నల్లగొండ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)పాఠశాల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న యంగ్ సైంటిస్ట్–2025 (యువ విజ్ఞాన కార్యక్రమం)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని డీఈఓ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ ఏడాది జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతూ ఉండాలని, 8వ తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 23లోగా దరఖాస్తులు ఆన్లైన్ jigyasa.iirs.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు సెల్ : 9848378845 నంబర్ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment