చి‘వరి’కి మేకలకు గ్రాసమై.. | - | Sakshi
Sakshi News home page

చి‘వరి’కి మేకలకు గ్రాసమై..

Published Tue, Mar 11 2025 12:23 AM | Last Updated on Tue, Mar 11 2025 12:21 AM

చి‘వరి’కి మేకలకు గ్రాసమై..

చి‘వరి’కి మేకలకు గ్రాసమై..

యాసంగి రైతులకు సాగునీరందడంలేదు. ఫలితంగా పొటపొలాలు ఎండిపోతున్నాయి. దీంతో అన్నదాతలు పొలాలు పశువుల మేతకు వదిలేస్తున్నారు. గంగాధర మండలం గర్శకుర్తి గ్రామానికి చెందిన దాది ఐలయ్య వ్యవసాయ బావి ఆధారంగా రెండు ఎకరాల వరి సాగుచేశాడు. భూగర్భ జలాలు అడుగంటి పోయి బావిలో నీరింకిపోయింది. దీంతో పొట్టదశకు వచ్చిన పొలానికి సాగు నీరందించలేక పశువుల మేతకు వదిలేసాడు. మునుముందు మరీ దారుణ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

– గంగాధర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement