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో మిథున్, లోహిత్, నటరాజులు కలిసి చేతన్ అనే యువకున్ని కొట్టసాగారు. అక్కడే ఉన్న శరత్ వీరిని విడిపించడానికి వెళ్లగా నటరాజ్ ఆనే యువకుడు శరత్ తలపై బండరాయితో మోదాడు. ఆపై కారులో ఉన్న లాంగును తెచ్చి దాడి చేశారు. భయపడిన శరత్ సమీపంలోని కన్వెన్షన్ హాల్లోకి పరుగులు తీశారు. అక్కడ వదలకుండా లాంగ్తో దాడి చేశారు. గాయాలైన శరత్ కుప్పకూలగా దుండగులు పరారయ్యారు. బాధితున్ని స్థానికులు హాసన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హొళెనరసీపుర నగర పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దాడి వీడియో వైరల్ అయ్యింది. -
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: ఆన్లైన్ గేమ్లకు బానిసైన ఓ ఏఆర్ కానిస్టేబుల్ సర్వమూ కోల్పోయి అప్పుల పాలయ్యాడు. చివరకు అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. నార్పలకు చెందిన అనిల్కుమార్ శ్రీసత్యసాయి జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో కుటుంబసభ్యులు అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రమాదం తప్పింది. కాగా, సులువుగా డబ్బు సంపాదించాలన్న ఆశతో అనిల్ కుమార్ ఆన్లైన్ గేమ్లకు బానిసైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో తెలిసిన వారితో అప్పులు చేస్తూ వచ్చాడు. అవి కాస్త వడ్డీలకు వడ్డీలు పేరుకుపోయి పెనుభారంగా మారాయి. కానిస్టేబుల్ అనే ఒకేఒక్క కారణంతో వడ్డీ వ్యాపారులు సైతం మిన్నకుండిపోయారు. చివరకు అప్పు తీర్చాలంటూ కొంత కాలంగా వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక చివరకు ఆత్మహత్యాయత్నం చేసినట్లు నార్పల పోలీసులకు బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
పాముకాటుతో కానిస్టేబుల్ మృతి.. ఎస్సై కావాలన్న ఆశ తీరకుండానే
ప్రకాశం: తుళ్లూరు మండలం అనంతవరం ఆర్–5 జోన్లో విధుల నిమిత్తం వెళ్లిన తాళ్లూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఇరిగిపోయిన పవన్కుమార్ పాము కాటుకు గురై చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. రెండు రోజులుగా గుంటూరు రమేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డయాలసిస్ చేసి అన్ని విధాలుగా ప్రయత్నించినా పవన్కుమార్ మృతి చెండటం పోలీస్ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీస్ ఉన్నతాధికారులు, దర్శి డీఎస్పీ, సీఐ, ఎస్సైలు నిరంతర పర్యవేక్షణ చేసినా సరే పవన్కుమార్ను దక్కించుకోక పోయారు. పవన్కుమార్ది చీమకుర్తి పట్టణం. 2012 జవవరి 19లో పోలీస్ కానిస్టేబుల్గా ఉద్యోగంలో చేరారు. తాళ్లూరు, ఒంగోలు వన్ టౌన్, ముండ్లమూరులలో పనిచేసి మళ్లీ 2020 జనవరి 2న తాళ్లూరు పోలీస్ స్టేషన్లలో జాయిన్ అయ్యారు. ఎస్సైగా ఎప్పటికై నా ఎంపిక కావాలన్న ఆశయంతో ఉంటూ అంకితభావంతో పనిచేసే పవన్ ఇక లేక పోవటం దురదృష్టకరమని స్నేహితులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. ఆయన మరణం తీరని లోటని అన్నారు. పవన్కుమార్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కానిస్టేబుల్ రాత పరీక్షకు "థర్డ్ జెండర్"
వరంగల్: పోలీస్ కానిస్టేబుళ్ల తుది రాత పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. స్టయిఫండరీ ట్రెయినీ కానిస్టేబుళ్ల నియామకంలో భాగంగా అభ్యర్థుల పరీక్ష కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 16 సెంటర్లు ఏర్పాటు చేశారు. మొత్తం 12,029 మంది అభ్యర్థులకు హాల్ టికెట్లు జారీ చేయగా 11,910 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ముగ్గురు థర్డ్ జెండర్లు ఉన్నారు. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగిన ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఉదయం 8 గంటల వరకే కేంద్రాలకు చేరుకున్నారు. పోలీస్ అధికారుల పర్యవేక్షణలో సిబ్బంది.. తనిఖీలు నిర్వహించి లోనికి అనుమతించారు. పరీక్ష ప్రశాంతంగా ముగియడానికి కృషిచేసిన పోలీస్ సిబ్బందిని సీపీ రంగనాథ్ అభినందించారు. -
కానిస్టేబుల్ పరీక్షలో 'బలగం' సినిమాపై ప్రశ్న.. అదేంటంటే?
తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు తెరకెక్కించిన చిత్రం 'బలగం'. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వంలో రూపొందించిన ఈ చిత్రం ఊహించని స్థాయిలో రికార్డులు కొల్లగొట్టింది. ఎప్పుడు తెరపై కనిపించని వారు కూడా ఈ సినిమాలో ఫేమస్ అయిపోయారు. అంతలా ప్రజల ఆదరాభిమానులు సంపాదించుకున్న ఈ చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు వరించిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ' 'బలగం' తొలి సినిమానే.. కానీ ఆమె జీవితమే ఓ కన్నీటి కథ') అయితే తాజాగా ఈ సినిమాపై తెలంగాణలో జరిగిన కానిస్టేబుల్ రాతపరీక్షలో ఓ ప్రశ్న వచ్చిందంటే బలగం సినిమాకు ఉన్న ఆదరణ ఏంటో అర్థమవుతోంది. ఈనెల 30న జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రశ్నను అడిగారు. మార్చి 2023లో ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఓ విభాగంలో బలగం సినిమాకు పురస్కారం లభించింది అన్న ప్రశ్న అడిగారు. అబ్జెక్టివ్ టైప్ ప్రశ్నకు ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ నాటకం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంభాషణ అనే నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు ఉత్తమ నాటకం అనేది సరైన సమాధానం. ఓనికో ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ నాటకం విభాగంలో అవార్డ్ దక్కింది. కాగా.. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కల్యాణ్ రామ్, వేణు యెల్దండి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికీ పల్లెల్లో ఈ సినిమాను పెద్ద తెరలపై ప్రదర్శిస్తున్నారు. (ఇది చదవండి: తోడుగా ఉన్న భర్త చనిపోయాడు, చేతికందిన కొడుకు కూడా: బలగం నటి) -
నేడు కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్ష
వరంగల్ : స్టయిఫండరీ క్యాండెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల రాత పరీక్ష ఆదివారం జరగనుందని, ఈ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. పరీక్ష నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు, అభ్యర్థులు పాటించాల్సిన జాగ్రత్తలను శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాత పరీక్ష కోసం వరంగల్, హనుమకొండ ప్రాంతాల్లో 16 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి జిల్లానుంచి పరీక్షకు 12,040 మంది అర్హత సాధించారని వివరించారు. అభ్యర్థులకు సూచనలు.. ► నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ► హాల్ టికెట్ను పరీక్ష కేంద్రం, హాల్లో చూపిస్తేనే లోపలికి అనుమతి ఉంటుంది. ► పరీక్ష కేంద్రానికి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ఫోన్లు, బ్యాగులను తీసుకురావద్దు. ► పోలీస్ నియామకబోర్డు జారీ చేసిన హాల్టికెట్, బ్లాక్, బ్లూపెన్, అధార్, డ్రైవింగ్, ఓటర్ గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకురావాలి. ► అభ్యర్థుల గుర్తింపును పరీక్ష కేంద్రాల వద్ద పూర్తిగా పరిశీలించిన తరువాతే లోపలికి అనుమతిస్తారు. ► పరీక్ష ప్రారంభమైన తరువాత అభ్యర్థులను హాల్లోకి అనుమతించరు. లోపల ఉన్న వారిని పరీక్ష పూర్తయ్యేవరకు బయటకు పంపించరు. ► అభ్యర్థులు గంట ముందుగా తమకు కేటాయించిన కేంద్రాలకు చేరుకోవాలి. ► పరీక్ష రాసే ముందు అభ్యర్థులు ఓఎంఆర్ షీట్ను పూర్తిగా చదువుకోవాలి. ► ఓఎంఆర్షీట్పై అనవసరపు గుర్తులు, మతపరమైన గుర్తులు, ఏమైనా రాస్తే ఆ ఓఎంఆర్షీట్ను పరిగణనలోకి తీసుకోరు. ► అభ్యర్థులు అనైతిక చర్యలకు పాల్పడితే.. వారి ఓఎంఆర్షీట్ను పరిగణనలోకి తీసుకోరు. ► ఒక అభ్యర్థికి బదులు మరో అభ్యర్థి పరీక్ష రాస్తే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయి. ► అభ్యర్థుల ఫొటోలు, వేలిముద్రలు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ► మెహందీ, సిరా వంటి వాటిని చేతులకు, పాదాలకు పెట్టుకోకూడదు. ► ప్రశ్నపత్రం అభ్యర్థులకనుగుణంగా తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషల్లో ఉంటుంది. పరీక్ష కేంద్రాలు 16.. అభ్యర్థులు 12,040 మంది నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ -
30న కానిస్టేబుల్ పోస్టులకు తుది రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా పోలీసు శాఖలోని వివిధ విభాగాల కానిస్టేబుల్ పోస్టులకు తుదిరాత పరీక్షను ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నారు. ఉమ్మడి 9 జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో పరీక్షకేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సివిల్ కానిస్టేబుల్, తత్సమాన పోస్టులకు తుది రాతపరీక్ష నిర్వహిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 2–30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు కమ్యూనికేషన్ కానిస్టేబుల్ అభ్యర్థులకు తుది రాతపరీక్ష నిర్వహించనున్నారు. సివిల్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ పరీక్షలు రాస్తున్న అభ్యర్థుల రెండు పరీక్షలకు సైతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఒకే పరీక్షకేంద్రాన్ని కేటాయించనున్నట్టు చైర్మన్ స్పష్టం చేశారు. కానిస్టేబుల్ తుది రాతపరీక్ష హాల్టికెట్లను అభ్యర్థులు సోమవారం(ఈ నెల 24) ఉదయం 8 గంటల నుంచి 28వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. అభ్యర్థులు www.tslprb.com వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. హాల్టికెట్ల డౌన్లోడ్లో ఇబ్బందులు ఉన్న అభ్యర్థులు 93937 11110, 93910 05006 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
ప్రాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) వస్తాయి. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. -
‘కానిస్టేబుల్’ మెయిన్ పరీక్షకు 95,208 మందికి అర్హత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. గత నెల 22న నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ప్రకటించింది. మొత్తం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే. 35 ప్రాంతాల్లోని 997 కేంద్రాల్లో నిర్వహించిన ప్రిలిమినరీ రాతపరీక్షకు 4,59,182 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 95,208 మంది అర్హత సాధించారు. పరీక్ష రాసిన 3,63,432 మంది పురుషుల్లో 77,876 మంది క్వాలిఫైకాగా.. 95,750 మంది మహిళల్లో 17,332 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారి వివరాలు slprb. ap.gov.in వెబ్సైట్లో ఉంచారు. ప్రిలిమినరీ రాతపరీక్ష జవాబు పత్రాల కీ గతనెల 22న సాయంత్రం విడుదల చేశారు. దానిపై వచ్చిన 2,261 అభ్యంతరాలను పరిశీలించిన సబ్జెక్ట్ నిపుణులు.. ఆ కీలోని మూడు ప్రశ్నలకు జవాబులు మార్చి తుది కీ విడుదల చేశారు. స్కాన్చేసిన ఓఎంఆర్ షీట్లను మూడురోజలపాటు డౌన్లోడ్ చేసుకునేలా అందుబాటులో ఉంచారు. ఈ నెల 7వ తేదీ (మంగళవారం) సాయంత్రం 5 గంటల వరకు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తదుపరి సమాచారం కోసం ఈ వెబ్సైట్ను తరచు పరిశీలించాలని సూచించారు. మెయిన్ పరీక్షకు దరఖాస్తులు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు హెల్ప్లైన్ నంబరు 9441450639కి కాల్ చేయవచ్చు. 9100203323 నంబరులో సంప్రదించవచ్చు. mail-slprb@ap.gov.inకి మెయిల్ చేయవచ్చు. కటాఫ్ మార్కుల వివరాలు 200 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో కటాఫ్ ఓసీలకు 40 శాతం (200కు 80 మార్కులు), బీసీలకు 35 శాతం (200కు 70 మార్కులు), ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్కు 30 శాతం (200కు 60 మార్కులు)గా నిర్ణయించారు. కులాలవారీగా పరీక్ష రాసిన, క్వాలిఫై అయిన పురుషులు, మహిళల సంఖ్య -
TS: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వారందరికీ మరోసారి ఈవెంట్స్!
సాక్షి, హైదరాబాద్: యూనిఫాం సర్వీసెస్ కొలువుల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షల్లో బహుళ సమాధాన ప్రశ్నల (మల్టిపుల్ ఆన్సర్ క్వశ్చన్స్)కు సమాధానాలు రాసిన అభ్యర్థులకు మార్కులు కలపాలని, ఈ మేరకు అర్హులైన వారికి మరోమారు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలుచేస్తూ వచ్చే నెల 15 నుంచి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇలా అర్హత సాధించిన అభ్యర్థుల హాల్టికెట్ నంబర్లను సోమవారం www.tslprb.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తులు నింపండి.. ఇప్పుడు మార్కులు కలపడంతో అర్హత సాధించే అభ్యర్థులు ఆన్లైన్లో పార్ట్–2 దరఖాస్తును నింపాలని టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. వీటిని నింపేందుకు ఫిబ్రవరి 1 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి 10 గంటల వరకు సమయం ఇవ్వనున్నట్టు తెలిపింది. ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షల్లో (ఎస్సై లేదా కానిస్టేబుల్) అర్హత సాధించి, బోర్డు తాజా నిర్ణయంతో రాతపరీక్షలో అర్హత సాధించే అభ్యర్థులు కూడా మళ్లీ పార్ట్–2 దరఖాస్తు నింపాల్సి ఉంటుంది. అయితే, ఇప్పటికే దేహదారుఢ్య పరీక్షలకు హాజరై అర్హత సాధించలేకపోయిన అభ్యర్థులు.. ఇప్పుడు కొత్తగా మార్కులు కలపడం వల్ల రాతపరీక్షలో ఉత్తీర్ణులైనప్పటికీ వారికి మరో అవకాశం ఇచ్చేది లేదని పోలీస్ బోర్డు స్పష్టం చేసింది. వీరికి మాత్రమే ఫిజికల్ ఈవెంట్స్ గతంలో దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనని, ఇప్పుడు మార్కులు కలిపితే కొత్తగా అర్హత సాధించే అభ్యర్థులకు మాత్రమే ఫిబ్రవరి 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. హైదరాబాద్, సైబరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ, ఆదిలాబాద్ల్లో నిర్వహించనున్న ఈ ఫిజికల్ ఈవెంట్స్ను పదిరోజుల్లో పూర్తి చేస్తామని తెలిపారు. వీటి అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 ఉదయం 8 గంటల నుంచి ఫిబ్రవరి 10వ తేదీ రాత్రి 12 గంటల వరకు టీఎస్ఎలీ్పఆర్బీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్లోడ్లో ఏవైనా సమస్యలుంటే 9393711110, 9391005006 నంబర్లలో సంప్రదించవ్చని చెప్పారు. -
AP: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కీ విడుదల
సాక్షి, విజయవాడ: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ(ఆదివారం) జరిగిన పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు 91 శాతం అభ్యర్ధులు హాజరైనట్లు రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది. అలాగే కీని సైతం రిలీజ్ చేసేసింది. మొత్తం 6,100 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. 5,03,487 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఆదివారం ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షకు 4,58,219 మంది హాజరు కాగా, 45,268 మంది గైర్హాజరు అయ్యారు. ఇక ముందుగా చెప్పిన టైంకి slprb.ap.gov.in వెబ్సైట్ లో ప్రిలిమినరీ ఆన్సర్ కీ అప్ లోడ్ చేశారు అధికారులు. జనవరి 25వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ప్రిలిమినరీ ఆన్సర్ కీ పై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యంతరాలను తెలిపేందుకు id mail-slprb@ap.gov.in మెయిల్ ఐడీ కేటాయించింది రిక్రూట్మెంట్ బోర్డు. పూర్తి సమాచారం కోసం సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ క్లిక్ చేయండి -
TS Police: ఈవెంట్స్ కంప్లీట్.. ఫైనల్ పరీక్షలకు బస్తీమే సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీస్ ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తి చేసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఫిజికల్ ఫిటెనెన్ టెస్టుల్లో పాల్గొన్నారు. కాగా, దేహదారుఢ్య పరీక్షలు సైతం పూర్తయ్యాయి. డిసెంబర్ 8వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు ఈవెంట్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 2.07 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటిలో అర్హత సాధించినవారికి మెయిన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్ మూడో వారం వరకు మెయిన్స్ నిర్వహిస్తారు. కాగా, 554 ఎస్సై పోస్టులకు 52,786 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. 15644 కానిస్టేబుల్ పోస్టులకుగాను 90,488 మంది, 614 ఆబ్కారీ కానిస్టేబుల్ పోస్టులకు 59,325 మంది అభ్యర్థులు మెయిన్స్ రాయనున్నారు. కాగా, ఈవెంట్స్ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డ్ చేశామని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ పేర్కొంది. లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్టు బోర్డ్ తెలిపింది. ఈ రిక్రూట్మెంట్లో 53.7 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. ఇక, 2018-19 నోటిఫికేషన్లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్లో క్వాలిఫై అయనట్టు బోర్టు అధికారులు వెల్లడించారు. -
స్టేడియంలో కానిస్టేబుల్ రాతపరీక్ష.. నిరుద్యోగానికి నిదర్శనం!
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనమీ చిత్రం. 1,667 పోలీసు కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం రాజధాని ఇస్లామాబాద్లోని ఓ స్టేడియంలో రాత పరీక్ష జరిగింది. ఏకంగా 32,000 మంది అభ్యర్థులు తరలివచ్చారు. అప్పుల కారణంగా ఖర్చును భరించే పరిస్థితి లేక అధికారులు అందరినీ ఒకేచోటుకి పిలిపించి పరీక్ష నిర్వహించారు. పాకిస్తాన్ యువతలో 31 శాతం మంది నిరుద్యోగులే ఉన్నారు. ఇస్లామాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 30వేల మంది పురుష, మహిళ అభ్యర్థులు స్టేడియంలో నేలపైనే కూర్చుని పరీక్ష రాశారు. గత ఐదేళ్లుగా సుమారు 1,667 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఇటీవలే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. పోలీసు నియామక పరీక్షలకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో దేశంలోని నిరుద్యోగ పరిస్థితిపై చర్చ మొదలైంది. దేశంలో నిరుద్యోగ సమస్య గరిష్ఠస్థాయికి చేరుకుంది. పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవెలప్మెంట్ ఎకనామిక్స్(పీఐడీఈ) ప్రకారం దేశంలో 31 శాతం మంది యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అందులో 51 శఆతం మంది మహిళలు, 16 శాతం మంది పురుషులు ప్రొఫెషనల్ డిగ్రీలు చేసి ఖాళీగా ఉన్నారు. పాకిస్థాన్ జనాభాలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారే ఉండగా.. నిరుద్యోగ రేటు 6.9 శాతంగా ఉంది. ఇదీ చదవండి: ప్రమాదకరంగా పైపైకి -
TS: ‘పోలీస్’ తుది పరీక్షల షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: యూనిఫామ్ సర్వీసెస్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో కీలకమైన తుది రాత పరీక్ష తేదీల షెడ్యూల్ ఖరారైంది. మార్చి 12 నుంచి పలు విభాగాల్లోని 17,560 పోస్టుల భర్తీకి తుది రాత పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో పోలీస్ ఉద్యోగార్థులు తీవ్రంగా శ్రమించే సివిల్ ఎస్సై పోస్టులకు రాత పరీక్షను ఏప్రిల్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి చైర్మన్ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. సివిల్ కానిస్టేబుల్ తుది రాత పరీక్షను ఏప్రిల్ 23న నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు పరీక్షల తేదీలను వెల్లడిస్తూ ఆయన ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు తుది రాతపరీక్షకు సన్నద్ధం కావాలని సూచించారు. ఈనెల 5తో ముగియనున్న దేహదారుఢ్య పరీక్షలు పలు విభాగాల్లోని ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 8న ప్రారంభించారు. ఈ ప్రక్రియ జనవరి 5తో ముగియనుంది. హైదరాబాద్సహా తెలంగాణ వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో ఫిజికల్ ఈవెంట్స్ను నిర్వహిస్తున్నారు. దేహదారుఢ్య పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు తుది రాత పరీక్ష హాల్టికెట్లను త్వరలోనే జారీ చేయనున్నట్టు బోర్డు అధికారులు తెలిపారు. డ్రైవర్, డ్రైవర్ ఆపరేటర్స్, మెకానిక్ పోస్టులకు పోటీపడుతున్న అభ్యర్థులకు డ్రైవింగ్ టెస్ట్ తేదీలను త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు. -
గుడ్న్యూస్! కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు
సాక్షి, అమరావతి: పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి గడువును రాష్ట్ర పోలీసు నియామక మండలి పొడిగించింది. ఇటీవల 611 ఎస్ఐ పోస్టులు, 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థుల వయో పరిమితిని ప్రభుత్వం రెండేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ముందు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కానిస్టేబుల్ పోస్టులకు ఈ నెల 28లోపు దరఖాస్తు చేసుకోవాలి. వయో పరిమితి రెండేళ్లు సడలింపునిచ్చిన నేపథ్యంలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా గడువును 2023, జనవరి 7 వరకు పొడిగించింది. ఈ మేరకు పోలీస్ నియామక నోటిఫికేషన్ను సవరించింది. ఎస్ఐ పోస్టులకు మాత్రం ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం జనవరి 18లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. -
AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..
సాక్షి, అమరావతి: హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్ – ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,500 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. హోంగార్డులకు ముఖ్యమంత్రి వరం హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తగిన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపునకు నోచుకోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డుల జీతాలు పెంచింది. అప్పటివరకు నెలకు రూ.18 వేలు మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వారికి మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారనుంది. చదవండి: ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. -
స్టేషన్లో గొడవతో హత్యకు సుపారీ
తుమకూరు: హుళియారు పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సుధా హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఆమెను హత్య చేయడానికి సహచర కానిస్టేబుల్ రాణినే సుపారీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే మంజునాథ్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా అతనికి సహకరించిన వ్యక్తి పట్టుబడ్డాడు. కానిస్టేబుల్ రాణితో పాటు నిఖేశ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రాణం తీసిన గొడవ హుళియారు పీఎస్లో సుధాతో పాటు రాణి అనే మహిళా కానిస్టేబుల్ కూడా పనిచేస్తోంది. అయితే డ్యూటీ విషయాలతో పాటు సుధా, రాణి ఇద్దరు తరచూ డబ్బుల గురించి గొడవ పడేవారు. ఇద్దరు మూడు నాలుగు సార్లు స్టేషన్లోనే తీవ్రంగా రగడ పడినట్లు సమాచారం. దీంతో ఎలాగైనా సుధను అడ్డుతొలగించుకోవాలని రాణి పథకం వేసింది. ఏకంగా సుధకు వరుసకు సోదరుడైన మంజునాథ్కు సుపారీ ఇచ్చింది. దీంతో రాణి వద్ద సుపారీ తీసుకున్న మంజునాథ్ (23), తన స్నేహితుడు నిఖేశ్ (30) సాయంతో సుధను కారులో తీసుకుని పోయి హాసన్ వద్ద హత్య చేసి పొదల్లో పడేసి వెళ్లిపోయాడు. తరువాత భయాందోళనకు గురైన మంజునాథ్ శివమొగ్గకు చేరుకుని అక్కడ ఓ లాడ్జిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ కేవీ మూర్తి తెలిపారు. (చదవండి: ఫోటోలు లీక్, ప్రియుడు ఖతం) -
తెలంగాణ: కానిస్టేబుల్ అభ్యర్థులకు ఐదు మార్కులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పోలీసు నియామక మండలి తాజాగా నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల కీ విడుదల అయ్యింది. మంగళవారం సాయంత్రం కీని వెబ్సైట్లో ఉంచినట్లు తెలిపిన అధికారులు.. అభ్యంతరాలను తమ దృష్టికి తీసుకురావాలని అభ్యర్థులను కోరారు. అయితే బోర్డు రిలీజ్ చేసిన కీ ప్రకారం.. అభ్యర్థులకు ఐదు మార్కులు కచ్చితంగా జత చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యంతరాలపై రేపటి నుంచి(ఆగష్టు 31) ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 సాయంత్రం ఐదు గంటల వరకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దృష్టికి తీసుకెళ్లవచ్చు. అభ్యంతరాలు ఉన్న ప్రశ్నలను.. విడివిడిగా తగిన ఆధారాలతో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించారు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారులు. ఈ అభ్యంతరాలు పరిగణనలోకి గనుక తీసుకుంటే.. ఇంకొన్ని మార్కులు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది!. ఐదు మార్కులు! పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో ఉంచిన కీ ప్రకారం.. ప్రతీ అభ్యర్థికి ఐదు మార్కులు జత చేసే అవకాశం ఉంది. ఈ మేరకు కీ చివర్లో సదరు విషయాన్ని పరోక్షంగా పేర్కొంది రిక్రూట్మెంట్ బోర్డు. ఇక తెలంగాణలో ఆదివారం (ఆగస్టు 28వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పరీక్షలో.. 91.34 శాతం అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. హైదరాబాద్ సహా 38 పట్టణాల్లో పరీక్ష జరగ్గా.. 6,61,198 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకుని 6,03,955 మంది పరీక్షకు హాజరయ్యారు. కీ కోసం క్లిక్ చేయండి -
తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షల్లో తప్పులు
-
TS: కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో ప్రశ్నల్లో తప్పులుదొర్లాయి. ప్రశ్నాపత్రంలో 13 తప్పులు ఉన్నట్టు గుర్తించారు. ఈ క్రమంలో బోర్డుకు ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తోంది. దీంతో, ఎక్కువ ఫిర్యాదులు వస్తే అభ్యర్థులకు గరిష్టంగా 8 మార్కులు కలిపే అవకాశం అందని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. సబ్ ఇన్పెక్టర్ పోస్టులకు ఆగష్టు 7న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. 12న ప్రశ్నాపత్రం ‘కీ’ ని వెబ్ సైట్లో పెట్టారు. ప్రశ్నాపత్రంలో 8 ప్రశ్నలు తొలగించారు. ఇంగ్లీష్- తెలుగు వెర్షన్లోని ‘ఎ’ బుక్లెట్లో 43, 111, 146, 173, 180, 184, 195, 199 ప్రశ్నల్లో తప్పులు దొర్లాయి. ఈ నేపథ్యంలో ప్రతీ అభ్యర్థికి 8 మార్కులు కలపాలని మండలి ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇది కూడా చదవండి: అడ్వాన్స్డ్ పేపర్ హార్డే -
‘కానిస్టేబుల్ పరీక్ష’కు నిమిషం నిబంధన
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ అభ్యర్థుల రాత పరీక్ష ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు నిమిషం నిబంధన వర్తింపజేశారు. నిర్దేశిత సమయానికి ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 91 కేంద్రాలు ఏర్పాటు చేసిన సిటీ పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 6.61 లక్షల మందికి పైగా హాజరవుతుండగా సిటీలోనూ పెద్ద సంఖ్యలోనే రాయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా నగర పోలీసులు బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్దా అభ్యర్థులను క్షుణ్నంగా తనిఖీ చేసి లోపలకు పంపడం, నిర్దేశిత ప్రాంతాల నుంచి పరీక్ష పత్రాలకు పరీక్ష కేంద్రాలకు చేర్చడం, పూర్తయిన తర్వాత జవాబుపత్రాలను బందోబస్తు మధ్య జేఎన్టీయూలోని స్ట్రాంగ్ రూమ్ సిబ్బందికి అప్పగించడం... ఇలాంటి ప్రతి అంశానికీ ప్రాధాన్యం ఇస్తూ బందోబస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సంయుక్త కమిషనర్ ఎం.రమేష్ శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లోని రహదారుల్లో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులపై కన్నేసి ఉంచాలని, ప్రతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించాలని స్థానిక పోలీసులకు అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి పరీక్ష జరగనుంది. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. సరిగ్గా 10 గంటలకు గేట్లు మూసేస్తారు. ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా లోపలకు అనుమతించరు. సెల్ఫోన్లు, బ్యాగులు, స్మార్ట్ వాచీలు, క్యాలిక్లేటర్లు సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థుల హాజరు బయోమెట్రిక్ విధానంలో తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే పరీక్ష రాసేవాళ్లు మెహందీ, టాటూలకు దూరంగా ఉండాలి. అభ్యర్థులు తమ వెంట హాల్టికెట్, పెన్ మాత్రమే తెచ్చుకోవాలి. హాల్ టిక్కెట్పై బోర్డు సూచించిన విధంగా పాస్పోర్టు సైజు ఫొటో కచ్చితంగా అతికించుకుని రావాలి. -
సాక్షి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో.. పోలీసు కానిస్టేబుల్స్ బుక్లెట్.. ఈజీగా అర్థమయ్యేలా..
సాక్షి ఎడ్యుకేషన్: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఉద్యోగాలకు లక్షల్లో పోటీ ఉంటుంది. ఈ పోలీసు ఉద్యోగం సాధించాలంటే సరైన ప్రిపరేషన్ ఉండాలి. అలాగే పోలీసు ఉద్యోగ పరీక్షలకు పుస్తకాల ఎంపిక కూడా విజయానికి కీలక పాత్ర పోషిస్తాయి. తెలంగాణలో 17 వేల పైచిలుకు పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెల్సిందే. చదవండి: TS: రానున్న 3 రోజుల్లో అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇలాంటి కీలకమైన నేపథ్యంలో.. తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం సాక్షి ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో బుక్లెట్ను ప్రిపేర్ చేయించింది. పరీక్షకు సంబంధించిన అన్ని అంశాలను కవర్ చూస్తూ.. ఈజీగా అర్థమయ్యేలా ఈ పుస్తకాన్ని సాక్షి మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ పుస్తకం మీ విజయంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అత్యంత తక్కువ ధరకే ఈ బుక్ లభిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ బుక్ కావాల్సిన వారు 18004259899 నెంబర్కు ఫోన్ చేసి పొందవచ్చు. సాక్షి ఏజెంట్ను లేదా మీ దగ్గర్లోని బుక్స్టాల్ని సంప్రదించి తీసుకొవచ్చు. -
పోలీసు జాబ్స్ వయోపరిమితి పెరిగేనా?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ముందుగా పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడతాయనే ప్రచారంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఈ కొలువులకే సన్నద్ధమవుతోంది. అత్యధిక పోస్టులు ఉండటంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ అర్హత కావడంతో వీటికి అత్యధిక ప్రాధాన్యం ఏర్పడింది. ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. వయోపరిమితి విషయంలో నెలకొన్న అస్పష్టతతో చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం వేచిచూస్తున్నారు. అధిక సంఖ్యలో నియామకాలు చేపట్టే కానిస్టేబుల్ ఉద్యోగానికి గరిష్ట వయోపరిమితి 22 ఏళ్లు ఉండగా, ఎస్సై పోస్టులకు 25, డీఎస్పీకి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్కు 26 ఏళ్లు ఉంది. దీంతో గరిష్ట వయోపరిమితి పెంపుపై నిరుద్యోగ యువత గంపెడాశలు పెట్టుకుంది. వయోపరిమితి పెంచితేనే.. పోలీసు శాఖలో వివిధ కేటగిరీల్లో 16,587 కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను భర్తీ చేసేందుకు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రూప్–1లో డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, రీజినల్ ట్రా న్స్పోర్ట్ ఆఫీసర్ విభాగాల్లో 120 ఉద్యోగాలున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న నేపథ్యంలో ఇతర ఉద్యోగాలకు వయోపరిమితి సడలింపు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ యూనిఫాం కొలువులపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. రిజర్వేషన్ అభ్యర్థులకు కాస్త సడలింపు ఉన్నప్పటికీ జనరల్ కేటగిరీలో సడలింపు కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ జనరల్ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి పెంచితే రిజర్వ్డ్ అభ్యర్థులకు మరింత ఉపశమనం కలుగుతుందనే ఆశ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల్లో కనిపిస్తోంది. వయోపరిమితిపై ప్రభుత్వం ముం దుగానే నిర్ణయం ప్రకటించాలని, నోటిఫికేషన్ విడుదలయ్యాక సడలింపు జఠిలమవుతుందని అభ్యర్థులు చెబుతున్నారు. పొరుగున 35 ఏళ్లు గ్రూప్–1 కేటగిరీలో యూనిఫాం ఉద్యోగాలు డీఎస్పీ, ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆర్టీఓ ఉన్నాయి. వీటిలో జనరల్ కేటగిరీలో డీఎస్పీకి గరిష్ట వయోపరిమితి 28, ఎక్సైజ్ సూపరింటెండెంట్కు 26 ఏళ్లు ఉంది. అయితే, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఈ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలుగా ఉంది. ఇక్కడా వయోపరిమితి పెంచాలని, లేనిపక్షంలో చాలామంది ఆశలు గల్లంతవుతాయని నిరుద్యోగులు అంటున్నారు. -
బీఎస్ఎఫ్లో భారీగా కొలువులు.. 2788 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసి సరిహద్దు రక్షణ దళంలో పనిచేయాలనుకునే వారికోసం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) ఉద్యోగ ప్రకటన వెలువడింది. దీనిలో భాగంగా కానిస్టేబుల్(ట్రేడ్మెన్) పోస్టులను భర్తీచేయనున్నారు. మొత్తం పోస్టుల సంఖ్య 2788. వీటిల్లో పురుషులకు 2651, మహిళలకు 137 పోస్టులను కేటాయించారు. ఫిజికల్ టెస్టులు, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత ► పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పని అనుభవం ఉండాలి. లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్(ఐటీఐ) నుంచి ఏడాది సర్టిఫికేట్ కోర్సు/రెండేళ్ల డిప్లొమా లేదా తత్సమాన కోర్సు చదివి ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ రిజర్వేషన్లకు అనుగుణంగా వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. ► ఎత్తు: పురుష అభ్యర్థులు ఎత్తు 167.5 సెం.మీ, ఛాతీ కొలత 78–83 సెం.మీ మ«ధ్య ఉండాలి. స్త్రీలు 157 సెం.మీ ఎత్తు ఉంటే సరిపోతుంది. చదవండి: 2022లో సింగరేణిలో ఉద్యోగాల భర్తీ.. పూర్తి విరాలు ఇవే.. ఎంపిక ఇలా ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), డాక్యుమెంటేషన్, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ► హైట్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే పీఈటీ పరీక్షలను నిర్వహిస్తారు. ఇందులో పురుçషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో పరుగెత్తాలి. స్ట్రీలు 1.6 కిలో మీటర్ల దూరాన్ని 8.30 నిమిషాల్లో పరుగెత్తాల్సి ఉంటుంది. రాత పరీక్ష ► పైన టెస్టులను విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇంగ్లిష్, హిందీల్లో నిర్వహించే ఈ పరీక్షను ఓఎంఆర్ షీట్ మీద రాయాలి. అంటే.. ఆఫ్లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ► రాత పరీక్షలో మొత్తం 100 మార్కులకు–100 ప్రశ్నలుంటాయి. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలను అడుగుతారు. జనరల్ అవేర్నెస్/జనరల్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద డిస్టింగ్విష్డ్ ప్యాట్రన్స్, బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లిష్/హిందీ.. ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 2 గంటలు. అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులు కనీసం 35శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు కనీసం 33 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఇలా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలకు కేటాయించిన ఖాళీలకు అనుగుణంగా సొంత రాష్ట్రానికి చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో జనరేట్ అయ్యే ఐడీ, పాస్ట్వర్డ్లను సేవ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తిచేసుకున్న అభ్యర్థులు సదరు రిజిస్ట్రేషన్ ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇది రికార్డు నిమిత్తం భద్రపరుచుకోవాలి. దరఖాస్తును పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కరస్పాండెన్స్ అంతా ఈమెయిల్/ఎస్ఎంఎస్ ద్వారానే జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు తప్పులు లేకుండా ఫోన్, మెయిల్ ఐడీ సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వ/పాక్షిక ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది. వీటితోపాటు టెన్త్ సర్టిఫికేట్ అలాగే రెండేళ్ల పని అనుభవానికి సంబంధించి సర్టిఫికేట్, రెసిడెన్సీ, కాస్ట్ సర్టిఫికేట్(అవసరమైతే)లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వేతనాలు పే మ్యాట్రిక్స్ లెవల్–3 ప్రకారం–నెలకు రూ.21,700–రూ69,100–వరకు వేతనంగా చెల్లిస్తారు. ఇవేకాకుండా ఇతర అలవెన్సులు కూడా పొందుతారు. ముఖ్య సమాచారం దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 01, 2022 వెబ్సైట్: https://rectt.bsf.gov.in -
22 నుంచి పోలీసు ఉద్యోగాలకు ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: సబ్ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు బీసీ స్టడీసర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కోవిడ్–19 నేపథ్యంలో ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లలో ఈ నెల 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ బాలాచారి వివరించారు. జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లిష్ తదితర అంశాల్లో 60 రోజుల పాటు శిక్షణ సాగుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 15,622 మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిని బ్యాచ్లుగా విభజించి కోచింగ్ ఇస్తామని చెప్పారు. దీంతోపాటు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూట్యూబ్ చానల్ ద్వారా ఆన్లైన్ తరగతులు వీక్షించవచ్చని వెల్లడించారు. -
టెన్త్తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఐదంకెల జీతం
శారీరకంగా ధృడంగా ఉండి.. దేశ సేవ చేయాలనే తపన కలిగిన యువతకు కేంద్ర పారామిలిటరీ దళాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఆయా భద్రతా దళాల్లో ఖాళీగా ఉన్న 25వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి పూర్తిచేసి కేంద్ర సాయుధ బలగాల్లో కొలువు సాధించాలని కలల కనే యువతకు చక్కటి అవకాశం.. ఎస్ఎస్సీ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఈ నేపథ్యంలో.. కానిస్టేబుల్ పోస్టుల దరఖాస్తుకు అర్హతలు.. ఎంపిక విధానం.. సిలబస్.. ప్రిపరేషన్ టిప్స్... ► పోస్టు పేరు: కానిస్టేబుల్(జనరల్ డ్యూటీ) ► మొత్తం ఖాళీల సంఖ్య: 25,271 ► విభాగాల వారీగా పోస్టుల సంఖ్య: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785,ఎస్ఎస్ఎఫ్–240 సీఏపీఎఫ్ ఆర్మీ, నేవీ ఎయిర్ఫోర్స్ మాదిరిగానే సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో ప్రతి ఏటా నియామకాలు జరుగుతున్నాయి. ఇందులో పలు విభాగాలున్నాయి. అవి.. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్(సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్(ఐటీబీపీ), సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్(ఎప్ఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్(ఏఆర్). వీటిల్లో ఉమ్మడి పరీక్ష ద్వారా కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆయా ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తోంది. అర్హతలు ► ఎస్ఎస్సీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 2021, ఆగస్టు 1 నాటికి పదోతరగతి/తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. మహిళలు కూడా దరఖాస్తుకు అర్హులే. ► వయసు: 2021, ఆగస్టు 1 నాటికి 18–23ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు్ల, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. వేతనం ఎంపికైతే పే లెవెల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 వేతన శ్రేణి లభిస్తుంది. ఎంపిక విధానం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్(సీబీఈ),సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్) నిర్వహించే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ), డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ టెస్ట్ ► తొలిదశలో సీబీఈ(కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్) ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలకు–100 మార్కులకు ఈ టెస్ట్ ఉంటుంది. పరీక్ష సమయం 90 నిమిషాలు. ► ఈ పరీక్షలోనాలుగు విభాగాల నుంచి ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులు, ఇంగ్లిష్/హిందీల నుంచి 25ప్రశ్నలు–25 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ► జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో.. వెర్బల్, నాన్ వెర్బల్, అనలిటికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పజిల్స్, డిస్టన్స్ అండ్ డైరెక్షన్, నంబర్ సిరీస్ కంప్లిషన్, అనాలజీ, కౌంటింగ్ ఫిగర్,డైస్, సిలోజిజం తదితర అంశాలుంటాయి. ఇందులో మంచి మార్కులు సాధించేందుకు లాజికల్ థింకింగ్ ఉపయోగపడుతుంది. ► జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ విభాగంలో.. హిస్టరీ, జాగ్రఫీ, కరెంట్ అఫైర్స్, ఇండియన్ పాలిటీ, ఇంటర్నేషనల్ అఫైర్స్, పుస్తకాలు, రచయితలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ విభాగంలో అభ్యర్థికి సమకాలీన పరిణామాలపై ఉన్న అవగాహనను పరిశీలిస్తారు. కాబట్టి వర్తమాన అంశాలపై పట్టుకోసం నిత్యం దినపత్రికలు చదివి నోట్స్ రాసుకోవడం అలవాటు చేసుకోవాలి. ► ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో..టైమ్ అండ్ డిస్టన్స్, బోట్ అండ్ స్ట్రీమ్, ఆల్జీబ్రా, జామెట్రీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్ వంటి వాటి నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇది అభ్యర్థికి గణితంపై ఉన్న అవగాహనను పరీక్షించే విభాగం. కాబట్టి పదో తరగతి స్థాయి మ్యాథమెటిక్స్ అంశాలపై గట్టి పట్టు సాధించాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వేగం పెంచుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించడం చాలా అవసరం. ► ఇంగ్లిష్/హిందీ: ఇందులో మంచి స్కోర్ సాధించేందుకు గ్రామర్తోపాటు వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. సెంటెన్స్ కరెక్షన్, సినానిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ ఎరేంజ్మెంట్, ఎర్రర్స్ ఫైండింగ్ తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్ పుస్తకాలు, ఇంగ్లిష్ దినపత్రికలు, వ్యాసాలు చదవడం ద్వారా ఈ విభాగాన్ని సులువుగానే గట్టెక్కే అవకాశముంది. ► ఈ పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానం అమలులో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గోవంతు(0.25) మార్కు తగ్గిస్తారు. ► ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్టీ): ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల శారీరకంగా «ధృడంగా ఉండాలి. ఎత్తు: పురుషులు 170 సెం.మీ, మహిళలు 157 సెం.మీ ఉంటే సరిపోతుంది. ఛాతీ: పురుషులు 170 సెం.మీ ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి. బరువు: ఎత్తుకు తగిన విధంగా ఉండాలి. ► ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ): ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టుల్లో భాగంగా పురుషులు 5 కిలోమీటర్ల దూరాన్ని 24 నిమిషాల్లో; అలాగే 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 1/2 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళలు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 8 1/2 నిమిషాల్లో, 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల్లో పరుగెత్తాలి. తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ► ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ► తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ల్లో పరీక్ష కేంద్రాలున్నాయి. ప్రిపరేషన్ టిప్స్ ► కానిస్టేబుల్ పరీక్షకు సన్నద్ధమయ్యే అభ్యర్థుల పరీక్ష విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సరైన స్టడీ ప్లాన్ సిద్దం చేసుకోవాలి. ► సిలబస్ను గురించిన అవగాహన పెంచుకోవాలి. ముఖ్యమైన టాపిక్స్ను గుర్తించాలి. ► గత ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ఆన్లైన్ మాక్టెస్టులు రాయాలి. దీనిద్వారా పరీక్షలో ఎక్కడ పొరపాట్లు చేస్తున్నామో తెలుస్తుంది. ► ఒత్తిడిని దూరం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. అప్పుడే పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు చివరి తేదీ: 31.08.2021 ► పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు ► వెబ్సైట్: https://ssc.nic.in -
3 రోజులు సెలవులు.. 28న విధుల్లోకి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ) కానిస్టేబుళ్లు కొత్తగా విధుల్లో చేరే ముందు మూడురోజుల సెలవులు దక్కాయి. వీరంతా తమకు కేటాయించిన యూనిట్లలో ఈ నెల 28న ఉదయం రిపోర్టు చేయాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 బెటాలియన్లలో శిక్షణ పొందుతున్న 3,804 మందికి షెడ్యూల్ ప్రకారం 25వ తేదీన ఉదయం నియామకపత్రాలు ఇవ్వాలి. అలా అయితే, వీరికి మధ్యలో రెండురోజుల గడువు మాత్రమే ఉందని గుర్తించిన అధికారులు 24వ తేదీ సాయంత్రమే అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు. దీంతో 25, 26, 27 తేదీల్లో మూడు రోజులు సెలవులు లభించాయి. -
ఎస్ఎస్సీ నోటిఫికేషన్: 25271 కానిస్టేబుల్ పోస్టులు
భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్ మంత్రిత్వ శాఖ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగానికి చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ)... వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 25271 ► పోస్టుల వివరాలు: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్ల్లో కానిస్టేబుల్ పోస్టులు, అస్సాం రైఫిల్స్లో రైఫిల్మెన్. ► విభాగాల వారీగా ఖాళీలు: బీఎస్ఎఫ్–7545, సీఐఎస్ఎఫ్–8464, ఎస్ఎస్బీ–3806, ఐటీబీపీ–1431,ఏఆర్–3785, ఎస్ఎస్ఎఫ్–240 ► జీతభత్యాలు: పేస్కేల్–3 ప్రకారం–రూ.21700–రూ.69100 ► అర్హత: 01.08.2021 నాటికి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ► వయసు: 01.08.2021 నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష(సీబీఈ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ సాండర్ట్ టెస్ట్(పీఎస్టీ), మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► కంప్యూటర్ ఆధారిత పరీక్ష: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 ప్రశ్నలు–25 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు–25 మార్కులకు, ఇంగ్లిష్/హిందీ 25ప్రశ్నలు–25 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి పొరపాటు సమాధానానికి 0.25 మార్కు తగ్గిస్తారు. ► తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్లో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: https://ssc.nic.in -
ఏం తెలివబ్బా.. మాస్క్తో హైటెక్ కాపీయింగ్
పాట్నా: మహమ్మారి వైరస్ రాకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా వాడుతున్న మాస్క్ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. మాస్క్ ఉండడంతో ముఖం కనిపించదని భావించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు యువతులను కూడా మోసం చేస్తున్నారు. తాజాగా కొందరు ముందడుగు వేసి మాస్క్ చాటున హైటెక్ కాపీయింగ్కు పాల్పడేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. పోలీసుల తనిఖీల్లో వారి అతి తెలివితేటలు కనిపెట్టి అదుపులోకి తీసుకున్నారు. బిహార్లో పోలీస్ నియామకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో దానికి సంబంధించిన పరీక్షను ఆదివారం (మార్చి 21) నిర్వహించారు. పెద్ద ఎత్తున నిరుద్యోగులు పరీక్ష రాయడానికి వచ్చారు. అయితే ఈ పరీక్షకు మాస్క్ తప్పనిసరి చేశారు. తనిఖీల సమయంలో మాస్క్లను పరీక్షించలేరని భావించి కొందరు ఈ ఎన్ 95 మాస్క్ ను అడ్డంగా పెట్టుకుని కొందరు హైటెక్ కాపీ చేసేందుకు ప్రయత్నించారు. బాబువా, హజీపూర్లో కూడా పరీక్షలు జరిగాయి. బాబువాలో విక్కీ కుమార్, యాదుపూర్లో నిరంజన్ కుమార్ మాస్క్ చాటున సిమ్ కార్డు, బ్లూటూత్, బ్యాటరీ తీసుకెళ్తున్నారు. తనిఖీల సమయంలో వీటిని అధికారులు గుర్తించి వెంటనే వారిని పోలీసులకు అప్పగించారు. మరోచోట విశాల్ కుమార్ కూడా ఇదే విధంగా మోసం చేయడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు. వీరికి 20 కిలో మీటర్ల దూరంలోని కుద్రా నుంచి సమాధానాలు అందించేందుకు ఏర్పాట్లు చేశారు. నిందితులు సమాచారం అందించడంతో సమాధానాలు ఇచ్చే వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సంతోశ్ కుమార్, దీపక్ కుమార్, అతుల్ పాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి ల్యాప్టాప్, పప్రింటర్, సెల్ఫోన్లు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు బాబువా ఎస్పీ రాకేశ్ కుమార్, డీఎస్పీ సునీతా కుమారి తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. వీరి వెనుక ఎవరు ఉన్నారనే దానిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయనున్నారు. -
వారం ముందే ముగియనున్న కానిస్టేబుళ్ల శిక్షణ
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతోన్న కానిస్టేబుల్ శిక్షణ గడువుకు వారం ముందే ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ అక్టోబర్ 12 తరువాత పూర్తవ్వాల్సి ఉంది. కరోనా కారణంగా మొదటి సెమిస్టర్ అనంతరం ఇవ్వాల్సిన వారం రోజుల సెలవులు రద్దయ్యాయి. మర్నాటి నుంచే రెండో సెమిస్టర్ ప్రారంభమవడంతో తొమ్మిది నెలల కానిస్టేబుల్ శిక్షణ ఈసారి వారం ముందే పూర్తవుతోంది. ఇదే విషయాన్ని సాక్షి జూన్ 26 నాటి సంచికలో వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి 7వ తేదీ మధ్య పాసింగ్ ఔట్ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ), అంబర్పేట, గోషామహల్, మేడ్చల్ యూనిట్లతోపాటు జిల్లాలకు చెందిన అన్ని పీటీసీ, డీటీసీల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలందాయి. కరోనా కారణంగా.. జనవరి 17న రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 12వేలమంది సివిల్, ఏఆర్ తదితర విభాగాల కానిస్టేబుళ్లకు శిక్షణ ప్రారంభమైంది. అంతలో కరోనా, లాక్డౌన్ పరిణామాలతో ముందుజాగ్రత్తగా అధికారులు కేడెట్లను బయటకు అనుమతించలేదు. మార్చి 25 నుంచి ఇప్పటిదాకా అంటే 130 రోజులకుపైగా వీరందరినీ టీఎస్పీఏపాటు, జిల్లాల్లోని పీటీసీలకు పరిమితం చేశారు. కేడెట్లకు ఔటింగ్ ఇవ్వకపోగా వారిని చూసేందుకు వచ్చే తల్లిదండ్రులు, భార్యాపిల్లలను అనుమతించట్లేదు. చివరిసారిగా కానిస్టేబుల్ కేడెట్లకు మార్చి 8, 9 తేదీల్లో సెలవులిచ్చారు. తరువాత లాక్డౌన్తో ఇవన్నీ రద్దయ్యాయి. మే 4,5,6,7 తేదీల్లో తొలి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం వీరికి మే 8 నుంచి 14 వరకు సెమిస్టర్ హాలీడేస్ ఇవ్వాలి. కానీ, కరోనా దృష్ట్యా రద్దు చేసి, మే 8 నుంచి రెండో సెమిస్టర్ తరగతులు ప్రారంభించారు. దీంతో కోర్సు వారం ముందే పూర్తికానుంది. టీఎస్ఎస్పీ అభ్యర్థుల్లో చిగురిస్తున్న ఆశలు వాస్తవానికి ప్రస్తుత కానిస్టేబుల్ అభ్యర్థులతోపాటు తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎస్ఎస్పీ) అభ్యర్థులకూ శిక్షణ ప్రారంభించాలి. ఈసారి భారీగా పోలీసు కానిస్టేబుళ్లను భర్తీ చేయడంతో రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో ఖాళీ లేకుండా పోయింది. దీంతో దాదాపు 4,200 మంది టీఎస్ఎస్పీ కేడెట్లను ఆంధ్రప్రదేశ్కు పంపాలని భావించినా, సాంకేతిక కారణాలతో వీలుపడలేదు. ఈ క్రమంలో సివిల్, ఏఆర్ అభ్యర్థుల పాసింగ్ ఔట్ పరేడ్ తేదీలు ప్రకటించడంతో టీఎస్ఎస్పీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి. త్వరలోనే వీరి శిక్షణ తేదీలు ప్రకటించే అవకాశాలున్నాయి. నలుగురు అడిషనల్ ఎస్పీల బదిలీ సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో అడిషనల్ ఎస్పీలు (నాన్కేడర్)గా విధులు నిర్వర్తిస్తున్న పలువురు అధికారులు బదిలీ అయ్యారు. రా మగుండం అడిషనల్ డీసీపీ (ఆపరేషన్స్)గా ఉన్న పి.శోభన్కుమార్ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆ స్థానంలో ఉన్న కె.సురేశ్కుమార్ను డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయమన్నారు. వరంగల్లో అడిషనల్ డీసీపీ (క్రైమ్స్ అండ్ ఆపరేషన్స్)గా వి.తిరుపతిని భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ (ఆపరేషన్స్)గా బదిలీ చేశారు. అక్కడున్న అట్ల రమణారెడ్డిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తా ఆదేశాలు జారీ చేశారు. -
కానిస్టేబుల్ ఫలితాలపై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. కట్ ఆఫ్ కంటే ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులను ఎంపిక చేయలేదని పిటిషనర్ వాదనలు వినిపించారు. అయితే కానిస్టేబుల్స్ నియామక ప్రక్రియ సక్రమంగానే జరిగిందని, ఫలితాల్లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు న్యాయ స్థానానికి తెలిపింది. అంతా పారదర్శకంగానే నిర్వహించామంటూ ఫలితాల వివరాలను కౌంటర్ ద్వారా కోర్టుకు సమర్పించింది. ఇరు వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి(అక్టోబర్ 29) వాయిదా వేసింది. కాగా కానిస్టేబుల్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటూ అక్టోబర్ 1న అభ్యర్థులు కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. -
కానిస్టేబుల్ ఫలితాలపై హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వెల్లడించిన కానిస్టేబుల్ ఫలితాలలో అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు మంగళవారం హైకోర్టును ఆశ్రయించారు. కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు రాలేదని అభ్యర్థులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన హైకోర్టు కానిస్టేబుల్ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని తెలంగాణ హోంశాఖను ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబరు 15కు వాయిదా వేసింది. -
పోలీస్ ఫలితాల్లో నల్లగొండ జిల్లాదే పైచేయి
సాక్షి, నల్లగొండ : పోలీస్ ఉద్యోగాల్లో జిల్లా నిరుద్యోగ యువత అధిక ఉద్యోగాలు సాధించింది. డిగ్రీ, పీజీ, ఎం.ఫార్మసీ, ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులంతా పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల్లో పట్టు సాధించారు. ఎలాగైనా ఉద్యోగం పొందాలనే తపన, లక్ష్యానికి అనుగుణంగా సాధన చేసి శిక్షణ పొంది ఉద్యోగం పొందడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొనగా వారి తల్లిదండ్రుల్లో ఆనందం ఆకాశాన్నంటింది. మంగళవారం రాత్రి వెలువడిన కానిస్టేబుల్ ఫలితాల్లో సుమారుగా 401 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందగా ఎస్ఐ ఫలితాల్లో 140 మంది ఎంపికైనట్లు జిల్లా పోలీస్ శాఖ అంచనా వేసింది. ప్రతి గ్రామం నుంచి 10 మంది, ఐదుగురు, ఒకరు చొప్పున ఉద్యోగాలు పొందడంతో ఆయా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాల కోసం ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి 24,908 మంది దరఖాస్తులు చేసుకోగా 22,250 మంది దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొన్నారు. 10వేల మంది పురుష అభ్యర్థులు, 1844 మంది మహిళలు అర్హత సాధించారు. పోలీస్ పరీక్షా ఫలితాల్లో దేహదారుఢ్య పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన వారే ఎక్కువగా ఉద్యోగాలు పొందారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో మహిళా అభ్యర్థులదే పైచేయిగా నిలిచింది. జిల్లా పోలీస్ శాఖ నుంచి అవగాహన సదస్సులు, ప్రత్యేక శిక్షణ కోసం కోచింగ్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు పొందే విధంగా దిశా నిర్దేశం చేశారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎస్పీ రంగనాథ్ స్త్రీ, పురుష అభ్యర్థులకు వేర్వేరుగా శిక్షణ ఇప్పించారు. జిల్లా నుంచి పోలీస్ ఉద్యోగాల్లో మెరుగైన ఫలితాలు సాధించడంపై ఇటు పోలీస్ శాఖ, అటు నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దోమలపల్లి గ్రామానికి చెందిన ఎం.ఫార్మసీ విద్యార్థి రాంరెడ్డి కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాడు. అదే గ్రామంలో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసు ఉద్యోగులు ఉండగా ఇటీవల ఫలితాలతో మరో ఆరుగురు కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారు. ఖాజీ రామారం నుంచి నలుగురురు, చందనపల్లి, బుద్ధారం నుంచి ఒకరు చొప్పున ఉద్యోగాలు సాధించారు. -
కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసాలు..
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఫలితాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు డీజీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) మంగళవారం రాత్రి ప్రకటించింది. ఇందులో తమ కటాఫ్ మార్కుల్లో వ్యత్యాసాలు వచ్చాయని పలువురు అభ్యర్థులు బుధవారం ఉదయమే డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. టీఎస్ఎల్ పీఆర్బీ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావును కలవాలని ప్రయత్నించారు. వారి వద్ద వినతిపత్రాలు తీసుకున్న పోలీసులు తిప్పి పంపారు. దీనిపై టీఎస్ఎల్ పీఆర్బీ స్పందించింది. ఈ విషయంలో అభ్యర్థులకు అనుమానాలు అక్కర్లేదని, ఒకవేళ అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం నుంచి టీఎస్ఎల్ పీఆర్బీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చైర్మన్ శ్రీనివాసరావు సూచించారు. డిప్లొమా అభ్యర్థుల ఆవేదన..: డిప్లొమా చేసిన అభ్యర్థులను కానిస్టేబుల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్కు తొలుత అనుమతించలేదు. వీరంతా కోర్టును ఆశ్రయించారు. ఇంటర్ ఫెయిలైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులతో పాటు, డిప్లొమా ఫెయిలైన అభ్యర్థుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. డిప్లొమా అభ్యర్థులు 6 సెమిస్టర్ల సర్టిఫికెట్లు చూపాలని స్పష్టం చేసింది. దీంతో పలువురు అభ్యర్థులు వెరిఫికేషన్కు 6 సెమిస్టర్ల సర్టిఫికెట్లు చూపలేకపోయారు. అలాంటి అభ్యర్థుల వివరాలను కటా ఫ్ మార్కుల వెల్లడిలో వారిని పరిగణనలోకి తీసుకోలేదు. వీరంతా తమకు న్యాయం చేయాలని కోరారు. -
సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్ నియామక పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులు తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, ప్రైవేట్ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ తక్షణమే జోక్యం చేసుకొని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్ట్ విడుదల చేయమని డీజీపీ, బోర్డు చైర్మన్లను ఆదేశించాలని కోరారు. -
ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించిన ఫలితాలను క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో హోం మంత్రి సుచరిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతమ్ నవాంగ్, ఆంధ్రప్రదేశ్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజీత్లు హాజరయ్యారు. సివిల్, ఆర్ముడ్ రిజర్వ్, ఏపీఎస్పీ, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్, జైలు వార్డర్స్ విభాగాల్లోని మొత్తం 2723 పోస్టులకు గాను 2623 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వీరిలో 500 మంది మహిళలున్నారు. ఆయా సామాజిక వర్గాల్లో అభ్యర్థులు లేకపోవడంతో వంద పోస్టులు మిగిలిపోయాయని పోలీసు శాఖ తెలిపింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాను http://slprb.ap.gov.in/ వెబ్సైట్లో ఉంచినట్లు పోలీసు శాఖ తెలిపింది. ఎంపిక ప్రక్రియకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా apslprb.pcsobj@gmail.com కు ఈ నెల 16వ తేదీలోపు అభ్యంతరాలు పంపవచ్చని పేర్కొంది. ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసు శాఖ వెల్లడించింది. -
త్వరలో కానిస్టేబుల్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: వేలాది మంది అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న కానిస్టేబుల్ పరీక్ష తుది ఫలితాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇప్పటికే ఎస్సై అభ్యర్థుల ఫలితాలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఈ నెలాఖరుకు కానిస్టేబుల్ అభ్యర్థులకు తీపికబురు అందించనుంది. ఇప్పటికే 1,272 మంది ఎస్సై అభ్యర్థుల తుది ఫలితాలు విడుదల చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసు అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)తోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఉన్న పోలీస్ ట్రైనింగ్ కాలేజీల్లో శిక్షణకు ఏర్పాట్లు చకాచకా జరుగుతున్నాయి. సిలబస్, సిబ్బంది అంతా సిద్ధం.. కొత్తగా వచ్చే పోలీసు సిబ్బందికోసం ఇప్పటికే సిలబస్ సిద్ధంగా ఉంది. పెద్దగా మార్పులు ఏమీ లేనప్పటికీ.. ఈసారి యాప్స్ వినియోగం, టెక్నాలజీ, సైబర్ నేరాలు, ఆధారాల సేకరణకు ఆధునిక సమాచారం జోడించి స్వల్పమార్పులు చేసినట్లు సమాచారం. ప్రాక్టికల్స్కు కూడా పెద్దపీట వేశారు. ఎస్సై బ్యాచ్ 1,272 మంది, 16,925 మంది కానిస్టేబుళ్లకు ఒకేసారి తరగతులు ప్రారంభంకానున్నాయి. వీరికి తరగతులు బోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,800 మంది పోలీసు సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. వీరికి తోడుగా 35 మంది విశ్రాంత పోలీసులు, మాజీ సైనికులు శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు. తరగతులు మొదలయ్యేసరికి మరో 40 మంది వరకు విశ్రాంత పోలీసు, సైనిక సిబ్బంది వచ్చి చేరతారని అధికారులు తెలిపారు. దాదాపు 18 వేల మందికి ఒకేసారి శిక్షణ ఇచ్చేందుకు ఈ సిబ్బంది, ఇక్కడున్న సదుపాయాలు సరిపోతాయా? అన్న సందేహం కూడా అధికారుల్లో ఉంది. దీంతో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. శిక్షణలో భాగంగా కొందరిని అక్కడికి పంపించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. -
అంతా మా ఇష్టం!
‘వేములవాడ సర్కిల్ పరిధిలోని ఓ మండలంలో ఎస్సై మోడల్ గ్రంథాలయం నిర్మాణం కోసం చందాల పేరుతో రూ.లక్షలు వసూలు చేశాడు. అక్కడ గ్రంథాలయం ఏర్పాటైంది కానీ ఎస్సై వసూలు చేసిన డబ్బులతో కాదు... మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్రావు రూ.20 లక్షలు ఇవ్వడంతో..’ ‘మంథని సర్కిల్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు, అమరవీరుల స్తూపం నిర్మాణం కోసం ఇక్కడి పోలీస్ అధికారి వ్యాపారుల నుంచి రూ.లక్షలు వసూలు చేశాడు. సదరు అధికారి చేసిన ఘనకార్యాల గురించి అక్కడి వ్యాపారులు డీజీపీని కూడా ఆశ్రయించారు’ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కొందరు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు తమకున్న విశేష అధికారాలను ఉపయోగించి ఇష్టారాజ్యంగా వ్యవహరించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. జిల్లా మంత్రి, ఎమ్మెల్యేలతోనో... లేక డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారితోనో మంచి సంబంధాలు కొనసాగించి ఆయా స్టేషన్లలో ఉన్నన్నాళ్లూ నాలుగు రాళ్లు వెనుకేసుకోవచ్చనే ధోరణితో ఖాకీలు వ్యవహరిస్తున్నారు. రియల్టర్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో ఆర్థిక లావాదేవీలు నడుపుతూ చేతిలో అధికారం ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనుకేసుకునే పనిలో ఉన్న ఖాకీలు కరీంనగర్ పాత జిల్లాలో అనేక మందే ఉన్నారు. ఈ నెల 4న మానకొండూరు పోలీస్స్టేషన్లో కాంట్రాక్టర్ ‘రవన్న’ బర్త్డే ఉత్సవాలు ఘనంగా జరపడం వెనుక కూడా ఆర్థిక లావాదేవీలే ప్రధాన కారణమనే ఆరోపణలున్నాయి. గతంలో సుల్తానాబాద్లో ఎస్సైగా విధులు నిర్వర్తించినప్పుడు కూడా పలు వివాదాలకు కారణమైన చరిత్ర సదరు అధికారిది. అలాగే కాళేశ్వరంలో బంధువులతో కలిసి ఓ కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్థానిక గ్రామస్తులతో జరిగిన గొడవలో తన ఐడెంటిటీని చూపించేందుకు సర్వీస్ రివాల్వర్తో భయపెట్టిన ఘనుడు ఆయన. ఉన్నతాధికారులతో సంబంధాలు కొనసాగించడం వల్ల తనకేం కాదనే ధీమాతో ఉన్న కొందరు పోలీసులు వివాదాలకు కారణం అవుతున్నారనడంలో సందేహం లేదు. మానకొండూరు పోలీస్స్టేషన్లో ప్రైవేటు వ్యక్తికి బర్త్డే వేడుకలు జరిపిన సీఐ ఇంద్రసేనారెడ్డిని కమిషనర్ కమలాసన్రెడ్డి హెడ్క్వార్టర్స్కు అటాచ్ చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ సంతోష్కుమార్కు మానకొండూరు బాధ్యతలు అప్పగించారు. రియల్టర్లు... కాంట్రాక్టర్లు... అక్రమార్కులతో బంధాలు కరీంనగర్ శివార్లతోపాటు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో రియల్ వెంచర్లు సాగుతున్నాయి. దీంతో పోలీస్ అధికారులతో సంబంధాలు సర్వసాధారణంగా మారాయి. ఈ బంధంతో రియల్ వెంచర్లలో భాగస్వాములుగా మారిన పోలీసు అధికారులు కూడా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలి కాలంలో వేరే జిల్లాల్లో వెంచర్లు చేస్తున్న రియల్టర్లకు పెట్టుబడి సమకూరుస్తున్నట్లు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులతో ఉన్న సంబంధాలతో సెటిల్మెంట్లు కూడా కొందరు ఖాకీలకు సాధారణ అంశాలుగా మారాయి. ఏఎస్సై మోహన్రెడ్డి రియల్ దందా, సెటిల్మెంట్లు తరువాత చోటుచేసుకున్న పరిణామాలు కరీంనగర్లోనే గాక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓ ఏఎస్సై కోట్లకు పడగలెత్తిన తీరు ఖాకీలకు, అక్రమ దందాలు సాగించే వారికి మధ్యనున్న బంధాన్ని తేటతెల్లం చేసింది. ఆయన స్థాయిలో కాకపోయినా... ఉమ్మడి జిల్లాలో పలువురు పోలీస్ అధికా>రులు బినామీలుగా సొంత దందాలు సాగిస్తున్నారనేది నిర్వివాదాంశం. సివిల్ దందాల్లో జోక్యం చేసుకొని శాఖాపరమైన చర్యలను ఎదుర్కొన్న పోలీసులు కూడా జిల్లాలో ఉన్నారు. అలాగే రాజకీయ ప్రముఖులు, అక్రమార్కులతో కూడా పలువురు పోలీసులకు సంబంధాలు అందరికీ తెలిసిన సత్యాలే. గతంలో చోటు చేసుకున్నకొన్ని సంఘటనలు... పెద్దపల్లి జిల్లా కమన్పూర్ పోలీస్స్టేషన్లో కొన్ని నెలల క్రితం ఎస్సై, ఇతర సిబ్బంది ఒకరినొకరు దూషించుకుని తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. పొత్కపల్లి పోలీస్స్టేషన్లో సర్పంచ్ ఎన్నికలు, హోలీ సందర్భంగా కిందిస్థాయి సిబ్బంది పలువురు నుంచి మామూళ్లు వసూలు చేసి వాటా పంపకాల విషయంలో గొడవకు దిగడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఓ భూ సమస్యపై వీణవంక ఎస్సై విచారణ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన ముదిగంటి నర్సింహరెడ్డి వీడియో తీస్తున్నాడనే నేపంతో చితకబాదడంతో యువకుడు తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. హుజూరాబాద్ డివిజన్లో ఓ సీఐ భార్యాభర్తల పంచాయతీని సెటిల్ చేసి వారి నుంచి సుమారు రెండు లక్షలకు పైగా వసూలు చేశారని ప్రచారంలో ఉంది. ఉన్నతాధికారులు విచారించగా రాజకీయ ఒత్తిడితో చర్యలు తీసుకోలేదని సమాచారం. ఆర్థిక లావాదేవిలకు సంబంధించిన ఓ అనే వ్యక్తిని స్టేషన్కు పిలిపించి చితకబాదిన హుజూరాబాద్ ఎస్సైపై బాధితులు సీపీకి ఫిర్యాదు చేశారు. అదే ఎస్సై ఓ కేసు విషయంలో నిర్లక్ష్యం చేయడంతో సదరు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. కోరుట్లలో పనిచేసిన ఓ ఎస్సైని నెలరోజుల క్రితం అవినీతి ఆరోపణలపై కుమురంభీం జిల్లాకు బదిలీ చేశారు. ఓ కేసు విషయంలో ఒక వర్గం నుంచి డబ్బులు తీసుకున్నడన్న ఆరోపణలతో కొద్ది రోజుల క్రితం గంగాధర ఎస్సైని రెండు నెలల క్రితం హెడ్క్వార్టర్కు అటాచ్డ్ చేశారు. తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీలో గతంలో పనిచేసిన ఓ ఎస్సై ఇసుక అక్రమ రవాణాదారులకు సహకరించారన్న ఆరోపణలతో కుమురంభీం జిల్లాకు బదిలీ అయ్యారు. ఇక్కడ పనిచేసిన మరో ఎస్సై కూడా అవినీతి ఆరోపణలతోనే బదిలీ అయ్యాడు. మెట్పల్లి సబ్డివిజన్ పరిధిలోని దాదాపు అన్ని పోలీస్స్టేషన్లలో ఇసుక దందా నుంచి రూ.లక్షల్లో మామూళ్లు ముడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో జరిగే ఇసుక దందాలు, ఇటుక బట్టీలు, రైస్మిల్లుల యజమానులతో కూడా పోలీసులకు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. మంథనిలో అక్రమార్కులతో పోలీసు సంబంధాల గురించి రామగుండం కమిషనరేట్కు, డీజీపీ కార్యాలయానికి ఫిర్యాదుల రూపంలో ఇప్పటికే చేరాయి. ఇటీవల మానకొండూరుకు ఎన్నికల విధులకు వచ్చిన ఓ ప్రొబేషనరీ ఎస్సై రాత్రి పార్టీ చేసుకొని ఇంటికొచ్చిన ఇద్దరు వ్యక్తులను తీవ్రంగా కొట్టాడు. అందులో ఒక వ్యక్తి అపోలో రీచ్లో జాయిన్ అయి చికిత్స పొందగా, పోలీసులు రూ.50వేలు విదిలించుకోవాల్సి వచ్చింది. కానిస్టేబుళ్లు, హోంగార్డు స్థాయిల్లో పలువురిపై వేటు పడింది. కానీ రాజకీయ, ఉన్నతాధికారుల అండదండలు ఉన్నవారు మాత్రం యథేచ్ఛగా కొనసాగుతున్నారు. -
ఒకసారి ఓడిపోతే.. బతికే ధైర్యం వస్తుంది
సాక్షి, దోమ : నా పేరు కె.రాఘవేందర్. మాది దోమ మండలం ఊటపల్లి గ్రామం. నా పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాల్లోనే సాగింది. బాగా చదివే వాడిని. మా నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో మా అమ్మ కష్టాలు చూసి ఆమెకు పనుల్లో సహాయపడేవాడిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు బాగానే చదివాను. ఫస్ట్ ఇయర్ ఫస్ట్క్లాస్ మార్కులతో పాసయ్యాను. కానీ, సెకండ్ ఇయర్లో ఫెయిలయ్యాను. పరీక్షలు బాగానే రాశాను. పాసవుతాననే ధీమాతో మహబూబ్నగర్లో డీఈడీ కోచింగ్కు కూడా వెళ్లాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చిన రోజున నా తోటి విద్యార్థులు భయపడుతూ ఫలితాలు చూస్తున్నారు. నేను మాత్రం చాలా నమ్మకంతో.. పాసవుతాననే ధీమాతో ఫలితాలు చూసుకున్నాను. అయితే, ‘ఫెయిల్’ అని ఉంది. ఆ ఫలితాలు చూసేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు షాక్కు గురయ్యాను. తరువాత మొత్తం రిజల్ట్ చూస్తే.. అన్ని సబ్జెక్టుల్లో 80శాతం పైన మార్కులు వచ్చి.. ఒక కెమిస్ట్రీలో ఫెయిల్ అని ఉంది. ఆ రోజు మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు మా అమ్మని కూడా అడిగి బాధించారు. నేను మొదటిసారి ఫెయిల్ అవడం అదే. అయితే, అందరూ అన్న మాటలు నాలో దాచుకుని మా అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతున్నారో.. రేపు వారే నన్ను పొగిడేలా చేస్తా అని చెప్పాను. వెంటనే మళ్లీ పరీక్ష రాసి పాసయ్యాను. ఇంతలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఇదే సరైన అవకాశం అని భావించి కష్టపడి చదివాను. శారీరక పరీక్షలకు ప్రాక్టీస్ చేశాను. చివరకు 116 మార్కులతో సివిల్ కానిస్టేబుల్కు ఎంపికయ్యాను. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. అప్పుడు పేపర్లో నా ఫొటో చూసి అందరూ వచ్చి మా అమ్మతో ‘మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా’ అని అడిగారు. అప్పుడు మా అమ్మ కళ్లలో ఆనందం చేసిన నాకు ఇంటర్లో ఫెయిలైన బాధ పూర్తిగా పోయింది. ఇంటర్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే.. ఒకసారి ఓడిపోతే ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఓడిపోతే జీవిత కాలం ఏ కష్టం వచ్చినా బతికే ధైర్యం వస్తుంది. ఇంటర్ ఫెయిల్ అయితే ఏదో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. అప్పుడే నా జీవితం మొదలైంది అని గుర్తించాలి. -
గత్యంతరం లేక విధుల్లోకి!
వరంగల్కు చెందిన ఓ కానిస్టేబుల్కు ఇటీవలే 32 ఏళ్లు నిండాయి. ఇప్పటికే ఎస్సై శారీరక పరీక్షలు పూర్తి చేసి, రాతపరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. డ్యూటీ చేస్తూనే.. రాతపరీక్షకు సిద్ధమవడం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేశాడు కరీంనగర్కు చెందిన ఓ కానిస్టేబుల్ పదేళ్ల కింద డిపార్ట్మెంట్లో చేరాడు. ఈ మధ్య డిగ్రీ పూర్తి చేసిన యువకులతో పోటీ పడాలంటే.. రాత పరీక్షలకు ఇపుడున్న తక్కువ సమయం సరిపోదంటున్నాడు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సై రాత పరీక్షల కోసం సెలవు పెట్టి మరీ సిద్ధమవుతున్న కానిస్టేబుళ్లు తప్పనిసరి పరిస్థితుల్లో విధుల్లో చేరారు. రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సెలవులన్నీ రద్దుచేసిన డీజీ కార్యాలయం.. కానిస్టేబుళ్లంతా ఏప్రిల్ 1 నాటికి తప్పకుండా విధులకు హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో చేసేదిలేక ఇన్నిరోజులుగా ఇంటి దగ్గరే ఉంటూ రాతపరీక్షకు ప్రిపేరవుతున్న వారంతా.. డ్యూటీలో రిపోర్ట్ చేసి, విధులకు హాజరవుతున్నారు. అటు.. ఎస్సై రాతపరీక్షలకు ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. అయితే.. ఈ పరీక్షలను వాయిదా వేయాలని పోలీసుశాఖలోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు వేడుకుంటూనే ఉన్నారు. గతేడాది ఎస్సై రాతపరీ క్షకు నోటిఫికేషన్ రాగా.. మార్చి చివరినాటికి శారీరక పరీక్షలు పూర్తయ్యాయి. ఇదీ.. కానిస్టేబుళ్ల ఆవేదన! వాస్తవానికి ప్రస్తుతం పోలీసుశాఖలో దాదాపుగా 3వేల మందికిపైగా కానిస్టేబుళ్లు ఎస్సై పరీక్షకు ప్రిపేరవుతున్నారు. ఏప్రిల్ 20, 21 తేదీల్లో తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వీరికి రాతపరీక్షలు నిర్వహించనుంది. అయితే, సమయం తక్కువగా ఉందని పరీక్షను వాయిదా వేయాలని డిపార్ట్మెంట్లోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు అభ్యర్థిస్తున్నారు. దీనిపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. అయినా.. పరీక్షను వాయిదా వేసేది లేదంటూ హోంశాఖ స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల తర్వాత అనధికారికంగా సెలవుల్లో ఉన్న కానిస్టేబుళ్లందరికీ నోటీసులు పంపి, టెలిఫోన్లో వారికుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించింది. ఫలితంగా వారంతా ఏప్రిల్ 1లోపు అంతా రిపోర్టు చేసి విధుల్లో చేరారు. ఎస్సై కావాలని ఎన్నో ఏళ్లుగా కలలుగంటున్న తమకు.. తమ శాఖలోని అధికారులే కరుణించకపోతే ఎలాగని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాము రాత పరీక్షను రద్దు చేయమని అడగడం లేదని, కేవలం ప్రిపరేషన్ కోసం నెల రోజులు వాయిదా వేయమని మాత్రమే కోరుతున్నామంటున్నారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు, ఏప్రిల్ 14న ఏఆర్ కానిస్టేబుళ్లకు పదోన్నతి శిక్షణ ఉందని ఈ నేపథ్యంలో వాయిదా విషయాన్ని మానవతాకోణంలో పరిశీలించాలని విన్నవిస్తున్నారు. వాయిదా సమస్యేలేదు ఈ విషయంలో పోలీసుశాఖ పలుమార్లు తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేసింది. ఎట్టిపరిస్థితుల్లో షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని రిక్రూట్మెంట్ బోర్డు చెప్పేసింది. ఇప్పటికే 2.17 లక్షల మందికి శారీరక పరీక్షలు నిర్వహించిన బోర్డు రాతపరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. -
కానిస్టేబుళ్ల ఎంపికకు సర్టిఫికెట్ల పరిశీలన
విజయనగరం టౌన్: పోలీస్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల ఒకటో తేదీ నుంచి రెండురోజుల పాటు జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎస్పీ ఎల్.కె.వి.రంగారావు తెలిపారు. ఈ మేరకు బుధవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ సివిల్ విభాగంలో 192, ఆర్మ్డ్ రిజర్వు 107, జైలు వార్డర్లు19(పురుష), 11 మహిళ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం వారికివైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు అభ్యర్థుల గత చరిత్రను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు పరిశీలిస్తారని ఎస్పీ తెలిపారు. తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు సివిల్, ఆర్మ్డ్ రిజర్వు, జైలువార్డర్ల ఉద్యోగాలకు ఎంపికైన మహిళా, పురుష అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే సమయంలో సమర్పించిన విద్యార్హత, కుల, క్రీడా వగైరా ధ్రువపత్రాల ఒరిజినల్స్, గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించిన రెండు సెట్స్ జెరాక్స్ కాపీలను, ఇటీవల తీసుకున్న మూడు కలర్ పాస్పోర్టు సైజ్ ఫొటోలను తమ వెంట తీసుకుని రావాలని చెప్పారు. అభ్యర్థులు వెనుకబడిన తరగతులకు చెందిన వారైతే కుల ధ్రువీకరణ పత్రంతో పాటు క్రిమిలేయర్ ధ్రువపత్రాన్నీ తీసుకురావాల్సి ఉంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన అభ్యర్థులు తమ కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు.