
ఆపద మిత్రలు అప్రమత్తంగా ఉండాలి
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): గ్రామాల్లో జరిగే విపత్తుల సందర్భంగా ఆపద మిత్రలు అప్రమత్తమై గోల్డెన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎ్స్డీఆర్ఎఫ్ రాష్ట్ర నోడల్ అధికారి గౌతమ్ అన్నారు. గురువారం జెడ్పీ హాల్లో ఆపద మిత్రలకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ విపత్తుల నివారణ సంస్థతో చేసుకొన్న ఒప్పందం ప్రకారం రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ జిల్లాలో 300 మంది ఆపద మిత్ర వలంటీర్లకు 3 దశలలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ప్రమాదాలు జరినప్పుడు ఎలా వ్యవహరించాలో వారికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమయంలో గోల్డెన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర అధికారులు ఆర్ఎస్ మిశ్రా, లికున్ పాత్రా, జిల్లా ఫైర్ అధికారి కిశోర్, తహసీల్దార్ జె. సువర్ణరాజు, జిల్లా శిక్షణ కేంద్ర కోఆర్డినేటర్ హన్మంతు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment