
యశవంతపుర: బెంగళూరు–ధార్వాడ మధ్య తిరిగే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. సోమవారం తెల్లవారు 5:45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు ధార్వాడకు చేరనుంది. మధ్యాహ్నం 1:15కు ధార్వాడలో బయలు దేరి రాత్రి 8:10 గంటలకు బెంగళూరుకు చేరుకోనుంది. వారంలో ఆరు రోజుల పాటు బెంగళూరు–ధార్వాడల మధ్య తిరుగుతుంది.
లాంఛనంగా ఈ నెల 26న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 6 గంటల 55 నిమిషాల వ్యవధిలో ధార్వాడకు చేరుకుంటుందని అధికారులు తెలిపారు. ఎనిమిది బోగీలు ఉండగా 530 మంది ప్రయాణికులను తీసుకెళ్లే దీన్ని మినీ వందే భారత్ రైలుగా పిలుస్తారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో రైల్వే అధికారులు హర్షం వ్యక్తం చేశారు.