రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Published Tue, Mar 18 2025 8:53 AM | Last Updated on Tue, Mar 18 2025 8:49 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఎలుకుర్తి క్రాస్‌ వద్ద ఘటన

మడికొండ/చిల్పూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన ఆదివారం రాత్రి మడికొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్‌కు చెందిన చెగొండి వినయ్‌(22) తన స్నేహితుడు మామిండ్ల అరవింద్‌తో కలిసి ద్విచక్రవాహనంపై పెద్దపెండ్యాల నుంచి ధర్మసాగర్‌ వైపునకు వస్తుండగా ఎలుకుర్తి క్రాస్‌ వద్ద బొలెరో ఢీకొంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన వినయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అరవింద్‌ తీవ్ర గాయాలతో ఎంజీఎంలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి సంపత్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌, చిల్పూరు ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement