కొత్త ప్రయాణం | Sidharth Malhotra and Rashmika Mandanna to star in Mission Majnu | Sakshi
Sakshi News home page

కొత్త ప్రయాణం

Dec 24 2020 5:35 AM | Updated on Dec 24 2020 5:35 AM

Sidharth Malhotra and Rashmika Mandanna to star in Mission Majnu - Sakshi

కథానాయికగా రష్మికా మందన్నా కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’.. ఇలా వరుస హిట్లతో దూసుకెళుతున్న రష్మికా ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టడం ఏంటీ? అనుకోవచ్చు. అయితే ఈ జర్నీ హిందీ సినిమాకి సంబంధించినది. బాలీవుడ్‌లో ‘మిషన్‌ మజ్ను’ అనే సినిమాలో కథానాయికగా నటించనున్నారు రష్మికా. ‘‘మీ అందరికీ ఓ న్యూస్‌ చెప్పబోతున్నాను. కొత్త ప్రయాణం ఆరంభమైంది. చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను’’ అని హిందీలో తొలి సినిమా అంగీకరించిన సందర్భంగా రష్మిక పేర్కొన్నారు.

భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక కోవర్ట్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో శాంతను బాగ్చి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరో. ‘‘దేశ పౌరులను రక్షించడానికి ధైర్యసాహసాలు ప్రదర్శించిన గూఢచారులను స్ఫూర్తిగా తీసుకుని చేస్తున్న చిత్రం ఇది. ఇండియా–పాకిస్తాన్‌ మధ్య ఓ మిషన్‌ను విజయవంతం చేసే ‘రా ఏజెంట్‌’ పాత్రను చేస్తున్నాను’’ అన్నారు సిద్ధార్థ్‌. సినిమాలోని ఆయన ఫస్ట్‌ లుక్‌ని కూడా విడుదల చేశారు. ఇక రష్మికా బాలీవుడ్‌ ఎంట్రీపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఎంట్రీయే దేశభక్తి సినిమాతో అంటే ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో మంచి లాంచింగ్‌ అనే చెప్పాలి. ప్రస్తుతం తెలుగులో ‘పుష్ప’, ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’, ‘పొగరు’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు రష్మికా మందన్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement