vacation
-
కుమారునికి డిస్నీలాండ్ చూపించి... గొంతు కోసి చంపేసింది!
న్యూయార్క్: పిల్లలకు తల్లి ఒడిని మించిన స్వర్గం లేదంటారు. కానీ అమెరికాలో ఓ కన్నతల్లే కొడుకు ప్రాణాలు తీసింది. సరితా రామరాజు అనే భారత సంతతికి చెందిన మహిళ ఈ ఘాతుకానికి పాల్పడింది. తన 11 ఏళ్ల కొడుకు యతిన్కు మూడు రోజుల పాటు డిస్నీలాండ్ తిప్పి చూపించింది. తర్వాత హోటల్ గదిలో గొంతు కోసి చంపేసింది. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నట్టు 911కు ఫోన్ చేసి చెప్పింది. వాళ్లు వచ్చేసరికే బాలుడు శవమై కనిపించాడు. అపస్మారక స్థితిలో ఉన్న సరితను ఆస్పత్రికి తరలించారు. బాలుడు చనిపోయాకే ఆమె 911కు ఫోన్ చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. వంటకు ఉపయోగించే పెద్ద కత్తి హోటల్ గదిలో దొరికింది. దాంతోనే పొడిచి చంపినట్టు భావిస్తున్నారు. ఆమెకు 26 ఏళ్ల నుంచి యావజ్జీవ శిక్ష దాకా పడవచ్చని కాలిఫోర్నియాలోని ఆరెంజ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం తెలిపింది. సరితది బెంగళూరు. భర్త ప్రకాశ్ రాజుతో 2018లో విడాకులు తీసుకుంది. కొడుకు యతిన్ రాజును కోర్టు తండ్రి సంరక్షణలో ఉంచింది. సరితకు సందర్శన హక్కులు మాత్రమే లభించాయి. విడాకుల తర్వాత సరిత కాలిఫోర్నియా నుంచి వర్జీనియాలోని ఫెయిర్ ఫాక్స్కు మారింది. యతిన్ను తనకు అప్పగించాలంటూ గత నవంబర్లో పిటిషన్ దాఖలు చేసింది. ‘‘కొడుకు వైద్యం, స్కూలింగ్ వంటి నిర్ణయాలు తన ప్రమేయం లేకుండానే తీసుకుంటున్నారు. నా మాజీ భర్తకు మాదకద్రవ్యాల వ్యసనముంది. మద్యం, ధూమపానం మత్తులో ఉంటాడు’’ అని ఆరోపించింది. ఇటీవల కొడుకును చూసేందుకు సరిత శాంటా అనాకు వచ్చింది. తనను మూడు రోజులూ డిస్నీల్యాండ్కు తీసుకెళ్లింది. ఈ నెల 19న కొడుకును తండ్రికి అప్పగించాల్సి ఉంది. ఆ రోజు ఉదయం 9.12కు ఈ ఘాతుకానికి పాల్పడింది. తనపై సరిత ఆరోపణలన్నీ అవాస్తవమని ప్రకాశ్ అన్నాడు. ‘‘ఆమెకు తీవ్రమైన మానసిక సమస్యలున్నాయి. తనతో మాట్లాడేందుకే యతిన్ భయపడేవాడు’’ అని ఆరోపించారు. -
మాల్దీవుల్లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ (ఫోటోలు)
-
బీచ్లో ఎంజాయ్ చేస్తూ అనన్య పాండే ఫోజులు (ఫోటోలు)
-
గోవాలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోన్న యాంకర్ లాస్య మంజునాథ్ (ఫోటోలు)
-
యూఎస్ఎయిడ్ ఉద్యోగులకు సెలవులు
వాషింగ్టన్: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో పని చేస్తున్న యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూఎస్ఎయిడ్) ఉద్యోగులను సెలవులపై ఉండాలని, విధులకు రావొద్దని ఆదేశించింది. అత్యవసర విధుల్లో ఉన్నవారికి మినహాయింపు ఇచ్చింది. యూఎస్ఎయిడ్లో ప్రత్యక్షంగా నియమితులైన ఉద్యోగులంతా బలవంతంగా సెలవులపై ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారంతా 30 రోజుల్లోగా స్వదేశానికి చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం నోటీసును ఆన్లైన్లో పోస్టు చేసింది. యూఎస్ఎయిడ్ సంస్థ గత 60 ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇది అమెరికా ప్రభుత్వ ఆధ్యర్యంలో ఉంటూనే స్వతంత్రంగా పనిచేసే సంస్థ. యుద్ధాలు, విపత్తులు, సంక్షోభాల్లో చిక్కుకున్న దేశాల్లో ప్రజలకు మానవతా సాయం అందించడం యూఎస్ఎయిడ్ బాధ్యత. ఇందుకోసం అమెరికా పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తోంది. ఇటీవల డొనాల్ట్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖర్చులకు కళ్లెం వేస్తున్నారు. ఇందులో భాగంగానే యూఎస్ఎయిడ్ ఉద్యోగులకు సెలవులు ఇచ్చేశారు. ప్రపంచదేశాల్లో ఈ సంస్థ కార్యకలాపాలను పూర్తిగా లేదా పాక్షికంగా రద్దుచేసే దిశగా ట్రంప్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వేలాది మంది యూఎస్ఎయిడ్ సిబ్బందిని విధుల నుంచి తొలగించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. విదేశాలకు తామెందుకు ఆర్థిక సాయం అందించాలని ట్రంప్ ప్రశి్నస్తున్నారు. అమెరికా ప్రజలు కట్టిన పన్నుల సొమ్మును వారి అభివృద్ధికే ఖర్చు చేస్తామని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, యూఎస్ఎయిడ్ సిబ్బందిని ఇంటికి పంపించడాన్ని అమెరికన్ ఫారిన్ సరీ్వసు అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ట్రంప్ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేస్తామని అంటోంది. -
భార్యతో బీచ్ ఒడ్డున టీమిండియా క్రికెటర్ (ఫొటోలు)
-
కేరళలో చిల్ అవుతోన్న దేవర భామ (ఫోటోలు)
-
గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్బాత్
నటి మలైకా అరోరా జీవన శైలి ఫ్యాషన్ తీరు తెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆశించదగిన వార్డ్రోబ్ కలెక్షన్, ఫ్యాషన్ స్టైల్కు ఫిదా కాని ఫాలోయర్లు, అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా గోవాలో హాలిడే ట్రిప్ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట హల్చల్ చేస్తున్నాయిమలైకా అరోరా గోవాలో సేదతీరుతోంది. ఆల్-వైట్ కో-ఆర్డ్ సెట్లో సన్సెట్ టైంలో ఎరుపు పసుపు కలగలిసిన సూర్యాస్తమయ ఛాయలో అందంగా మెరిసింది. నడుము చుట్టూ సెమీ-షీర్ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ ,మెర్మైడ్-ఫిట్ స్కర్ట్తో, బీచ్సైడ్ స్టైల్లో కనిపించింది. ఈ దృశ్యాలు ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతకుముందు కూడా ఇటీవల సుప్రియా ముంజా డిజైన్ చేసిన ఐవరీ గౌనును ధరించి ఆకట్టుకుంది. మలైకా అరోరా అన్ని సీజన్లలోనూ వైట్ కలర్కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మరో సందర్బంలో వన్షోల్డర్లో గౌన్లో కనిపించి ఫ్యాన్స్ కళ్లను తనవైపు తిప్పుకుంది. వన్ సైడ్ కటౌట్ డిజైన్ ఈ డ్రెస్ హైలైట్. అంతేకాదు మలైకాఅరోరా ఫిట్నెస్కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాసనాలు, జిమ్లో వర్కౌట్లతో తన బాడీని ఫిట్గా ఉంచుకుంటుంది. ముఖ్యంగా సన్బాత్ తన ఫిట్నెస్ అండ్ సీక్రెట్ అని కూడా చెప్పవచ్చు.సన్బాత్లేలేత సూర్యకిరణాలతో డి విటమిన్ లభిస్తుంది. మితంగా సూర్యరశ్మి మన శరీరానికి తాకేలాగా సూర్యరశ్మి కాంతికి పడుకొని దానిని ఆస్వాదించడాన్ని సన్ బాత్ అంటారు. దీని వల్ల శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. సన్ బాత్ రెగ్యులర్గా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు. చర్మంపై ముడతలు మచ్చలు తగ్గిపోతాయి. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒత్తిడి తొలగి, మంచి నిద్ర పడుతుంది. మంచి శక్తి వస్తుంది. ఉదయం వేళల్లోగానీ, సాయం సంధ్యవేళ గానీ సూర్యునికి ఎదురుగా నిలబడి వ్యాయమాలు చేయడం, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.మరోవైపు దాదాపు అయిదేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకున్న లవ్బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా ఇటీవలే బ్రేకప్ చెప్పున్నట్టు ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఒకే చోట కనిపించారు. దీంతో ఈ జంట మళ్లీ కలిసిపోయిందా అని పుకార్ల తెర లేచింది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ దుండగుల కత్తిపోట్లకు గురై, ఆస్పత్రిలో చేరాడు. ఈ సమయంలో సైఫ్ను పరామర్శించేందుకు అర్జున్ కపూర్, మలైకా అరోరా కలిసి రావడం బీటౌన్లో హాట్ టాపిక్గా మారిన సంగతి విదితమే. View this post on Instagram A post shared by Malaika Arora (@malaikaaroraofficial) చదవండి: తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో ఉపశమనం -
ఫ్యామిలీ వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ యాంకర్ రవి (ఫోటోలు)
-
ఫ్రెండ్స్తో థాయ్లాండ్ బీచ్లో చిల్ అవుతున్న హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (ఫోటోలు)
-
kiara Advani: భర్తతో గేమ్ ఛేంజర్ బ్యూటీ వెకేషన్ (ఫోటోలు)
-
Winter Travel Ideas: శీతాకాలంలో తప్పక చూడాల్సిన పర్యాటక ప్రాంతాలు
దేశంలో చలివాతావరణం కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ శీతాకాలంలో దేశంలోని కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. ఇటువంటి తరుణంలో ఆయా ప్రాంతాలకు వెళితే బిజీలైఫ్ నుంచి మానసిక ప్రశాంతత లభిస్తుంది.మనదేశంలో శీతాకాలంలో సందర్శించదగిన అనేక ప్రదేశాలున్నాయి. అక్కడ చలిని కూడా ఎంజాయ్ చేయవచ్చు. ప్రతీయేటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఈ ప్రాంతాల్లో టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది. ఆ ప్రాంతాలు ఏవి? ఎక్కడున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.గోవాప్రకృతి అందాలకు నిలయమైన గోవా.. స్వదేశీ, విదేశీ పర్యాటకుల గమ్యస్థానం. అందమైన సముద్రం, బీచ్, నైట్ లైఫ్, పార్టీలు, వినోదాన్ని ఇష్టపడేవారు వింటర్ సీజన్లో గోవాను సందర్శిస్తే మంచి అనుభూతి దొరుకుతుంది. గోవా ప్రముఖ పర్యాటక ప్రాంతంగా గుర్తింపుపొందింది. గోవాకు స్నేహితులు, కుటుంబ సభ్యులతో వెళ్లవచ్చు. లేదా ఒంటరిగా నైనా వెళ్లవచ్చు. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గోవాలో అత్యంత రమణీయమైన వాతావరణం కనిపిస్తుంది.జైసల్మేర్శీతాకాలంలో రాజస్థాన్లోని జైసల్మేర్ ప్రకృతిశోయగాలతో మరింత సుందరంగా తయారవుతుంది. జైసల్మేర్లో చారిత్రక వారసత్వం, సంస్కృతి రెండూ కనిపిస్తాయి. ఇక్కడ క్యాంపింగ్, నైట్ అవుట్, ఒంటె సవారీ తదితర వినోద కార్యకలాపాల్లో పాల్గొని, ఎంజాయ్ చేయవచ్చు. చలికాలంలో జైసల్మేర్ను సందర్శించాలని పర్యాటకులు ఉవ్విళ్లూరుతుంటారు.కూర్గ్కర్ణాటకలో ఉన్న కూర్గ్ అధికారిక పేరు కొడగు. దీనిని స్కాట్లాండ్ ఆఫ్ సౌత్ ఇండియా అని కూడా అంటారు. చలికాలంలో కూర్గ్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం ఇక్కడి విశేషం. దేశమంతటా అత్యధిక చలివున్న సమయంలో కూర్గ్లో వెచ్చదనాన్ని అనుభవించవచ్చు. కూర్గ్లోని ప్రకృతి అందాలు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటాయి.ముంబైవింటర్ సీజన్లో ముంబైని కూడా సందర్శించవచ్చు. ఇక్కడి బీచ్లో బలమైన అలలను చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముంబైలో సందర్శించేందుకు పలు పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ను ఆహార ప్రియులను అమితంగా ఇష్టపడుతుంటారు. ముంబైలో సందర్శించేందుకు పలు పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. ఈ శీతాకాలంలో తక్కువ బడ్జెట్లో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందుకు ముంబై అనువైన ప్రాంతమని పర్యాటకులు చెబుతుంటారు. ఇది కూడా చదవండి: Delhi Election 2025: ఆ మూడు పార్టీల బలాలు.. బలహీనతలు -
Keerthy Suresh: భర్తతో జాలీగా వెకేషన్.. కానీ! (ఫోటోలు)
-
కూతురు రాహాతో స్టార్ జంట రణ్బీర్ - ఆలియా వెకేషన్ (ఫోటోలు)
-
తల్లితో కలిసి బుట్టబొమ్మలా.. మంచులో భర్త ప్రేమలో తడిసి ముద్దవుతూ ఇలా (ఫొటోలు)
-
ఫ్యామిలీ ట్రిప్లో భూమిక చావ్లా.. శ్రీలంకలో చిల్ అవుతూ! (ఫోటోలు)
-
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
లండన్లో చిల్ అవుతోన్న యంగ్ టైగర్.. వీడియో వైరల్
ఈ ఏడాది దేవర మూవీతో బ్లాక్బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ యాక్షన్ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వార్ 2లో కనిపించనున్నారు. ఆ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో జతకట్టనున్నారు. ఈ చిత్రాన్ని పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కించనున్నట్లు ఇటీవల నిర్మాత ప్రకటించారు.అయితే ప్రస్తుతం షూటింగ్కు కాస్తా గ్యాప్ దొరకడంతో ఫ్యామిలీతో చిల్ అవుతున్నారు యంగ్ టైగర్. లండన్లో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా లండన్లోని హైడ్ పార్క్లో తన పిల్లలతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. #JrNTR anna at London with his family...@tarak9999 #prideofindia pic.twitter.com/CEtShHW8r4— i am Rajesh(NRT)“🐉” (@rajeshntripati) December 28, 2024 Tiger @tarak9999 chilling on the streets of London ♥️🐯#JrNTR #War2 #NTRNeel #Dragon pic.twitter.com/LLxLG5N7zc— poorna_choudary (@poornachoudary1) December 28, 2024 -
ఆస్ట్రేలియాలో భర్తతో విన్యాసాలు.. భయపడిపోయిన సోనాక్షి సిన్హ (ఫోటోలు)
-
సారా టెండూల్కర్ స్టన్నింగ్ లుక్స్.. హీరోయిన్స్ను మించి(ఫోటోలు)
-
గోవా టూర్లో బాయ్ ఫ్రెండ్తో హీరోయిన్ తమన్నా (ఫొటోలు)
-
అందుకే సాయిపల్లవి డిఫరెంట్.. చెల్లితో బీచ్లో చిల్ అవుతూ! (ఫొటోలు)
-
బెస్ట్ కపుల్స్గా స్నేహ దంపతులు.. ఫ్రెండ్స్తో వెకేషన్ ప్లాన్ (ఫోటోలు)
-
భారతీయుల దుబాయ్ విహారానికి బ్రేక్
సాక్షి, అమరావతి: ప్రముఖ పర్యాటక నగరమైన దుబాయ్లో విహరించాలనుకునే భారతీయులకు ఎదురుదెబ్బ తగులుతోంది. హాలీడే ట్రిప్పులు, కుటుంబ సభ్యులతో వెకేషన్ కోసం దుబాయ్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి నిరాశే మిగులుతోంది. ఒకప్పుడు దరఖాస్తు చేసుకున్న వెంటనే దుబాయ్ వీసా మంజూరయ్యేది. కానీ, ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన దుబాయ్ ఇర్ముగ్రేషన్ నిబంధనలు భారతీయ పర్యాటకులకు చుక్కలు చూపిస్తున్నాయి. కొన్ని వారాలుగా వీసాల తిరస్కరణ రేటు గణనీయంగా పెరిగింది. ఒకప్పుడు వీసా దరఖాస్తుల్లో 99 శాతం ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు 94–95 శాతానికి పడిపోయింది. ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కఠిన పర్యాటక వీసా నిబంధనలను అమలు చేస్తోంది. దుబాయ్లో పర్యటించాలనుకునేవారు తమ వీసా దరఖాస్తుతో పాటు ఏ హోటల్లో బస చేస్తారో.. ఆ హోటల్ బుకింగ్ డాక్యుమెంట్స్, విమాన రిటర్న్ టికెట్లను జత చేయాల్సి ఉంటుంది. ఒకవేళ హోటల్లో కాకుండా బంధువుల ఇంట్లో ఉండాలనుకుంటే.. సంబంధిత నివాస ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. హోస్ట్ రెంటల్ ఒప్పందం, ఎమిరేట్స్ ఐడీ, కాంటాక్ట్ వివరాలు తప్పనిసరి చేసింది. ఈ పత్రాలన్నీ ముందుగా జత చేస్తేనే వీసాకు ఆమోదం లభిస్తుంది. అలాగే అదనంగా దుబాయ్లో ఉండటానికి తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందని రుజువు చేయాల్సి ఉంటుంది. హోటల్లో బస చేయాలనుకుంటే కనీస బ్యాలెన్స్ రూ.50 వేలు చూపిస్తూ చివరి మూడు నెలల బ్యాంక్ స్టేట్మెంట్, పాన్కార్డును సమర్పించాలి. వీటిలో ఏది లేకున్నా వీసా మంజూరుకు అవరోధం ఏర్పడినట్టే. తాజాగా ప్రతి వంద దరఖాస్తుల్లో 5–6 శాతం తిరస్కరణకు గురవుతున్నాయి. డాక్యుమెంటేషన్ పక్కాగా ఉన్నా.. వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని ట్రావెల్ ఏజెన్సీలు వాపోతున్నాయి.ఆర్థి కంగానూ నష్టమే.. వీసా దరఖాస్తుల తిరస్కరణ పర్యాటకులపై తీవ్ర ఆర్థి క భారాన్ని మోపుతోంది. వీసా దరఖాస్తు రుసుమును కోల్పోవడంతో పాటు ముందుగా బుక్ చేసుకున్న విమాన, హోటల్ టికెట్ల కోసం చెల్లించిన డబ్బును కూడా నష్టపోతున్నారు. అలాగే ఒక కుటుంబ సభ్యుడి వీసా తిరస్కరణకు గురైతే.. కుటుంబంలోని మిగిలిన సభ్యులు కూడా తమ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోంది. సెలవులు సీజన్ రాబోతుండటంతో పాటు డిసెంబర్, జనవరిలో దుబాయ్లో షాపింగ్ ఫెస్ట్ జరగబోతున్న సమయంలో పెద్ద ఎత్తున వీసాలు తిరస్కరణకు గురవుతుండటం భారతీయ పర్యాటకులతో పాటు ట్రావెల్ ఏజెన్సీలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. వారి సంఖ్యను కాస్త తగ్గించేందుకే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. -
వేకేషన్లో చిల్ అవుతోన్న టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్.. తన గ్యాంగ్ను చూశారా?..ఫోటోలు వైరల్
-
‘ఇటాలియన్ మాఫియా’ : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట (ఫొటోలు)
-
ఫారిన్ ట్రిప్లో చిల్ అవుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్
-
థాయ్లాండ్ ట్రిప్లో ధోని కుటుంబం.. బీచ్ ఒడ్డున అలా (ఫొటోలు)
-
హీరోయిన్ నిత్యా మీనన్ ఎవర్ గ్రీన్ నవ్వు (ఫొటోలు)
-
బ్యాంకాక్లో చిల్ అవుతోన్న మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)
-
వెకేషన్లో గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. మామూలుగా లేదుగా! (ఫొటోలు)
-
స్నేహితులతో వెకేషన్లో ధోని (ఫొటోలు)
-
ఫారిన్ ట్రిప్ ఫొటోలు షేర్ చేసిన సూర్యకుమార్ యాదవ్ భార్య దేవిశా శెట్టి
-
లాంగ్ వీకెండ్.. ఎక్కువ మంది ఇక్కడికే..
స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్లను పురస్కరించుకుని లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో వీటిని సద్వినియోగం చేసుకునేందుకు చాలా మంది వెకేషన్ ప్లాన్ చేసే పనిలో పడ్డారు. దగ్గరలో మంచి వెకేషన్ స్పాట్లు ఎక్కడ ఉన్నాయా అని శోధిస్తున్నారు.వెకేషన్ రెంటల్ సేవలు అందించే ఎయిర్బీఎన్బీ (Airbnb) సంస్థ ప్రకారం.. స్వాతంత్య్ర దినోత్సవం, రక్షా బంధన్ సందర్భంగా వచ్చిన లాంగ్ వీకెండ్తో డొమెస్టిక్ వెకేషన్ స్టేల కోసం శోధనలు వార్షిక ప్రాతికదికన 340 శాతానికిపైగా పెరిగాయి. దేశంలో మంచి వెకేషన్ స్పాట్లు అందుబాటులో ఉండటంతో లాంగ్ వీకెండ్లలో వీటిని సందర్శించేందుకు భారతీయ పర్యాటకులలో పెరుగుతున్న ఆసక్తిని ఈ డేటా తెలియజేస్తోంది.ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రాంతాలు ఇవే.. ఈ లాంగ్ వీకెండ్ సందర్భంగా ఎక్కువ మంది ఆసక్తి కనబరిచిన వెకేషన్ స్పాట్లను ఎయిర్బీఎన్బీ తెలియజేసింది. వాటిలో గోవా, లోనావాలా, పుదుచ్చేరి, ముంబై, బెంగళూరు, న్యూఢిల్లీ, ఉదయపూర్ అగ్రస్థానంలో ఉన్నాయి. ఎయిర్బీఎన్బీ సెర్చ్ డేటా ప్రకారం చాలా మంది బీచ్లు ఉన్న ప్రాంతాలపై ఆసక్తి కనబరిచినట్లుగా తెలుస్తోంది. -
ఉద్యోగులకు 10 రోజుల ‘సెలవు’.. కానీ ట్విస్ట్ తెలిస్తే..
దేశ వజ్రాల పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ తగ్గింది. దీంతో దని పేర్కొంటూ సూరత్కు చెందిన ఒక ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ఏకంగా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజులపాటు 'సెలవు' ప్రకటించింది.ప్రపంచంలో అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారైన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆగస్టు 17 నుంచి 27 వరకు 10 రోజులు 'సెలవు' ప్రకటించింది. "మా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించాం. దీని కోసం కొంత మొత్తం కోత విధించినప్పటికీ, ఉద్యోగులందరికీ ఈ కాలానికి జీతం చెల్లిస్తాం. మాంద్యం కారణంగా ఈ సెలవులను ప్రకటించవలసి వచ్చింది'' అని కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభాయ్ లఖానీ వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.ప్రపంచంలోని దాదాపు 90 శాతం వజ్రాలను ప్రాసెస్ చేసే స్థానిక వజ్రాల పరిశ్రమను మాంద్యం దెబ్బతీసిందన్న లఖానీ అభిప్రాయాలతో సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ఖుంట్ ఏకీభవించారు. "కిరణ్ జెమ్స్ ఇలా సెలవు ప్రకటించడం (ఉద్యోగులకు) ఇదే మొదటిసారి. ఇంతవరకు మరే ఇతర సంస్థ కూడా ఇటువంటి చర్య తీసుకోనప్పటికీ, మాంద్యం పాలిష్ చేసిన వజ్రాల అమ్మకాలను తగ్గించింది" అని ఖుంట్ అన్నారు.పాలిష్ చేసిన వజ్రాలు అత్యధికం ఎగుమతి చేస్తున్నందున అంతర్జాతీయ కారకాలు వజ్రాల అమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలను కొన్ని కారకాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ కారకాలతో 2022లో దాదాపు రూ. 2,25,000 కోట్లున్న వజ్రాల పరిశ్రమ టర్నోవర్ నేడు రూ. 1,50,000 కోట్లకు తగ్గిందన్నారు. సూరత్లో దాదాపు 4,000 డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. -
'సీతారామం'కి రెండేళ్లు.. స్కాట్లాండ్లో మృణాల్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
కట్టుకున్న చీరకే అందాన్ని తెచ్చిన స్నేహ (ఫోటోలు)
-
కొండాకోనల్ల నడుమ సేద తీరుతున్న అల్లు అర్జున్ ఫ్యామిలీ (ఫోటోలు)
-
అమ్మాయి... సూర్యుడు... జెలాటో
‘‘భగవంతుడు సృష్టించిన ఈ పెద్ద ప్రపంచంలో మనం ఎంత చిన్నవాళ్లమో ప్రకృతి గుర్తు చేస్తుంది. ప్రకృతికి సంబంధించిన ప్రతిదీ చాలా వైశాల్యంతో కూడుకుని ఉంటుంది. చాలా గంభీరంగా, వినయంగా అనిపిస్తుంటుంది. అలాగే ప్రతిదాంట్లోనూ ఓ ఆధ్యాత్మిక ఉట్టిపడుతుంది’’ అంటున్నారు పూజా హెగ్డే.ఈ బ్యూటీ ప్రస్తుతం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. షూటింగ్స్కి కాస్త విరామం రావడంతో విహార యాత్రకు ఇటలీలో వాలిపోయారు పూజా హెగ్డే. అక్కడ పలు ప్రదేశాలను సందర్శిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కలర్ఫుల్ ఫ్రాక్లో సన్ గ్లాసెస్తో, చేతిలో జెలాటో (ఇటలీలో అన్ని రకాల ఐస్క్రీమ్లను జెలాటో అంటారు)తో చిరునవ్వులు చిందిస్తూ దిగిన ఫొటోలను ‘అమ్మాయి... సూర్యుడు... జెలాటో’ అనే క్యాప్షన్ ఇచ్చి, షేర్ చేశారామె.అలాగే పడవ ప్రయాణం చేస్తూ, ప్రకృతిని చూసి పరవశించిన వీడియోను షేర్ చేసి, పై విధంగా పేర్కొన్నారు. ఇక ఈ హాలిడేలో ఫుల్గా రిలాక్స్ అయి, ఇండియా వచ్చాక ఓ నూతనోత్సాహంతో పూజా హెగ్డే షూటింగ్స్లో పాల్గొంటారని చెప్పాచ్చు. -
వెకేషన్ ఫుల్ ఎంజాయ్ చేస్తోన్న బన్నీ ఫ్యామిలీ (ఫొటోలు)
-
Miami: వేకేషన్లో బ్యూటీ.. లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసిన ఐశ్వర్య రాజేశ్ (ఫోటోలు)
-
వేకేషన్ పూర్తి చేసుకున్న ప్రిన్స్.. డిఫరెంట్ లుక్లో మహేశ్ బాబు!
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో అభిమానులను అలరించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రీలీల హీరోయిన్లుగా నటించారు. అయితే ప్రస్తుతం మహేశ్ బాబు.. దర్శకధీరుడు రాజమౌళితో కలిసి పని చేయనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రానికి ఇప్పటికే కథను సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉండగా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫుల్గా చిల్ అవుతున్నారు. కాస్తా ఖాళీ సమయం దొరికితే చాలు ఠక్కున విదేశాల్లో వాలిపోతుంటారు. తాజాగా ప్రిన్స్ తన ఫ్యామిలీతో కలిసి వేకేషన్కు వెళ్లారు. ఇటీవలే కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లిన మహేశ్ బాబు తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సితార, గౌతమ్, తన భార్యతో కలిసి కనిపించారు. విమానాశ్రయం నుంచి బయటికొస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది. #TFNExclusive: Superstar @urstrulyMahesh and his family have arrived in Hyderabad after their vacation!📸#MaheshBabu #SSMB29 #TeluguFilmNagar pic.twitter.com/smdCatOYlb— Telugu FilmNagar (@telugufilmnagar) July 7, 2024 -
కిక్ ఇచ్చేలా కేతిక.. రొమాంటిక్ బ్యూటీ సోయగాలు (ఫొటోలు)
-
ఫారిన్ ట్రిప్ ఫోటోలు షేర్ చేసిన సమంత
-
చెల్లితో వితికా షెరు విదేశీ ట్రిప్.. ఇద్దరూ కలిశారంటే రచ్చే! (ఫొటోలు)
-
వెకేషన్లో 'విశ్వంభర' బ్యూటీ.. తెగ ముద్దొచ్చేస్తుంది! (ఫొటోలు)
-
సింపుల్గా భలే అందంగా ఉంది.. మౌనీ రాయ్ సూపర్ హాట్! (ఫొటోలు)
-
స్పెయిన్లో భర్తతో కలిసి చిల్ అవుతున్న మౌనీ రాయ్ (ఫొటోలు)
-
Disha Patani Photos: వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న కల్కి 2898 ఏడీ హీరోయిన్ (ఫోటోలు)
-
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
-
వర్కలా బాయ్స్
ఇటీవల ‘ముంజమ్మల్ బాయ్స్’ సినిమా పెద్ద హిట్ అయ్యింది. బిలంలో పడ్డ స్నేహితుణ్ణి బయటకు లాగడం కథ. ఇక్కడ మనం ‘వర్కలా బాయ్స్’ని చూడొచ్చు. కర్నాటక నుంచి కేరళ విహారానికి వచ్చిన ఒక మహిళ వర్కలా బీచ్లో ఫోన్ జారవిడిచింది. అది అక్కడి రాళ్ల కింద చాలా లోతులో పడింది. అసలే అది ఐఫోన్. ఇంకేముంది వర్కలా అగ్నిమాపక దళం రంగంలోకి దిగింది. 7 గంటలు శ్రమించాక... ఏమైంది?విహారంలో అపశృతులు దొర్లితే మనసు పాడవుతుంది. కర్నాటక నుంచి కేరళలోని వర్కలాకు విహారానికి వచ్చిన ఒక మహిళ అక్కడి బ్లాక్ బీచ్లో ఉండగా పొరపాటున ఫోన్ జారింది. అది రాళ్ల కట్ట ఉన్న బీచ్. ఫోన్ రాళ్ల సందులో నుంచి లోపలికి పడిపోయింది. లక్షన్నర రూపాయల విలువ చేసే ఐఫోన్. వెంటనే ఆమె బస చేసిన హోటల్ సిబ్బంది, వర్కలా అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. రాళ్లు తొలగించి ఫోన్ తీసే వీలు లేదు. తాడుతో తీగతో బయటకు లాగడం కూడా కష్టమైంది. దానికితోడు బీచ్లో భారీ అలలు, వాన పనికి అంతరాయం కలిగించాయి. దాంతో మరుసటి రోజు ఉదయం వచ్చి సుమారు ఏడు గంటలు కష్టపడి ఆ ఫోన్ని వెలికి తీశారు. అమ్మయ్య. కథ సుఖాంతం అయ్యింది. సుఖాంతం సంతోషమే కదా ఇస్తుంది. మంజుమ్మల్ బాయ్స్లో కూడా కథ సుఖాంతం కావడం వల్లే అది అంత పెద్ద హిట్ అయ్యిందని అనుకోవచ్చా? -
హీరో యూనివర్స్ నా వెనకాల అంటున్న శ్యామల (ఫొటోలు)
-
త్వరలో పెళ్లి.. వెకేషన్లో చిల్ అవుతున్న సిద్దార్థ్- అదితి (ఫోటోలు)
-
ఫ్యామిలీతో నయనతార సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
భర్తతో కలిసి క్రొయేషియా ట్రిప్లో బిజీగా బ్యాడ్మింటన్ స్టార్.. స్టన్నింగ్ లుక్స్ (ఫొటోలు)
-
క్విట్ వెకేషనింగ్ ట్రెండ్ ఏమిటి? యువత ఎందుకు ఫాలో చేస్తోంది?
సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగానికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమన్వయాన్ని కొనసాగించేందుకు పని నుండి కాస్త విరామం తీసుకుని, ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటారు. ఇందుకోసం తమ ఆఫీసులోని బాస్కు చెప్పి సెలవు తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈ విషయంలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. ప్రపంచంలోని అనేక దేశాలలో వివిధ ప్రైవేట్ కంపెనీలలో పనిచేసే ఉద్యోగులు ఈ నూతన ట్రెండ్ను ఫాలో చేస్తున్నారు. దానిపేరే ‘క్విట్ వెకేషనింగ్’. ఇంతకీ ఈ కొత్త ధోరణి ఏమిటి?అమెరికన్ మార్కెటింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ ‘హారిస్ పోల్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం యూఎస్లోని దాదాపు 78 శాతం మంది ఉద్యోగులు, ప్రధానంగా యువత తమకు పని నుంచి విరామం కావాలని బాస్ను అడగడం లేదు. ఇలా అడగకుండా లీవ్ పెట్టడాన్ని వారు తప్పుగా భావించడంలేదని సదరు సర్వే చెబుతోంది. పని ఒత్తిడికి తగ్గించుకునేందుకే వారు ఇలా చేస్తున్నారని సర్వే వెల్లడించింది.పని నుంచి విరామం కోరుకునేందుకు ఉద్యోగులు తమకు తోచిన పరిష్కారాలను కనిపెడుతున్నారు. దీనిలో భాగంగానే క్విట్ వెకేషనింగ్ అనేది ఉద్భవించిందని సర్వే చెబుతోంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం క్విట్ వెకేషనింగ్ సమయంలో ఉద్యోగులు తాము పనిచేస్తున్నట్లు సంస్థకు భ్రమ కల్పిస్తారు. పని వేళల్లో తాము పంపాల్సిన ఈమెయిల్స్ను ముందుగానే షెడ్యూల్ చేస్తారు. పనివేళల తర్వాత కూడా ఓవర్ టైం చేస్తున్నట్లు కనిపించేందుకు కూడా ప్రయత్నిస్తుంటారు.మరి కొందరు ఉద్యోగులు అప్పుడప్పుడు తమ కంప్యూటర్ మౌస్ను కంపెనీ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై ఉంచి, పని చేస్తున్నట్లు కనిపించడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా తెరవెనుక కొన్నాళ్లుగా జరుగుతున్నదని ఈ సర్వే చేపట్టిన సంస్థ తెలిపింది. అయితే అటు ఉద్యోగాన్ని, ఇటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసేందుకు మంచి పరిష్కార మార్గం కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని సర్వే నిర్వాహకులు తెలిపారు. -
అర్ధరాత్రి దాకా.. తెలంగాణ హైకోర్టులో అరుదైన ఘట్టం
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టు అరుదైన ఘట్టానికి వేదిక అయ్యింది. గురువారం అర్ధరాత్రి 1గం.(శుక్రవారం) దాకా కేసుల విచారణ జరిగింది. అందులో వెకేషన్ బెంచ్ ఆ ప్రొసీడింగ్స్ చేపట్టడం మరీ విశేషం. మే 6 నుంచి మే 31వ తేదీదాకా తెలంగాణ హైకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో అత్యవసర కేసుల విచారణ కోసం వెకేషన్ బెంచ్లు పని చేస్తాయి. అయితే గురువారం ఒక్కరోజే లిస్ట్లో ఉన్న 250 కేసులు విచారణ చేపట్టింది జస్టిస్ విజయ్సేన్ రెడ్డి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన డివిజన్ బెంచ్. ఉదయం 10.30ని. మొదలైన బెంచ్ విచారణ.. తెల్లవారుఝామున 1గం. దాకా సాగింది. తెలంగాణ హైకోర్టు చరిత్రలోనే ఇదొక అరుదైన ఘట్టమని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. ఇక.. బీజేపీ వేసిన ప్రైవేట్ పిటీషన్ ను అర్థరాత్రి 1 గంటకు విచారించింది ఈ వెకేషన్ బెంచ్. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి క్రిమినల్ కోర్టులో సీఆర్పీసీ సెక్షన్ 299, 300 ప్రకారం ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. అయితే.. దీనిని నాంపల్లి కోర్టు స్వీకరించకుండా వాయిదా వేసింది. దీంతో.. ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాలంటూ దాఖలైన క్వాష్ పిటిషన్పై హైకోర్టు గురువారం అర్ధరాత్రి ఒంటిగంటకు విచారణ చేపట్టింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని.. అర్ధరాత్రి ఒంటి గంటకు విచారించాల్సినంత ముఖ్య విషయం కాదని హైకోర్టు వ్యాఖ్యానించింది.సాధారణంగా వెకేషన్ కోర్టులో అత్యవసర పిటిషన్లు మాత్రమే దాఖలు చేయాల్సి ఉంటుంది. గురువారం వెకేషన్ బెంచ్ జాబితాలో ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఈ కేసు విచారణ వచ్చేటప్పటికి సమయం అర్ధరాత్రి ఒంటిగంట అయింది. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈ కేసు కోసం అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఎందుకు వేచి ఉన్నారు? ఇందులో అంత అతస్యవసరం ఏముంది? అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సూచనలు తెలుసుకుని చెప్పాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్కు ఆదేశాలు జారీచేసింది. విచారణను జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది.రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని, ఫేక్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆరోపణలున్నాయి. సంబంధిత వార్త: ఆ వీడియోతో నాకు సంబంధం లేదు: సీఎం రేవంత్ -
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
-
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
హ్యాపీ హాలిడేస్
వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళుతుంటారు మహేశ్బాబు. ఈ వేసవి వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి మహేశ్బాబు ఫారిన్ వెళ్లారు. ‘హ్యాపీ హాలిడేస్.. ఫ్యామిలీ టైమ్’ అంటూ జర్నీ ఫొటోలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. ఈ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రాజమౌళితో చేయనున్న సినిమా షూటింగ్లో పాల్గొంటారట మహేశ్బాబు. షూటింగ్ గురించిన వివరాలను త్వరలోనే రాజమౌళి వెల్లడించనున్నట్లుగా తెలిసింది. -
Sania Mirza : దుబాయ్ వెకేషన్లో ఆహ్లాదంగా సానియా మీర్జా (ఫొటోలు)
-
దుబాయ్లో రెండు వారాలు ఇలా: సానియా మీర్జా ఫొటోలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కుటుంబంతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు. ప్రతికూల భావనలు దరిచేరకుండా తన చుట్టూ పూర్తి సానుకూల వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. చిన్నారి కుమారుడు ఇజహాన్, తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి దుబాయ్ పర్యటనలో సానియా ఆహ్లాదంగా గడిపారు. ఈ క్రమంలో తన టూర్కు సంబంధించిన ఫొటోలను.. ‘‘గత రెండు వారాల్లో నాకు ఇష్టమైన పనులతో ఇలా గడిచింది’’ అనే క్యాప్షన్తో పంచుకున్నారు. కాగా సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. షోయబ్ పాక్ నటి సనా జావెద్ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. సనాను వివాహం చేసుకున్నానంటూ షోయబ్ మాలిక్ ఫొటోలు విడుదల చేసిన తర్వాత.. సానియా కుటుంబం స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల కారణంగానే సానియా ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖులా ద్వారా తానే స్వయంగా అతడితో బంధం నుంచి విముక్తి పొందినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జీవితంలోని కఠిన దశను దాటే క్రమంలో సానియా మీర్జా తనకోసం తాను ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. దుబాయ్ పర్యటనలో భాగంగా సానియా మీర్జా పాక్ సింగర్ అతిఫ్ అస్లాం లైవ్ కన్సర్ట్కు హాజరయ్యారు. అస్లాం, అతడి భార్య సారాతో కలిసి లంచ్కు వెళ్లి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. కాగా పాకిస్తాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ను సానియా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు దుబాయ్లో కాపురం ఉన్నారు. అయితే, ఆట నుంచి విరామం తీసుకున్న తర్వాత షోయబ్తో కలిసి ఎక్కువ సమయం గడిపే క్రమంలో.. అతడి గురించి నిజాలు తెలియడంతోనే.. ఆమె అతడి నుంచి విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇక సానియాకు దుబాయ్లో టెన్నిస్ అకాడమీ ఉంది. ప్రస్తుతం అకాడమీ కార్యకలాపాలతో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
Niharika Konidela: నీటిలో గజరాజుతో మెగా డాటర్ ఆటలు (ఫోటోలు)
-
Vishnupriya Bhimeneni: పారిస్లో చిల్ అవుతోన్న విష్ణుప్రియ (ఫోటోలు)
-
Sudheer Babu Family Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో (ఫోటోలు)
-
Shraddha Das Kerala Trip Pics: కేరళ నేచర్ను ఎంజాయ్ చేస్తోన్న శ్రద్ధా దాస్
-
MS Dhoni: దుబాయ్ వెకేషన్లో ధోని.. ఫొటోలు తీసుకున్న హీరోయిన్లు
-
ఫారిన్కు మహేశ్ బాబు.. 'గుంటూరు కారం' ప్రమోషన్స్ షురూ
‘గుంటూరు కారం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతోంది. మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట యూనిట్. ఈ పాట పూర్తయితే షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని టాక్. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి, ఈ నెలాఖరుకు ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి అయ్యేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్కు వెళతారట మహేశ్బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్నగర్ సమాచారం. ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారు మహేశ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
Pooja Ramachandran Beach Photos: ఫ్యామిలీతో బీచ్లో చిల్ అవుతున్న పూజా రామచంద్రన్ (ఫోటోలు)
-
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్పోర్ట్లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
Anjali: వెకేషన్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ అంజలి (ఫోటోలు)
-
వెకేషన్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన బన్నీ.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్గా కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వర్ సింగ్ షెకావత్గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!) అయితే గతనెలలో షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన బన్నీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. యూరప్లో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ సంగీత ఉత్సవం టుమారో ల్యాండ్కు అల్లు అర్జున్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడే అందరి మధ్యలో డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ కనిపించారు. దీంతో కొంతమంది అభిమానులు బన్నీతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ వేడుక జూలై చివర్లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించనున్నారు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
SS Rajamouli Norway Vacation Images: నార్వేలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దర్శకధీరుడు (ఫోటోలు)
-
‘సెలవులు పెడితే క్రిమినల్లా చూస్తున్నారు’.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్ప్లేస్ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్ప్లేస్లో ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్ (Reddit) యూజర్ తన వర్క్ప్లేస్లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్ కాస్త ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా.. "నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు. సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్టాప్ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్టాప్ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్ చెక్ చేయనని, నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టు కాస్త వైరల్గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు. -
ఆస్ట్రేలియాలో పీవీ సింధు.. వెకేషన్ ఫొటోలు
-
స్కాట్లాండ్ లో కుటుంబంతో కలిసి వెకేషన్ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ బాబు (ఫొటోలు)
-
వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. టాలీవుడ్ ప్రిన్స్ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన నమ్రత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో స్కాట్లాండ్లో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. (ఇది చదవండి: హీరోయిన్గా మారిన ‘విక్రమార్కుడు’ చైల్డ్ ఆర్టిస్ట్) స్కాట్లాండ్లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించారు. చారిత్రాత్మక మ్యూజియంలో తన పిల్లలు సితార, గౌతమ్తో దిగిన ఫోటోలను నమ్రత పంచుకుంది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ సరసన పెళ్లి సందడి భామ శ్రీలీల కనిపించనుంది. అంతకుముందు పూజా హెగ్డేను ఎంపిక చేయగా.. పలు కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
నితిన్ కౌగిలిలో భార్య షాలిని.. క్యూట్ పెయిర్ ఫోటోలు
-
Mahesh Babu Family London Vacation Photos: లండన్లో వేకేషన్లో మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
-
సమంత వేసుకున్న ఈ డ్రెస్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సెలబ్రిటీలను చాలామంది ఫాలో అవుతుంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వాళ్లు వేసుకున్న డ్రెస్సులు, వాచీలు, గాడ్జెట్స్పై జనాలు ఎక్కువగా దృష్టి పెడుతుంటారు. వాళ్లు ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా ఆ వార్తలు క్షణాల్లో వైరల్గా మారుతుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత వేసుకున్న డ్రెస్ నెట్టింట హాట్టాపిక్గా మారింది. ఆ స్టోరీ ఏంటన్నది ఇప్పుడు చూసేద్దాం. సమంత ఫ్యాషన్ సెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలోనూ సామ్ అవుట్ఫిట్స్ సూపర్ ట్రెండ్ అయ్యాయి. ప్రస్తుతం సామ్ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలె మయోసైటిస్ నుంచి బయటపడిన సమంత ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించదని టాక్. పలు నివేదికల ప్రకారం, ఆగస్ట్ 2023 మొదటి వారంలో సమంత తన మైయోసైటిస్ చికిత్స కోసం యూఎస్ వెళ్లనుంది. బ్రేక్ ప్రకటించిన వెంటనే ముందుగా తనకెంతో ఇష్టమైన ఇషా ఫౌండేషన్కు వెళ్లిన సమంత తాజాగా బాలికి వెకేషన్కు వెళ్లింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో పంచుకుంటుంది. రీసెంట్గా సమంత వేసుకున్న ఓ డ్రెస్ డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇందులో ఓ డ్రెస్లో సమంత క్యూట్ లుక్స్తో మెస్మరైజ్ చేసింది. ఇక ఆ డ్రెస్ కాస్ట్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. కల్ట్ గయా కామెరూన్ నిట్ బ్రాండ్కు చెందిన గ్రీన్ కలర్ డ్రెస్లో సమంత స్టైలిష్గా దర్శనమిచ్చింది. ఆ డ్రెస్ ఖరీదు సుమారు రూ. 37, 790 రుపాయలు అని తేలింది. దీంతో ఇంత సింపుల్ డ్రెస్ అంత ఖరీదా అని నెటిజన్లు షాక్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
లండన్లో ప్రిన్స్ ఫ్యామిలీ.. ఫోటోలు షేర్ చేసిన నమ్రత!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే ప్రిన్స్ కాస్తా టైం దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్ ప్లాన్ చేస్తుంటారు. అంతేకాదు ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉంటారు. ప్రస్తుతం షూటింగ్కు కాస్త విరామం లభించడంతో మహేశ్బాబు కుటుంబంతో సహా లండన్లో వాలిపోయారు. ఇటీవలే వేకేషన్కు వెళ్తూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కనిపించారు. (ఇది చదవండి: హైదరాబాద్కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్) తాజాగా నమ్రత లండన్లో ఉన్న ఫోటోలను తన ఇన్స్టాలో షేర్ చేసింది. లండన్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్తో డిన్నర్ చేస్తున్న ఫోటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహేశ్ అన్నను జాగ్రత్తగా చూసుకో మేడమ్ అంటూ కొందరు నెటిజన్స్ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. గతంలో కూడా పలుసార్లు మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి లండన్కు వేకేషన్ వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా..మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి పూజా హేగ్డే హీరోయిన్గా తప్పుకోవడంతో... పెళ్లి సందడి భామ శ్రీలీల ఆ ఛాన్స్ కొట్టేసింది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రం చేయనున్నారు. (ఇది చదవండి: టాలీవుడ్ హీరోకు పెద్ద ఫ్యాన్.. ధోని భార్య సాక్షి కామెంట్స్ వైరల్!) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
Gouri G Kishan : మాల్దీవుల్లో అందాల ఊయల ఊగేస్తున్న గౌరీ కిషన్(ఫోటోలు)
-
వేకేషన్కు మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఎయిర్పోర్ట్లో సందడి!
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం ఆయన త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. అయితే మొదట ఈ చిత్రంలో హీరోయిన్గా పూజా హేగ్డేను ఎంపిక చేయగా.. ఆ తర్వాత ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. పూజా స్థానంలో పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీలను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే హీరో.. కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. (ఇది చదవండి: జ్యువెల్లరీ యాడ్లో సితార.. రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) అయితే ప్రస్తుతం గుంటూరు కారం షూటింగ్కు కాస్త విరామం లభించడంతో వేకేషన్ ప్లాన్ చేశాడు ప్రిన్స్ మహేశ్ బాబు. తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు పయనమయ్యారు. మహేశ్ బాబు సతీమణి, పిల్లలు సితార, గౌతమ్ హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఎయిర్పోర్ట్లో మహేశ్ బాబు ఫ్యామిలీ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కాగా.. జూలై 20న సితార బర్త్డేను జరుపుకున్న సంగతి తెలిసిందే. సితార పుట్టినరోజు వేడుకను మహేష్ బాబు ఫౌండేషన్లోని యువతులతో కలిసి ఇంట్లోనే చాలా సింపుల్గా జరుపుకున్నారు. కాగా.. ఇటీవలే సితార మొదటి జ్యూవెల్లరీ యాడ్ న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఈ యాడ్ కోసం భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. సితారకు యాడ్ కోసం ఏకంగా రూ.కోటి ఇచ్చినట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: బేబీ బంప్ వీడియో షేర్ చేసిన నటి..సోషల్ మీడియాలో వైరల్!) Superstar #MaheshBabu with family off to vacation #GunturKaaram @urstrulyMahesh pic.twitter.com/srs35m2Hoh — 𝙎𝙎𝙈𝘽 𝙁𝙍𝙀𝘼𝙆𝙎 𝙁𝘾 (@ssmb_freaks) July 22, 2023 -
Malaika Arora: ఫ్రెండ్స్తో వెకేషన్ చెక్కేసిన బాలీవుడ్ హీరోయిన్ (ఫోటోలు)
-
వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
బాలీవుడ్ నటి మలైకా అరోరా తన అద్భుతమైన ఫిజిక్, స్టైల్తో ఫ్యాన్స్ను ఎపుడూ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ ఉంటుంది. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేస్తూ ఉర్రూత లూగించడం, లక్షలాది మంది అభిమానులను మంత్రముగ్ధులను చెయ్యడం అలవాటు.పబ్లిక్ అప్పీరెన్స్లో ఫ్యాషన్ ఐకాన్గా నిలవడం ఆమెకు అలవాటు.తన వార్డ్రోబ్లో లగ్జరీ యాక్ససరీస్కు పాపులర్ అయిన ఈ చయ్యా చయ్యా అమ్మడు ఇటీవల వెకేషన్ను ఎంజాయ్ చేసి వచ్చిందట అజర్బైజాన్లోని బాకులో ఆనందంగా గడిపిన క్షణాలుంటూ కొన్నిఫోటోలు, వీడియోతో అందరినీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అజర్బైజాన్ వెకేషన్లో ధరించిన వైట్-హ్యూడ్ ట్యాంక్ డ్రెస్ ఫ్యాన్స్ను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించి ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది. తెల్లని పొడవాటి వైట్ గౌను, మెడలో రెండు గొలుసులు, సన్ గ్లాసెస్తో స్పెషల్ లుక్లో ఉంది. సోర్చ్ అన్నోన్ అనే బ్రాండ్కు చెందిన ఈ డ్రెస్ ధర భారతీయ కరెన్సీలో టాక్స్లు మినహాయించి రూ. 5,909లట. కాగా బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ను మలైకా వివాహం ,అర్హాన్ అనే కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం బీటౌన్ హీరో అర్జున్ కపూర్ల ప్రేమయాణం గురించి తెలిసిందే. -
Chiranjeevi And Surekha Photos: అర్ధాంగితో చిరంజీవి అమెరికా ట్రిప్ (ఫోటోలు)
-
వెకేషన్కు మెగాస్టార్ దంపతులు.. సోషల్ మీడియాలో పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'భోళా శంకర్'. ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ మూవీలో మెగాస్టార్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా కనిపించనుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. అంతే కాకుండా చిరంజీవి తన పాత్ర డబ్బింగ్ని పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం రీమేక్గా తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్ పూర్తి కావడంతో మెగాస్టార్ విదేశాలకు పయనమయ్యారు. (ఇది చదవండి: ఆ హీరోకి తల్లిగా చేయమన్నారు.. యాక్టింగ్ వదిలేశా: మధుబాల) వెకేషన్కు అమెరికా వెళ్తున్నట్లు మెగాస్టార్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్బంగా సతీమణితో విమానంలో దిగిన ఫోటోలను షేర్ చేశారు. షూటింగ్లతో ఎప్పుడు బిజీగా ఉండే చిరంజీవి.. కాస్తా తీరిక సమయం లభిస్తే విదేశాల్లో వాలిపోతుంటారు. కాగా.. రామబ్రహ్మం సుంకర నిర్మించిన భోళా శంకర్ ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించగా.. ఈ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతమందించారు. వెకేషన్ నుంచి తిరిగొచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు మెగాస్టార్ ట్వీట్లో పేర్కొన్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందని చిరంజీవి వెల్లడించారు. (ఇది చదవండి: మీ క్యాలెండర్లో ఇది మార్క్ చేసుకోండి: చిరంజీవి) Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ — Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023 -
ఇంట్లోనే పది రోజులు ఒంటరిగా 16 నెలల చిన్నారి..పాపం! చివరికి..
కర్కశమో లేక కసాయితనమో గానీ కొందరూ తల్లుల చేసే కృత్యాలు అత్యంత ఘోరంగా ఉంటాయి. ముఖ్యంగా కొందరూ తల్లల ప్రవర్తన అర్థంకాని రీతిలో ఉంటుంది. అది ఒక మానసిక రుగ్మత మరైదైన గానీ..వారి నైజానికి అభం శుభం తెలియని చిన్నారుల బలవుతున్నారు. అచ్చం అలానే యూఎస్లోని ఓ తల్లి క్షమించరాని ఘాతుకానికి పాల్పడింది. యూఎస్లోని 31 ఏళ్ల క్రిస్టెల్ కాండెలారియో 16 నెలల పసికందుని ఇంట్లోనే పది రోజులుగా 16 నెలల చిన్నారి జైలిన్ని ఒంటరిగా వదిలేసింది. అది కూడా సెలవులపై బయటకు వెళ్లడం కోసం.. ఆ చిన్నారి బాగోగులను గాలికి వదిలేసి.. డెట్రాయిట్లో గడిపొచ్చింది. చివరికి ఆ మహా తల్లి హాయిగా తిరిగి వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఆ చిన్నారి అపస్మారక స్థితిలో పడి ఉంది. డీ హైడ్రెషన్కి గురయ్యి ఉంది. ఆ తర్వాత తాపీగా సాయం కోసం హెల్ప్లైన్కి కాల్ చేసింది. దీంతో ఘటనస్థలికి చేరుకున్న పోలీసులు ఆ చిన్నారిని నిశితంగా గమనించారు. ఆ చిన్నారి ఒంటిపై ఒక్క గాయం కూడా లేదని గుర్తించారు. ఐతే ఆ చిన్నారి ఉన్న పరుపు మూత్రం, మలంతో కలుషితమై ఉన్నట్లు గమనించారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో కాండెలారియో ఇలా చిన్నారిని ఒంటరిగా వదిలేయడం మొదటిసారి కాదని తేలింది. కాండెలారియో ఇంటి చుట్టుపక్కల వాళ్లు ఆమె ఇలా చాలాసార్లు చేసిందని, అలాగే ఇలా చేయొద్దని చెప్పామని వారు చెబుతున్నారు. చిన్నారి జైలిన్ చనిపోవడానికి తల్లి నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. (చదవండి: ఎవ్వరూ మాట్లాడని కేరళ కథ! యావత్ సమాజం సేవ చేసేలా..!) -
చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది
చండీఘర్కు చెందిన మోహిత్ అహ్లువాలియా, జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది. నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్గా, జగజ్యోత్ కౌర్ హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసేవారు. ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్లు, క్విల్ట్లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం. బాలి పర్యటనతో మలుపు ‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్ ‘షి ద పీపుల్’ అనే ఆన్లైన్ మ్యాగజైన్తో పేర్కొన్నారు. బ్లాక్ ప్రింటింగ్తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్ను విడిచిపెట్టారు. 2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్లు వస్తున్నాయి. యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు. View this post on Instagram A post shared by Raamaé - Home Baby Lifestyle (@raamae_life) -
Anasuya Bharadwaj : బీచ్లో వైట్ కలర్ బికినీలో రచ్చ లేపుతున్న అనసూయ (ఫొటోలు)
-
వేకేషన్ నుంచి తిరిగొచ్చిన ఐకాన్ స్టార్.. ఫోటోలు వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్ అల్లు అర్జున్ - స్నేహారెడ్డి జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంట ఎక్కడికెళ్లినా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో టచ్లో ఉంటారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే చాలు విదేశాల్లో వాలిపోతుంటారు. ఇటీవలే తన ఫ్యామిలీతో కలిసి యూరప్ ట్రిప్ వెళ్లిన బన్నీ తాజాగా ఇండియాకు తిరిగొచ్చారు. తన భార్య స్నేహా రెడ్డితో కలిసి ముంబయి విమానాశ్రయంలో కనిపించారు. (ఇది చదవండి: నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?) టాలీవుడ్ జంట ఎయిర్పోర్ట్లో స్పెషల్ లుక్లో కనిపించారు. వీరిద్దరిని చూసిన నెటిజన్స్ స్టైలిష్ కపుల్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న పుష్ప- 2: ది రూల్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తోంది. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంలో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే పుష్ప-2 షూటింగ్లో బన్నీ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) ICON star @alluarjun and #AlluSnehaReddy at Mumbai airport Bunny boy looks 😎😍#Pushpa2TheRule pic.twitter.com/YoPTySfKyx — Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) June 7, 2023 #TFNExclusive: AA slays in Black🖤 Icon Star @alluarjun along with his wife #AlluSnehaReddy get papped at Mumbai airport!!😎#AlluArjun #Pushpa2TheRule #TeluguFilmNagar pic.twitter.com/rkVKbbpj4A — Telugu FilmNagar (@telugufilmnagar) June 7, 2023 -
దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడు షూటింగ్లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గతవారం దుబాయ్ వెళ్లారు. ఎయిర్పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. (ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్!) అయితే ఫ్యామిలీతో దుబాయ్ వేకేషన్ వెళ్లిన తారక్ శనివారం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఎయిర్పోర్ట్లో తన కుమారులతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్ తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచాపరం. ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేస్తారని తెలుస్తోంది. (ఇది చదవండి: మరోసారి జంటగా లవ్ బర్డ్స్.. డేటింగ్పై మొదలైన చర్చ!) -
Rakul Preet Singh : మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ రచ్చ (ఫోటోలు)
-
ఫ్యామిలీతో ఎన్టీఆర్ వెకేషన్ ట్రిప్ వీడియో వైరల్
-
ఫ్యామిలీతో వెకేషన్కు వెళ్లిన ఎన్టీఆర్.. ఫోటోలు, వీడియో వైరల్
ఓవైపు సినిమాలు చేస్తూనే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో షూటింగ్కు ముందే భార్య లక్ష్మీ ప్రణతి, కొడుకులు ఆభయ్, భార్గవ్ రామ్లతో కలసి వెకేషన్కు వెళ్లారు. ఈ మేరకు శంషాబాద్ ఎయిర్పోర్టులో వాళ్లు దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా తారక్ చిన్న కోడుకు భార్గవ్ రామ్ భలే క్యూట్గా ఉన్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ వెకేషన్ ట్రిప్ చాలా చిన్నదని, మళ్లీ వారం రోజుల తర్వాత ఎన్టీఆర్ హైదరబాద్కు చేరుకుంటారని, ఆ వెంటనే కొరటాల శివ డైరెక్షన్లో దేవర షూటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. NTR with his family off to Vacation Bhargav Ram 😍😍 PC @ArtistryBuzz@tarak9999 #Devara #ManOfMassesNTR pic.twitter.com/iSJiOBK36g — NTR THE LEGEND (@NTRTHELEGEND) May 28, 2023 -
బాలి ట్రిప్లో కూతురితో హరితేజ సందడి (ఫోటోలు)
-
భర్తతో వెకేషన్లో దిల్ రాజు ముద్దుల తనయ (ఫొటోలు)
-
'ఏజెంట్ ఫ్లాప్'..డిప్రెషన్లోకి అఖిల్? ఒంటరిగా దుబాయ్కి..
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్తో డిజాస్టర్ అనిపించుకుంది. అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్ దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్తో అఖిల్ కాస్త డిప్రెషన్కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్గా దుబాయ్కు వెకేషన్కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం -
పనిమనుషులకు హెలికాప్టర్లో ఐలాండ్ ట్రిప్, వైరల్వీడియో
న్యూఢిల్లీ: ఇంట్లో పనిచేసే సహాయకులకు ఏ పండగ్గో,పబ్బానికో కొత్త బట్టలు, లేదంటే ఎంతో కొంత నగదు బోనస్లు ఇవ్వడం సహజం. ఎంత పెద్ద గొప్ప వ్యాపారవేత్తలయినా కాస్త అటూ ఇటూగా దాదాపు ఇదే చేస్తారు. కానీ మలేషియాకు చెందిన మహిళా వ్యాపారవేత్త మాత్రం అద్భుతమైన బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచింది. వెబ్సైట్ మదర్షిప్ ప్రకారం, ఫరావెన్ అనే మహిళ తన ముగ్గురు ఇంటి పనివాళ్లకు భారీ బహుమతి ఇవ్వడం ఇపుడు హాట్ టాపిక్. తన ముగ్గురు మహిళా గృహ సహాయకులకు సుమారు రూ. 1.8 లక్షల గిఫ్ట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కవర్లు ఇస్తూ టిక్టాక్ వీడియోను ఫరా షేర్ చేసింది. ముస్లింలకు అతిపెద్ద సెలవుదినాలలో ఒకటైన హరి రాయ (దీనిని హరి రాయ ఐడిల్ఫిత్రి అని కూడా పిలుస్తారు) కోసం ద్వీపానికి వెళ్లి ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేసింది. (ఇది కూడా చదవండి: బంపర్ ఆఫర్! ఏడాది వేతనంతో కూడిన సెలవు! ఎక్కడ?) డిపింగ్ పూల్, బాత్టబ్, లాంజ్ ఏరియాతో కూడిన విలాసవంతమైన ప్రైవేట్ సూట్లో ఎంజాయ్ చేసేలా అవకాశం కల్పించింది. ఇందుకోసం వారికి హెలికాప్టర్ ఏర్పాటు చేయడం విశేషం. ఈ వీడియోలో హెలికాప్టర్లో సదరు ద్వీపానికి ప్రయాణం అవ్వడాన్ని, అలాగే యజమాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతూ, ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడొచ్చు. Jadi bibik pun dapat duit raya 5 angka, siap dapat pakej healing 😭 pic.twitter.com/94Sz6Gzj6V — 🇲🇾 (@localrkyt) April 13, 2023 టిక్టాక్లో మిలియన్ల వ్యూస్తో ఈ వీడియో వైరల్గా మారింది. దీంతో ఇతర సోషల్మీడియాల్లోనూ చక్కర్లు కొడుతోంది. ఆమె దాతృత్వాన్ని కొంతమంది నెటిజన్లు ప్రశంసించారు. మరి కొందరు ఇది వాళ్లకి సంతోషాన్నిస్తుందా అని, ఇది ఫేక్ అని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే ఇంట్లో పనిచేసే మహిళల పట్ల ఓనర్లు ఔదార్యాన్ని చూపించడం ఇదే మొదటిసారి గతేడాది దీపావళి రోజున చెన్నై వ్యాపారి తన సిబ్బందికి రూ.1.2 కోట్లకు పైగా విలువైన కార్లు, బైక్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. (క్రెడిట్కార్డు వాడుతున్నారా? ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా..గుదిబండే!) -
వేకేషన్లో ఉపాసన- చెర్రీ దంపతులు.. పోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో ఒకరు. వీరిద్దరు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే దుబాయ్లో బేబీ షవర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో స్నేహితులు, సన్నిహితులు కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం మాల్దీవుస్లో ఉన్న ఉపాసన- రామ్ చరణ్ వేకేషన్ల ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫోటోలు పంచుకుంటున్నారు. తాజాగా సముద్రంలో బోట్పై విహరిస్తున్న ఫోటోను రామ్చరణ్ ట్వీటర్లో షేర్ చేశారు. ప్రస్తుతం అవీ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. 💙 pic.twitter.com/vKsd0Stt6T — Ram Charan (@AlwaysRamCharan) April 11, 2023 -
మాల్దీవులకు వెకేషన్కు వెళ్లిన రామ్చరణ్,ఉపాసన
హీరో రామ్చరణ్ విహారయాత్ర కొనసాగుతూనే ఉంది. తన భార్య ఉపాసనతో కలిసి రామ్చరణ్ ఇటీవల దుబాయ్ వెళ్లారు. బంధుమిత్రులు, సన్నిహితుల సమక్షంలో అక్కడ ఉపాసన బేబీ షవర్ సెలబ్రేషన్స్ ముగించుకుని ఇటీవల హైదరాబాద్ వచ్చారు. తాజాగా రామ్చరణ్, ఉపాసన కలిసి శనివారం మాల్దీవులకు పయనమయ్యారు. ఈ షార్ట్ వెకేషన్ను ముగించుకుని హైదరాబాద్కు తిరిగొచ్చిన తర్వాత ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్లో పాల్గొంటారు చరణ్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా, అంజలి, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, నవీన్చంద్ర కీ రోల్స్ చేస్తున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలపై త్వరలో ఓ స్పష్టత రానుంది. Mega power star Ram Charan along with his wife Upasana get clicked at the airport as they head for a getaway ✈️❤️@alwaysramcharan#globalstarramcharan#ramuapsana pic.twitter.com/giqUS2narK — Dr. Ramachandran Srinivasan (@indiarama) April 9, 2023 -
ఫ్యామిలీ టైమ్.. విదేశాల్లో వెకేషన్కు మహేశ్ బాబు
ప్రతి ఏడాది వేసవిలో కుటుంబంతో కలిసి వెకేషన్ కోసం విదేశాలకు వెళ్తుంటారు హీరో మహేశ్ బాబు. ఈ ఏడాది కూడా వెళ్లనున్నారాయన. ఈ నెల మొదటి వారంలోనే మహేశ్ బాబు వెకేషన్ మోడ్ ఆన్ కానుంది. ఇప్పటికే ఆయన సతీమణి నమ్రత, పిల్లలు విదేశాల్లోనే ఉన్నారని, అతి త్వరలో మహేశ్ కూడా ఫ్యామిలీతో జాయిన్ అవుతారని సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను హీరోగా నటిస్తున్న సినిమాషూటింగ్తో బిజీగా ఉన్నారు మహేశ్ బాబు. మరో మూడు, నాలుగు రోజులు ఈ షూట్లో పాల్గొన్న తర్వాత ఫారిన్ ఫ్లైట్ ఎక్కనున్నారాయన. ఈ నెలాఖరున హైదరాబాద్కు తిరిగొచ్చి మళ్లీ షూటింగ్లో జాయిన్ అవుతారు. ఈ మూవీలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తున్నారు. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా 2024, జనవరి 13న విడుదల కానుంది. -
చిరు కూతుళ్లు శ్రీజ, సుష్మితలతో అల్లు అర్జున్ వెకేషన్.. ఇది సరిపోదా?
అల్లు-మెగా ఫ్యామిలీ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఇప్పటికే చిరంజీవి, అల్లు అరవింద్ స్పందించినా రూమర్స్ మాత్రం ఆగడం లేదు. రీసెంట్గా రామ్చరణ్ బర్త్డే పార్టీలో కూడా అల్లు అర్జున్ కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. 38వ వసంతంలోకి అడుగుపెట్టిన రామ్చరణ్ చిరంజీవి నివాసంలో గ్రాండ్ పార్టీ ఇచ్చారు. టాలీవుడ్ ప్రముఖులంతా పార్టీలో సందడి చేసినా అల్లు అర్జున్ మాత్రం రాకపోడంతో నిజంగానే వీరిద్దరి మధ్య స్టార్ వార్ నడుస్తోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ రూమర్స్కి అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి చెక్ పెట్టింది. అల్లుఅర్జున్, శ్రీజ, సుష్మితలతో పాటు మరికొంత మంది కజిన్స్తో వెకేషన్కు వెళ్లిన వీడియోను స్నేహ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీనికి లవ్ ఫ్యామిలీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఒకవేళ నిజంగానే బన్నీ-చరణ్లకు మధ్య విబేధాలు ఉంటే శ్రీజ, సుష్మితలు బన్నీతో కలిసి వెకేషన్కు వెళ్లరు కదా, అయినా సోషల్ మీడియాలో విష్ చేయనంత మాత్రానా కథలు అల్లడమేనా? అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sreeja (@sreejakonidela) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
వేకేషన్లో చెర్రీ దంపతులు.. సోషల్ మీడియాలో వైరల్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం 'గేమ్ ఛేంజర్'. ఈ చిత్రంలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఇటీవలే చరణ్ బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ ప్రముఖులు, ఆర్ఆర్ఆర్ చిత్రబృందం పాల్గొని సందడి చేశారు. బర్త్ డే ఫంక్షన్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసన తొలిసారిగా బేబీ బంప్లో కనిపించింది. త్వరలోనే చెర్రీ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడు షూటింగ్లతో బిజీగా ఉండే రామ్ చరణ్ తాజాగా తన భార్య ఉపాసనతో కలిసి వేకేషన్కు వెళ్లారు. తన బర్త్ డే వేడుకల అనంతరం దుబాయ్లో ప్రత్యక్షమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఉపాసన తన ఇన్స్టా స్టోరీస్లో పోస్ట్ చేసింది. ప్రైవేట్ జెట్లో దుబాయ్ వెళ్తున్న ఓ వీడియోను ఆమె పంచుకుంది. విమానంలో రామ్ చరణ్ తన పెంపుడు కుక్కను కూర్చొబెట్టుకుని ఉన్న ఫోటో తెగ వైరలవుతోంది. -
ఎంజాయ్ చేద్దాం అనుకుంటే హడలిపోయేలా చేసింది..పాపం ఆ జంట..
కొలరాడోకి వెకేషన్కి వచ్చిన జంట అక్కడ ఒక రిసార్ట్ వెలుపల హాట్ టబ్లో సేదతీరుతున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఓ మౌంటైన్ లయన్ వారిపై దాడి చేసింది. ఈ అనూహ్య ఘటనకు ఆ జంట ఒక్కసారిగా షాక్కి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకుని ఆ జంతువుపై ఫ్లాష్ లైట్ వేసి, వేడినీళ్లు జల్లి కేకలు వేయడం ప్రారంభించారు. దీంతో అది అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏదో విధలా ఆ జంట తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. ఐతే ఈ ఘటనలో ఆమె భర్తకి మాత్రం కొద్దిపాటి గాయాలయ్యాయి. వాస్తవానికి ఆరోజు మౌంటైన్ లయన్ ఆమె భర్త తల, చెవిపై దాడి చేస్తుండగా..గమనించిన అతడి భార్య వెంటనే దాన్ని తరిమి కొట్టే ప్రయత్నం చేయడంతో వారిద్దరూ బయటపడగలిగారు. ఆ తర్వాత ఆ జంట చుట్టుపక్కల వాళ్లని, అధికారులను అప్రమత్తం చేశారు. ఆ గాయాలను చూసిన అధికారులు సైతం మౌంటైన్ లయన్ పంజా దాడిలానే ఉందని నిర్థారించారు. ఆ జంట ఆ సమయంలో సరైన విధంగానే స్పందించారని అన్నారు. ఐతే సాధారణంగా మౌంటైన్ లయన్లు సాధారణ వెలుగులో మనిషి తలను గుర్తుపట్టలేవని, అది కూడా హాట్ టబ్లో ఉండగా అస్సలు దాడి చేయలేవని చెబుతున్నారు వైల్డ్లైఫ్ మేనేజర్ సీన్ షెపర్డ్. ఈ మేరకు తాము ఆ సింహం గురించి హెచ్చరికలు జారీ చేయడమే గాక దాన్ని ఎప్పటికప్పుడూ ట్రాక్ చేస్తుంటామని ఆ జంటకి భరోసా ఇచ్చారు. కాగా కొలరాడో ఇలాంటి మౌంటైన్ లయన్ దాడులు దాదాపు 24 జరిగాయని అన్నారు. (చదవండి: కూలీ చేతికి రూ. 1.4 లక్షల ఫోన్..ఆ తర్వాత ఏం జరిగిందంటే..) -
రాజస్థాన్లో బన్నీ టూర్.. వైరలవుతున్న వీడియో
ఎప్పుడు షూటింగ్లతో బిజీగా ఉండే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్తా విరామం ఇచ్చారు. ఆయన ప్రస్తుతం వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. రాజస్థాన్లో ఫ్యామిలీతో కలిసి పలు చారిత్రక ప్రదేశాలను సందర్శించారు. ఈ వ్యాకేషన్కు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు స్నేహారెడ్డి తన ఇన్స్టాలో షేర్ చేశారు. అలాగే ఓ నేషనల్ పార్క్లో అల్లు అర్జున్ పులిని ఫోటో తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కాగా.. పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంతో మేకర్స్ సీక్వెల్ రూపొందిస్తున్నారు. ఇటీవలే వైజాగ్లో షూటింగ్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు బన్నీ. సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ గ్యాప్ దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తున్నారు. రణథంబోర్ నేషనల్ పార్కులో దూరంగా ఉన్న పులిని తన పిల్లలకు చూపిస్తూ కనిపించాడు బన్నీ. అయితే పుష్ప-2 షూటింగ్లో మళ్లీ త్వరలోనే మళ్లీ బన్నీ జాయిన్ అవ్వాల్సి ఉంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. Allu Arjun Did Tiger Safari At Ranthambhore On Friday Morning 🔥😍😍@alluarjun #AlluArjun #PushpaTheRule pic.twitter.com/aHOc3wRF0Y — KA̶A̶rthikᴾᵘˢʰᵖᵃᵀʰᵉᴿᵘˡᵉ 🪓 (@KarthikAADHF__) February 28, 2023 View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
విజయ్ దేవరకొండ తల్లిని ఏడిపించేసిన రౌడీ ఫ్యాన్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి చిత్రంతో స్టార్స్టేటస్ అందుకున్న విజయ్ గత ఐదేళ్ల నుంచి ‘దేవరశాంటా’(Deverasanta) పేరుతో ఫ్యాన్స్కు సర్ప్రైజ్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఇంకాస్త డిఫరెంట్గా ప్లాన్ చేసిన విజయ్ తన అభిమానుల్లో 100మందిని మనాలికి హాలీడే ట్రిప్కు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ ఓ స్పెషల్ వీడియోను షేర్చేసుకున్నాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్కి వెళ్లిన సంగతులని గుర్తుచేసుకుంటూ.. 'నాకు 21 ఏళ్లున్నప్పుడు అనుకుంటా. మొదటిసారి నా ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి హంపి ట్రిప్కు వెళ్లాను. అప్పుడు నా దగ్గర అంత డబ్బులు లేకపోవడంతో నా ట్రిప్కు సరిపడా డబ్బులన్నీ నా స్నేహితుడే భరించాడు. నా ఫస్ట్ హాలీడే వెకేషన్ అదే. నాలాగే అలాంటి సంతోసాన్ని మీ అందరికి కూడా పంచాలనుకున్నా' అంటూ విజయ్ అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఈ దేవర శాంటాలో భాగంగా మనాలి ట్రిప్కు వెళ్లిన అభిమానులు తమ అనుభవాలను షేర్ చేసుకుంటూ విజయ్కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా ఈ ట్రిప్కు చివర్లో తన తల్లిదండ్రులతో వెళ్లి విజయ్ ఫ్యాన్స్కు సర్ప్రైజ్ చేయడం విశేషం. -
జమ్మూ కాశ్మీర్ లో రాహుల్ గాంధీ వేకేషన్
-
Hyderabad: భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
సాక్షి, హైదరాబాద్: భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లి సముద్రంలో మునిగి నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగోలు డివిజన్ బండ్లగూడ అజయ్నగర్లో నివాసం ఉండే రాముని రవీందర్ చిన్న కుమారుడు వంశీకృష్ణ (27) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరో పక్క గ్రూప్–1 ఫలితాల్లో మెయిన్స్ అర్హత సాధించాడు. గతేడాది జూన్ 23న కర్మన్ఘాట్కు చెందిన యువతితో వివాహమైంది. ఈ నెల 13న భార్య, ఇతర బంధువులతో కలిసి మలేసియా, ఇండోనేషియాలకు విహారయాత్రకు వెళ్లారు. మొదట మలేసియా యాత్ర పూర్తయిన తరువాత ఇండోనేషియాలోని బాలికి వెళ్లారు. ఈ నెల 22న ఆదివారం వంశీకృష్ణ బాలిలో సముద్ర గర్భంలోని అక్వేరియం సందర్శించేందుకు ఒంటరిగా వెళ్లాడు. అతను సముద్రంలోకి వెళ్లే సమయంలో అక్కడి నిర్వాహకులు సూచించిన ప్రకారం కాళ్లకు చెప్పులు, ఆక్సిజన్ సిలిండర్ ధరించి వెళ్లాడు. కానీ వంశీకృష్ణ సముద్రంలోకి దిగి గల్లంతయ్యాడు. భార్య అతని రాకకోసం చాలాసేపు ఎదురు చూసినా పైకి రాలేదు. దీంతో సముద్రంలో గల్లంతైనట్లు భావించి అక్కడి నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు సముద్రంలో గాలించి వంశీకృష్ణ మృతదేహాన్ని బయటకు తీశారు. అతను అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. నగరంలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో వారు మంగళవారం ఉదయం బాలికి బయలుదేరి వెళ్లారు. అక్కడ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని శుక్రవారం నగరానికి తీసుకొచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. సముద్రంలో గల్లంతైన వంశీకృష్ణ నీటిలోకి వెళ్లాక భయపడడంతో గుండెపోటుతో మృతి చెందాడని అక్కడ పోలీసులు ప్రాథమిక సమాచారం ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వంశీకృష్ణ (ఫైల్) -
ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు: ఏపీ హైకోర్టు
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ మేరకు దాఖలైన పిటిషన్పై సోమవారం విచారణ సందర్భంగా.. వాద ప్రతివాదనల తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యలను ఓసారి పరిశీలిస్తే.. ‘‘ఏపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెం.1 ప్రజల ప్రాథమిక హక్కులకు సంబంధించినది.పూర్తిగా ప్రజా ప్రయోజనమైందని న్యాయస్థానం భావిస్తోంది. అలాగే.. నడి రోడ్డుపై మీటింగ్ పెట్టడానికి ఎవరికీ హక్కు లేదు. నిజానికి ప్రభుత్వం ఏ బహిరంగ సభను అడ్డుకోలేదు. నడి రోడ్డు మీద కాదు, సౌకర్యమున్న చోట సభ పెట్టుకోమని చెప్పింది అని చీఫ్ జస్టిస్ గుర్తు చేశారు. రోడ్షోల మీద, ర్యాలీల మీద సర్కార్ ఎలాంటి నిషేధం విధించలేదని, నడి రోడ్డు మీద భారీగా జనాన్ని సమీకరించవద్దని మాత్రమే చెప్పిందని, ప్రజా రక్షణకు సంబంధించి ప్రభుత్వానికే పూర్తి అధికారమని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా హైకోర్టు సీజే గుర్తు చేశారు. అలాగే.. చంద్రబాబు సభల్లో 8 మంది చనిపోయిన దృష్ట్యా సర్కారు జీవో తెచ్చిందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ వేసిన వ్యక్తిలో దురుద్ధేశమేదో కనిపిస్తోందన్న హైకోర్టు సీజే.. ఎనిమిది మంది చనిపోయిన దుర్ఘటనపై విచారణ కమిటీ నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. జీవో నెంబర్ 1ని నిలిపివేయాలంటూ వేసిన పిటిషన్కు సహేతుక కారణాలు లేవని, అలా చేయడమంటే ప్రజల హక్కులు కాలరాసినట్టేనని హైకోర్టు పిటిషనర్కు స్పష్టం చేసింది. అది సుప్రీం రూల్స్కు విరుద్ధం జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో వాద, ప్రతివాదనలు వాడీవేడిగానే సాగాయి. ప్రభుత్వం తెచ్చిన జీవోను పిటిషన్ సవాల్ చేయగా.. ఆ వాదనలను అంతే సమర్థవంతంగా తోసిపుచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ వాదనలను పరిశీలిస్తే.. ‘‘పిటిషన్ను అత్యవసరంగా వెకేషన్ బెంచ్ ముందుకు తేవడాన్ని వ్యతిరేకించాం. చీఫ్ జస్టిస్ వేసిన రోస్టర్ను వెకేషన్ బెంచ్ మార్చింది. రోస్టర్ను జనవరి 5వ తేదీన రూపొందించి, 6వ తేదీన హడావిడిగా మార్చారు. రోస్టర్ను సరైన కారణం లేకుండా మార్చడం సుప్రీంకోర్టు నియామవళికి విరుద్ధం. రోస్టర్ మార్చిన విషయం ప్రతివాదులకు కనీసం చెప్పలేదు. ఈ పిటిషన్లో అత్యవసరం కూడా ఏమీ లేదు. సెలవులు పూర్తయ్యేవరకు వేచి ఉండకుండా ముందే విచారించారు. జనవరి 12న వెకేషన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను మార్చాలి అని వాదనలు వినిపించారు. -
కీర్తిసురేష్.. నీకు ఇలాంటివి అవసరమా? అస్సలు సూట్ కాదు
తమిళసినిమా: నటి కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే మహానటి చిత్రంలో సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న విషయం తెలిసిందే. తర్వాత తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో లైంగికదాడికి గురై ప్రతీకారేచ్ఛతో రగిలే యువతిగా నటించి ప్రశంసలు అందుకుంది. అదేవిధంగా కొన్ని హీరోయిన్ సెంట్రింగ్ కథా పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేదు. దీంతో కీర్తిసురేష్ ఇప్పుడు పూర్తిగా గ్లామర్పై దృష్టిపెట్టినట్టు కనిపిస్తోంది. కారణం అవకాశాలు తగ్గడమే అని ప్రచారం జరుగుతోంది. తెలుగులో చిరంజీవికి చెల్లెలుగా బోలాశంకర్ చిత్రంలో, నానికి జంటగా దసరా చిత్రంలో నటిస్తోంది. వీటిలో దసరా చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఇకపోతే తమిళ్లోను శివకార్తికేయన్కు జంటగా నటించిన మావీరన్ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన మామన్నన్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. దీంతో కీర్తిసురేష్ కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈమె తరచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు థాయిలాండ్లో విహారయాత్ర చేస్తోంది. అక్కడ బికినీ దుస్తుల్లో దిగిన ఫొటోలను తన ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కీర్తిసురేష్ హాట్నెస్ ఓవర్ లోడ్ కీర్తి వేరే లెవెల్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే కీర్తి ఇలాంటివి నీకు సరిపడవు. పాత కీర్తిలా ఉంటేనే బాగుంటావు అంటూ సూచనలు ఇస్తున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
హైదరాబాద్కు తిరిగొచ్చిన మహేశ్ బాబు ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్బాబు-నమ్రత శిరోద్కర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. న్యూ ఇయర్కు ముందు ఫ్యామిలీతో కలిసి వ్యాకేషన్కు వెళ్లారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్లో ఉన్నారు. వ్యాకేషన్ పూర్తి చేసుకున్న మహేశ్ బాబు ఫ్యామిలీ శనివారం హైదరాబాద్కు తిరిగొచ్చింది. మహేష్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు సితార, కుమారుడు గౌతమ్తో కలిసి లండన్ నుంచి నగరానికి తిరిగి వస్తుండగా ఎయిర్పోర్టులో కెమెరాలకు చిక్కారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. మహేష్ బాబు తన కుటుంబం, స్నేహితులతో కలిసి స్విట్జర్లాండ్లో వేడుకలు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా పంచుకున్నారు. మహేష్ ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్తో కలిసి ఓ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాలో నటి పూజా హెగ్డే నటిస్తోంది. ఆ తరువాత ఎస్ఎస్ రాజమౌళితో కలిసి మరో చిత్రంలో కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
ఎయిర్పోర్టులో తారక్, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆర్ఆర్ఆర్ మూవీతో అలరించిన తారక్ నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాను ప్రకటించి నెలలు గుడుస్తున్నా ఇప్పటికీ సెట్స్పై రాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా నాలుగేళ్లు కేటాయించిన తారక్ మూవీ విడుదల అనంతరం కాస్తా విరామం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి విదేశాలు చూట్టేస్తున్నాడు. ఇక రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ ఇటివలె ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడైన షూటింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే మళ్లీ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. తాజాగా భార్య లక్ష్మి ప్రణతి, తనయులు అభయ్ రాం, భార్గవ్ రాంలతో ఎయిర్పోర్ట్లో దర్శనం ఇచ్చాడు. దాదాపు నెల రోజుల వరకు ఈ వెకేషన్లో ఉండనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పట్లో తారక్-కొరటాల మూవీ సెట్స్పైకి వచ్చేలా లేదంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం భార్యతో కలిసి విదేశాలు చూట్టేసిన చరణ్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ వెంటనే శంకర్తో ఆర్సీ 15 మూవీ సెట్లో అడుగు పెట్టడమే కాకుండా తన మరో ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టాడు. కానీ తారక్ మాత్రం కొరటాల శివ, ప్రశాంత్ నీల్తో చిత్రాలు ప్రకటించిన ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా? అని నందమూరి అభిమానులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా -
హీరోయిన్ త్రిషకు ప్రమాదం.. కాలికి ఫ్రాక్చర్, ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్ త్రిష దాదాపు రెండు దశాబ్దాల పాటు ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. 40కి చేరువవుతున్నా ఇప్పటికీ స్టార్ హీరోయిన్గా సత్తాచాటుతుంది. ఇటీవలె లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో కుందవై పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ సినిమా హిట్తో త్రిషకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతో త్రిష ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవలె విదేశాలకు వెళ్లిన త్రిష గాయంతో తిరిగొచ్చింది. టూర్లో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ఆమె కాలు విరిగింది. ఈ క్రమంలో కాలికి పట్టి వేసి ఉన్న ఫోటోని త్రిష తన ఇన్స్టాగ్రామ్లో షేర్చేసింది. ప్రమాదం కారణంగా వెకేషన్ మధ్యలోనే రావాల్సి వచ్చిందని పేర్కొంది. ఇక త్రిష షేర్ చేసిన ఫోటో చూసి ఆమె త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కోరుకుంటున్నారు. గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. -
వెకేషన్ నుంచి తిరిగొచ్చిన రామ్చరణ్ దంపతులు.. వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ దంపతులు వెకేషన్ నుంచి తిరిగొచ్చారు. జపాన్లో ఆర్ఆర్ఆర్ ప్రీమియర్ కోసం అక్కడికి వెళ్లిన రామ్చరణ్, ఉపాసన ఆ తర్వాత ఆఫ్రికాకు పయనం అయ్యారు. గురువారం వెకేషన్ నుంచి రామ్చరణ్ దంపతులు హైదరాబాద్కు తిరిగొచ్చారు. వారి వెంట పెట్డాగ్ రైమ్ కూడా ఉంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రామ్చరణ్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రామ్చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందున్న సినిమా ఆగిపోయిన సంగతి తెలిసిందే. Mega Power Star @alwaysRamCharan is back in India from vacation with his wife @UpasanaKonidela💞🥰#RamCharan #UpasanaKonidela #Couplegoals #ShreyasMedia pic.twitter.com/C5LgB2SSI1 — Shreyas Media (@shreyasgroup) November 3, 2022 -
Visakhapatnam: నగర అందాలను చూస్తూ షిప్లో విహారం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : సముద్రాన్ని చూస్తే.. ఎవరైనా చిన్న పిల్లాడిలా మారిపోవాల్సిందే. ఎగసిపడే కెరటాల్లా మనసు కేరింతలు కొట్టించే.. సాగరతీరంలో పడవ ప్రయాణమంటే..? గుండె ఆనందంతో గంతులేస్తుంది. పిల్లగాలి అల్లరి చేస్తుంటే.. నీలి కెరటాలతో పోటీ పడుతూ అలలపై ఆహ్లాదకరమైన విహారయాత్ర.. విశాఖ వాసుల్ని రా.. రమ్మని ఆహ్వానిస్తోంది. నగర అందాల్ని చూస్తూ.. ఆనంద ‘సాగరం’లో మునిగిపోతూ.. ఫిషింగ్ హార్బర్ నుంచి రుషికొండ వరకూ షిప్లో సుమారు 2 గంటల పాటు విహరించే అవకాశం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. పర్యాటకులకు మర్చిపోలేని మధుర స్మృతులు మిగిల్చేలా సాగరంలో విహారానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎంతో కాలంగా లాంచీల ప్రయాణం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి ప్రేమికులు.. పర్యాటకులకు ఆనందంతో పాటు మానసిక ఉల్లాసం అందించేందుకు ఎంఎస్ఎస్ క్లాస్–6 షిప్ అందుబాటులోకి రానుంది. ఒకేసారి 54 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఈ షిప్ని గుజరాత నుంచి తీసుకురానున్నారు. నగర అందాల్ని చూస్తూ.. ఫిషింగ్ హార్బర్ నుంచి రుషికొండ వరకూ జల విహారం చేసేలా చర్యలు చేపడుతున్నారు. 2 గంటల పాటు సముద్రంలో.. ఇటీవల క్రూయిజ్ షిప్ కనువిందు చేసింది. కానీ.. ఇందులో సామాన్యులు మాత్రం ప్రయాణం చేయలేని పరిస్థితి. ఒక్కసారైనా సాగరతీరంలో షిప్లో విహరించాలన్న కోరిక.. ఈ ప్రయాణంతో తీరిపోనుంది. సుమారు 2 గంటల పాటు సముద్రంలో ప్రయాణించవచ్చు. షిప్లో డెక్ మీదకు వచ్చి నగరాన్ని చూసేందుకు కూడా వీలు కలి్పంచనున్నారు. సముద్ర తీరం నుంచి అరకిలోమీటరు నుంచి కిలోమీటరు దూరం వరకూ లోపల నౌకాయానానికి అవకాశం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డ్రై డాక్ అనుమతి షిప్ ప్రయాణానికి సంబంధించి.. పోర్టు చైర్మన్ కె.రామ్మోహన్రావుతో జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున, పర్యాటక శాఖ రీజనల్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఇటీవలే సంప్రదింపులు చేశారు. బోటు విహారానికి పోర్టులో అవకాశం కలి్పంచేందుకు అనుమతులివ్వాలన్న ప్రతిపాదనలు పంపించారు. దీనికి విశాఖపట్నం పోర్టు అథారిటీ అంగీకరిస్తూ.. డ్రైడాక్లో రాకపోకలకు అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే.. అతి త్వరలోనే అలలపై షికారు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ మల్లికార్జున చెప్పారు. విశాఖ పర్యాటకానికి ఎంఎస్ఎస్ క్లాస్–6 షిప్ మరో ఆభరణంగా మారనుందన్నారు. లగ్జరీ ప్రయాణంలా.. బోటు ఎక్కామా... రుషికొండ వరకూ ప్రయాణించామా అన్నట్లుగా కాకుండా.. పర్యాటకులకు మధురానుభూతుల్ని అందించేందుకు కూడా ప్రణాళికలు చేస్తున్నారు. షిప్లో ప్రయాణిస్తున్న సమయంలో స్నాక్స్, టీ అందించనున్నారు. కొన్ని గదులు కూడా షిప్లో ఉండటంతో అందులో ఏసీ, టీవీ కూడా ఏర్పాటు చేయనున్నారు. ఓపెన్ ఎయిర్ ప్రయాణంతో పాటు.. ఏసీ గదిలో ప్రయాణం.. అనేరీతిలో రెండు భాగాలుగా టికెట్ ధరని నిర్ణయించనున్నారు. బోట్ ఆపరేటింగ్ ద్వారా వచ్చే ఆదాయంలో 8 శాతం ఇవ్వాలని కోరనున్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వశాఖల నుంచి నిరంభ్యంతర పత్రాలన్నీ (ఎన్వోసీ) ప్రభుత్వమే జారీ చేసి ఇస్తుంది. అన్నీ సక్రమంగా పూర్తయితే.. ఈ ఏడాది చివర్లోనే విశాఖ వాసులతో పాటు.. వైజాగ్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకులు బోటులో షికారు చేసే అవకాశం కలుగుతుంది. -
మాల్దీవుల్లో రకుల్ ప్రీత్ సింగ్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల బాలీవుడ్లో ఆమె నటించిన చిత్రాలు ఛత్రివాలి, డాక్టర్ జి విడుదలయ్యాయి. ఈ సినిమాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. తాజాగా మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోలను సోషల్ మీడియాతో పంచుకుంది. ఆ ఫోటోలు కాస్తా వైరలవుతున్నాయి. బాలీవుడ్లో ఆమె నటించిన 'థ్యాంక్ గాడ్'మూవీ విడుదలైన తర్వాత మాల్దీవులకు చెక్కేసింది ఈ భామ. ఇన్స్టాలో తన చిత్రాలను షేర్ చేస్తూ.. 'కాస్ ఐలాండ్ లైఫ్ వైబ్' అంటూ రాసుకొచ్చింది. సూర్యాస్తమయం వేళ ఉన్న మరో చిత్రాన్ని పంచుకుంటూ.. 'సూర్యాస్తమయం, నక్షత్రాల రాత్రులు, సంతోషకరమైన అమ్మాయి' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీపావళికి విడుదలైన థ్యాంక్ గాడ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. బాలీవుడ్లో డాక్టర్ జి, కట్ పుట్లి, రన్వే 34, అటాక్ సినిమాల్లో నటించింది ఈ భామ. రకుల్ ప్రీత్ సింగ్ డైరీ, ఛత్రివాలి, ఇండియన్- 2లో సినిమాల్లో కూడా నటిస్తోంది. View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) -
వంట చేసిన రామ్ చరణ్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఇటీవల టాలీవుడ్ నటులు ఎక్కువగా వ్యాకేషన్లో కనిపిస్తున్నారు. షూటింగ్లతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోలు కాస్త ఫ్రీ టైం దొరికితే విదేశాలకు చెక్కెస్తున్నారు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాల్దీవులకు వెళ్లి రాగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం లండన్లో వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ సైతం చేరిపోయారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్లో ఉన్నారు. జపాన్లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న స్టార్ హీరో ఒక్కసారిగా టాంజానియాలో సందడి చేస్తూ కనిపించారు. (చదవండి: జపాన్లో రామ్ చరణ్ వీరాభిమాని.. ఆమె ప్రతిభకు చెర్రీ ఫిదా) ఆయన సతీమణి ఉపాసనతో కలిసి టాంజానియాలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది. టాంజానియాలోని ఓ జూలో జీప్ నడుపుతున్న వీడియో క్లిప్ను పోస్ట్ చేశాడు. అక్కడే స్థానికులతో కలిసి రామ్ చరణ్ వంట చేస్తూ సందడి చేశారు. అనంతరం తన కెమెరాతో అక్కడి వన్యప్రాణుల చిత్రాలను కూడా బంధించారు. ఈ మెగా హీరో 'పేరులేని ఆఫ్రికా' అంటూ పోస్ట్కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. నల్లటి టీ-షర్టు, నీలిరంగు జాకెట్ ధరించిన చెర్రీ కొత్త లుక్లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్.. సోషల్ మీడియాలో పిక్స్ వైరల్ (ఫొటోలు)
-
మాల్దీవుల్లో రష్మిక.. ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్
పుష్ప భామ రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండపై గాసిప్స్ గుప్పమంటున్నాయి. ఇటీవలే వ్యాకేషన్ కోసం మాల్దీవులకు చెక్కేయగా ఈ జంటపై సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా బ్లాక్ కలర్ సన్గ్లాసెస్తో మాల్దీవుల్లో ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు. దీంతో అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు. ఆ సన్ గ్లాసెస్ విజయ్ దేవరకొండవే అని.. ఇద్దరు కలిసి వ్యాకేషన్కు వెళ్లారని పోస్టులు పెడుతున్నారు. (చదవండి: ప్రేమించడానికి టైమ్ లేదు : రష్మిక మందన్నా) రష్మిక తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో స్విమ్మింగ్ పూల్ పక్కన కూర్చున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో ఓ పువ్వును పట్టుకుని తెల్లటి బుట్ట వైపు చూస్తూ కూర్చుంది. ఆమె తన పోస్ట్కు సన్ఫ్లవర్తో పాటు రెడ్హార్ట్ సింబల్ను జోడించింది. మాల్దీవుల్లోని ఓజెన్ రిజర్వ్ బోలిఫుషిగా ప్రాంతాన్ని జియో ట్యాగ్ చేసింది ఈ బుట్టబొమ్మ. కాగా.. రష్మిక, విజయ్ ఈ ఏడాది బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటించిన గుడ్బై చిత్రంలో రష్మిక నటించింది. విజయ్ అనన్య పాండేతో లైగర్తో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్లో విజయ్స, రష్మిక జోడి గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మాల్దీవులకు చెక్కేసిన విజయ్, రష్మిక? ఫోటోలు వైరల్
విజయ్ దేవరకొండ-రష్మిల డేటింగ్లో ఉన్నట్లు చాలకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఇప్పటికే ఈ జంట క్లారిటీ ఇచ్చినా డేటింగ్ రూమర్స్ ఆగడం లేదు. తాజాగా విజయ్, రష్మిక ఒకేసారి ఎయిర్పోర్టులో దర్శనం ఇవ్వడంతో మరోసారి ఈ జంట లవ్టాపిక్ హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా ఇద్దరూ ఒకే కలర్ డ్రెస్లో కనిపించడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎయిర్పోర్టుకు విజయ్ వచ్చిన కాసేపటికే రష్మిక కూడా నవ్వుతూ లోపలికి వెళ్లింది. దీంతో ఇద్దరూ కలిసే వెకేషన్ కోసం మాల్దీవులకు వెళ్లినట్లు టాక్ వినిపిస్తుంది. కాగా గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించిన విజయ్-రష్మికల కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులున్న సంగతి తెలిసిందే. #VijayDevarakonda and #RashmikaMandanna keep it cool and casual as they jet off to Maldives for vacation 🛫✈️#pair ❤️ #virosh 😘🔥 @TheDeverakonda @iamRashmika VC: @pinkvilla pic.twitter.com/dpYSk9mOYj — Revanth (@AtmakuriRevanth) October 7, 2022 -
భర్తతో నయన్ వెకేషన్.. ఫోటోలు వైరల్
కోలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ నయనతార- విగ్నేశ్ శివన్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ సినిమాలతో బిజీ అయిపోయారు. తాజాగా ఈ కొత్తజంట పని నుంచి బ్రేక్ తీసుకొని హనీమూన్కు చెక్కేశారు. స్పెయిన్లో బార్సిలోనాలో వెకేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను విగ్నేశ్ శివన్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇందులో నయన్ తాళిబొట్టుతో కనిపించడం విశేషం. మోడ్రన్ డ్రెస్సుల్లోనూ నయన్ తాళిబొట్టుతో మెస్మరైజ్ చేస్తుంది. నయన్ తాళిని ఫ్యాషన్ ట్రెండ్గా క్రియేట్ చేస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
భార్య లేకపోతేనేం.. పిల్లో ఉందిగా.. యువకుడి వెకేషన్ ఫోటోలు వైరల్
మనీలా: ఏదైనా పర్యటక ప్రదేశానికి వెళ్లినప్పుడు తోడుగా ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. ఇక జీవిత భాగస్వామే వెంట ఉంటే ఆ మజానే వేరు. కానీ చివరి నిమిషంలో వెకేషన్కు రానని భార్య చెబితే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఫిలిప్పీన్స్కు చెందిన ఓ యువకుడికి. అయితే భార్య లేకున్నా ఒంటరిగానే టూర్కు వెళ్లి అతడు చేసిన పని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది. సరికొత్తగా ఆలోచించాడని అందరూ అతడ్ని అభినందిస్తున్నారు. ఫిలిప్పీన్స్కు చెందిన ఈ యువకుడి పేరు రేమండ్ ఫార్చునడో. భార్య జోనీతో పలవన్ రాష్ట్రంలోని కొరన్కు వెకేషన్కు వెళ్లాలని చాలా రోజుల క్రితమే ప్లాన్ చేశాడు. అయితే చివరి నిమిషంలో ఆమె రాలేనని చెప్పింది. అయితే ఎలాగైనా టూర్కు వెళ్లాలని భావించిన అతడు భార్య లేని లోటు ఉండకూడదు అనుకున్నాడు. దీనికోసం వినూత్న ఆలోచన చేశాడు. భార్య ఫోటోను ముద్రించిన ఓ దిండును ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. టూర్కు దాన్ని వెంటతీసుకెళ్లాడు. ఇక తను తిరిగిన ప్రతి చోటుకు ఆ దిండును కూడా తీసుకెళ్లాడు రేమండ్. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో షేర్ చేశాడు. అవి కాస్తా వైరల్గా మారాయి. రేమండ్ ఆలోచన సూపర్ అని కొందరు కామెంట్లు పెట్టారు. అతని భార్య చాలా అదృష్టవంతురాలని మరికొందరు అన్నారు. రేమండ్ తన భార్య ఫోటో ఉన్న దిండును పట్టుకుని పర్యటక ప్రదేశాలను సందర్శించిన ఫొటోలను మీరూ చూసేయండి.. మరో ఆసక్తికర విషయమేంటంటే టూర్కు వెళ్లేముందు కొవిడ్ నింబంధనల ప్రకారం తన భార్య ఫోటో ఉన్న దిండుకు కూడా టెంపరేచర్ చెక్ చేయించాడు రేమండ్. ఇతని క్రియేటివ్ ఆలోచనలను చూసి నెటిజన్లు వావ్ అంటున్నారు. చదవండి: కరోనా, మంకీపాక్స్ రెండూ ఒకే రకమైన వైరస్లా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..? -
మాల్లో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఎక్కడంటే..
జూనియర్ ఎన్టీఆర్ తాజాగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టించింది. రికార్టు స్టాయిలో కలెక్షన్స్ రాబట్టి రూ. 1200 కోట్ల క్లబ్లోకి చేరింది. దీంతో ఆర్ఆర్ఆర్ బ్లాక్బస్టర్ హిట్ను ఎన్టీఆర్ ప్రస్తుతం ఆస్వాదిస్తున్నాడు. ఈమూవీ సెక్సెస్ జోష్లో ఉన్న తారక్ ప్రస్తుతం వెకేషన్ మూడ్లో ఉన్నాడు. తారక్ నెక్స్ట్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్తో రానున్న ఈ సినిమా జూలైలో సెట్స్పైకి రానుంది. ఇక ఈ విరామ సమయాన్ని ఎంజాయ్ చేసేందుకు తారక్ సింగపూర్ టూర్కు వెళ్లాడు. సింగపూర్లోని ప్రముఖ టీఎస్ఎంబీఎస్ మాల్లో ఎన్టీఆర్ అక్కడి ఫ్యాన్స్తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఈ ఫొటోల్లో ఎక్కడా తారక్ భార్య కానీ, పిల్లలు కానీ కనిపించలేదు. చూస్తుంటే తన స్నేహితులతో కలిసి ఎన్టీఆర్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా యాక్షన్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న కొరటాల సినిమాలో తారక్ ఈ సారి కొత్త లుక్లో అలరించబోతున్నాడని టాలీవుడ్ సర్కిల్లో టాక్. జనతా గ్యారేజీ లాంటి హిట్ సినిమా తర్వాత కొరటాల-తారక్ క్రేజీ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. -
మహేశ్ బాబు ఫారిన్ టూర్.. ఎక్కడికంటే ?
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా, మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. ‘గీత గోవిందం’ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 12న విడుదలై ఘన విజయం సాధించింది. రిలీజైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్తో దూసుకెళ్తోంది. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ను సాధించి రికార్డు సృష్టించింది. ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల షేర్ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా రికార్డుకెక్కింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ జోష్లో ఉన్న మహేశ్ బాబు ఫారిన్ టూర్ వెళ్లారు. ఫ్యామిలీతో కలిసి ఆయన యూరప్లో ల్యాండ్ అయ్యారు. దాదాపు రెండు వారాలు మహేశ్ అక్కడే ఉంటారని సమాచారం. ఫారిన్ ట్రిప్ ముగించుకుని ఇండియా వచ్చిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను హీరోగా నటించనున్న సినిమా షూటింగ్లో మహేశ్బాబు జాయిన్ అవుతారని తెలిసింది. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఏప్రిల్ నెలాఖరులో కూడా మహేశ్ బాబు ఫారిన్ టూర్కు వెళ్లొచ్చిన విషయం తెలిసిందే. చదవండి: సితార సోఫాలో నుంచి కిందపడిపోయింది: మహేశ్ బాబు సర్కారు వారి పాట విజయంపై సూపర్ స్టార్ కృష్ణ స్పందన var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
భార్యతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యశ్.. ఫోటోలు వైరల్
కన్నడ స్టార్ యశ్ ప్రస్తుతం కేజీఎఫ్-2 గ్రాండ్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కెరీర్నే మలుపుతిప్పిన సినిమా ఇది. ఈ సినిమా సీక్వెల్గా వచ్చిన కేజీఎఫ్-2 కూడా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది. అయితే మొన్నటివరకు షూటింగ్లో ఫుల్ బిజీగా గడిపిన యశ్ తన భార్యతో కలిసి వెకేషన్కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలను యశ్ భార్య రాధిక పండిత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు క్యూట్ కపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: పబ్ ఇన్సిడెంట్ తర్వాత తొలిసారి భర్తతో కనిపించిన నిహారిక View this post on Instagram A post shared by Radhika Pandit (@iamradhikapandit) -
దుబాయ్కు వెళ్లిన మహేశ్ బాబు.. అందుకోసమేనా ?
SSMB29: Mahesh Babu SS Rajamouli To Discuss Script In Dubai: మహేశ్బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ షూటింగ్ పూర్తయింది. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ హీరోగా స్టార్ట్ కావాల్సిన సినిమా షూటింగ్కు కాస్త సమయం ఉంది. దీంతో వేసవి వెకేషన్ కోసం ఆయన దుబాయ్ వెళ్లారని తెలిసింది. ఈ వెకేషన్ను పూర్తి చేసుకుని వచ్చాక ‘సర్కారువారి పాట’ ప్రమోషన్స్లో పాల్గొంటారు మహేశ్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబోలో సినిమా రావాలని ప్రేక్షకులు, అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. అయితే మహేశ్ బాబు లానే జక్కన్న కూడా దుబాయ్ వెళ్లినట్లు సమాచారం. తమ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో భాగంగానే మహేశ్, రాజమౌళి దుబాయ్ వెళ్లారనే టాక్ ఫిల్మ్నగర్లో వినిపిస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. చదవండి: ప్రభాస్, మహేశ్ బాబును దాటేసిన విజయ్ దేవరకొండ.. చదవండి: ఈవీ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ మహేశ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
రామ్ చరణ్-ఉపాసనల ఫన్నీ వీడియో .. నెట్టింట వైరల్
Ram Charan And Upasana Funny Video Goes Viral: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సాధారణంగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటాడు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదలకు రెడీగా ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా మరో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇటీవల రాజమండ్రిలో మొదలైన ఈ సినిమా చిత్రీకరణ షెడ్యూల్ పూర్తయింది. ఇక ఈ సినిమా షూటింగ్ లకు కాస్త విరామం ఇచ్చి ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లారు. రెండేళ్ల తర్వాత రామ్ చరణ్ తో వెకేషన్ కు వెళ్తున్నాను అంటూ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ వెకేషన్ లోని సరదా సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఫిన్ లాండ్ లో ఉపాసనతో రామ్ చరణ్ ఫన్నీగా గడిపిన సన్నివేశాలు చూడ ముచ్చటగా ఉన్నాయి. ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ను ఉపాసన ట్రాలీపై కూర్చొపెట్టి అటు ఇటూ తిప్పడం, అలాగే ఉపాసనను రామ్ చరణ్ తిప్పడం ఫన్నీగా ఉంది. అంతేకాకుండా ఈ జంట ఫిన్ లాండ్ లో చేసిన మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. ఉపాసన మంచు తినడం, ఒక కుక్క పక్కన మంచులో రామ్ చరణ్ పడుకోవడం సరదాగా ఉన్నాయి. ఇంకా ఈ వీడియోలో ఎలాంటి సన్నివేశాలు ఉన్నాయో చూడండి. #RamCharan and #Upasana's adorable video from their recent fun filled vacation to Finland@AlwaysRamCharan @upasanakonidela pic.twitter.com/BEU7Nu7iDY — BA Raju's Team (@baraju_SuperHit) March 14, 2022 -
స్విమ్సూట్లో కనిపించిన సమంత.. గోవాలో చిల్లింగ్
Samantha Goa Trip With Friends Ahead Of New Year, Pics Goes Viral: స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం రూటు మార్చిన సమంత సినిమాల విషయంలో మరింత దూకుడు పెంచింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు సైన్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. దీంతో ఏమాత్రం సమయం దొరికినా వెకేషన్కు పయనమవుతుంది. తాజాగా యశోద షూటింగ్ కంప్లీట్ చేసిన సామ్ గోవాకి చెక్కేసింది. తన బెస్ట్ఫ్రెండ్ శిల్పారెడ్డి సహా మరో ఫ్రెండ్తో కలిసి గోవా టూర్ని ఎంజాయ్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోలను #goayoubeauty అనే ట్యాగ్ లైన్తో తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. అయితే ఇటీవలె ఊ అంటావా మావ.. ఊ ఊ అంటావా అంటూ హాట్ పర్ఫార్మెన్స్తో హెడ్లైన్స్లో నిలిచిన సామ్ తాజాగా బికినీలో స్విమ్సూట్లో దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా ప్రస్తుతం సమంత రాజ్-డీకే దర్శకత్వంలో ఓ వెబ్సిరీస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
సముద్రంలో ఫ్లోటింగ్ ప్యాలెస్.. చుట్టూ విల్లాలు.. వెకేషన్ అదిరిపోద్దంతే!
చాలా మంది ఆహ్లాదకరమైన ప్రాంతాలకు వెకేషన్కు వెళ్తుంటారు. కొండ ప్రాంతాలు, సముద్రతీరాల్లాంటి మనసుకు ప్రశాంతతనిచ్చే ప్రాంతాలకైతే మరీ మరీ ఇష్టపడి వెళ్తారు. ఇలాంటి వాళ్లను మరింత ఆశ్చర్యపరిచేందుకు ఓ అద్భుతమైన ఫ్లోటింగ్ ప్యాలెస్ రెడీ కాబోతోంది. అది కూడా సముద్రంలో. అలా ఇలా కాదు.. నీటిపై తేలేలా 156 రూములతో నిర్మితమవుతోంది. ప్యాలెస్ ఒక్కటే కాదండోయ్.. దాని చుట్టూ విల్లాలు కూడా సిద్ధం కాబోతున్నాయి. అవి కూడా నీటిపై తేలేవే. అలా సముద్రాన్ని చుట్టొద్దామనుకుంటే ఆ విల్లాలే ప్యాలెస్ నుంచి విడిపోయి బోట్లలా మారిపోతాయి. అలా తిరిగొచ్చాక షిప్లు కదా ‘డాక్’ అయినట్టు ఆ పెద్ద ప్యాలెస్కు అతుక్కుపోతాయి. వినడానికి భలేగా ఉన్నా, వెంటనే చూడాలనేలా ఊరిసున్నా ఈ ప్యాలెస్ హోటల్ దుబాయ్లో జుమెయ్రా బీచ్కు దగ్గర్లో నిర్మితమవుతోంది. 2023లో అందుబాటులోకి రానుంది. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ బోట్లు, హెలికాప్టర్ల ద్వారా ప్యాలెస్ను చేరుకోవచ్చు. 16 బోట్లు పార్క్ చేసేలా పార్కింగ్ డెక్ ఏర్పాటు చేశారు. తేలాడే హెలిప్యాడ్ను కూడా నిర్మించబోతున్నారు. ప్రధాన ప్యాలెస్ 4 భాగాలుగా ఉంటుంది. వాటిని మధ్యలో ఉండే గ్లాస్ పిరమిడ్ కలుపుతుంది. ప్యాలెస్లో రెస్టారెంట్, బార్, స్పా, పూల్స్, బొటీక్స్ లాంటి సౌకర్యాలెన్నో ఉన్నాయి. విల్లాల్లో ఉండే వాళ్లు కూడా ఈ సౌకర్యాలు పొందవచ్చు. ప్యాలెస్ను, విల్లాలను నీటిపై తేలేలా ఎలా నిర్మిస్తున్నారో వెల్లడించలేదు. ప్యాలెస్ ఓపెనింగ్ తేదీ.. అందులోని రూమ్లు, సర్వీసుల ధరలు కూడా చెప్పలేదు. చదవండి: పాపికొండల సోయగాలు.. నదీ విహారం విల్లాల్లో ఏమేముంటాయ్? తేలియాడే ఆ పెద్ద ప్యాలెస్ చుట్టూ 12 విల్లాలను నిర్మించనున్నారు. ఒక్కోటి రెండంతస్తులు ఉంటుంది. 1, 4 బెడ్రూమ్ల గదులతో పాటు పైన టెర్రస్.. స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఇంతేకాదు.. విల్లాలను పర్యావరణ అనుకూలంగా నిర్మిస్తున్నారు. వాటిల్లో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్లో గాని, విల్లాలో గాని ఏ ప్రాపర్టీనైనా కొనుక్కోవచ్చు. చదవండి: విటమిన్ ‘డి’ లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త! – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మరోసారి వార్తల్లో నిలిచిన సమంత స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్
Samantha Foreign Tour With Preetham Jukalker And Sadhana Singh: సమంత ప్రస్తుతం వెకేషన్లపై ఎక్కువగా దృష్టి పెట్టింది. నాగచైతన్యతో విడిపోయిన అనంతరం సమంత బాగా కుంగిపోయిందని ఆమె సన్నిహితులు తెలిపారు. దీంతో బాధలోంచి బయటపడేందుకు క్లోజ్ఫ్రెండ్స్తో ఎక్కువగా సమయాన్ని గడుపుతుందని సమాచారం. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా సామ్ తిరుపతి, శ్రీకాశహస్తి దైవ దర్శనాలకు వెళ్లిన సామ్..ఇటీవలె స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి చార్ధామ్ యాత్రను సందర్శించిన సంగతి తెలిసిందే. చదవండి: నా కొడుకులకు అలాంటివి చేయొద్దని చెప్తా : నాగార్జున తాజాగా సమంత మరో వెకేషన్ ట్రిప్కు వెళ్లింది. తన పర్సనల్ డిజైనర్, స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్, మేకప్ ఆర్టిస్ట్ సాధనా సింగ్లతో కలిసి సామ్ దుబాయ్కు పయనమైంది. దీనికి సంబంధించిన ఫోటోను సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ.. ఫారిన్కు వెళ్తున్నాం అని పేర్కొంది. దీంతో ప్రీతమ్ పేరు మరోసారి నెట్టింట వైరల్గా మారింది. ఇది వరకే తనపై వస్తున్న రూమర్స్కు ప్రీతమ్ ఖండించిన సంగతి తెలిసిందే. సమంత తనకు అక్కలాంటిదని, ఈ విషయం నాగ చైతన్యకు కూడా తెలుసని పేర్కొన్నాడు. కాగా చైతూతో విడాకుల అనంతరం సమంత ఇటీవలె బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు ప్రకటించింది. వచ్చే నెలలో ఈ సినిమాలు సెట్స్పైకి వెళ్లనున్నాయి. చదవండి: సమంత పోస్టుకు కామెంట్ చేసిన వెంకటేశ్ కూతురు ఫారెన్ అమ్మాయితో రెండో పెళ్లి.. స్పందించిన మంచు మనోజ్ అందుకే పూరి జగన్నాథ్ భార్య అంటే ఇష్టం: ప్రభాస్ -
దుబాయ్లో ఎంజాయ్ చేస్తున్న బన్నీ
టాలీవుడ్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అల్లు అర్జున్ ఒకరు. ఆయన ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. మొదట ఒకే సినిమాగా చేద్దామనుకున్న, కథ లెంత్ దృష్ట్యా రెండు పార్టులుగా తీస్తున్నారు. అయితే మొదటి పార్టైన ‘పుష్ప: ది రైజ్’ ఈ ఏడాది చివరికి విడుదల చేసేలా మూవీ టీం ప్లాన్ చేస్తుంది. అందుకే షూటింగ్ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అయితే ప్రొఫెషనల్ లైఫ్లో ఎంత బిజీగా ఉన్న వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎంతో బాగా బ్యాలెన్స్ చేస్తుంటాడు బన్నీ. టైట్ షెడ్యూల్ ఉన్న ఈ తరుణంలోనూ షూటింగ్కి గ్యాప్ ఇచ్చి కుటుంబంతో కలిపి దుబాయ్లో వేకేషన్ని ఎంజాయ్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ పిక్లో స్టైలిష్ స్టార్ టోటల్ బ్లాక్ డ్రెస్లో ఉండగా, వెనుక చీకట్లో మెరుస్తున్న దుబాయ్ సిటీ ఆకట్టుకుంటోంది. అయితే ఆర్య, ఆర్య 2 హిట్ సినిమాల తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వస్తున్నా మూడో మూవీ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇంతకుముందు ‘అల వైకుంఠపురంలో’తో బన్నీ, ‘రంగస్థలం’తో సుకుమార్ మంచి హిట్లను సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. కాగా ఈ సినిమా అనంతరం స్టైలిష్ స్టార్ ‘ఐకాన్’ చేయనున్నాడు. Bunny Boy @ Dubai..😍#Pushpa #AlluArjun pic.twitter.com/xj33ZLeyOX — Arjun 🪓 (@ArjunVc_Online) September 24, 2021 -
పంజాబ్లో టీకా తీసుకోకుంటే లీవ్పై వెళ్లాల్సిందే
చండీగఢ్: కోవిడ్ టీకా ఒక్క డోసు కూడా తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపించాలని పంజాబ్ ప్రభుత్వం కఠిన నిర్ణ యం తీసుకుంది. వైద్య సంబంధ, ఇత రత్రా కారణాలున్న వారికి మినహా అందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈనెల 15వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుందని తెలిపింది. మహమ్మారి నుంచి ప్రజలను కాపాడటానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అమరీందర్ సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు టీకా తీసుకోకుండా తప్పించుకుంటు న్న వారిని, కనీసం ఒక్క డోసైనా తీసుకునే వరకు లీవ్పై పంపిస్తామని తెలిపారు. రాష్ట్రం లో కోవిడ్ వ్యాప్తిని నివారిం చేందుకు అమల్లో ఉన్న ఆంక్షలను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. అన్ని రకాల సభలు, సమా వేశాల్లో ప్రస్తుతం ఉన్న పరిమితికి సడలింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. -
షూటింగ్ గ్యాప్లో.. దాని గురించి కలలు కంటున్న రాశీ ఖన్నా
షాట్ గ్యాప్లో న్యాప్ (చిన్న కునుకు) తీస్తూ, విహారయాత్ర కోసం రాశీ ఖన్నా కల కంటున్నారు. ఈ మధ్యకాలంలో హాలిడే ట్రిప్ వెళ్లే వీలు దొరకలేదు ఈ బ్యూటీకి. ఎందుకంటే నాగచైతన్య ‘థ్యాంక్యూ’, గోపీచంద్ ‘పక్కా కమర్షియల్’ చిత్రాల కోసం హైదరాబాద్, కార్తీ ‘సర్దార్’, ధనుష్ ‘తిరుచిత్రంబలమ్’ల కోసం చెన్నై, షాహిద్ కపూర్ ‘సన్నీ’, అజయ్ దేవగన్ (రుద్ర) వెబ్ సిరీస్ల కోసం ముంబై.... ఇలా మూడు నగరాలను చుట్టేస్తున్నారామె. ప్రస్తుతం ‘తిరుచిత్రంబలమ్’ కోసం చెన్నైలో ఉన్నారు. ఈ షూట్లో షాట్ గ్యాప్లో హాయిగా కునుకు తీశారు. ‘‘షాట్ గ్యాప్లో కాస్త టైమ్ దొరకడంతో నిద్రపోతున్నాను. ఈ నిద్రలో నా వెకేషన్ (విహారయాత్ర) ఎలా ఉండాలో కల కంటున్నాను’’ అన్నారు రాశీ. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్న రాశీ ఓ వెకే షన్ను కోరుకోవడం కరెక్టే కదా! View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) చదవండి : ప్యాన్ ఇండియా సినిమాలకు మమ్మల్ని పిలవరు: :పృథ్వీ ‘కొండపొలం’ ఫస్ట్ సాంగ్.. ఆకట్టుకున్న వైష్ణవ్, రకుల్ లవ్ ట్రాక్ -
మహేశ్ బాబు బ్యాక్ టూ హైదరాబాద్
గోవాలో ‘సర్కారువారి పాట’ షెడ్యూల్ ముగిసింది. మహేశ్బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటీవల ఈ సినిమా షెడ్యూల్ గోవాలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ బుధవారంతో ముగిసింది. ఈ గోవా షెడ్యూల్లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్సెస్ను షూట్ చేశారు. ఓ యాక్షన్ సీక్వెన్స్తో మొదలైన గోవా షెడ్యూల్ మరో యాక్షన్ సీక్వెన్స్తో పూర్తయింది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ పతాకాలపై రూపొందుతున్న ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ డైరెక్టర్. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) చదవండి : ఎస్... అవన్నీ వదంతులే! ‘బంగార్రాజు’ మూవీ షూటింగ్ స్టార్ చేసిన అక్కినేని హీరోలు -
పార్ధూ ఇంకోసారి చూసి చెప్పు: నిహారిక వైరల్ పోస్ట్
నాగబాబు ముద్దుల కూతురు నిహారిక పెళ్లి తర్వాత మరింత యాక్టివ్గా కనిపిస్తోంది. భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి టూర్లు చుట్టోస్తూ.. మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తోంది. అత్తారింట్లో అడుగుపెట్టిన అనంతరం మెగా డాటర్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయింది. నిత్యం ట్రెండీ లుక్లోనే దర్శనమిస్తుంది. ఎక్కడికెళ్లినా తమ జంట దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తాజాగా చైతన్య- నిహారిక జంట వెకేషన్ ట్రిప్లో భాగంగా పాండిచ్చేరి అందాలను ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ హోటల్ రూమ్లో దిగిన ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫోటోకు పెట్టిన కామెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.అద్దంలో తనను తానే చూసుకుంటున్న ఈ ఫోటోపై 'పార్ధు ఇంకోసారి చూసి చెప్పు' అంటూ అతడు సినిమాలో త్రిష చెప్పిన డైలాగ్ను గుర్తుచేస్తూ కామెంట్గా పెట్టింది. అయితే ఇక్కడే ఓ షరతు పెట్టింది ఈ బ్యూటీ. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉందో గుర్తురాని వాళ్ళు దయచేసి కామెంట్ చేయొద్దు అని ఆమె పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. పెళ్లి తర్వాత నిహారిక గ్లామర్ డోస్ పెంచిదని కొందరు, అయినా ఏం బాలేదని మరికొందరు బదులిస్తున్నారు. కాగా ప్రస్తుతం నిహారిక పాండిచ్చేరిలో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) -
'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'
ముంబై : ఓ వైపు దేశమంతా కరోనాతో ప్రజలు అల్లాడుతుంటే బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రం తమ ఎంజాయ్మెంట్కే ప్రాధాన్యత ఇస్తున్నారు. సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్న సంగతి తెలిసిందే. హాలీడే ట్రిప్పుల పేరుతో ప్రేమపక్షులు మాల్దీవుల బీచుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలకు ఫోజులిస్తున్నారు. ఇటీవలె అలియా భట్, రణ్బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా విషయంపై బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ స్పందించారు. ఇప్పడు ప్రపంచమంతా కరోనా కోరల్లో చిక్కుకుంది. మన దేశంలో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. కనీసం తినడానికి తిండి కూడా లేకుండా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే వీళ్లు మాత్రం తమ జల్సాల కోసం డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతున్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంటే...వీరు మాత్రం వెకేషన్ ట్రిప్పులను ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి. వీళ్లు యాక్టింగ్ గురించి తప్పా ఇంకేమీ మాట్లాడలేరు అంటూ బాలీవుడ్ సెలబ్రిటీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, అందరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఒక తన వెకేషన్ గురించి మాట్లాడుతూ..తాను బుధానాలోని తన కుటుంబంతో సమయం గడుపుతున్నానని, ఇదే తనకు మాల్దీవులు అని చెప్పుకొచ్చారు. చదవండి : అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్ ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ -
అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్
దేశ వ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్నా సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్నారు. ప్రజలంతా ఇంటికే పరిమితం కావాలని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వాలు నెత్తీ నోరు ముత్తుకుంటున్నా కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలకు మాత్రం అది చెవికెక్కడం లేదు. ఇటీవలె బాలీవుడ్ ప్రేమ పక్షులు అలియా భట్, రణ్బీర్ కపూర్, దిషా పటాని-టైగర్ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే ట్రిప్పై నెటిజనులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే అంశంపై హీరోయిన్ శృతి హాసన్ సైతం స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'వారికి హాలిడే దొరికినందుకు సంతోషం, వారు దానికి అర్హులు కూడా. అయితే విహారయాత్రలకు ఇది సరైన సమయం కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ప్రస్తుతం ఎంతోమంది కష్టకాలంలో ఉన్నారు. ఇలాంటి పాండమిక్ సమయంలో వెకేషన్ ట్రిప్పులకు వెళ్లడం కరెక్ట్ కాదు' అని పేర్కొంది. శృతి సహాన్ పాటు రోహిణి అయ్యర్, కాలమిస్ట్ శోభా దే సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సెలబ్రిటీల విహారయాత్రలను తప్పుబడుతున్నారు. చదవండి: ‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’ గుండె పగిలింది: విషాదంలో పూజా హెగ్డే -
దాని ప్రాముఖ్యత గురించి పిల్లలకు నేర్పండి: అశ్విన్
చెన్నై: వరుస టెస్ట్ సిరీస్ల్లో (ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించిన భారత స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. కాస్త విరామం దొరకడంతో కుటుంబంతో కలిసి విహారయాత్రను ఎంజాయ్ చేస్తున్నాడు. మంగళవారం కేరళలోని వన్యప్రాణుల అభయారణ్యాన్ని భార్య ఇద్దరు కూతుళ్లతో కలిసి సందర్శించిన ఆయన.. తన కుమార్తెతో కలిసి దిగిన సెల్ఫీని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. View this post on Instagram A post shared by Ashwin (@rashwin99) View this post on Instagram A post shared by 𝒫𝓇𝒾𝓉𝒽𝒾 𝒜𝓈𝒽𝓌𝒾𝓃 (@prithinarayanan) ఈ పోస్ట్లో అతను ప్రకృతి అందం, దాని ప్రాముఖ్యత గురించి ప్రతి తల్లిదండ్రి పిల్లలకు నేర్పాలని కోరాడు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకివ్వగలిగే అత్యుత్తమ బహుమానం ఇదేనంటూ పేర్కొన్నాడు. మరోవైపు అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ కూడా తన ఇద్దరు కూతుళ్లతో కలిసి దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ.. 'మాస్క్ అప్, దట్స్ ఆల్' అంటూ క్యాప్షన్ జోడించింది. -
మాల్దీవ్స్లో అక్కినేని నాగార్జున,అమల
-
మాల్దీవ్స్లో ఎంజాయ్ చేస్తున్న కృష్ణంరాజు ఫ్యామిలీ
-
మాల్దీవుల్లో వాలిపోయిన 'మంచు' ఫ్యామిలీ
షూటింగులతో బిజీబిజీగా ఉండే సినీ సెలబ్రిటీలు ఏమాత్రం వీలు కుదిరినా సేదతీరడానికి విదేశాలకు వాలిపోతుంటారు. ఫ్యామిలీతోనో, ఫ్రెండ్స్తోనే సరదాగా వెకేషన్ ట్రిప్కు వెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో దక్షిణాదితో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఈ మధ్య ఎక్కువగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్నారు. అలా వెళ్లిన వారిలో రానా-మిహిక, నిహారిక-చైతన్య,కాజల్-కిచ్లు జంటలు కూడా ఉన్నాయి. దీంతో ప్రస్తుతం మాల్దీవులు సెలబ్రిటీలకు ఫేవరెట్ ప్లేస్గా మారినట్లు తెలుస్తోంది. తాజాగా మంచు ఫ్యామిలీ కూడా మాల్దీవుల్లో వాలిపోయారు. మంచు మోహన్బాబు, ఆయన భార్య నిర్మల సహా మంచు లక్ష్మీ తన కూతురు, భర్త ఆండీ శ్రీనివాసన్ అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. చదవండి : (ఇక్కడ ఒక్క రాత్రికి రూ. 58 లక్షలు) మాల్దీవులు భూతలస్వర్గంగా ఉందని.. ఆకాశం, బీచ్లతో ఇక్కడి ప్రకృతి సోయగాలు ఎంతో బాగున్నాయని మంచు లక్ష్మీ పేర్కొంది. దీనికి సంబంధించి పలు ఫోటోలను సోషల్మీడియాలో పంచుకుంది. ఇక డైలాగ్కింగ్ మోహన్బాబు తన సతీమణితో సముద్రపు ఒడ్డున దిగిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. యంగ్లుక్లో కనిపిస్తున్నారంటూ మోహన్బాబు దంపతులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తన్నారు. చదవండి : (మజా మాల్దీవ్స్ ) ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి Beaching until further notice! 😉 Enjoying the beautiful sunset with nana and amma! 🌅❤️❤️❤️ It's so good to be finally out of the house and relish some quality time with the fam at @LUXSouthAri!✨ We are in heaven 😍🌊🌴🐚👙🐬🐋 pic.twitter.com/WH2zmbNWr2 — Lakshmi Manchu (@LakshmiManchu) January 21, 2021 View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) -
మాల్దీవులు: మంచు ఫ్యామిలీ..
-
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కు చైసామ్.. ఫోటోలు వైరల్
2020 ఏడాది ముగుస్తుండటంతో న్యూ ఇయర్ వేడుకలకు అందరూ రెడీ అవుతున్నారు. కొత్త సంవత్సరానికి ఇంకా మూడు రోజులే మిగిలి ఉండటంతో వెకేషన్ ట్రిప్లకు వరుస కడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల దాకా హాలీడే ప్రదేశాలకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ క్యూట్ కపూల్ సమంత, చైతన్య న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు మంగళవారం గోవా బయల్దేరారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి గోవా బయల్దేరారు. ఈ నేపథ్యంలో చైతన్యతో కలిసి సమంత ఎయిర్పోర్టులోకి వెళుతుండగా కెమెరా కంటికి చిక్కారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చదవండి: ఒక్క చోట చేరిన అక్కినేని కుటుంబం! ఎయిర్పోర్టులో గ్రే, బ్లాక్ దుస్తుల్లో సమంత.. వైట్ టీ షర్టు, గ్రే కార్గో ప్యాంట్లో నాగచైతన్య కనిపించారు. ఇద్దరూ ముఖానికి మాస్కు ధరించి ఉన్నారు. ఇదిలా ఉండగా నవంబర్ చివరి వారంలో నాగ చైతన్య 34వ పుట్టినరోజును సమంత మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన విషయం తెలిసిందే. మాల్దీవుల వెకేషన్ అనంతరం వీరిద్దరూ ప్రస్తుతం గోవా వెళుతున్నారు. గోవాలోని ప్లష్ రిసార్ట్లో న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. కాగా చైసామ్కు ఇష్టమైన ప్రదేశాల్లో గోవా ఒకటి. 2017లో గోవాలోని ఓ రిసార్ట్లోనే వీరి వివాహం జరిగింది. 2017 అక్టోబర్ 6న హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ జంట ఏడడుగులు వేయగా.. అక్టోబర్ 7న గోవాలో క్రిస్టియన్ పద్దతిలో సామంతకు చైతన్య రింగ్ తొడిగాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రేమికులు ఇష్టపడే రొమాంటిక్ ప్రదేశాలు
-
రెండు రోజులు సెలవుల్లో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్) : జిల్లాకలెక్టర్ సి.హెచ్.విజయమోహన్ ఆది, సోమవారాల్లో సెలవులో వెళ్లనున్నారు. వ్యక్తిగత పనులపై విజయవాడకు వెళ్లనున్నట్లు సమాచారం. జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ ఇన్చార్జి కలెక్టర్గా వ్యవహరిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
సెలవుల్లో కలెక్టర్
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ వ్యక్తిగత పనులపై గురువారం నుంచి మూడు రోజులు సెలవుల్లో వెళ్లానున్నారు. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్లారు. మూడు రోజుల పాటు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఇన్చార్జ్ కలెక్టర్గా వ్యవహరిస్తారు.