
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో ఒకరు. వీరిద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దుబాయ్లో బేబీ షవర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ప్రస్తుతం మాల్దీవుస్లో ఉన్న ఉపాసన- రామ్ చరణ్ వేకేషన్ల ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకుంటున్నారు. తాజాగా సముద్రంలో బోట్పై విహరిస్తున్న ఫోటోను రామ్చరణ్ ట్వీటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు.
— Ram Charan (@AlwaysRamCharan) April 11, 2023