వయనాడ్‌ విషాదం.. రూ.10 లక్షల విరాళం ప్రకటించిన రష్మిక | Rashmika Mandanna Donates Rs 10 Lakhs for Wayanad Landslide Tragedy Victims | Sakshi
Sakshi News home page

Rashmika Mandanna: వయనాడ్‌ బాధితులకు రష్మిక విరాళం

Published Sat, Aug 3 2024 2:19 PM | Last Updated on Sat, Aug 3 2024 3:27 PM

Rashmika Mandanna Donates Rs 10 Lakhs for Wayanad Landslide  Tragedy Victims

కేరళలో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడి వయనాడ్‌ జిల్లాలోని పలు గ్రామాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో 350 మందికి పైగా మరణించారు. వందలమంది క్షతగాత్రులయ్యారు. సర్వం కోల్పోయి శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితుల కోసం సామాన్యులు, సెలబ్రిటీలు తమవంతు సాయం చేస్తున్నారు.

హీరోయిన్‌ రష్మిక సైతం బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించింది. ఈ కష్ట సమయంలో కేరళ ప్రజలంతా ధైర్యంగా ఉండాలంది. మరోవైపు మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌.. రూ.25 లక్షలు, కమల్‌ హాసన్‌.. రూ.25 లక్షలు, విక్రమ్‌.. రూ.20 లక్షలు, సూర్య, జ్యోతిక, కార్తీ కలిసి రూ.50 లక్షలు.. కేరళ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళం ప్రకటించారు.

చదవండి: లెఫ్టినెంట్ కల్నల్‌ హోదాలో సహాయక చర్యల్లో మోహన్‌లాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement