కానిస్టేబుల్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Aug 2 2023 7:10 AM | Updated on Aug 2 2023 8:42 AM

- - Sakshi

ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.

రామచంద్రాపురం (పటాన్‌చెరు): ఓ కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఏలూరుకు చెందిన నాగేంద్రనాథ్‌(42) మూడేళ్లుగా చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. పట్టణంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్నాడు. 2014లో మొదటి భార్య లక్ష్మి మృతి చెందింది. కాగా, నాగేంద్రనాథ్‌ 2020లో మహబూబ్‌నగర్‌కు చెందిన మనీషాతో రెండో పెళ్లి జరిగింది.

గతంలో కంట్రోల్‌ రూం, మైలార్‌దేవ్‌పల్లిలో విధులు నిర్వహించాడు. కొద్దిరోజుల క్రితమే హెడ్‌ కానిస్టేబుల్‌ ట్రైనింగ్‌కు వవెళ్లి వచ్చాడు. సోమవారం రాత్రి చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహించి మంగళవారం ఉదయం 10గంటలకు ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనం చేసి గదిలోకి వెళ్లి పడుకున్నాడు. సాయంత్రమైనా గదిలో నుంచి బయటకు రాకపోవడంతో భార్య మనీషా తలుపులు కొట్టినా తీయకపోవడంతో కిటీకీలో నుంచి లోపలికి చూడగా.. గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకున్నాడు.

తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి అతని స్థానిక ప్రైవేట్‌ అసుత్రికి తరలించారు. అప్పటికే నాగేంద్రనాథ్‌ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఏలూరులో అమ్మమ్మ దగ్గర ఉంటున్న మొదటి భార్య కుమారులు భానుప్రకాశ్‌, రామ్‌దత్త పది రోజుల క్రితమే తండ్రి వద్దకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

నాగేంద్రనాథ్‌ మృతదేహాన్ని మియాపూర్‌ ఏసీపీ పి.నరసింహరావు, చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ పాలవల్లి, రామచంద్రాపురం ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌ రెడ్డిలు సందర్శించారు. కాగా నాగేంద్రనాథ్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement