400 మంది విద్యార్థుల కిడ్నాప్‌!  | 400 Students Kidnaped In Nigeria | Sakshi
Sakshi News home page

నెజీరియాలో 400 మంది విద్యార్థుల కిడ్నాప్‌! 

Published Mon, Dec 14 2020 6:53 AM | Last Updated on Mon, Dec 14 2020 6:55 AM

400 Students Kidnaped In Nigeria - Sakshi

విద్యార్థుల తల్లిదండ్రులు

లాగోస్‌: నైజీరియాలోని కట్సీనా రాష్ట్రంలో సాయుధ దుండగులు శుక్రవారం ఒక మాధ్యమిక పాఠశాలపై దాడి చేశారు. ఏకే 47 రైఫిల్స్‌తో పాఠశాలలోకి చొరబడి కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. దాడి అనంతరం పెద్ద సంఖ్యలో విద్యార్థులు కనిపించకుండాపోయారని వెల్లడించారు. ఆ సాయుధ దుండగులు తమతో పాటు కొందరు విద్యార్థులను బందీలుగా తీసుకువెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ స్కూల్‌లో సుమారు 600 మంది విద్యార్థులు ఉంటారని, వారిలో సుమారు 400 మంది ఆచూకీ ఇప్పుడు లభించడం లేదని పోలీస్‌ విభాగం అధికార ప్రతినిధి గాంబో ఇషా తెలిపారు. పోలీసులు, నైజీరియా సైన్యం, దేశ వైమానిక దళం విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement