కబ్జాలపై చర్యలు తీసుకోవాలి
కరీంనగర్కార్పొరేషన్: నగరపాలకసంస్థలో ఇటీవల విలీనమైన చింతకుంట గ్రామంలోని శాంతినగర్లో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త ఎంఎ జమీల్ డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలక్థ కమిషనర్ చాహత్ బాజ్పేయ్కి ఫిర్యాదు చేశారు. విలీన గ్రామాల్లో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న వ్యవహారంపై ‘సర్కారు భూములు మాయం’ శీర్షికన సోమవారం ‘సాక్షి’లో కథనం రావడం తెలిసిందే. ఈ క్రమంలో శాంతినగర్ కాలనీలోని సర్వేనంబర్ 439లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. దీనిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. కబ్జాలపై విచారణ జరిపించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్ను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment