1,500 కేసులు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

1,500 కేసులు పరిష్కారం

Published Sun, Mar 9 2025 7:32 AM | Last Updated on Sun, Mar 9 2025 7:32 AM

1,500

1,500 కేసులు పరిష్కారం

షెడ్డులోని కుండలపై వివిధ రకాల పక్షులు

తడికి పక్షులంటే ప్రాణం.. ఇష్టంతో రూ. వేలు ఖర్చు చేసి పక్షులను కొనుగోలు చేసి ప్రాణంగా పెంచుతున్నాడు. వృత్తివ్యవసాయం, ఉద్యోగం లైన్‌మెన్‌.. అయినా ఉదయం, సాయంత్రం పక్షులతోనే గడుపుతాడు. వాటి దాణా కోసం ప్రతి నెలా వేలు ఖర్చు చేస్తూ పక్షి ప్రేమికుడిగా మారాడు కౌడిపల్లి మండలం కంచన్‌పల్లి గ్రామానికి చెందిన మల్లాగౌడ్‌.

– బొడ్డు పెంటయ్య, కౌడిపల్లి(నర్సాపూర్‌)

మెదక్‌జోన్‌/నర్సాపూర్‌: జాతీయ లోక్‌ అదాలత్‌లో భాగంగా శనివారం జిల్లా కోర్టులో పలువురు కక్షిదారులు రాజీ అయ్యారు. జిల్లావ్యాప్తంగా పలుకోర్టుల్లో 1,500 కేసులు పరిష్కారం అయ్యాయి. అలాగే పలురకాల కేసులకు సంబంధించి బాధితులకు చెల్లించాల్సిన బీమా కంపెనీలతో పాటు ఇతర జరిమానాలు రూ. 46.32 లక్షలను కోర్టులో చెల్లించారు. ఈసందర్భంగా జిల్లా జడ్జి లక్ష్మీశారద మాట్లాడుతూ.. ఇరువురి మధ్య మనస్పర్ధలు వస్తే కూర్చొని పరిష్కరించుకోవటం మంచిదన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి జితేందర్‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే నర్సాపూర్‌ కోర్టులో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి రుబీనా ఫాతిమా పాల్గొని మాట్లాడారు. కక్షిదారులు రాజీ పడడమే రాజమార్గమని అన్నారు. లోక్‌అదాలత్‌లో 137 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.

8లో

No comments yet. Be the first to comment!
Add a comment
1,500 కేసులు పరిష్కారం 1
1/3

1,500 కేసులు పరిష్కారం

1,500 కేసులు పరిష్కారం 2
2/3

1,500 కేసులు పరిష్కారం

1,500 కేసులు పరిష్కారం 3
3/3

1,500 కేసులు పరిష్కారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement