విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది.. | DRDO unmanned testing aircraft crashes in Hiriyur | Sakshi
Sakshi News home page

విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..

Aug 21 2023 6:28 AM | Updated on Aug 21 2023 9:07 AM

DRDO unmanned testing aircraft crashes in Hiriyur - Sakshi

ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది.

సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్‌07 ఎ–14 రకం డ్రోన్‌ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్‌డీఓ ఏరోనాటికల్‌ టెస్టింగ్‌ రేంజ్‌ (ఏటీఆర్‌) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్‌డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్‌ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్‌డీవో అధికారులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement