నా పిల్లలు.. మోదీ తాతను మిస్‌ అవుతున్నారు: ఉషా వాన్స్‌ | Usha Vance Recalls How Her Kids Calling PM Modi Grandfather And Bonded With Him During India Visit, Video Went Viral | Sakshi
Sakshi News home page

నా పిల్లలు.. వాళ్ల మోదీ తాతను మిస్‌ అవుతున్నారు: ఉషా వాన్స్‌

Jun 3 2025 11:39 AM | Updated on Jun 3 2025 3:50 PM

Usha Vance recalled her visit to India

వాషింగ్టన్‌ : తన పిల్లలు వాళ్ల మోదీ ( భారత ప్రధాని న‌రేంద్ర‌ మోదీ) తాతను మరిచిపోలేకపోతున్నారని, మిస్‌ అవుతున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ (JD Vance) సతీమణి ఉషా వాన్స్‌ (Usha Vance) గుర్తు చేశారు.   

జేడీ వాన్స్‌ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో భారత్‌లో పర్యటించారు. భారత పర్యటన సంద‌ర్భంగా ప్రధాని మోదీ తమ పట్ల వ్యక్తిగతంగా చూపించిన ప్రేమ, ఆప్యాయతను మరిచిపోలేమంటూ.. ఉషా వాన్స్‌ అన్నారు. మరోసారి భారత్‌లో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన ఆమె.. ఈ సారి తన మూలాలున్న ప్రాంతాల్లో పర్యటించాలని భావిస్తున్నట్లు తెలిపారు.


అమెరికా వాషింగ్టన్‌ డీసీలో యూఎస్‌- ఇండియా స్ట్రాటజిక్‌ పార్టనర్‌షిప్‌ ఫోరంలో ఉషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె భారత్‌ పర్యటన అనుభూతిని పంచుకున్నారు. కుమారులు ఇవాన్‌, వివేక్‌ కుమార్తె మీరాబెల్‌లు భారత్‌ పర్యటనను పదే పదే ప్రస్తావిస్తున్నార‌ని.. భారత‌ సంస్కృతి, సంప్రదాయాలు, రామాయణం గురించి ఇప్పటికీ మాట్లాడుతున్నట్లు తెలిపారు.    

'నా పిల్లలు భారత పర్యటనలో ఉండగా ప్రధాని మోదీని తమ తాత లాగా భావించారు. ముఖ్యంగా నా కుమారుడు మోదీ నివాసంలో మామిడి పండ్లన్నింటినీ తీసుకున్నాడు. తనకు అక్కడే ఉండిపోవాలని ఉందని' అతడు పేర్కొన్నట్లు వెల్లడించారు. తన‌ ఐదేళ్ల కుమార్తె మీరాబెల్‌ పుట్టిన రోజుకు ప్ర‌త్యేక‌ బహుమతి ఇచ్చిన న‌రేంద్ర మోదీ త‌మ‌ గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నార‌ని అన్నారు. మరోసారి భారత్‌లో పర్యటించేందుకు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. కానీ, ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లోనూ తాను పర్యటిస్తానన్నారు.

ప్రధాని మోదీతో భేటీపై ఉషా వాన్స్ కీలక వ్యాఖ్యలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement