-
Rashmi Gautam: విదేశాల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న రష్మి (ఫోటోలు)
-
Tanya Sharma: వియత్నాంలో హిందీ బుల్లితెర నటి సమ్మర్ వెకేషన్ (ఫోటోలు)
-
కిడ్స్ తో కలిసి సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న నమ్రత (ఫొటోలు)
-
హ్యాపీ హాలిడేస్
వీలైనప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి వెకేషన్కు వెళుతుంటారు మహేశ్బాబు. ఈ వేసవి వెకేషన్ కోసం కుటుంబంతో కలిసి మహేశ్బాబు ఫారిన్ వెళ్లారు. ‘హ్యాపీ హాలిడేస్.. ఫ్యామిలీ టైమ్’ అంటూ జర్నీ ఫొటోలను ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు మహేశ్ సతీమణి నమ్రత. ఈ వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత రాజమౌళితో చేయనున్న సినిమా షూటింగ్లో పాల్గొంటారట మహేశ్బాబు. షూటింగ్ గురించిన వివరాలను త్వరలోనే రాజమౌళి వెల్లడించనున్నట్లుగా తెలిసింది. -
Sania Mirza : దుబాయ్ వెకేషన్లో ఆహ్లాదంగా సానియా మీర్జా (ఫొటోలు)
-
దుబాయ్లో రెండు వారాలు ఇలా: సానియా మీర్జా ఫొటోలు వైరల్
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా కుటుంబంతో కలిసి సరదాగా సమయం గడుపుతున్నారు. ప్రతికూల భావనలు దరిచేరకుండా తన చుట్టూ పూర్తి సానుకూల వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. చిన్నారి కుమారుడు ఇజహాన్, తన చెల్లెలు ఆనం మీర్జాతో కలిసి దుబాయ్ పర్యటనలో సానియా ఆహ్లాదంగా గడిపారు. ఈ క్రమంలో తన టూర్కు సంబంధించిన ఫొటోలను.. ‘‘గత రెండు వారాల్లో నాకు ఇష్టమైన పనులతో ఇలా గడిచింది’’ అనే క్యాప్షన్తో పంచుకున్నారు. కాగా సానియా మీర్జా తన భర్త, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్కు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. షోయబ్ పాక్ నటి సనా జావెద్ను పెళ్లాడిన తర్వాత ఈ విషయం బయటకు వచ్చింది. సనాను వివాహం చేసుకున్నానంటూ షోయబ్ మాలిక్ ఫొటోలు విడుదల చేసిన తర్వాత.. సానియా కుటుంబం స్పందిస్తూ.. విడాకుల విషయాన్ని తెలియజేసింది. ఈ నేపథ్యంలో షోయబ్ మాలిక్ వివాహేతర సంబంధాల కారణంగానే సానియా ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పాక్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఖులా ద్వారా తానే స్వయంగా అతడితో బంధం నుంచి విముక్తి పొందినట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో జీవితంలోని కఠిన దశను దాటే క్రమంలో సానియా మీర్జా తనకోసం తాను ఎక్కువ సమయం కేటాయించుకుంటున్నట్లు ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. దుబాయ్ పర్యటనలో భాగంగా సానియా మీర్జా పాక్ సింగర్ అతిఫ్ అస్లాం లైవ్ కన్సర్ట్కు హాజరయ్యారు. అస్లాం, అతడి భార్య సారాతో కలిసి లంచ్కు వెళ్లి క్వాలిటీ టైమ్ స్పెండ్ చేశారు. కాగా పాకిస్తాన్ ఆల్రౌండర్ షోయబ్ మాలిక్ను సానియా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరు దుబాయ్లో కాపురం ఉన్నారు. అయితే, ఆట నుంచి విరామం తీసుకున్న తర్వాత షోయబ్తో కలిసి ఎక్కువ సమయం గడిపే క్రమంలో.. అతడి గురించి నిజాలు తెలియడంతోనే.. ఆమె అతడి నుంచి విడిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఇక సానియాకు దుబాయ్లో టెన్నిస్ అకాడమీ ఉంది. ప్రస్తుతం అకాడమీ కార్యకలాపాలతో ఆమె బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) View this post on Instagram A post shared by Sania Mirza (@mirzasaniar) -
Niharika Konidela: నీటిలో గజరాజుతో మెగా డాటర్ ఆటలు (ఫోటోలు)
-
Vishnupriya Bhimeneni: పారిస్లో చిల్ అవుతోన్న విష్ణుప్రియ (ఫోటోలు)
-
Sudheer Babu Family Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో (ఫోటోలు)
-
Shraddha Das Kerala Trip Pics: కేరళ నేచర్ను ఎంజాయ్ చేస్తోన్న శ్రద్ధా దాస్
-
MS Dhoni: దుబాయ్ వెకేషన్లో ధోని.. ఫొటోలు తీసుకున్న హీరోయిన్లు
-
ఫారిన్కు మహేశ్ బాబు.. 'గుంటూరు కారం' ప్రమోషన్స్ షురూ
‘గుంటూరు కారం’ సినిమాకు గుమ్మడికాయ కొట్టే సమయం ఆసన్నమైంది. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, ప్రకాష్రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లోని ఓ స్టూడియోలో వేసిన సెట్లో జరుగుతోంది. మహేశ్ బాబుతో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా, ఓ మాస్ సాంగ్ను చిత్రీకరిస్తున్నారట యూనిట్. ఈ పాట పూర్తయితే షూటింగ్ దాదాపు పూర్తయినట్లేనని టాక్. చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు కూడా కంప్లీట్ చేసి, ఈ నెలాఖరుకు ‘గుంటూరు కారం’ షూటింగ్ పూర్తి అయ్యేలా చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందని తెలిసింది. అలాగే ‘గుంటూరు కారం’ సినిమా షూటింగ్ పూర్తికాగానే ఫ్యామిలీతో కలిసి ఫారిన్ వెకేషన్కు వెళతారట మహేశ్బాబు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అక్కడే చేసుకుంటారని ఫిల్మ్నగర్ సమాచారం. ఫారిన్ నుంచి తిరిగి రాగానే ‘గుంటూరు కారం’ ప్రమోషన్స్ తో బిజీ అవుతారు మహేశ్. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. -
పెళ్లైనా తగ్గేదేలే అంటోన్న స్టార్ హీరోయిన్.. ఏకంగా బికినీలో!
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం అన్నది అందరికీ తెలిసిందే. ఇక్కడ ప్రతిభతో పాటు అందానికి కూడా అధిక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అందం అనేది చాలా ముఖ్యం. అందుకే చాలామంది హీరోయిన్లు తమ గ్లామర్ను కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అందుకు తగిన ఆహారపు అలవాట్లతో పాటు కసరత్తు చేస్తుంటారు. అలాంటి హీరోయిన్లలో దేశముదురు భామ హన్సిక ఒకరు. 32 ఏళ్ల ఈ ముంబయి బ్యూటీ హిందీలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన కొన్ని చిత్రాలలో నటించారు. ఆ తరువాత పదహారేళ్ల ప్రాయంలోనే దేశముదురు అనే తెలుగు చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు ఆ తరువాత తమిళంలో ధనుష్ సరసన మాప్పిళ్లై చిత్రంతో మెప్పించారు. ఈ రెండు భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటించి పాపులర్ అయ్యారు. నటిగా అర్ధసెంచరీ కొట్టిన హన్సిక గతేడాది డిసెంబర్లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సొహైల్ కుతురియాను పెళ్లాడినా ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కూడా నటనకు మాత్రం దూరం కాలేదు. ఒక పక్క మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తూనే సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 105 అనే తెలుగు చిత్రం, రౌడీ బేబీ, గార్డియన్, మెన్ అనే తమిళ చిత్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్న హన్సిక ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటోంది. హీరోయిన్గా నటిస్తూ తన గ్లామర్పై ప్రత్యేక కసరత్తు చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. తాజాగా తన భర్తతో కలిసి స్విట్జర్లాండ్ వెళ్లిన ముద్దుగుమ్మ ఫుల్గా చిల్ అవుతున్నారు. బికినీ దుస్తుల్లో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకున్నారు. తాజాగా ఆమె ఫొటోలను తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు. స్విమ్మింగ్ చేస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) -
విద్యార్థులకు శీతాకాలపు సెలవులు తగ్గింపు
దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు శీతాకాలపు సెలవులకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. ఈసారి పాఠశాలలకు శీతాకాలపు సెలవులు 6 రోజులు మాత్రమే ఉండనున్నాయి. గతంలో జనవరి ఒకటి నుండి జనవరి 15 వరకు పాఠశాలకు సెలవులు ఇచ్చేవారు. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం పాఠశాలలు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు మాత్రమే మూసివేయనున్నారు. ఢిల్లీలో గాలి నాణ్యత తక్కువగా ఉన్నందున ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నవంబర్ 9 నుండి నవంబర్ 18 వరకు అన్ని పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. అందుకే పిల్లల చదువులను దృష్టిలో ఉంచుకుని ఈసారి శీతాకాలపు సెలవులను తగ్గించాలని నిర్ణయించారు. ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్లో.. 2023-24 అకడమిక్ సెషన్లో శీతాకాలపు సెలవులు జనవరి ఒకటి నుండి జనవరి ఆరు వరకు ఉండనున్నాయని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: గర్బా నృత్యానికి యునెస్కో గుర్తింపు -
Pooja Ramachandran Beach Photos: ఫ్యామిలీతో బీచ్లో చిల్ అవుతున్న పూజా రామచంద్రన్ (ఫోటోలు)
-
బిడ్డతో తొలిసారి ఫారిన్ టూర్కు చెర్రీ దంపతులు.. పెళ్లి కోసమేనా?
ఈ ఏడాది జూన్లో మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టారు. రామ్ చరణ్-ఉపాసన దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత చెర్రీ- ఉప్సీ జంట బిడ్డకు స్వాగతం పలకడంతో మెగా ఫ్యామిలీలో పాటు ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. తన ముద్దుల మనవరాలి పేరును క్లీంకారగా మెగాస్టార్ చిరంజీవి పరిచయం చేశారు. (ఇది చదవండి: అక్కినేని ఇంట తీవ్ర విషాదం..) అయితే క్లీంకార పుట్టిన తర్వాత రామ్ చరణ్-ఉపాసన సంతోషంలో మునిగిపోయారు. బిడ్డ పుట్టాక మొదటిసారి ఫారిన్ ట్రిప్కు బయలుదేరారు. తమ గారాల కూతురు క్లీంకారతో కలిసి విమానాశ్రయంలో కెమెరాల కంటికి చిక్కారు. తమ అభిమాన జంటను ఎయిర్పోర్ట్లో చూసిన ఫ్యాన్స్ మొబైల్స్ ద్వారా క్లిక్మనిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్- ఉపాసన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఆ ఫోటోల్లో రామ్ చరణ్ తన పెట్ రైమ్ను ఎత్తుకుని కనిపించగా.. క్లీంకారను ఉపాసన తన చేతుల్లో పట్టుకుని కనిపించింది. అయితే ఈ జంట ఇటలీ వేకేషన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. సినిమాలకు కాస్తా విరామం లభించడంతో ట్రిప్ ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఇటీవలే మెగా ఇంట్లో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మెగా ఫ్యామిలీ అంతా పాల్గొన్నారు. వీరిద్దరి పెళ్లి వేడుక కూడా ఇటలీలోనే జరగనున్నట్లు గతంలో ఉపాసన చేసిన పోస్ట్లో వెల్లడించింది. అయితే వరుణ్- లావణ్య పెళ్లి కోసమే ఇటలీ వెళ్తున్నారా? లేదా వ్యక్తిగత ట్రిప్ కోసమా? అనేది తెలియాల్సి ఉంది. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ అతని జంటగా కనిపించనుంది. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకెళ్తోన్న చిన్న సినిమా.. ఏకంగా టాప్-5లో!) Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip @AlwaysRamCharan pic.twitter.com/cHmwISRQ1H — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 Klinkara's Mom dad 😍 Megapowerstar #Ramcharan @upasanakonidela papped at airport off too family trip@AlwaysRamCharan pic.twitter.com/tO4QZwndIq — ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 18, 2023 -
Anjali: వెకేషన్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ అంజలి (ఫోటోలు)
-
వెకేషన్లో ఫుల్గా ఎంజాయ్ చేసిన బన్నీ.. వీడియో వైరల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పుష్ప పార్ట్-1 బ్లాక్ బస్టర్గా కావడంతో ఈ మూవీపై సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎర్రచందన స్మగ్లింగ్ నేపథ్యంతో తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ఎస్పీగా భన్వర్ సింగ్ షెకావత్గా కనిపించిన ఫహాద్ ఫాజిల్ నటన మరింత ఆసక్తిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన సీతారామం బ్యూటీ..!) అయితే గతనెలలో షూటింగ్కు కాస్తా గ్యాప్ ఇచ్చిన బన్నీ వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు. యూరప్లో జరిగే అతిపెద్ద అంతర్జాతీయ సంగీత ఉత్సవం టుమారో ల్యాండ్కు అల్లు అర్జున్ హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అక్కడే అందరి మధ్యలో డ్యాన్స్ చేస్తూ చిల్ అవుతూ కనిపించారు. దీంతో కొంతమంది అభిమానులు బన్నీతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అయితే ఈ వేడుక జూలై చివర్లో జరిగినట్లు తెలుస్తోంది. కాగా.. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప సీక్వెల్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో నటించనున్నారు. (ఇది చదవండి: ఫోటోపై రియాక్ట్ అయిన రేణు దేశాయ్.. వెంటనే తొలగించేసిన రాఘవేంద్ర రావు) View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
SS Rajamouli Norway Vacation Images: నార్వేలో భార్యతో కలిసి ఎంజాయ్ చేస్తున్న దర్శకధీరుడు (ఫోటోలు)
-
‘సెలవులు పెడితే క్రిమినల్లా చూస్తున్నారు’.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్!
ప్రస్తుతం అన్ని రకాల ఉద్యోగాల్లోనూ పని ఒత్తిడి ఎక్కువైంది. ఇక ప్రైవేటు ఉద్యోగాల సంగతి చెప్పనక్కర్లేదు. పని వేళలకు, కుటుంబ జీవన సమయానికి సమతుల్యత అస్సలు ఉండటం లేదు. పని ఒత్తిడి సహజమే అయినప్పటికీ వర్క్ప్లేస్ వాతావరణం ప్రతికూలంగా ఉండటం, పై అధికారులు, తోటి ఉద్యోగుల సహకారం లేకుంటే ఆ ఒత్తిడి మరింత ఎక్కువౌతుంది. ఈ రోజుల్లో చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిపరమైన అనుభవాలను, వర్క్ప్లేస్లో ఎదుర్కొంటున్న సవాళ్లను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఇటీవల ఒక రెడిట్ (Reddit) యూజర్ తన వర్క్ప్లేస్లో ఎదురైన ప్రతికూల అనుభవాన్ని పంచుకున్నారు. ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా సెలవులు (Vacation) తీసుకున్న తన పట్ల ఎంత ప్రతికూలంగా ప్రవర్తించారో వివరించారు. ఈ పోస్ట్ కాస్త ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా.. "నేను కంపెనీలో చేరినప్పటి నుంచి మొదటిసారి సెలవులు పెట్టాను. దీంతో నన్నో క్రిమినల్లా చూస్తున్నారు" అంటూ తన పోస్ట్ను మొదలు పెట్టారు. తాను ఉద్యోగంలో చేరిన ఎనిమిది నెలల తర్వాత మొదటిసారిగా ఒకటిన్నర వారం సెలవులు తీసుకున్నానని, కానీ సెలవు పెట్టిన రోజే తనకు పని చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తన సహచరులు కూడా తనను ఏదో తప్పు చేసినట్టు చూశారని వాపోయారు. సెలవులకు వెళ్లినప్పుడు తనతో ల్యాప్టాప్ కూడా తీసుకుని వెళ్లి రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పారని, కానీ తాను నిరాకరించినట్లు పేర్కొన్నారు. తాను ల్యాప్టాప్ తీసుకెళ్లినా రోజూ ఈమెయిల్స్ చెక్ చేయనని, నాలుగైదు రోజులకోసారి చూస్తారని చెప్పినట్లు తెలిపారు. దీంతో సహచరులు తనపై కోపం ప్రదర్శిస్తూ సెలవులో ఉన్నప్పటికీ రోజూ ఈమెయిల్స్ చెక్ చేయాలని చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ పోస్టు కాస్త వైరల్గా మారింది. దీనిపై పలువురు యూజర్లు ప్రతిస్పందించారు. తమకూ ఇలాంటి అనుభవాలు ఎదురైనట్లు పేర్కొన్నారు. సెలవులపై వెళ్లినప్పుడు ల్యాప్టాప్ తీసుకువెళ్లకూడదంటూ సలహాలు ఇస్తూ కామెంట్లు పెట్టారు. -
ఆస్ట్రేలియాలో పీవీ సింధు.. వెకేషన్ ఫొటోలు
-
స్కాట్లాండ్ లో కుటుంబంతో కలిసి వెకేషన్ను ఎంజాయ్ చేస్తోన్న మహేష్ బాబు (ఫొటోలు)
-
వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్లో మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ జంట ఒకటి. టాలీవుడ్ ప్రిన్స్ను లవ్ మ్యారేజ్ చేసుకున్న నమ్రత ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఇటీవలే కుటుంబంతో కలిసి లండన్ వెళ్లిన నమ్రత సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ అలరిస్తోంది. ప్రస్తుతం ఫ్యామిలీతో స్కాట్లాండ్లో టూర్ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేయడంతో వైరల్గా మారాయి. (ఇది చదవండి: హీరోయిన్గా మారిన ‘విక్రమార్కుడు’ చైల్డ్ ఆర్టిస్ట్) స్కాట్లాండ్లోని అతి పురాతనమైన రాయల్ స్కాట్స్ అండ్ ది రాయల్ రెజిమెంట్ మ్యూజియాన్ని సందర్శించారు. చారిత్రాత్మక మ్యూజియంలో తన పిల్లలు సితార, గౌతమ్తో దిగిన ఫోటోలను నమ్రత పంచుకుంది. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేశ్ సరసన పెళ్లి సందడి భామ శ్రీలీల కనిపించనుంది. అంతకుముందు పూజా హెగ్డేను ఎంపిక చేయగా.. పలు కారణాలతో ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. (ఇది చదవండి: మిమ్మల్ని ఇలా చూస్తుంటే సంతోషంగా ఉంది: నమ్రత పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
నితిన్ కౌగిలిలో భార్య షాలిని.. క్యూట్ పెయిర్ ఫోటోలు
-
Mahesh Babu Family London Vacation Photos: లండన్లో వేకేషన్లో మహేశ్ బాబు ఫ్యామిలీ (ఫొటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
No Headline
No Headline
శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం
శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ‘గంగుల’
కరీంనగర్లో ‘లండన్’ ఎగ్జిబిషన్
నేలకు సారం.. పంటకు ప్రాణం
పనులు సత్వరమే పూర్తి చేయాలి
బీమా చెక్కు అందజేత
తప్పక చదవండి
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- Virat Kohli: ఒక్కసారి క్రికెట్కు వీడ్కోలు పలికితే.. కోహ్లి నోట రిటైర్మెంట్ మాట!
- భారత సంతతి బాలుడికి దుబాయ్ పోలీసుల సత్కారం!
- IPL 2024: సన్రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరదు.. ఆ నాలుగు జట్లే! ఫ్యాన్స్ ఫైర్
- మళ్లీ మనదే అధికారం.. చరిత్ర సృష్టించబోతున్నాం: సీఎం జగన్
Advertisement