రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
కామారెడ్డి టౌన్: ఓటరు జాబితా, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్ అన్నారు. గురువారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడారు. జిల్లా ఎన్నికల అధికారురి అయిన కలెక్టర్తోపాటు ఈఆర్వోలు తమతమ స్థాయిలలో పొలిటికల్ పార్టీ మీటింగ్లు ఏర్పాటు చేసి అప్డేట్స్ అందించాలన్నారు. సమావేశాల తేదీ, సమయాన్ని ఖరారు చేస్తూ ముందస్తుగానే రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలపాలన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని, సమావేశాల వివరాలను సీఈవో కార్యాలయానికి, గుర్తింపు పొందిన పార్టీల ప్రధాన కార్యాలయాలకు సైతం పంపించాలని సూచించారు. కాగా, ఓటరు జాబితా సవరణకు సంబంధించి కొత్తగా వచ్చిన దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్లు వి విక్టర్, డి శ్రీనివాస్రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు సరళ, నాయబ్ తహసీల్దార్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
13కెఎంఆర్ 154: వీసీలో మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్
13కెఎంఆర్ 155: వీసీలో పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలి
Comments
Please login to add a commentAdd a comment