బాసరలో భక్తుల రద్దీ
బాసర(ముధోల్): బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. పవిత్ర గోదావరినదిలో పుణ్యస్నానం ఆచరించిన భక్తులు ప్రత్యేక అక్షరాభ్యాస మండపంలో తమ చిన్నారుల చేత అక్షర శ్రీకారం, కుంకుమార్చన పూజలు చేయించారు. శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పదోతరగతి పరీక్షలు సమీపిస్తుండడంతో విద్యార్థులు అమ్మవారి దర్శనానికి బారులు తీరారు.
బాసరలో భక్తుల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment