collapsed
-
డైరెక్టర్ శంకర్ దెబ్బతో కుదేలైన భారీ నిర్మాణ సంస్థ..
-
తెలంగాణ హైకోర్టులో విషాదం.. కేసు వాదిస్తూ కుప్పకూలిన లాయర్
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసు వాదించే సమయంలో ఓ సీనియర్ న్యాయవాది కుప్పకూలిపోయారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన మరణించారు. మృతి చెందిన సీనియర్ లాయర్ పేరు వేణుగోపాల్ రావు. ఓ కేసు విషయంలో ఆయన మంగళవారం వాదనలు వినిపిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులోని అన్ని బెంచ్లో విచారణ నిలిపి వేసి.. రేపటికి వాయిదా వేశారు. -
సూపర్గా డ్యాన్స్ చేస్తున్న యువతి..ఒక్కసారిగా..
భోపాల్:అప్పటిదాకా ఆ యువతి పెళ్లి వేడుకలో ఆనందంతో డ్యాన్స్ చేస్తోంది. ఇంతలోనే ఒక్కసారిగా డ్యాన్స్ ఆపేసి కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని విదిషలో జరిగింది. తన సోదరి వివాహం సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేస్తూ యువతి కుప్పకూలి కింద పడిపోయింది. కుప్పకూలిన యువతిని బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆ యువతి ప్రాణాలు కోల్పోయినట్లు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో సంబరాలు జరగాల్సిన పెళ్లింట్లో తీవ్ర విషాదం నెలకొంది. Madhya Pradesh - A young woman collapsed while dancing on stage at her sister's wedding in Vidisha. Relatives who were there rushed her to the hospital, but doctors declared her dead.How normal this has become post c0vid jabs yet no one questions!@shreyastalpade1 @MoHFW_INDIA https://t.co/dxJBVwT9ey pic.twitter.com/JwoWTUvz7B— Dee (@DeeEternalOpt) February 9, 2025 యువతి అప్పటిదాకా ఆకట్టుకునే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొవిడ్ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువైపోయాయని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అసలు ఈ మరణాలకు సరైన కారణాన్ని కనుక్కోవాలని వారు కోరుతున్నారు. -
యూపీ: బాగ్పత్లో ఘోర ప్రమాదం
-
రాజమండ్రి ఎయిర్పోర్టులో తప్పిన ప్రమాదం
సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. మధురపూడి విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ కొంతభాగం పాక్షికంగా కూలింది. నిర్మాణ సమయంలో ఐరన్ గ్రిల్స్ కిందపడిపోయాయి. కూలిన సమయంలో కార్మికులు లేకపోవడంతో ముప్పు తప్పింది. -
కన్నౌజ్ రైల్వే స్టేషన్లో కూలిన పైకప్పు
-
మహారాష్ట్రలో క్రికెట్ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్
-
తమిళనాడులో కుప్పకూలిన ఫ్లైఓవర్..
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ కుప్పకూలడంతో శిథిలాల కింద వందలాది మంది కార్మికులు చికుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో అంబూర్ బస్టాండ్ ఎదురుగా చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ శనివారం అర్ధరాత్రి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలో వందలాది మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనా స్థలంలో రాత్రి నుంచి సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రెస్య్కూ టీమ్ ఇప్పటి వరకు 22 మందిని కాపాడింది. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇది కూడా చదవండి: రత్న భండార్లో రెండో సర్వే ప్రారంభం -
తప్పిన పెను ప్రమాదం.. ‘సుంకిశాల’లో అసలేం జరిగింది?
సాక్షి, నల్గొండ జిల్లా: సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కూలీలు షిఫ్ట్ మారడానికి వెళ్లిన సమయంలో ప్రమాదం జరిగింది. కొన్ని క్షణాలు ముందైనా, ఆలస్యం అయినా భారీగా ప్రాణ నష్టం జరిగేది.పంప్ హౌస్లో షిఫ్ట్కు 115 మంది వరకు కూలీలు పని చేస్తున్నారు. సాగర్ డెడ్ స్టోరేజ్కు చేరిన సమయంలో హైదరాబాద్కు తాగునీటిని అందించడానికి సుంకిశాల పథకం చేపట్టారు. పథకంలో భాగంగా సొరంగ మార్గం నిర్మాణ పనులు చేస్తున్నారు. సొరంగంలోకి సాగర్ నీరు రాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టగా.. సాగర్ నిండటంతో నీటి ఒత్తిడికి రక్షణ గోడ కూలింది. దీంతో సొరంగం పూర్తిగా మునిగిపోయింది. నీటిలోనే క్రేన్, టిప్పర్లు, ఇతర సాంకేతిక సామాగ్రి మునిగిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ నెల ఒకటినే రక్షణ గోడ కూలినా అధిక యంత్రాంగం గోప్యంగా ఉంచారు. ఆగష్టు ఒకటిన ఉదయం ఆరుగంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై జలమండలి అధికారులు నీళ్లు నములుతున్నారు.అసలు అక్కడ ఏం జరగలేదన్నట్లు కప్పిపుచ్చుకునే ధోరణిలో అధికార యంత్రాంగం ఉంది. తిరిగి పనులు ప్రారంభం కావాలంటే వచ్చే వేసవి వరకు ఆగాల్సిందే. -
Nigeria: స్కూలు బిల్డింగ్ కూలి 22 మంది విద్యార్థులు మృతి
నైజీరియాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర మధ్య నైజీరియాలో హఠాత్తుగా రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోయింది. తరగతులు జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 22 మంది విద్యార్థులు మృతి చెందగా, 100 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకుపోయారని తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న విద్యార్థులను బయటకు తీసుకువచ్చేందుకు రిలీఫ్ అండ్ రెస్క్యూ టీమ్లు ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.బుసా బుజి కమ్యూనిటీలోని సెయింట్స్ అకాడమీ కాలేజీలో తరగతులు ప్రారంభమైన కొద్దిసేపటికే పాఠశాల భవనం కుప్పకూలింది. ప్రమాదం బారినపడినవారిలో 15 ఏళ్లలోపు విద్యార్థులు ఉన్నారు. శిథిలాల్లో మొత్తం 154 మంది విద్యార్థులు చిక్కుకుపోయారని, 132 మందిని రక్షించామని పోలీసు అధికార ప్రతినిధి ఆల్ఫ్రెడ్ అలబో తెలిపారు. వీరంతా ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 22 మంది విద్యార్థులు మృతి చెందారు.నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ సిబ్బంది ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. పాఠశాల నిర్మాణం బలహీనంగా ఉండడం, నది ఒడ్డున ఉండడం వల్లే ఈ ఘటన జరిగివుంటుందని అధికారులు అంటున్నారు. ప్రమాదం సంగతి తెలియగానే గ్రామస్తులు ముందుకు వచ్చి, సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి విద్యార్థులను బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బందికి సహకారం అందించారు. ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియాలో భవనాలు తరచూ కూలిపోతుండటం గమనార్హం. గత రెండేళ్లలో ఇలాంటి పలు ఘటనలు నమోదయ్యాయి. -
10 ఏళ్లలో కూలిపోయిన 200 వంతెనలు!
బీహార్లో వరుసగా బ్రిడ్జిలు కూలిపోతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీహార్లో ఇటీవలి కాలంలో జూన్ 18న తొలి వంతెన కూలగా ఆ తరువాత కేవలం 17 రోజుల్లోనే 12కు పైగా వంతెనలు కుప్పకూలిపోయాయి. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి బలహీనమైన వంతెనల విషయంలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.దేశంలో వంతెనలు కూలడమనేది ఒక్క బీహార్ మాత్రమే కాదు. ఇతర ప్రాంతాలలో కూడా వంతెనలు కూలుతుంటాయి. ఒక నివేదిక ప్రకారం 1977- 2017 మధ్య భారతదేశంలో 2,130 వంతెనలు కూలిపోయాయి. 2012- 2021 మధ్య 214 వంతెనలు కూలిపోయినట్లు ప్రభుత్వ రికార్డులలో నమోదయ్యింది.నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) నివేదిక ప్రకారం ఇటీవలి కాలంలో వంతెనల కూలిన కేసులు తక్కువగా నమోదయ్యాయి. 2012- 2013 మధ్య సగటున 45 వంతెనలు కుప్పకూలగా, ఆ సంఖ్య 2021లో ఎనిమిదికి తగ్గింది.సంవత్సరంకూలిన వంతెనలు2012452013452014162015222016 192017 102018 172019232020920218 వంతెనలు కూలిపోవడానికి కారణంవంతెనలు కూలిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంతెనల డిజైన్, ఉపయోగించిన మెటీరియల్, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయకపోవడం మొదలైనవి వీటిలో ప్రధాన కారణాలు. వంతెనలు కూలడానికి ప్రకృతి వైపరీత్యాలు కూడా ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇండియా టుడే నివేదిక ప్రకారం ప్రకృతి వైపరీత్యాల కారణంగా దేశంలో 80కి పైగా వంతెనలు కూలిపోయాయి. 2012 నుంచి 2021 వరకు వంతెనలు కూలిన ప్రమాదాలలో 285 మంది మృతి చెందారు. 2022లో గుజరాత్లోని మోర్బీలో వంతెన కూలిపోవడంతో 141 మంది మృతి చెందారు.సంవత్సరం మృతుల సంఖ్య2013 532014 122015 242016 472017 102018 342019 262020 102021 5 -
గాలివానకు మళ్లీ కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, సాక్షి: ముత్తారం మండలం ఓడేడ్ వద్ద జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య మానేరువాగుపై గిడ్డర్లు మరోసారి కూలాయి. దాదాపు తొమ్మిదేళ్లుగా నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణంలో నాణ్యతలోపం మరోసారి వెల్లడైంది. మంగళవారం సాయంత్రం భారీగా వీచిన గాలులకు గర్మిళ్లపల్లి వైపు వంతెన 17, 18 నంబరు పిల్లర్లపై ఐదు గడ్డర్లు పెద్ద శబ్దంతో కింద పడ్డాయని స్థానికులు తెలిపారు. గాలి దుమారం రావడంతోనే గడ్డర్లు కూలిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పెద్దపల్లి జిల్లా ఆర్అండ్బీ ఇన్ఛార్జి అధికారి, ఈఈ నర్సింహాచారి పేర్కొన్నారు. అధికారులను క్షేత్రస్థాయికి పంపి ఘటనకు గల కారణాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. 2016 ఆగస్టులో సుమారు రూ.49 కోట్ల అంచనా వ్యయంతో వంతెన పనులు ప్రారంభించారు. నిర్మాణ సమయంలో పలుమార్లు వచ్చిన వరదలకు సామగ్రి దెబ్బతినడం, గుత్తేదారులు మారడంతో పనులు ఆలస్యమయ్యాయి. రెండేళ్లుగా వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్ 22న అర్ధరాత్రి గాలి దుమారానికి 1, 2 నంబరు పిల్లర్లలో మూడు గడ్డర్లు కింద పడ్డాయి.భూపాలపల్లి మీదుగా పెద్దపళ్లి జిల్లాకు వెళ్లాలంటే సుమారు 100కిలోమీటర్లు ప్రయాణించాలి. అలా కాకుండా బ్రిడ్జి గనుక పూర్తైతే కేవలం 30 కిలోమీటర్ల దూరానికి తగ్గిపోతుంది. ప్రత్యామ్నాయంగా వాగు గుండా మట్టి రోడ్డు నుంచి ప్రజలు రాకపోకలు కొనసాగిస్తున్నా.. వర్షాకాలం ఆ రోడ్డు కొట్టుకుపోతుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. -
బీహార్లో కూలిన మరో వంతెన
బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అరారియాలో ఓ వంతెన కూలిపోయిన ఘటన మరువక ముందే సివాన్లోని దారుండా బ్లాక్లోని రామ్గర్హాలోని గండక్ కాలువపై నిర్మించిన వంతెన కూలిపోవడం కలకలం రేపుతోంది.పాతేడీ బజార్- దరౌండా బ్లాక్లను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో స్థానికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. కొద్ది రోజుల క్రితమే అరారియాలో ఓ వంతెన కూలిపోయింది. ఆ వంతెన నిర్మాణానికి దాదాపు రూ.12 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా సివాన్లోని కాలువకు వంతెనకు ఒకే పిల్లర్ ఉండగా అది కూడా కొట్టుకుపోవడంతో వంతెన కూలిపోయింది.ఈ వంతెన నిర్మించి ఏడాది కూడా గడవకముందే కూలిపోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. శాఖాపరమైన నిర్లక్ష్యం కారణంగానే వంతెన కూలిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
ముంబై హోర్డింగ్ కుప్పకూలిన ఘటన,.. వెలుగులోకి కీలక విషయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో హోర్డింగ్ కూలిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘ఇగో మీడియా ప్రైవేట్ లిమిటెడ్’ యాడ్ ఏజెన్సీ యజమాని భవేష్ భిండేపై హత్యకేసు నమోదైంది. అయితే అతనిపై పోలీసు కేసులు కొత్తేమి కాదు. ఓ అత్యాచార కేసుతో సహా దాదాపు 20 కేసుల్లో భవేష్ నిందితుడిగా ఉన్నారు. ప్రస్తుతం భిండే పరారీలో ఉన్నాడని, అతని ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ వస్తుందని పోలీసులు పేర్కొన్నారు.అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యజమాని 2009లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ములుండ్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాడు. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్(చెక్ బౌన్స్) కింద తనపై 23 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరిలో అతనిపై ములుంద్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కేసు నమోదైంది. ఛార్జిషీట్ కూడా దాఖలు చేశారు పోలీసులు. అయితే ముందస్తు బెయిల్పై ప్రస్తుతం బయట ఉన్నాడు.రాష్ట్రంలో హోర్డింగ్లు,బ్యానర్లను ఏర్పాటు చేయడం కోసం గత కొన్నేళ్లుగా భిండే భారతీయ రైల్వేలు, ముంబై పౌర సంస్థ, బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నుంచి అనేక కాంట్రాక్టులను పొందినట్లు తెలుస్తోంది. అయితే చాలాసార్లు ఆయన నిబంధనలను ఉల్లఘించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భిండేతోపాటు అతని కంపెనీలలోని అనేక మంది చెట్లకు విషం, చెట్ల నరికివేత కేసుల్లో నిందితులుగా ఉన్నారు.ముంబైలోని ఘాట్కోపర్లో సోమవారం అకాల వర్షం, ఈదురు గాలులతో ఓ భారీ బిల్ బోర్డ్ పక్కనే ఉ న్న పెట్రోల్ పంపుపై కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మరో 74 మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలిన హోర్డింగ్ కింద నుజ్జునుజ్జయిన కార్లలో ఇంకా కొంత మంది చిక్కుకొని ఉండొచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. -
కెన్యాలో కూలిన డ్యామ్
నైరోబీ(కెన్యా): ఆఫ్రికా దేశం కెన్యాలో జలాశయం ధ్వంసమై నివాసప్రాంతాలను ముంచెత్తడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. 49 మంది గల్లంతయ్యారు. సుమారు 109 మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. తరచూ ఆకస్మిక వరదలు సంభవించే గ్రేట్ రిఫ్ట్ వ్యాలీ ప్రాంతంలో సోమవారం వేకువజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మయి మహియులో ఇటీవలి వర్షాలకు పొంగి పొర్లుతున్న పాత కిజాబె డ్యాం ఆనకట్ట కొట్టుకుపోయింది. దీంతో వరద ఒక్కసారిగా నివాస ప్రాంతాలను ముంచెత్తిందని, ప్రధాన రహదారి కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో వరద పోటెత్తడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. -
తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్లో దృశ్యాలు
తైవాన్లో అత్యంత భారీ భూకంపం తైవాన్ను కుదిపేసింది. రిక్టర్ స్కేల్పై 7.6 గా నమోదైన ఈ భూకంపంలో నలుగురు వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా బుదవారం ఉదయం 7:58 గంటలకు ద్వీపం తూర్పు తీరాన్ని తాకింది. ఫలితంగా అనే భవనాలు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడి ప్రజలు యోగ క్షేమాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. దీంతో సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. భూకంపం తీవ్రత దృశ్యాలు అనేక చోట రికార్డైనాయి. పలు ఆకాశహర్మ్యాలు, అనేక ఇళ్లు కూలి పోయాయి. చాలా చోట్ల రవాణా మార్గాలు దెబ్బ తిన్నాయి. మెట్రో రైలు, స్విమ్మింగ్ పూల్, దృశ్యాలు ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి. దక్షిణాన హౌలెన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) పేర్కొంది. దీంతో తూర్పు తైవాన్తో పాటు దక్షిణ జపాన్, ఫిలిప్పీన్స్లోని కొన్ని ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీచేశారు. తైవాన్, జపాన్, ఫిలిప్సీన్స్ సహా పలు దేశాల్లో తరుచూ భూకంపాలు సంభవిస్తాయి. కానీ ఈ స్థాయిలో అక్కడ భూకంపం సంభవించడం గత పాతికేళ్లలో ఇదే తొలిసారి. సెప్టెంబరు 1999లో సంభవించిన భూకంపానికి 2 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. भूकंप के समय मेट्रो के भीतर का हाल#earthquake #Taiwan pic.twitter.com/gd1dGN3BeA — Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) April 3, 2024 Visuals of a Swimming Pool when the 7.4 earthquake hit Taiwan. #earthquake #Taiwan #Tsunami pic.twitter.com/YsBgfO9e2g — Aajiz Gayoor (@AajizGayoor) April 3, 2024 -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
Uttarkashi tunnel collapse rescue: పీడకల... అగ్నిపరీక్ష
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకొని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతికిన 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. సొరంగంలో తమకు ఎదురైన భయానక అనుభవాలు, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని ప్రాణాలు నిలబెట్టుకున్న తీరును పలువురు కార్మికులు బుధవారం మీడియాతో పంచుకున్నారు. సొరంగంలో తామంతా కష్టసుఖాలు కలబోసుకున్నామని, మిత్రులుగా మారామని చెప్పారు. ఆడిన ఆటలు, పాడుకున్న పాటల గురించి తెలియజేశారు. సొరంగంలో చిక్కుకున్నప్పుడు ప్రాణాలపై ఆశలు వదులుకున్నామని జార్ఖండ్లోని ఖిరాబేడా గ్రామానికి చెందిన అనిల్ బేడియా(22) అనే కార్మికుడు వెల్లడించాడు. ‘‘నవంబర్ 12న సొరంగంలో మేము పనిలో ఉండగా, హఠాత్తుగా కొంత భాగం కూలిపోయింది. భారీ శబ్ధాలు వినిపించాయి. మేమంతా లోపలే ఉండిపోయాం. బయటకు వచ్చే దారి కనిపించలేదు. ఎటు చూసినా చిమ్మచీకటి. అక్కడే సమాధి కావడం తథ్యమని అనుకున్నాం. మొదటి రెండు రోజులపాటు బతుకుతామన్న ఆశ లేకుండాపోయింది. క్రమంగా ధైర్యం కూడదీసుకున్నాం. బయట పడడానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ముందు ఎలాగైనా ప్రాణాలు రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాం. నిజంగా అదొక పీడకల, అగ్ని పరీక్ష. సొరంగం పైభాగంలోని రాళ్ల సందుల నుంచి పడుతున్న ఒక్కో చుక్క నీటిని ఒడిసిపట్టుకొని చప్పరించాం. మా దగ్గరున్న బొరుగులతో 10 రోజులపాటు కడుపు నింపుకున్నాం. అర్ధాకలితో గడిపాం. ఆ తర్వాత అధికారులు పైపు గుండా పండ్లు, భోజనం, నీళ్ల సీసాలు మాకు అందించారు. ప్రమాదం జరిగాక 70 గంటల తర్వాత అధికారులు మాతో మాట్లాడారు. అప్పుడే ప్రాణాలపై మాలో ఆశలు మొదలయ్యాయి. మేమంతా కలిసి నిత్యం దేవుడిని ప్రార్థించేవాళ్లం. చివరకు దేవుడు మా ప్రార్థనలు ఆలకించాడు. మొదట్లో కష్టంగా గడిచింది సొరంగంలో తాము చిక్కుకున్నట్లు తెలియగానే ఆందోళనకు గురయ్యామని ఉత్తరాఖండ్లోని చంపావత్ గ్రామానికి చెందిన పుష్కర్సింగ్ ఐరే అనే కార్మికుడు చెప్పాడు. మొదట్లో చాలా కష్టంగా గడిచిందని, చనిపోతామని అనుకున్నామని, క్రమంగా అక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డామని తెలిపాడు. తొలుత సరైన ఆహారం లేదు, బయటున్నవారితో మాట్లాడే వీలు లేదని అన్నాడు. ఒంటిపై ఉన్న బట్టలతోనే 17 రోజులపాటు ఉండాల్సి వచి్చందని, స్నానం చేయలేదని, సొరంగం లోపలంతా అపరిశుభ్రంగా మారిందని తెలియజేశాడు. ప్లాస్టిక్ షీట్లపై నిద్రించామని పేర్కొన్నాడు. ఆహారం, నీరు అందిన తర్వాత ఊపిరి పీల్చుకున్నామని చెప్పాడు. కాలక్షేపం కోసం పేకాడామని, కాగితాలను క్రమపద్ధతిలో చింపుతూ ఉండేవాళ్లమని వివరించాడు. సాక్సులతో బంతులు చేసి, చోర్–సిఫాయి ఆట ఆడామని, పాటలు పాడుకున్నాం తెలిపాడు. నిత్యం యోగా, వాకింగ్ చేశాం.. సొరంగం నుంచి బయటకు వచి్చన 41 మంది కార్మికులతో మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ ద్వారా మాట్లాడారు. వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. సొరంగంలో ఉన్నప్పుడు నిత్యం యోగా, వాకింగ్ చేశామని, తద్వారా మనోస్థైర్యం సడలకుండా జాగ్రత్తపడ్డామని, ఆత్మవిశ్వాసం పెంచుకున్నామని ప్రధానమంత్రికి కార్మికులు తెలియజేశారు. విదేశాల్లో ఉన్న భారతీయులు ప్రమాదాల్లో చిక్కుకుంటే మన ప్రభుత్వం కాపాడిందని, స్వదేశంలోనే ఉన్న తామెందుకు భయపడాలని భావించామని అన్నారు. రిషికేశ్ ఎయిమ్స్కు కార్మికుల తరలింపు సిల్క్యారా టన్నెల్ నుంచి బయటకు వచి్చన కార్మికులను బుధవారం రిషికేశ్లోని ఎయిమ్స్కు హెలికాప్టర్లో తరలించారు. డిజాస్టర్ వార్డులో చేర్చి, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మానసిక పరిస్థితి కూడా పరీక్షిస్తామని, అవసరమైన వారికి తగిన చికిత్స అందిస్తామని ఎయిమ్స్ వైద్యులు చెప్పారు. ఆరోగ్యం కుదుటపడిన వారిని ఇళ్లకు పంపిస్తామని వెల్లడించారు. కార్మికుల కుటుంబ సభ్యులు, బంధులను కూడా సిల్క్యారా నుంచి బస్సుల్లో ఎయిమ్స్కు తీసుకొచ్చారు. కార్మికుల గ్రామాల్లో సంబరాలు ఖిరాబేడా గ్రామం నుంచి మొత్తం 13 మంది యువకులు సొరంగం పనుల కోసం ఉత్తరకాశీకి చేరుకున్నారు. అదృష్టం ఏమిటంటే వారిలో ముగ్గురు మాత్రమే సొరంగంలో చిక్కుకున్నారు. బాధితులుగా మారిన మొత్తం 41 మంది కార్మికుల్లో 15 మంది జార్ఖండ్లోని వివిధ ప్రాంతాలకు చెందినవారే కావడం గమనార్హం. ఖిరాబేడాలో అనిల్ బేడియా తల్లి 17 రోజులపాటు తల్లడిల్లిపోయింది. కుమారుడు జాడ తెలియక ఆందోళనకు గురైంది. ఇంట్లో వంట చేసింది లేదు. ఇరుగు పొరుగు అందించిన భోజనంతో కడుపు నింపుకుంది. ఎట్టకేలకు కుమారుడు అనిల్ బేడియా సొరంగం నుంచి బయటకు రావడంతో ఆమె ఆనందానికి అవధుల్లేవు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ బేడియా(55)కు పక్షవాతం. ఏకైక కుమారుడు రాజేంద్ర సొరంగం నుంచి బయటపడడంతో అతని ఇంట సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రశంసలందుకున్న నాగపూర్ నిపుణుల సేవలు సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యల్లో పలు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొన్నాయి. నిపుణులు తమవంతు సేవలందించారు. కార్మికులకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది లేకుండా, కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరగకుండా వీరు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ డబ్ల్యూసీఎల్కు నిపుణులు సొరంగం వద్దే మకాం వేశారు. భారీ యంత్రాలతో తవ్వకం పనులు చేపట్టడంతో సొరంగం లోపల కార్బన్డయాక్సైడ్ స్థాయిలు పెరుగుతుండేవి. ప్రమాదకర స్థాయికి చేరగానే యంత్రాలను ఆపించేవారు. వారి సేవలు ప్రశంసలందుకున్నాయి. సొరంగంలో కార్మికులు భుజాలపై ఎత్తుకున్నారు ర్యాట్ హోల్ మైనింగ్ నిపుణుల్లో ఢిల్లీకి చెందిన ఫిరోజ్ ఖురేïÙ, యూపీకి చెందిన మోను కూమార్ తొలుత సొరంగంలోని కార్మికుల వద్దకు చేరుకున్నారు. తమను చూడగానే కార్మికులు ఆనందంతో భుజాలపై ఎత్తుకున్నారని ఫిరోజ్ వెల్లడించాడు. ‘‘మాకు పండ్లిచ్చారు. పేర్లు అడిగారు. అరగంట పాటు సొరంగంలో ఉన్నాం’’ అని మోను కూమార్ చెప్పాడు. తాము కార్మికుల వద్దకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం వచ్చారని పేర్కొన్నాడు. కార్మికులను కాపాడినందుకు తాము డబ్బులేమీ తీసుకోలేదని తెలియజేశాడు. తల్లిదండ్రుల ఫొటో చూస్తూ కాలం గడిపా.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరీ జిల్లా భైరాంపూర్కు చెందిన 25 ఏళ్ల మంజీత్ చౌహాన్ సిల్క్యారా టన్నెల్లో చిక్కకొని, 17 రోజుల తర్వాత బయటకు వచ్చాడు. అతడి రాకతో స్వగ్రామంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. మంజీత్ తల్లిదండ్రులు భైరాంపూర్లో ఉంటున్నారు. అతడి సోదరుడు గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తల్లిదండ్రుల ఫొటో మంజీత్ వద్ద ఉంది. ఆ ఫొటో చూస్తూ ధైర్యం తెచ్చుకొని సొరంగంలో కాలం గడిపానని, ఒత్తిడిని అధిగమించానని చెప్పాడు. ‘‘సొరంగం లోపలిభాగం కూలిన సమయంలో అక్కడికి కేవలం 15 మీటర్ల దూరంలోనే పని చేస్తున్నాను. తొలుత అసలేం జరిగిందో అర్థం కాలేదు. క్రమంగా అది పీడ కలగా మారింది. ప్రమాదం జరిగాక మొదటి 24 గంటలు చాలా కష్టంగా గడిచాయి. మేమంతా భయందోళనకు గురయ్యాం. ఆకలి, దాహం, నీరసం, నిరాశ వంటివి అన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. నాలుగు అంగుళాల పైపు గుండా అధికారులు ఆహారం, నీరు పంపించిన తర్వాత మా మానసిక స్థితి మారింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు తెలియడంతో మాలో మనోధైర్యం పెరిగింది. కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగాం. అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని నాన్నకు చెప్పా. ఫోన్ వాల్పేపర్లో నా తల్లిదండ్రుల ఫొటో చూస్తూ ఉండిపోయేవాడిని. ప్రాణాలపై ఆశ కోల్పోకుండా అది ఉపయోగపడింది. సొరంగంలో అటూ ఇటూ నడుస్తూ ఉండేవాళ్లం. పైపు గుండా అధికారులు పంపించిన పప్పు నాకెంతో నచ్చింది. సొరంగంలో చిక్కుకున్న మేమంతా ఒకరికొకరం మంచి మిత్రులుగా మారిపోయాం. మా కష్ట సుఖాలు తెలియజేసుకున్నాం. క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడలేకపోవడం పట్ల విచారంగా ఉంది. ఇంటికెళ్లిన తర్వాత మ్యాచ్ హైలైట్స్ చూస్తా’’ అని మంజీత్ చౌహాన్ ఉత్సాహంగా చెప్పాడు. సొరంగం పనులు కొనసాగుతాయి ఉత్తరాఖండ్లో 4.5 కిలోమీటర్ల పొడవైన సిల్క్యారా సొరంగం పనులు కొనసాగుతాయని కేంద్ర రోడ్డు రవాణా శాఖ అధికారులు బుధవారం ప్రకటించారు. కూలిపోయిన ప్రాంతంలో మరమ్మతులు, సేఫ్టీ ఆడిట్ ముగిసిన తర్వాత పనులు యథావిధిగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇకపై ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభంచిన 900 కిలోమీటర్ల ‘చార్ధామ్ యాత్ర ఆల్ వెదర్ రోడ్’ ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా టెన్నల్ను నిర్మిస్తున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చార్ధామ్లో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్ క్షేత్రాలను అనుసంధానించడానికి కేంద్రం రూ.12,000 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో నాలుగు క్షేత్రాలను చుట్టిరావడానికి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. నిర్మాణ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 డిసెంబర్ 27న శంకుస్థాపన చేశారు. వాస్తవానికి 2020 మార్చిలోగా ప్రాజెక్టు పూర్తికావాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరుగుతోంది. కేబినెట్ భేటీలో మోదీ భావోద్వేగం సిల్క్యారా సొరంగంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా ప్రస్తావనకు వచి్చంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ మంగళవారం రాత్రి సమావేశమైంది. సొరంగంలో చిక్కుకున్న కార్మికులను తలచుకొని ప్రధానమంత్రి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం చెప్పారు. కార్మికులను కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు స్వయంగా ఆరా తీశారని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వివరించారు. దేశ విదేశాల్లోని భారతీయులను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యమని ఉద్ఘాటించారు. -
పోలింగ్ బూత్లో కుప్పకూలిన ఏజెంట్.. గుండెపోటుతో మృతి?
జైపూర్: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పోలింగ్ ఏజెంట్ మృతి చెందాడు. పాలి జిల్లాలో ఓ అభ్యర్థికి సంబంధించిన పోలింగ్ ఏజెంట్ శనివారం ఉదయం పోలింగ్ జరుగుతుండగా కుప్పకూలిపోయాడు. సుమేర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 47లో శాంతిలాల్ అనే పోలింగ్ ఏజెంట్ కుప్పకూలినట్లు పోలింగ్ అధికారి తెలిపారు. వెంటనే అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి జిల్లా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలింగ్ ఏజెంట్ మృతికి గుండెపోటు కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే మృతి చెందిన పోలింగ్ ఏజెంట్ పార్టీకి సంబంధించినవారు అనే వివరాలు వెంటనే తెలియరాలేదు. కాగా రాజస్థాన్లో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగున్నాయి. కరణ్పూర్ నియోజకవర్గంలో ఓ అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ పోలింగ్ వాయిదా పడింది. -
ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీలో కూలిన టన్నెల్
-
కుప్పకూలిన చార్దామ్ టన్నెల్..చిక్కుకున్న 40 మంది
డెహ్రాడూన్: నిర్మాణంలో ఉన్న ఓ భారీ టన్నెల్లో కొంత భాగం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 40 మంది దాకా కార్మికులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఈ ఘటన జరిగింది. చార్దామ్ రోడ్డు ప్రాజెక్టులో భాగంగా సిల్క్యారా నుంచి దండల్గాన్ను కలుపుతూ నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మిస్తున్నారు. ఇవాళ(ఆదివారం)ఉదయం 4 గంటల ప్రాంతంలో టన్నెల్లోని 150 మీటర్ల పొడవున్న ఒక భాగం కుప్పకూలినట్లు పోలీసులు చెప్పారు. టన్నెల్ కూలిన వెంటనే జిల్లా యంత్రాంగం అక్కడికి చేరుకుంది. టన్నెల్ కొంత భాగం ఓపెన్ చేసి చిక్కుకున్న 40 మంది కార్మికులను బయటికి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈలోగా వారికి ఆక్సిజన్ అందించేందుకు పైప్ను ఏర్పాటు చేశారు. ఇదీచదవండి..రాహుల్ ఎక్కడ? -
అమెరికా ఎంక్యూ–9 డ్రోన్ పేల్చివేత
సనా: ఇప్పటికే ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలతో పశి్చమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు యెమెన్కు చెందిన హౌతీ మిలిటెంట్లు అమెరికా సైన్యంపై దాడులు చేస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాకు చెందిన ఎంక్యూ–9 డ్రోన్ను హౌతీ మిలిటెంట్లు పేలి్చవేశారు. యెమెన్ ప్రాదేశిక జలాల్లో బుధవారం ఈ సంఘటన జరిగిందని అమెరికా సైన్యం వెల్లడించింది. హౌతీ దుశ్చర్య నేపథ్యంలో పశి్చమాసియాలో అమెరికా సేనలు అప్రమత్తమయ్యాయి. హౌతీకి ఇరాన్ ప్రభుత్వం అండగా ఉండడం గమనార్హం. -
బ్రెజిల్లో విమానం కూలి..14 మంది మృతి
రియో డి జనిరో: బ్రెజిల్లోని అమెజాన్ అడవుల్లో చిన్న ప్యాసింజర్ విమానం కూలిన ఘటనలో అందులోని మొత్తం 14 మందీ దుర్మరణం చెందారు. మనాస్ నుంచి బయలుదేరిన విమానం బర్సెలోస్ సమీపంలో కూలిందన్నారు. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోందన్నారు. మృతుల్లో 12 మంది ప్రయాణికులు కాగా, ఇద్దరు విమాన సిబ్బంది అని అమెజొనాస్ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లిమా చెప్పారు. -
లిబియా మరణాలు..11 వేలకు పైనే
డెర్నా: లిబియాలోని డెర్నాలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య శుక్రవారానికి 11 వేలు దాటింది. జాడ తెలియకుండా పోయిన మరో 10 వేల మంది కోసం అన్వేషణ ముమ్మరంగా సాగుతోంది. నివాస ప్రాంతాలను తుడిచిపెట్టిన మట్టి, బురద తొలగింపు పనులు సాగుతున్నాయి. సోమవారం సంభవించిన భారీ వర్షాలు, వరదలతో ఎగువనున్న రెండు జలాశయాలు బద్దలై ఒక్కసారిగా డెర్నా నగరాన్ని నీటి ప్రవాహం ముంచెత్తిన విషయం తెలిసిందే. -
విమానం ఎక్కాలన్న సరదా ఇప్పుడు తీరినట్లుంది..
సాక్షి, బళ్లారి: కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా హిరియూరు తాలూకా వద్దికేరె గ్రామం సమీపంలో తపస్07 ఎ–14 రకం డ్రోన్ కుప్పకూలింది. చిత్రదుర్గం వద్ద డీఆర్డీఓ ఏరోనాటికల్ టెస్టింగ్ రేంజ్ (ఏటీఆర్) ఉంది. నిత్యం ఇక్కడ డ్రోన్లు, మానవ రహిత విమానాల పరీక్షలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఈ డ్రోన్ను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తుండగా చెళ్లకెర తాలూకా హిరియూరు వద్ద పొలంలో పెద్ద శబ్ధంతో కుప్పకూలింది. దాని భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డీఆర్డీవో అధికారులు, పోలీసులు ధ్వంసమైన డ్రోన్ను అక్కడి నుంచి తరలించారు. సాంకేతిక లోపంతోనే అది కూలిందని, విచారణ జరుపుతున్నామని డీఆర్డీవో అధికారులు చెప్పారు. -
విరుగుతున్న కొండచరియలు.. కుప్పకూలుతున్న ఇళ్లు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండరియలు విరిగిపడుతున్నాయి. తాజాగా సిమ్లాలోని కృష్ణ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడగా.. వాటిపై ఉన్న ఏడు ఇళ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భయానక దృశ్యాలు భీతికొల్పేవిగా ఉన్నాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య ఇంకా ఓ అంచనాకు రాలేమని సీపీ సంజీవ్ కుమార్ తెలిపారు. #WATCH | Several houses collapsed in Krishna Nagar area in Himachal Pradesh's Shimla after a landslide took place. Rescue operation underway. (Video Source: Local; confirmed by Police and administration) pic.twitter.com/qdYvR4C4fx — ANI (@ANI) August 15, 2023 కాగా.. గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో వర్షాల కారణంగా 54 మంది మరణించారు. వర్షపు నీటితో నదులు ఉద్దృతంగా ప్రవహిస్తున్నాయి. సోమవారం వివిధ చోట్ల జరిగిన కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో 12 మంది మృతి చెందారు. రహదారులు మూతపడ్డాయి. దీంతో రాష్ట్రంలో నేడు స్వాతంత్య్ర వేడుకలు కూడా జరపలేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిర్విరామంగా పనిచేస్తున్నారు. #WATCH | Hill collapsed in Krishna Nagar area in HP's Shimla. Around five to seven houses collapsed. Further details awaited. pic.twitter.com/esWoGcjxlB — ANI (@ANI) August 15, 2023 కాగా.. మరో రెండు రోజులు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలో మరో ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. ఇదీ చదవండి: స్వాతంత్య్ర వేడుకలకు దూరంగా ఆ రాష్ట్రం.. ఎందుకంటే. -
ఎల్బీనగర్ సాగర్ రింగ్ రోడ్డులో కూలిపోయిన ఫ్లైఓవర్
-
బిహార్లో కూలిన తీగల వంతెన
-
జైల్లో కుప్పకూలిన జైన్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై 2022 మే నుంచి తీహార్ జైల్లో ఉన్న మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం కుప్పకూలిపోయారు. జైల్లో కళ్లు తిరిగిపడిన జైన్ను పోలీసులు హుటాహుటిన దీన్దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లోక్నాయక్ జయ్ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి ఐసీయూకి మార్చారని ఆప్ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం జైలు బాత్రూమ్లో జైన్ కాలుజారి పడిపోయారని జైలు అధికారి చెప్పారు. ‘‘కీలక అవయవాలకు గాయాలయ్యాయా అని వెంటనే వైద్యులు పరిశీలించి అంతా సాధారణంగా ఉందని తేల్చారు. వెనుకవైపు, ఎడమ కాలు, భుజం విపరీతంగా నొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం’’ అన్నారు. స్నానాలగదిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని ఆప్ తెలిపింది. ‘‘ఢిల్లీ ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం అందించాలని చూసిన జైన్ను ఒక నియంత ఇలా శిక్షిస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ ఆప్ నేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్చేశారు. జైన్ను చెప్పడంతో జైలు అధికారులు సోమవారమే సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చూపించారు. ‘‘జైన మతవిశ్వాసాలను బాగా పాటించే జైన్ జైల్లో కేవలం పళ్లు, పచ్చి కూరగాయలు తింటున్నారు. దాంతో 35 కిలోలు తగ్గారు. రాత్రంతా బీఐపీఏపీ మెషీన్తో శ్వాస ఇవ్వాలి’’ అని ఆప్ తెలిపింది. -
20 రోజుల్లో షిండే సర్కార్ పతనం: సంజయ్
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత
-
జగిత్యాల: డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన బీఆర్ఎస్ నేత
సాక్షి, జగిత్యాల: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ పాల్గొనాల్సిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ రజని భర్త, బీఆర్ఎస్ నేత బండారి నరేందర్ హఠాన్మరణంతో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఆత్మీయ సమ్మేళనం సంబురాల్లో.. ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. అయితే.. అక్కడే ఉన్న కార్యకర్తలు వెంటనే ఆయనకు సీపీఆర్ అందించారు. మంచి నీళ్లు తాగించి.. స్పృహలోకి తీసుకొచ్చారు. ఆలస్యం చేయకుండా అక్కడే ఉన్న వాహనంలో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. కోలుకుని క్షేమంగా తిరిగొస్తారని భావించిన బీఆర్ఎస్ శ్రేణులు.. ఆ మరణం వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇదిలా ఉంటే గుండెపోటుతోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. కవిత ఆధ్వర్యంలో జగిత్యాలలో ఇవాళ రోడ్షో, ఆపై బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద BRS నాయకులు ఉత్సాహంగా డ్యాన్స్లు చేయగా.. అందులో నరేందర్ పాల్గొన్నారు. స్థానిక నేత మృతితో సమ్మేళనం బీఆర్ఎస్ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కవిత కార్యక్రమాలు రద్దు బీఆర్ఎస్ సీనియర్ నేత బండారి నరేందర్ హఠాన్మరణంతో.. జగిత్యాలలో నేటి కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వేదిక వద్దే నరేందర్ చిత్రపటానికి, అలాగే ఆయన పార్థీవ దేహానికి కవిత నివాళులర్పించారు. ఆపై ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు కవిత, మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు. -
గుడిలో ఘోరం.. 35కి చేరిన మృతుల సంఖ్య
ఇండోర్: మధ్యప్రదేశ్ ఇండోర్లోని బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఆ సంఖ్య 35కి చేరింది. గురువారం శ్రీరామ నవమి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి రాగా.. మెట్లబావిను కవర్ చేస్తూ ఏర్పాటు చేసిన పైకప్పు భక్తుల బరువును ఆపలేక కుప్పకూలి ఈ ఘోరం జరిగిందని అధికారులు ఓ నిర్ధారణకు వచ్చారు. మెట్ల బావిలో భక్తులు పడిన ఘటనలో ఇప్పటిదాకా 35 మంది దుర్మరణం పాలయ్యారు. సహాయక చర్యల ద్వారా 14 మందిని రక్షించగలిగాం. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఇద్దరు డిశ్చార్జి అయ్యారు. మరికొందరు కనిపించడం లేదని వాళ్ల బంధువులు అంటున్నారు. కానీ, అధికారుల దగ్గర ఒక్కరే కనిపించకుండా పోయారన్న సమాచారం ఉంది. అందుకే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్(కలెక్టర్) ఇళయరాజా చెప్తున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మొదలైన సెర్చ్ ఆపరేషన్.. ఇంకా కొనసాగుతూనే ఉందని మెజిస్ట్రేట్ వెల్లడించారు. ఇండోర్ స్నేహ్నగర్లో పాత కాలనీల నడుమ ఓ ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది వందేళ్ల చరిత్ర ఉన్న బాలేశ్వర్ మహాదేవ్ ఆలయం. మెట్ల బావి Stepwell లోతు 40 అడుగులుగా అధికారులు చెప్తున్నారు. ఇక ఆలయంలోని పరిస్థితులపై గతంలోనే తాము ఫిర్యాదులు చేశామని, మున్సిపల్ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. అయితే ఇండోర్ మున్సిపల్ అధికారులు మాత్రం కిందటి ఏడాది ఏప్రిల్లోనే ఆలయ ట్రస్ట్కు నోటీసులు జారీ చేశామంటూ అందుకు సంబంధించిన కాపీని చూపిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో అక్రమ కట్టడాలను గానూ తాము నోటీసులు పంపినట్లు చెప్తున్నారు. కానీ, ట్రస్ట్ మాత్రం ఆ వాదనను తోసిపుచ్చుతోంది. మతపరమైన విషయాల్లో ఇండోర్ మున్సిపాలిటీ జోక్యం ఎక్కువగా ఉంటోందని ఆరోపిస్తోంది. శ్రీరామ నవమి సందర్భంగా.. మెట్లబావిని కవర్ చేస్తూ వేసిన కాంక్రీట్ స్లాబ్పై ఆలయ నిర్వాహకులు హోమం నిర్వహించారు. అయితే అది తేలికపాటి స్లాబ్ అని, 30 నుంచి 40 మందికి మించిన బరువును మోయలేదంటున్నారు స్థానికులు. అందుకే కుప్పకూలి ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల పరిహారం చెల్లించనున్నట్లు ప్రకటించారు. గాయపడినవాళ్లకు యాభై వేల రూపాయల పరిహారం చెల్లించాలని, చికిత్స ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. అంతేకాదు ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించారు. మరోవైపు పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వాళ్లకు రూ.50 వేలు ప్రకటించింది. -
జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్క సారిగా కూలిపోయింది. పక్క నున్న 3 భవనాలపై శిథిలాలు పడటంతో పక్క బిల్డింగ్ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పక్క బిల్డింగ్లో ఇద్దరు గాయపడ్డారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. -
కేజీఎఫ్ లాంటి సూపర్ హీరో: అస్సలేమీ లెక్క చేయలే!
న్యూఢిల్లీ: గుండె నిండా ధైర్యం, తెగింపు ఉండాలేగానీ ఎంతటి కష్టమైనా దూదిపింజలా తేలిపోవాల్సిందే. అలాగే భూమ్మీద నూకలుంటే.. ఎలాంటి ప్రమాదం నుంచైనా ప్రాణాలతో బయటపడవచ్చు. కుప్పకూలిపోతున్న బంగారు గని నుంచి అన్యూహంగా బతికి బయటపడ్డ వీడియో చూస్తే ఇదే అభిప్రాయం కలుగక మానదు. ముఖ్యంగా తన ప్రాణాలను ఫణంగాపెట్టి మరీ గనిలో చిక్కుకున్న 9మంది కార్మికులను రక్షించడం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. భారీ వర్షంతో అక్కడున్న బంగారు గని కూలిపోయింది. దీంతో అక్కడి పనిచేస్తున్న కార్మికులు (మైనర్లు) చిక్కుకుపోయారు. కానీ ఒకవ్యక్తి సకాలంలో స్పందించాడు. తన చేతులతో మట్టిని తొలగించుకుంటూ లోపల ఇరుక్కుపోయిన తొమ్మిది మంది మైనర్లను నిమిషాల్లో రక్షించడంతో అక్కడున్నవారంతా ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకవైపు పలుగుతో తవ్వుతుండగా మరోవైపు నుంచి కూలీలు ఒక్కొక్కరుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటకు రావడం వీడియోలో చూడవచ్చు. ఒక్కొక్కరూ అలా శిథిలాల్లోంచి బయటకు వస్తున్న క్షణాలు తీవ్ర ఉద్విగ్నతను , ఉత్కంఠను కలిగించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ దేశంలో మైనింగ్ ప్రమాదాలు, విపత్తులు, కొండ చరియలు విరిగి పడటం లాంటి సంఘటనలు సర్వసాధారణం. సరియైన భద్రతా విధానాలు, సరైన పరికరాలు లేక పోవడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. Nine Congolese miners were rescued from the rubble of a collapsed gold mine as onlookers cried out in joy in a victorious escape pic.twitter.com/BmPJNe0iQY — TRT World (@trtworld) March 28, 2023 -
పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ
-
డాన్స్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన యువకుడు
-
వ్యాయామం చేస్తూ కుప్పకూలిన విశాల్
-
Lucknow Building Collapsed: ఎస్పీ నేత భార్య, తల్లి దుర్మరణం
సాక్షి, లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సహాయాక బృందాలు రక్షించిన ఇద్దరు మహిళలు బుధవారం చికిత్స పొందుతూ చనిపోయారు. మృతి చెందిన ఇద్దరూ మహిళలు సమాజ్ వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అబ్బాస్ హైదర్ తల్లి బేగం హైదర్(72), అతని భార్య ఉజ్మా(30) హైదర్గా గుర్తించారు. ఆ రోజు ఈ ప్రమాదం జరిగిన వెంటనే శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశారు. ప్రస్తుతం ఆ శిథిలాల కింద ఇంకా ఇద్దరూ లేదా ముగ్గురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రమాదం జరిగిన అలాయా అపార్ట్మెంట్ యజమానులు మహ్మద్ తారిఖ్, నవాజీష్ షాహిద్, బిల్డర్ ఫహద్ యజ్దానీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐతే డివిజన్ కమిషనర్ రోషన్ జాకబ్ లక్నో డెవలప్మెంట్ అధికారులపై కూడా కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆ బిల్డర్ యజ్దానీ నిర్మించిన ఇతర భవనాల గురించి కూడా తనీఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ ఆ భవనాలు కూడా నాణ్యమైనవి కావు అని తేలితే వాటిని కూడా కూల్చేయమని చెప్పారు జాకబ్. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి డివిజన్ రోషన్ జాకబ్ నేతృత్వం వహించగా, లక్నో పోలీసలు జాయింట్ కమిషనర్ పీయూష్ మోర్డియా, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ తదితరులు కమిటీలో సభ్యులుగా ఉంటారని అధికారిక వర్గాలు తెలిపాయి. (చదవండి: లక్నో: కుప్పకూలిన నాలుగంతస్థుల బిల్డింగ్.. శిథిలాల కింద పదుల సంఖ్యలో..!) -
జోష్తో డ్యాన్స్.. విధి విచిత్రంగా ప్రాణం తీసింది
వైరల్: ఏ నిమిషానినో ఏమి జరుగునో ఎవరూహించెదరు?.. మనిషి జీవం విషయంలో ఇప్పుడు ఇలాగే జరుగుతోంది. నిన్న కళ్లెదురుగా నవ్వుతూ హుషారుగా కనిపించిన మనిషి.. ఇవాళ బతికి లేడు అని వినాల్సి వస్తున్న రోజులువి. కన్నవాళ్లను, భార్యాబిడ్డలను, అయినవాళ్లను ఉన్నట్లుండి శోకంలో ముంచెత్తి వెళ్లిపోతున్నారు. పైగా ఉన్నట్లుండి కుప్పకూలి మరణిస్తున్న ఘటనలు..అందునా పాతిక నుంచి నలభై ఐదేళ్లలోపు వాళ్ల మరణాలే అత్యధికంగా నమోదు అవుతున్నాయి ఈ మధ్యకాలంలో. తాజాగా.. మధ్యప్రదేశ్లో ఓ పెళ్లింట నెలకొన్న విషాదం తాలుకా ఘటన వీడియో తెగ వైరల్ అవుతోంది. యూపీ కాన్పూర్కు చెందిన 32 ఏళ్ల అభయ్ సచాన్ను విధి విచిత్రంగా మరణంతో చుట్టుకెళ్లిపోయింది. అభయ్.. సోమవారం దగ్గరి బంధువుల వివాహం కోసం మధ్యప్రదేశ్ రేవాకు వచ్చాడు. మంగళవారం రాత్రి వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్లు చేశాడు. అలా గంతులేస్తూనే ఉన్నట్లుండి.. నెమ్మదిగా కిందకు వాలిపోయాడతను. అది గమనించిన బంధువుల దగ్గరికి వెళ్లి చూసేసరికి.. అతనిలో ఎలాంటి చలనం లేదు. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్ట్తో అప్పటికే కన్నుమూశాడని వైద్యులు ప్రకటించారు. పైగా షాకింగ్ విషయం ఏంటంటే.. అతను మద్యం మత్తులో లేడట. అతను పరిపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నాడని వైద్యులు ప్రకటించడం. దీంతో ఆ యువకుడి మరణాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. అలా పెళ్లింటి విషాదం నెలకొని.. అతని సంతాప సభను నిర్వహించాల్సి వచ్చింది. సెలబ్రిటీలే కాదు.. ఇలాంటి మరణాలకు ఎవరూ అతీతులు కావడం లేదు. పదుల వయసున్న పిల్లల దగ్గరి నుంచి యుక్త వయసు కుర్రకారు కూడా ఇలాంటి మరణాల బారినపడుతోంది. వైద్య నిపుణులు సైతం ఇలాంటి మరణాలకు ఒక స్పష్టత అంటూ ఇవ్వలేకపోతుండగా.. అధ్యయనాలు మాత్రం రకరకాల నివేదికలను ఇస్తూ పోతోంది. 18 Jan 2023 : 🇮🇳 : On Camera, Abhay Sachan(32) dancing at Wedding collapses and Dies due to 🫀arrest💉... He is a resident of Uttar Pradesh's Kanpur districts, had come to Rewa for the wedding.#heartattack2023 #heartattack #cardiacarrest pic.twitter.com/FQFeZA3ZNa — Anand Panna (@AnandPanna1) January 18, 2023 -
బెంగుళూరు ఘటన: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా!
మంగళవారం బెంగుళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలి మహిళ, ఆమె కుమారుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బాధితురాలి భర్త, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో తాను సర్వ కోల్పోయానంటూ బాధితురాలి భర్త కన్నీటిపర్యంతమయ్యారు. మంగళవారం. ఈ మేరకు బాదితురాలి భర్త లోహిత్ ఆ సంఘటన గూర్చి వివరిస్తూ..."తాము నలుగురు బైక్పై వెళ్తున్నాం. వారిని స్కూల్ వద్ద దించి ఆఫీసుకి బయలుదేరాల్సి ఉండగా..సెకను వ్యవధిలో ఘెరం జరిగిపోయింది. వెనక్కి తిరిగి చూసేటప్పటికీ నా భార్య, పిల్లలు పడిపోయి ఉన్నారు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు" అని లోహిత్ ఆవేదనగా చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని బాధితురాలి భర్త లోహిత్ ప్రభుత్వాన్ని కోరారు. మరోకరు ఎవరూ ఈ పరిస్థితిని ఎదుర్కొనకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి మదన్కుమార్ మాట్లాడుతూ..ఆ కాంట్రాక్ట్ పనులు నిలిపి వేసేంత వరకు తమ కుమార్తె మృతదేహ్నాన్ని తీసుకోమని కరాఖండీగా చెప్పారు. ఆ కాంట్రాక్ట్ లైసెన్స్ రద్దు చేసేంత వరకు కూడా కూతురి మృతదేహాన్ని తీసుకోను అని చెప్పారు. అయినా ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరూ అనుమతిచ్చారని ప్రశ్నించారు. అలాగే టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేశారు. తాను కోర్టులో ఈ విషయం గూర్చి తేల్చకుంటానంటూ మండిపడ్డారు. కాగా మృతురాలి అత్తగారు నిర్మల మాట్లాడుతూ..."దావణగెరె నుంచి 10 రోజుల క్రితం బెంగళూరు వచ్చి పిల్లలను స్కూల్కి దింపెందేకు వెళ్లింది. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారులెవరూ ఘటనాస్థలికి రాలేదని వాపోయారు. అలాగే బాధితురాలి మామగారు, బావగారు కూడా ..కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ సీరియస్ అయ్యారు. దయచేసి వెంటనే వాటిని నిలిపేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతురాలి కుటుంబానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సుమారు రూ. 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంతేగాదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన అని, ఈ నిర్మాణ పనుల్లో లోపాలు ఉంటే వెంటనే విచారణ చేయాల్సిందిగా అదికారులను ఆదేశించారు కూడా. (చదవండి: బెంగుళూరులో విషాదం.. మెట్రో పిల్లర్ కూలి తల్లీ, మూడేళ్ల కొడుకు మృతి) -
హైదరాబాద్ కూకట్ పల్లిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
కూకట్పల్లిలో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం
-
థాయ్ ప్రిన్స్కి తీవ్ర అస్వస్థత.. కోలుకోవాలని ప్రజలంతా...
థాయ్లాండ్ రాజు వజిరాలాంగ్కార్న్ పెద్ద కుమార్తె థాయ్ యువరాణి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె బ్యాంకాక్కి ఉత్తరాన ఉన్న నఖోన్ రాట్చాసిమాలో జరుగుతున్న మిలటరీ శునకాల శిక్షణ కార్యక్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో ఆమెను హుటాహుటినా బ్యాంకాక్లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె ఇంటిన్సివ్ కేర్లో చికిత్స పొందుతున్నారు . ఆమె గుండె, ఊరితిత్తులు, కిడ్ని సరిగా పనిచేయడం లేదని థాయ ప్యాలెస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం ఆయా భాగాలకి వైద్యపరికరాల అమర్చి చికిత్స అందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి థాయ్లాండ్ రాజ్యం వారసత్వ నియమాలు పురుషులకే అనుకూలంగా ఉంటాయి. పైగా రాజు తర్వాత వారసుడిగా పురుషులనే ప్రకటిస్తారు. కాగా, అస్వస్థతకు గురయ్యినా 44 ఏళ్ల ప్రిన్స్ బజ్రకితియాభా మహిడోల్ని థాయ్లాండ్లోని ప్రజలు ప్రిన్సెస్ భా అని పిలుస్తారు. ఆమె థాయ్ రాజు మొదటి భార్య ఏకైక సంతానం. ఆమె థాయ్ రాజ్యంలో చాలా కీలక పాత్ర పోషించి అందరీ మన్ననలను అందుకుంది. ఆమె ఒక చిన్న అభియోగానికి 15 ఏళ్లు వరకు జైలు శిక్ష విధించే పరువు నష్టం వంటి చట్టాలను విమర్శిస్తూ..ప్రజలను రక్షిస్తుందనే మంచి పేరు ఆమెకు ఉంది. ప్రజలంతా రాజకుటుంబంలోని సదరు యువరాణికే పెద్ద పీఠ వేస్తారు. ప్రస్తుతం రాజ్యంలోని ప్రజలంతా ఆమె త్వరగా కోలుకోవాని ప్రార్థనలు చేయడమేగాక ఆమె త్వరగా కోలుకోవాలంటూ పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ప్రచురిస్తున్నారు. (చదవండి: 5 ఏళ్లైనా వీడని దంపతుల డెత్ మిస్టరీ..హంతకుడి తలపై ఏకంగా 300 కోట్లు) -
మహారాష్ట్ర : బల్లార్షా రైల్వేస్టేషన్ లో ఘోర ప్రమాదం
-
విషాద ఘటన: నాన్స్టాప్ డెలివరీలతో కుప్పకూలాడు
పండుగ సీజన్లను క్యాష్ చేసుకోవడం ఈ-కామర్స్ సంస్థలకు అలవాటైన పనే. అదే సమయంలో డెలివరీ ఏజెంట్లకు కూడా చేతి నిండా పని ఉంటుంది కూడా. అయితే ఆ పని హద్దులు దాటిపోతే. కంపెనీ ఇచ్చే టార్గెట్ను రీచ్ కావాలనే ఆత్రుతతో హక్కులు లేని గిగ్ సెక్టార్ ఉద్యోగులు తీవ్రంగా పని చేస్తుంటారు. సరిగా ఇలాంటి ఘటనే ఓ డెలివరీ ఏజెంట్ ప్రాణం తీసింది. ఆ డెలివరీ ఏజెంట్.. ఆర్డర్లను కస్టమర్లకు అందించడానికి యత్నించాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా పని చేశాడు. రోజుకు 14 గంటలపాటు ఒక వారం రోజులు పని చేశాడు. విరామం లేకుండా పని చేసే సరికి బాడీ అలిసిపోయింది. చివరకు ఆ వ్యాన్లోనే హ్యాండిల్పై కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. యూకేలో డెలివరీ ఏజెంట్గా పని చేస్తున్న వారెన్ నోర్టన్ (49).. డైనమిక్ పార్సిల్ డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్ల డెలివరీ చేస్తున్నాడు. ఇందుకోసం రెండేళ్లుగా తన వ్యాన్ను ఉపయోగించుకుంటున్నాడు. అయితే.. బ్లాక్ ఫ్రైడే తరుణంలో విపరీతమైన ఆర్డర్లు రావడంతో విరామం ఎరుగకుండా పని చేశాడు. రోజులో 14 గంటలు ఆర్డర్లు డెలివరీ చేస్తూనే ఉన్నట్టు తెలుస్తున్నది. అలా ఓ వారంపాటు డెలివరీ చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో.. బుధవారం ఉదయం వ్యానులో డెలివరీకి వెళ్లిన ఆయన.. అలాగే స్టీరింగ్పై కుప్పకూలి పోయాడు. అది గమనించిన ఓ కస్టమర్.. డోర్ తెరవడంతో సరాసరి రోడ్డు మీదకు పడిపోయాడు. వెంటనే సీపీఆర్ ప్రయత్నం చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. సదరు కంపెనీకి సమాచారం అందించడంతో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. పని ఒత్తిడితోనే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు పరిమితికి మించి పని చేయడంతోనే అతను చనిపోయినట్లు ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు చెప్తున్నారు. అయితే.. ఆ కంపెనీ మాత్రం పని ఒత్తిడి ఆరోపణలను కొట్టేసింది. న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటామని చెబుతూ.. వారెన్ నోర్టన్ మృతిపై మొక్కుబడిగా ఒక సంతాప ప్రకటన విడుదల చేసింది. -
మోర్బీ ఘటన.. మరో వంద మందికిపైగా జలసమాధి!
న్యూఢిల్లీ: సరదా.. పెను విషాదాన్నే మిగిల్చింది. గుజరాత్ మోర్బీ కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ప్రమాదంలో.. మృతుల సంఖ్య మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఘటన సమయంలో ఐదు వందల మందికి పైగా బ్రిడ్జి మీద ఉన్నట్లు ఒక అంచనా. ఇప్పటిదాకా 140 మందికిపైగా మృతదేహాలను వెలికి తీశాయి సహాయక సిబ్బంది. ఈ తరుణంలో.. సోమవారం చీకటి పడడంతో ఇవాళ్టికి రెస్క్యూ ఆపరేషన్ నిలిపి వేశారు. తిరిగి మంగళవారం ఉదయం సహాయక చర్యలు చేపడతామని వెల్లడించారు అధికారులు. ఇక ఘటనకు సంబంధించి గాయపడిన వాళ్లకు చికిత్స అందుతుండగా.. మరో వంద మందికిపైగా జాడ లేకుండా పోయినట్లు తెలుస్తోంది. దీంతో బుదర, మురికితో కూడి ఉన్న మచ్చు నది నీళ్లలో వందకుపైగా మృతదేహాలు చిక్కుకుని ఉంటాయని భావిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జికి.. ఏడు నెలలపాటు మరమ్మతుల పనులు జరిగాయి. అయితే.. రూల్స్ ప్రకారం ఎనిమిది నుంచి 12 నెలల పనుల తర్వాతే బ్రిడ్జి ప్రారంభం కావాలి. కానీ, గడువు కంటే ముందుగానే బ్రిడ్జిని అక్టోబర్ 26వ తేదీన ప్రారంభించారు నిర్వాహకులు. ఆదివారం సాయంత్రం బ్రిడ్జి కూలిన ఘటన చోటు చేసుకోగా.. ఇప్పటివరకు 141 మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాల్లో రెండేళ్ల చిన్నారి సహా 47 మంది చిన్నారుల బాడీలు ఉన్నట్లు గుర్తించారు. "15-20 boys were shaking the #MorbiBridge, after that the accident happened" : ◆ A person who survived the Accident speaks.#MorbiBridgeCollapse #MorbiBridge #MorbiTragedy pic.twitter.com/q9TySIreDx — The Analyzer- ELECTION UPDATES (@Indian_Analyzer) October 31, 2022 వారాంతం కావడంతో ఒక్కసారిగా బ్రిడ్జి మీదకు ఎక్కువ సంఖ్యలో జనాలు చేరారని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీ ప్రమాదానికి గల కారణాలు గుర్తించింది. బ్రిడ్జి నిర్మాణం నమునాను సైతం గ్యాస్ కట్టర్ల సాయంతో సేకరించి మరీ పరిశీలిస్తోంది బృందం. అయితే పది నుంచి పదిహేను మంది కుర్రాళ్లు.. బ్రిడ్జిని ఒక్కసారిగా ఊపేశారని అందుకే ప్రమాదం జరిగిందంటూ ఓ బాధితుడు మీడియాకు వెల్లడించాడు. So Sad, it's horrible#Morbi #MorbiBridgeCollapse#Corruption pic.twitter.com/RSXZFqvdIN — Yuvrajsinh Jadeja (@YAJadeja) October 31, 2022 మోర్బీ మున్సిపల్ అథారిటీ, అజంతా మానుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య మొత్తం పదిహేనేళ్ల పాటు కాంట్రాక్ట్ జరిగింది. ఇందులో భాగంగా గుజరాత్కు చెందిన వాచ్తయారీ కంపెనీ ఒరెవా గ్రూప్ బ్రిడ్జిని మెయింటెన్ చేస్తూ.. టికెట్ల మీద వచ్చే కలెక్షన్స్ను తీసుకుంటోంది. ఒక్కో వ్యక్తికి రూ.12-రూ.17 చొప్పున వసూలు చేస్తూ వస్తోంది. ఒరెవా గ్రూప్.. దేవ్ప్రకాశ్ సొల్యూషన్స్ అనే ఓ చిన్న కన్స్ట్రక్షన్ కంపెనీకి రినోవేషన్ బాధ్యతలను అప్పజెప్పింది. ఇక బ్రిడ్జి పునప్రారంభం గురించి మోర్బీ మున్సిపాలిటీకి ఎలాంటి సమాచారం అందలేదని తెలుస్తోంది. అయితే ఒరెవా మాత్రం సుమారు 2 కోట్ల రూపాయలతో.. ఏడు నెలల్లోనే పటిష్టంగా పనులు జరిపినట్లు ప్రకటించుకుంది. ఒక్కసారిగా చేరిన జనం.. కొందరు కావాలని ఊగిపోవడంతో.. మెటల్ కేబుల్స్ తెగిపోయి ఈ ఘోర ప్రమాదం జరిగిందని వీడియో ఆధారంగా తెలుస్తోంది. ఒరెవా మాత్రం.. ఒకవేళ జనాలు డ్యామేజ్ చేస్తే తప్పించి తాము చేపట్టిన రినోవేషన్ పనులకు ఎనిమిది ఏళ్ల మినిమమ్ గ్యారెంటీ నుంచి గరిష్టంగా పదిహేనేళ్ల గ్యారెంటీ ఉంటుందని ఒక ప్రకటన విడుదల చేసింది. అదీ బ్రిడ్జి ప్రారంభం కాకముందే.. 24వ తేదీనే కావడం గమనార్హం. ఇక ఈ ఘటనకు సంబంధించి కాంట్రాక్ట్తో పాటు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్లలో ఇద్దరు ఒరెవా గ్రూప్ ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇక కంపెనీకి సంబంధించిన ప్రధాన అధికారులు పరారీలో ఉన్నారన్న కథనాలపై జనాగ్రహం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ఎంతటి వాళ్లనైనా ఉపేక్షించేది లేదంటూ గుజరాత్ పోలీసులు ప్రకటించారు. ప్రత్యేక విచారణ బృందం (SIT) ద్వారా మోర్బీ కేబుల్ బ్రిడ్జి ప్రమాదం కేసు దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇదీ చదవండి: మోర్బీ తరహాలో దేశంలో జరిగిన విషాదాలు ఇవే.. -
మాట్లాడుతూనే కుప్పకూలిన ప్రొఫెసర్.. గుండెపోటుతో మృతి
పాట్నా: అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా, ఉత్సాహంగా కనిపిస్తూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల పెరిగిపోయాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో మరణిస్తున్నారు. అలాంటి సంఘటనే బిహార్లోని ఛాప్రా జిల్లాలో జరిగింది. ఓ మతపరమైన కార్యక్రమానికి హాజరైన రిటైర్డ్ ప్రొఫెసర్.. వేదికపై మాట్లాడుతూనే కుప్పుకూలిపోయారు. గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మారుతి మనాస్ ఆలయం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ప్రొఫెసర్ రనంజయ్ సింగ్.. ఆలయంలో శనివారం జరిగిన మతపరమైన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపై కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటు రావటంతోనే మరణించినట్లు వెల్లడించారు. VIDEO: हनुमान जयंती पर मंच से दे रहे थे भाषण, अचानक आया हार्ट अटैक; रिटायर्ड प्रोफेसर की मौत pic.twitter.com/cX8ehsxvyh — NDTV India (@ndtvindia) October 23, 2022 ఇదీ చదవండి: హైవేపై కరెన్సీ నోట్ల వర్షంతో ఎగబడిన జనం.. భారీగా ట్రాఫిక్ జామ్! -
బ్రిటన్ రాణి శవపేటిక వద్ద ఊహించని ఘటన.. రాయల్ గార్డ్కి ఏమైంది!
బ్రిటన్ను సుదీర్ఘ కాలం పాలించిన క్వీన్ ఎలిజబెత్-2 ఇటీవలే తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. కాగా. రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. వందల ఏళ్లుగా వస్తున్న సంప్రదాయాన్ని పాటిస్తూ.. రాణి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. విండ్సర్ క్యాజిల్లోని సెయింట్ జార్జ్ చాపెల్లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు. ఇక, రాణి పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్మినిస్టర్ హాల్లో ఉంచుతారు. ఇందులో భాగంగా రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్హౌజ్ కోటకు తరలించారు. మంగళవారం అక్కడి నుంచి విమానంలో లండన్కు తీసుకొచ్చారు. https://t.co/OzckR639WV#RoyalGuard #Queen's #coffin #collapsed #QueenElizabethII #video #Westminster #Watch: Royal Guard collapses in front of Queen Elizabeth II's coffin at Westminster#viralvdoz #BreakingNews pic.twitter.com/97x7dCMHL5 — ViralVdoz (@viralvdoz) September 15, 2022 ఇదిలా ఉండగా.. వెస్ట్మినిస్టర్ హాల్లో క్వీన్స్ శవపేటికను కాటాఫాల్క్ అని పిలిచే ఎత్తైన వేదికపై ఉంచారు. రాణి పార్థివదేహాన్ని సందర్శించి పెద్ద సంఖ్యలో ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. ఈ తరుణంలో ఎవరూ ఊహించని ఘటన చోటుచేసుకుంది. శవపేటిక వద్ద విధులు నిర్వహిస్తున్న రాయల్స్ బాడీగార్డ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు నిల్చున్న ఓ గార్డ్.. కిందపడిపోవడంలో అక్కడున్న ఇతర గార్డ్స్ అతడి వద్దకు పరిగెత్తుకుని వచ్చారు. కాగా, సదరు గార్డ్ నీరసంగా ఉన్న కారణంగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తోంది. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 'Thousands have travelled from all corners of the UK and the world to pay their respects to the Queen.' GB News' Theo Chikomba reports as Queen Elizabeth II's coffin Lies-In-State in Westminster Hall, where she will remain until the morning of the funeral on Monday. pic.twitter.com/K5ypw5FD8B — GB News (@GBNEWS) September 15, 2022 -
తరగతి గదిలో ఒక్కసారిగా కుప్పకూలిన ఏడో తరగతి విద్యార్థిని
-
నెల్లూరులో విషాదం.. క్లాస్రూంలో కుప్పకూలి విద్యార్థిని మృతి
సాక్షి, నెల్లూరు: జిల్లాలోని వింజమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పెనువిషాదం చోటు చేసుకుంది. పదమూడేళ్ల షేక్ సాజీదా అనే విద్యార్థిని.. తరగతి గదిలోనే ఒక్కసారిగా కుప్పకూలి కన్నుమూసింది. చిన్నవయసులోనే చిన్నారి కన్నుమూయడం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. ఏడో తరగతి చదువుతున్న సాజీదా.. క్లాస్ రూంలో టీచర్ ప్రశ్నలు అడగడంతో లేచి సమాధానాలు ఇస్తోంది. అయితే ఒక్కసారిగా ఆ చిన్నారి కుప్పకూలింది. వెంటనే స్కూల్ సిబ్బంది హుటాహుటిన స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె కన్నుమూసినట్లు డాక్టర్లు ప్రకటించారు. గుండె పోటుతో సాజీదా మృతి చెందిదని ప్రాథమికంగా చెబుతున్నా.. పూర్తిస్థాయి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తేనే మృతికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు స్పష్టత ఇస్తున్నారు. సమాధానాలు చెబుతూ హఠాత్తుగా ఆమె కుప్పకూలిందని.. ఫిట్స్ అనుకుని తాళాలు చేతిలో పెట్టినా ప్రయోజనం లేకుండా పోయిందని బయాలజీ టీచర్ చెబుతున్నాడు. ఆ వెంటనే సహోద్యోగి సాయంతో ఆస్పత్రికి తరలించామని తెలిపాడాయన. మరోవైపు సాజీదాకు ఎలాంటి గుండె సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలూ లేవని సాజీదా కుటుంబం కన్నీళ్లతో చెబుతోంది. పదమూడేళ్ల వయసుకే గుండెపోటుతో మృతి చెందిందన్న వార్త.. స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. ఇదీ చదవండి: మానవత్వం మరిచి.. వదినపై కర్రలతో దాడి.. -
హనుమాన్ వేషాధారణతో డ్యాన్స్.. ఉన్నట్టుండి స్టేజ్పై కుప్పకూలడంతో..
లక్నో: చావు ఎప్పుడు ఎవరిని ఎటునుంచి పలకరిస్తుందో చెప్పడం కష్టం. అప్పటి వరకు బాగానే ఉన్నా.. క్షణకాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో హఠాన్మారణాలు ఎక్కువైపోయాయి. కళ్లముందేనవ్వుతూ కనిపించిన వారు ఉన్నట్టుండి ఊపిరి వదులుతున్నారు. కొన్నిసార్లు ఊహించని రీతిలో మృత్యువు మనిషిని తీసుకెళ్లి పోతుంది. తాజాగా గణేష్ ఉత్సవాల్లో నృత్య ప్రదర్శన చేస్తూ ఓ కళాకారుడు ఉన్నట్టుండి ప్రాణాలు విడిచాడు. ఈ షాకింగ్ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గణేష్ చతుర్థి వేడుకల్లో భాగంగా మెయిన్పురి కొత్వాలి ప్రాంతంలోని శివాలయంలో భజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో రవి శర్మ అనేక కళాకారుడు హనుమంతుని వేషధారణలో గణేష్ మండపం వద్ద లైవ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. తన హుషారైన నటనతో అక్కడున్న పిల్లల్ని, పెద్దల్ని అలరించాడు. రవి శర్మ ప్రదర్శన చూసి అక్కడున్నవారంతా అతనిలో ఉత్సాహాన్ని నింపారు. చదవండి: మోదీ ఫొటోలు కనిపించాలా?.. నిర్మలా సీతారామన్గారూ ఇదిగో! అయితే స్టేజ్పై ప్రదర్శన చేస్తుండగా మధ్యలోనే రవి శర్మ ఉన్నట్టుండి కుప్పకూలి కిందపడిపోయాడు. ఏమైందో తెలుసుకునేందుకు అక్కడున్న వారికి కాస్తా సమయం పట్టింది. ఎంతకీ రవి శర్మ లేవకపోవడంతో అనుమానం వచ్చి అతన్ని లేపగా స్పృహ కోల్పోయి ఉన్నాడు. దీంతో వెంటనే అతన్ని మెయిన్పురి జిల్లా అసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. #मैनपुरी गणेश मूर्ति पंडाल में युवक नाचते समय बेहोश होकर गिरा हनुमान जी का रूप धर नाच रहा था युवक जिला अस्पताल में डॉक्टरों ने मृत घोषित किया मैनपुरी सदर कोतवाली के मोहल्ला बंशीगोहरा का मामला@mainpuripolice #HanumanJi #GaneshUtsav #network10 #ekdarpan pic.twitter.com/clHPTZSWm4 — Network10 (@Network10Update) September 4, 2022 -
షాకింగ్ వీడియో: బస్సు ఫుట్బోర్డు నుంచి పట్టుతప్పి..
వైరల్: రన్నింగ్ బస్సు నుంచి పట్టుతప్పి రోడ్డున పడ్డ ఓ పిలగాడి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో.. కొందరు విద్యార్థులు, ఇతరులు ప్రమాదకర పరిస్థితుల్లో ఫుట్బోర్డు ప్రయాణం చేస్తున్నారు. అయితే.. అంతమందితో వేగంగా వెళ్తున్న బస్సు నుంచి హఠాత్తుగా పట్టుతప్పి కిందపడిపోయాడు ఆ స్టూడెంట్. కాస్తుంటే బస్సు వెనుక చక్రం కిందకు వెళ్లిపోయేవాడే. వెనుక కూడా ఏం వాహనాలు రాకపోవడంతో.. అదృష్టవశాత్తూ పిలగాడు ప్రాణాలతో బయటపడగలిగాడు. ఈ ఘటనను బస్సును బైక్పై ఫాలో అవుతూ వస్తున్న యువకులు వీడియో తీసినట్లు తెలుస్తోంది. సెంథిల్ కుమార్ అనే వ్యక్తి తమిళనాడులో కాంచిపురం జిల్లాలో ఈ ఘటన జరిగినట్లు మొదటగా ట్వీట్ చేశాడు.ఆ తర్వాత పలువురు తమ తమ అభిప్రాయాలతో ఈ ట్వీట్ను వైరల్ చేస్తుండడం విశేషం. Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs — Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022 చాలాచోట్ల విద్యాసంస్థల రూట్లలో తక్కువ బస్సులు నడిపిస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాయి ప్రభుత్వాలు. అయితే.. అత్యుత్సాహంతో కొందరు యువకులు హెచ్చరికలను పట్టించుకోకుండా ఫుట్బోర్డ్ ప్రయాణాలు చేయడం కూడా తరచూ చూస్తుంటాం. ఫుట్బోర్డు ప్రయాణం నేరం మాత్రమే కాదు.. ప్రాణాల మీదకు తీసుకొస్తుంది కూడా!. ఇదీ చదవండి: వద్దురా సోదరా.. ఒకే బైక్పై ఏడుగురు -
తృటిలో తప్పిన ప్రమాదం.. కూలిపోయిన తహసీల్దార్ ఆఫీసు పైకప్పు
సాక్షి, నిర్మల్ అర్బన్: జిల్లా కేంద్రంలో ఉన్న తహసీల్దార్ ఆఫీసు భవనం పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భవనం పైకప్పు కూలిపోతున్న సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, భవనం పరిస్థితిపై గత కొంతకాలంగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, శుక్రవారం మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా భవన పైకప్పు కూలిపోతున్న సమయంలో పెద్ద శబ్ధం రావడంతో అక్కడున్న వారంతా భయాందోళనకు గురయ్యారు. ఇక, కొద్దిరోజలు నుంచి నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. -
స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విషాదం
-
విషాద ఘటన: దేశభక్తితో ప్రసంగిస్తూనే కుప్పకూలాడు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు. దేశభక్తితో తండ్రి ప్రసంగిస్తుండగా, అతడిని వీడియోలో బంధిస్తున్న కూతురు. చుట్టూ పండుగ వాతవరణం. అప్పటిదాకా కోలాహలంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా విషాద చాయలు నెలకొన్నాయి. ప్రసంగిస్తున్న వ్యక్తి.. ఉన్నట్టుండి కుప్పకూలాడు. అందరూ చూస్తుండగానే మృత్యు ఒడికి చేరాడు. ఈ విషాద ఘటన కాప్రా, వంపుగూడలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీవిల్లాస్లో పంద్రాగస్టు వేడుకలను నిర్వహిస్తున్నారు. కాలనీ అసోసియేషన్ సభ్యుడైన ఉప్పల సురేశ్ కూతురు మైత్రితో కలిసి స్వాతంత్ర వేడుకలకు వచ్చాడు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతున్నాడు. స్వాతంత్య్రోద్యమ చర్రితను చెబుతూ.. కుప్పకూలిపోయాడు. గుండెపోటు వచ్చి కూతురు చూస్తుండగానే మృత్యుఒడిలోకి చేరుకున్నాడు. సురేష్ అకస్మాత్తుగా మృతి చెందడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. బాగ్అంబర్పేట్ డీడీ కాలనీలో ఫార్మాస్యూటికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న సురేష్కు తల్లిదండ్రులు యాదగిరి, సరోజని, భార్య కరుణ, కూతురు మైత్రి, కొడుకు ధర్మపాల్ ఉన్నారు. తండ్రి యాదగిరి హైదరాబాద్లోని సీతాఫల్మండిలో ఉన్న వేదిక్ విద్యాలయ అధ్యక్షుడుగా ఉన్నారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన యాదగిరి, కొడుకు మరణవార్త విని హుటాహుటిన ఇంటికి వచ్చాడు. విగతజీవిగా పడి ఉన్న కొడుకును చూసి ఆయన బోరున విలపించడం అందరిని కంటతడి పెట్టించింది. సురేశ్ కూతురు మైత్రి సీఏ చదువుతుండగా, కొడుకు ధర్మపాల్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. తల్లిదండ్రులను చూసేందుకు ధర్మపాల్ రెండ్రోజుల క్రితమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చాడు. (క్లిక్: హైదరాబాద్ శివారులో కాల్పుల కలకలం) -
నడి రోడ్డు పై సొమ్మసిల్లి పడిపోయిన గుర్రం... తిట్టిపోస్తున్న జనాలు
భారత్లో భారీ వర్షాలతో జలాశయాలన్ని పూర్ణ కుంభంలా ఉంటే యూఎస్, యూకేలో భానుడు భగ భగ మంటున్నాడు. దీంతో అక్కడ పలు చోట్ల రైలు పట్టాలు వేడికి వంకర్లు తిరగడం, అగ్నిప్రమాదాలు చోటు చేసుకోవడం వంటి ఘటనలు చోటు చూసుకున్నాయి కూడా. అక్కడ వేడి గాలులకు జంతువులు సైతం తాళ్లేక నీటి కోసం ఆర్రులు చాచుతున్నాయి. తాజాగా న్యూయార్క్ ఒక గుర్రపు బండికి ఉన్న గుర్రం వేడిగాలుకు సొమ్మసిల్లి పడిపోయింది. అసలేం జరిగిందటే... అమెరికాలో ఎండలు విపరీతంగా కాస్తున్నాయి. ఆ ఎండల ధాటికి ఒక గుర్రం సోమ్మసిల్లి పడిపోయింది. ఆ గుర్రం ప్రసిద్ధిగాంచిన గుర్రపు జాతుల్లో ఒకటి. గుర్రపు బండికి ఉన్న గుర్రం రోడ్డు పై వెళ్తు వెళ్తూ... మాన్హాటన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. ఆ గుర్రానికి నెత్రిపై సుర్ర మంటున్న ఎండ మరోవైపు వేడిగా ఉన్న తారు రోడ్డు, ఈ రెండిటి ధాటికి బండిని లాగలేక పడిపోయింది. దీంతో రహదారిపై ఉన్న జనాలు ఆ గుర్రపు బండిని తోలే వ్యక్తి పై మండిపడ్డారు. పైగా ఆ వ్యక్తి గుర్రం పడిపోవడానికి ముందు బండిని లాగేలా...కొరడాతో గట్టిగా కొట్టాడాని ఆరోపణలు చేశారు. ఒక్క పక్క వేడుగాలులు, దీనికి తోడు అతను కొట్టడంతో ఆ గుర్రం నడవలేక పోయిందంటూ సదరు వ్యక్తిని తిట్టడం మొదలు పెట్టారు. ఈ ఘటనతో న్యూయార్క్ అధికారులు ఆ గుర్రాన్ని నీటితో తడుపుతూ సపర్యలు చేశారు. గుర్రాన్ని సంరక్షించే వ్యక్తి కూడా దాన్ని తిరిగి లేచి నిలబడేందుకు సాయం అందిస్తున్నాడు. కానీ ఆ గుర్రం లేచి నిలబడే స్థితిలో లేదు. జంతు ప్రేమికులు ఈ గుర్రాన్ని రైడ్ చేయడానికి వినయోగించొద్దని అధికారులను కోరారు. వాస్తవానికి ఆ గుర్రానికి నరాల వ్యాధి ఉందని ఇలా పడిపోతుంటుందని న్యూయార్క్ గుర్రాల ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ చెబుతుండటం విశేషం. ప్రస్తుతం గుర్రం పశువైద్య సంరక్షణలో ఉందని, చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. BREAKING: This horse COLLAPSED while pulling a carriage in NYC, likely from heat exhaustion, and has been down for over an hour. Horses don’t belong in big cities where they’re put in constant danger because of cars, humans, weather, and more. pic.twitter.com/vXBVRJRjPB — PETA (@peta) August 10, 2022 (చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే!) -
వరంగల్: మండిబజార్లో పాత భవనం కూలి ఇద్దరు మృతి
-
యమునోత్రిలో కూలిన రహదారి భద్రత గోడ.. 10 వేల మంది యాత్రికులు..
ఉత్తరాఖండ్లోని యమునోత్రి ఆలయానికి వెళ్లే రహదారి భద్రతా గోడ శుక్రవారం ఒక్కసారిగా కూలిపోయిది. దీంతో రిషికేశ్-యమునోత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న 10 వేల మందికి పైగా యాత్రికులు చిక్కుకున్నారు. జంకిచట్టి వద్ద భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ రహదారులను పునరుద్ధరించడానికి కనీసం 3 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే చిన్న చిన్న వాహనాలను పంపడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్ద పెద్ద వాహనాల్లో ఉన్న యాత్రికులకు మాత్రం ఇబ్బందులు తప్పవని అధికారులు పేర్కొంటున్నారు. కాగా బుధవారం భారీ వర్షాలు కురవడంతో సయనచట్టి, రణచట్టి మద్య ఉన్న రహదారి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో 24 గంటలు మూసేసి తిరిగి గురువారం సాయంత్రం హైవే తెరిచారు. అయితే ఇంతలోనే మరోసారి రోడ్డు కూలిపోవడంతో ప్రస్తుత ఇబ్బంది పరిస్థితి తలెత్తినట్లు తెలుస్తోంది. చదవండి: విపరీతమైన ట్రాఫిక్తో కొట్టుమిట్టాడే నగరాల్లో ముంబై, బెంగళూరు.. -
Custard Apple: ప్రాణం తీసిన సీతాఫలం
సాక్షి, దుగ్గొండి (వరంగల్): వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం స్వామిరావుపల్లిలో ఆదివారం సీతాఫలాల కోసం వెళ్లి బాలుడు మృత్యువాత పడ్డాడు. గ్రామానికి చెందిన జమలాపురం శ్రీనివాస్– మమత దంపతుల కుమారుడు సన్ని(9) ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి సమీపంలోని జమలాపురం చిన్న సాంబయ్య ఇంటి ప్రహరీ పక్కనే ఉన్న సీతాఫలం చెట్టుపై పండ్లు కోయడానికి గోడ ఎక్కాడు, కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు గోడకూలి పెల్లలు సన్నిపై పడ్డాయి. దీంతో తీవ్రగాయాలైన సన్ని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహం వద్ద బాలుడి తల్లిదండ్రులు శ్రీనివాస్–మమత రోదనలు కంటతడిపెడుతున్నాయి. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై లక్ష్మారెడ్డి తెలిపారు. చదవండి: Hyderabad: పూల కుండీల్లో గంజాయి మొక్కలు -
ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది బాబు, యనమల
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ పాలనలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థను అథోగతిపాలు చేసిన ఘనత చంద్రబాబు, యనమల రామకృష్ణుడులదేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. ప్రజలంతా దసరా పండుగ హడావుడిలో ఉంటే.. చంద్రబాబు బ్యాచ్ కడుపుమంటతో ఇళ్లల్లో కూర్చుని అబద్దపు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకొంటోందని విమర్శించారు. విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ రెండేళ్ల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని దుష్ప్రచారాలు చేస్తున్నారన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో దాదాపు రూ.4 లక్షల కోట్ల అప్పుతెచ్చి ఏం చేశారని ప్రశ్నించారు. ఎప్పుడైనా ఒక్కపైసా పేద కుటుంబానికి సాయం చేశారా.. అని నిలదీశారు. తెచ్చిన అప్పు మొత్తాన్ని హారతి కర్పూరంలా చేసిన మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడతారా అని మండిపడ్డారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా నిధులు సమకూర్చి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్నారన్నారు. అమ్మ ఒడి పాత పథకమని, టీడీపీ కూడా అమలు చేసిందని యనమల చెప్పడం సిగ్గుచేటన్నారు. ‘మీ బతుకంతా నారాయణ, చైతన్య కార్పొరేట్ కాలేజ్లు, వాళ్ల స్కూళ్లు బాగుచేయడమే తప్ప.. ప్రభుత్వ పాఠశాలల గురించి ఏనాడైనా ఆలోచించారా..’ అని ఎద్దేవా చేశారు. నేరాలు బయటపడతాయనే నలుగురు ఎంపీలను బీజేపీలో కలిపారు కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే తమ ఆర్థిక నేరాలు ఎక్కడ బయటపడతాయోనని ఉన్న నలుగురు ఎంపీలను ఆ పార్టీలో కలిపేసిన మీరు ఆర్థిక నేరాల గురించి మాట్లాడతారా అని విమర్శించారు. తమ నాయకుడు ఇచ్చిన హామీ ప్రకారమే దశలవారీగా మద్య నిషేధం అమలు చేస్తున్నారని చెప్పారు. లిక్కర్బాబు అయ్యన్నపాత్రుడు లిక్కర్ ధర పెరుగుతోందని మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా కరెంట్ సంక్షోభం రానుందని నిపుణులు సైతం చెబుతున్నారన్నారు. మన రాష్ట్రంలోనే కరెంట్ కష్టాలు ఉన్నట్లు చంద్రబాబు ప్రజలను తప్పుదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 200 యూనిట్ల కరెంట్ ఉచితంగా కరెంట్ ఎక్కడ ఇచ్చారని మాట్లాడుతున్న యనమల, అయ్యన్నపాత్రుడుల కళ్లు మూసుకుపోయాయా.. అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో 1,25,791 మంది ఎస్టీ గృహ వినియోగదారులకు, 35,148 మంది ఎస్సీ గృహ వినియోగదారులకు 200 యూనిట్లలోపు ఉన్నవారికి ఉచితంగా కరెంటు ఇస్తున్నామని చెప్పారు. నీతిఆయోగ్ సైతం ఆర్బీకేలను ప్రశంసించిందన్నారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. గతేడాది రూ.500 కోట్ల నష్టం వస్తే ప్రభుత్వం రీయింబర్స్ చేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, వైఎస్సార్సీపీ నాయకుడు జోగినాయడు తదితరులు పాల్గొన్నారు. -
వైరల్ వీడియో: కుప్పకూలిన 7 అంతస్థుల భవనం
-
ముంబైలో కుప్పకూలిన నిర్మాణంలోని ఫ్లైఓవర్
-
అనంతపురం జిల్లా గుత్తిలో విషాదం
-
ఓరి భగవంతుడా .. ఇది మూన్నాళ్ల ముచ్చటేనా !
మల్కన్గిరి( భువనేశ్వర్): జిల్లాలోని కలిమెల సమితి, దుబేంకొండ గ్రామ వంతెన పూర్తిగా నేలమట్టమైంది. ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ వంతెన లేకపోవడంతో మొత్తం 3 గ్రామాల ప్రజలు తమ రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణం కోసం బాధిత గ్రామాల ప్రజలు పోరాడగా, సరిగ్గా ఏడాది క్రితం ఇక్కడి గెడ్డపై వంతెన నిర్మాణం చేపట్టారు. దీంతో తమ కష్టాలు గట్టెక్కాయని అనుకునేలోపు ఇటీవల కురిసిన వర్షాలకు వంతెన ఇలా నేలకూలడం పట్ల గ్రామస్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడం వల్లే ఇలా జరిగిందని, అధికారులు తక్షణమే స్పందించి, ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. -
విశాఖలో కుప్పకూలిన నిర్మాణం లో ఉన్న ఫ్లైఓవర్ పిల్లర్
-
గ్రౌండ్లో కుప్పకూలిన క్రికెటర్లు.. షాక్లో ఆటగాళ్లు
అంటిగ్వా: పాకిస్తాన్ వుమెన్స్తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్లో ఇద్దరు విండీస్ మహిళా క్రికెటర్లు చినెల్లె హెన్రీ, చెడియన్ నేషన్లు గ్రౌండ్లోనే కుప్పకూలడం ఆందోళన కలిగించింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఆటగాళ్లు అప్రమత్తమై సిబ్బందిని అలర్ట్ చేశారు. ఫిజియో వచ్చి వారిని పరీక్షించి స్ట్రెచర్పై మైదానం నుంచి తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. ''ప్రస్తుతం వారిద్దరు కోలుకుంటున్నారని.. వాతావరణ మార్పులు, విపరీతమైన వేడిని తట్టుకోలేక డీహైడ్రేట్ అయ్యారని వైద్యులు తెలిపారు. ఇప్పడు వారిద్దరు బాగానే ఉన్నారని'' వెస్టిండీస్ క్రికెట్ బోర్డు తెలిపింది. కాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ వుమెన్స్ డక్వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో పాకిస్తాన్పై విజయం సాధించింది. కాగా మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ వుమెన్స్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కైసియా నైట్ 30 నాటౌట్, చెడియన్ నేషన్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ వుమెన్స్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం రెండుసార్లు అంతరాయం కలిగించింది. దీంతో వర్షం అంతరాయం కలిగించే సమయానికి పాక్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 103 పరుగులతో ఆడుతోంది. దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం విండీస్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించారు. Match between Pakistan and West Indies women cricketers continues ... Suddenly West Indies women cricketer fainted and collapsed . She was shifted to a nearby hospital. Hopefully she will recover soon. VC: @windiescricket#WIWvPAKW #WIWvsPAKW pic.twitter.com/OjhJmWioeO — Qadir Khawaja (@iamqadirkhawaja) July 2, 2021 -
చూస్తుండగానే కూలిపోయింది.. పెద్ద ప్రమాదం తప్పింది
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్లోని 415 జాతీయ రహదారి అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఇటానగర్లోని గాంధీ పార్క్ డీ సెక్టార్ వద్ద మంగళవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రోడ్డు కుంగిపోయి ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. అయితే రహదారిపై వన్వేలో వాహనాలు అనుమతించడంతో ఘటన జరిగిన సమయంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. కాగా ఈ జాతీయ రహదారి ఇటానగర్-నహర్లాగున్లను కలుపుతుంది.తాజాగా ప్రమాదానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్గా మారింది. చదవండి: మాకొద్దీ కరోనా ట్రీట్మెంట్, ప్రాణాలు పోతే పోనీ #WATCH | Arunachal Pradesh: A portion of the National Highway-415, collapses after heavy rainfall, near Indira Gandhi Park in Itanagar pic.twitter.com/CoEUOIKB7N — ANI (@ANI) May 31, 2021 -
అమ్మ బాబోయ్.. రైలు వేగానికి స్టేషన్ భవనం కూలింది
భోపాల్: మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్ అందరు చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ సంఘటన బుర్హన్పూర్ జిల్లాలోని చందాని రైల్వే స్టేషన్లో బుధవారం సాయంత్రం జరిగింది. ఈ స్టేషన్ సెంట్రల్ రైల్వే భూసవాల్ రైలు డివిజన్ పరిధిలోకి వస్తుంది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నేపానగర్-అసిగర్ మధ్య బుధవారం సాయంత్రం 4 గంటల సమయంలో పుష్పక్ ఎక్స్ప్రెస్ 110 కిలోమీటర్ల వేగంతో స్టేషన్ గుండా వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సుమారు 14 సంవత్సరాల క్రితం నిర్మించిన స్టేషన్ భవనం రైలు వేగంగా వెళ్లడంతో ఆ ప్రకంపనలను తట్టుకోలేక కూలిపోయింది. ప్రమాదం జరగడానికి ముందు రైలుకు గ్రీన్ సిగ్నల్ చూపించడానికి అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ప్రదీప్ కుమార్ పవార్ తన కార్యాలయం నుంచి బయటికు రావడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటన జరిగినప్పుడు భవనంలో ఎవరూ లేరని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ తరహా ఘటన జరగడం దేశంలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు. జీఆర్పీ సిబ్బంది ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ కారణంగా పుష్పక్ రైలును 30 నిమిషాల పాటు రైల్వే స్టేషన్లోనే నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. లూప్ లైన్ ద్వారా రైళ్ల రాకపోకలను పునరుద్ధరించారు. చదవండి: ‘అంత్యక్రియలు అయ్యాక ప్రత్యక్షం.. దెయ్యమా ఏంటి?’ -
కుప్పకూలిన ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక నిర్మాణం
దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్న ద్వీపకల్పంలో పర్యాటకులను అమితంగా ఆకట్టుకునే ప్రసిద్ధ పర్యాటక కట్టడం కుప్పకూలిపోయింది. వైల్డ్లైఫ్ ప్రియులకు ఇది చేదువార్తే. గాలాపోగోస్ ద్వీపంలో సహజసిద్ధ రాతి కట్టడం డార్విన్ ఆర్చ్ అకస్మాత్తుగా కుప్పకూలింది. ఈ విషయాన్ని ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారికంగా ప్రకటించింది. సహజ సిద్ధ శిలా తోరణం ప్రస్తుతం రెండు స్తంభాలుగా మారి బోసిపోయి కనిపిస్తోంది. ఒకప్పుడు డార్విన్ ద్వీపంలో ఈ కట్టడం ఓ భాగంగా ఉందంట. కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఆ కట్టడం నీటిలోకి చేరిపోయింది. సముద్రపు నీటి మధ్యలో ఈ ఆర్చ్ అద్భుతంగా కనిపించేంది. ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్ డార్విన్ పేరు మీదుగా డార్విన్ ఆర్చ్ పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో దీనికి చోటు కల్పించింది. గాలాపాగోస్ ద్వీపం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ముఖ్యంగా అడ్వైంచర్స్, సాహసాలు చేయాలనుకున్న వారికి ఇది అనువైన ప్రాంతం. ఫొటో షూట్లకు పేరు పొందింది. డార్విన్ ఆర్చ్ కూలిపోయిందని ఈక్వెడార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ చారిత్రక సహజ కట్టడంలో ప్రస్తుతం రెండు స్తంభాలు మాత్రమే మిగిలి ఉందని చెబుతూ ఫొటోలు విడుదల చేసింది. The famed Darwin's Arch in the Galapagos Islands has lost its top, and officials are blaming natural erosion. The collapse was reported on Monday by the Ecuadorean Environment Ministry. pic.twitter.com/QeJZW8IIqp — CBS News (@CBSNews) May 19, 2021 కూలిన అనంతరం రెండు స్తంభాలుగా నిలిచిన సహజ శిలా తోరణం ‘డార్విన్స్ ఆర్చ్’ -
ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం...
సాక్షి, నిజామాబాద్: ఎల్లమ్మగుట్ట శివారులో విషాదం చోటు చేసుకుంది. మున్సిపల్ డ్రైనేజీ మరమ్మతులు చేస్తుండగా రైల్వే ప్రహరీ గోడకూలి ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అదే సమయంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. మట్టిలో మృత దేహాలు కూరుకుపోవడంతో జేసీబీ, ఫైర్ ఇంజన్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మృతులను మహారాష్ట్రలోని చంద్రపూర్క్ చెందిన కిషోర్, బాదల్గా గుర్తించారు. చదవండి: విషాదం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి లాయర్ల హత్య కేసు: ఏరోజు ఏం జరిగిందంటే..? -
షూటింగ్లో కుప్పకూలిన నటుడు
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో బాలీవుడ్ విలక్షణ నటుడు మిథున్ చక్రవర్తి నటిస్తోన్న చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్లో నటుడు మిథున్ చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి షూటింగ్లో కుప్పకూలిపోయాడు. దీంతో సడెన్గా చిత్రీకరణను నిలిపి వేశారు. ఈ మేరకు డైరెక్టర్ వివేక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిథున్ పాత్రపై పెద్ద యాక్షన్ సన్నివేశం కోసం షూట్ చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున్ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు. సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఆ పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరు. కానీ మిథున్ కొద్దిసేపు తీసుకొని విశ్రాంతి మళ్లీ వచ్చి షూట్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా షూట్ చేస్తారని నేను అస్సలు ఉహించలేను. కానీ మిధున్ చేశాడు. అందుకే అతను సూపర్ స్టార్ అయ్యాడు. చదవండి: మిథున్ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు తన నాలుగు దశబ్దాల కెరీర్లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదని ఇటీవల మిథున్ నాకు చెప్పాడు. మీ షూటింగ్ నా వల్ల ఆగిపోలేదు కదా అని నన్ను అడిగే వాడు. నాకు నిజంగా ఆశ్యర్యం వేస్తోంది. ఎందుకంటే ఇంతటి అంకితభావంతో పనిచేసేవాళ్లను ఈ తరం నటుల్లో ఎవర్ని చూడలేదు. మిథున్చాలా కష్టజీవి. ప్రతిరోజు షూట్కు వచ్చినప్పుడు అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. తన పని తాను వేగంగా చేస్తాడు. మిథున్ చక్రవర్తి లాంటి నటుడు ఉండటం ఏ మూవీ యూనిట్కైనా ఆస్తి వంటింది.’ అని వివేక్ పేర్కొన్నారు. కశ్మీరీ హిందువుల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ఒక చిన్న మెట్టులాగా ఉపయోగపడుతుందని వివేక్ అభిప్రాయపడ్డారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 2021 లో విడుదల కానుంది. -
చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్
-
కూలిన రెస్టారెంటు: 29 మంది మృతి
బీజింగ్: ఉత్తర చైనాలోని షాంగ్జి ప్రావిన్సులో జుక్సైన్ రెస్టారెంటు కుప్పకూలిన ఘటన విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం 9.40 నిమిషాలకు చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. రెండంతస్థుల భవనం శిథిలాల కింద నుంచి 59 మంది క్షతగాత్రులను బయటకు తీశారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగతా 21 మంది స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. ఆదివారం ఉదయం సహాయక చర్యలు ముగిసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం ఇంకా గుర్తించలేదన్నారు. కాగా ప్రమాదం జరిగిన రోజు ఆ రెస్టారెంటులో 80 ఏళ్ల వ్యక్తి బర్త్డే పార్టీ జరుపుకున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ వేడుకకు ఎక్కువమంది హాజరవడంతో బాధితుల సంఖ్య అధికంగా ఉందని తెలిపారు. (చదవండి: సాంబార్లో సగం బల్లి.. మిగతాది ఏమైనట్లు?!) చదవండి: ‘మహా’ విషాదంలో 13 మంది మృతి చైనాలో కుప్పకూలిన రెస్టారెంట్ ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
గాలివానతో కుప్పకూలిన మామిడి మార్కెట్
కోహెడ/హయత్నగర్: గాలివాన బీభత్సానికి రంగారెడ్డి జిల్లా కోహెడలోని మామిడి మార్కెట్ షెడ్లు కూలిపోయాయి. దీంతో అక్కడ మామిడి ప్యాక్ చేస్తున్న సుమారు 30 మంది కార్మికులకు గాయాలయ్యాయి. వీరిని దగ్గరలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. రూ.56 లక్షలతో 4 రేకుల షెడ్లను ఇటీవలే నిర్మించారు. సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో సోమవారం సాయంత్రం వచ్చిన గాలివానకు అవి తట్టుకోలేకపోయాయి. ఒక్క షెడ్డు పూర్తిగా కూలిపోగా, మిగిలిన 3 షెడ్లపై రేకులు కొట్టుకుపోయాయి. ఘటన జరిగిన సమయంలో సుమారు 1000 టన్నుల మామిడి మార్కెట్లో ఉంది. దీని విలువ రూ.1.60 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు తెలి పాయి. కాయలన్నీ దెబ్బతిన్నాయని రైతులు, వ్యాపారులు చెప్పారు. విషయం తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డిలు ఘటనా స్థలానికి వచ్చారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారులతో మాట్లాడుతున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇద్దరికి తీవ్ర గాయాలు : షెడ్డు కూలిన ఘటనలో తొర్రూర్కు చెందిన తిమ్మమ్మ, నాగోల్ జైపురి కాలనీకి చెందిన అన్వేష్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మల్లేష్, శ్రీహరి, రేణుక, లక్ష్మి, తిరుపతమ్మ, అనిల్కుమార్, సలీం షేక్, హజీ పాషా, గౌస్ పాషా, నర్సింహ్మా, మల్లమ్మ, హనుమంతు, శివ, ఆంజనేయులు, యాదగిరి, యాద య్య, మమత, లక్ష్మి, సునీత, హైమవతి, షేక్ దస్తగిరి, అంజమ్మ, నీలా, సత్తయ్య, యాద య్య, నర్సమ్మ, బుజ్జ మ్మ, జుబేర్ ఖాన్ ఉన్నారు. వీరిలో కొందరు కోహెడకు మరికొందరు సింగరేణి కాలనీకి చెందినవారు. ప్రస్తుతం వీరు హయత్నగర్, అబ్దుల్లాపూర్మెట్లోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో, వనస్థలిపురంలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. ఘటనా స్థలిని పరిశీలించిన ఆయన.. కమీషన్లకు ఆశపడి నాణ్యత లేని షెడ్లను నిర్మించారని ఆరోపించారు. చికిత్స పొందుతున్న బాలిక నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు మూడు ప్రాంతాల్లో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. సోమవారం ఆదిలాబాద్, నిజామాబాద్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలావుండగా మంగళవారం కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. అలాగే తూర్పు మధ్యప్రదేశ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావాలతో తెలంగాణలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
-
మ్యాచ్ ప్రారంభానికి ముందు కూలిన గ్రౌండ్ గ్యాలరీ
పాలక్కాడ్ : కేరళలోని పాలక్కాడ్ ఫుట్బాల్ గ్రౌండ్లో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుండగా.. గ్రౌండ్లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్యాలరీ కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 50 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఇండియన్ ఫుట్బాల్ ప్రముఖులు ఐఎమ్ విజయన్, భైచుంగ్ భూటియా అక్కడే ఉన్నారు. అయితే వారు క్షేమంగా ఉన్నట్టు కేరళ పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది డిసెంబర్ 29న ఆల్ ఇండియా సెవెన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో గుండెపోటుతో మరణించిన ఆర్ ధన్రాజన్ కుటుంబానికి సాయం అందించేందుకు నిధుల సేకరణ కోసం ఈ మ్యాచ్ను నిర్వహించారు. ఈ ప్రమాదంలో గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్టు పోలీసులు చెప్పారు. ఎవరు కూడా తీవ్రంగా గాయపడలేదని వెల్లడించారు. ఈ ఘటనపై పాలక్కాడ్ ఎంపీ వీకే శ్రీకందన్ మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ప్రారంభానికి ముందు గ్యాలరీ కూలిపోవడం దురదృష్టకరం. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికి తీవ్ర గాయాలు కాలేదని తెలుస్తోంది. గాయపడినవారికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, వాలంటీర్లు సాయం అందించారు’ అని తెలిపారు. -
షాకింగ్ వీడియో: కుప్పకూలిన వంతెన
తైపీ: తైవాన్లోని నాన్ఫాంగోలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం ఓ భారీ వంతెన అకస్మాత్తుగా కుప్పకూలింది. దీంతో దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారు. వాహనాల్లో ఉన్న ప్రయాణికులు నీటిలో పడి గల్లంతయ్యారు. దీంతో పోలీసులు హెలికాప్టర్లు డైవర్ల సాయంతో గాలింపులు జరుపుతున్నారు. అలాగే వంతెన కూలిన సమయంలో దాని కింద చేపలు పడుతున్న బోట్లు ఉన్నాయి. బోట్లపై వంతెన పడిపోవడంతో అవి పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో కొన్నింట్లో పెట్రోల్ ట్యాంకర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. అక్కడున్న సిబ్బంది స్థానికుల సహాయంతో వాటిని అదుపులోకి తీసుకువచ్చారు. -
నలభైయేళ్లుగా నిర్మాణం, ఒక్క రోజులోనే..
రాంచీ : నలభై రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న సాగునీటి కాలువ, సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఇరవై నాలుగ్గంటల్లోనే కొట్టుకుపోయింది. దీనికి అధికారులు చెప్పిన కారణం ఏంటో తెలుసా? ఎలుకలు పెట్టిన బొరియలు. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. వివరాలు.. నలభై రెండేళ్ల క్రితం ఉమ్మడి బిహార్లో హజారిబాగ్ జిల్లాలోని కోనార్ నదిపై ఈ కాలువ నిర్మాణం ప్రారంభమైంది. అప్పటి నిర్మాణ అంచనా వ్యయం రూ. 12 కోట్లు. కాలువ పూర్తయ్యేసరికి నాలుగు దశాబ్దాల సమయంతో పాటు అంచనా వ్యయం కూడా పెరిగి రూ. 2176 కోట్లకు చేరింది. ఎట్టకేలకు పూర్తైన కాలువను బుధవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రఘువర్దాస్ బుధవారం ప్రారంభించి, అధికారులు చేసిన కృషిని ప్రశంసించారు కూడా. అయితే గురువారం వచ్చిన వరదలకు కాలువ నామరూపాల్లేకుండా కొట్టుకుపోయింది. వరదల వల్ల 35 గ్రామాలతో పాటు పంటపొలాలు మునిగిపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కమిటీ వేసి 24 గంటల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ సంఘటనపై అధికారులను వివరణ అడగ్గా నివ్వెరపోయే సమాధానం వచ్చింది. కాలువ గట్లలో ఎలుకలు బొరియలు తవ్వడం వల్ల వరద నీరు లీకై కాలువ గట్టు కొట్టుకుపోయిందని ప్రాథమిక సమాచారం బట్టి తెలుస్తోందని వివరించారు. మరోవైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తూ, నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. -
నేలమట్టమైన బ్రిడ్జి
-
ఆధిపత్య పోరు.. ఆలయం కూల్చివేత
సాక్షి, సోమాపురం(కడప) : మండలంలోని సోమాపురం గ్రామంలో శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ వర్గీయులు గ్రామంలోని రామాలయాన్ని కూల్చివేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉన్న పాత ఆలయాన్ని కూల్చి వేసి దాని స్థానంలో నూతన ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు మూడేళ్ల క్రితం గ్రామస్తులు రూ.14లక్షల వరకు విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణ కమిటీ ఏర్పడింది. టీటీడీ నుంచి ఆలయ నిర్మాణం కోసం నిధులు కూడా మంజూరయ్యాయి. మూడేళ్లుగా నూతన ఆలయ నిర్మాణం పేరుతో ఇరువర్గాల మధ్య వివాదం నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు గ్రామంలో ఆలయ నిర్మాణంపై టీడీపీ నాయకులు తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలతో సమస్య తలెత్తగా, ఆలయ నిర్మాణం కమిటీలో మార్పులు జరగాలని గ్రామ ప్రజలందరికీ ఆమోదం ఉండాలని వైఎస్సార్సీపీ వర్గీయులు అభ్యంతరాలు తెలిపారు. ఎన్నికల అనంతరం గత వారం రోజుల నుంచి ఆలయ నిర్మాణం చేపట్టాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి ఆలయ కమిటీ నిర్వాహకులు సమావేశం నిర్వహించారు. ఇందులో ఉన్న ఒకే ఒక్క వైఎస్సార్సీపీ వర్గీయుడైన పోలు వెంకటరామిరెడ్డి ఆలయ కమిటీలో మార్పులు చేసి ఇరు వర్గీయులకు ఆమోదయోగ్యంగా చర్యలు తీసుకోవాలని సూచించాడు. దీనికి టీడీపీ నాయకులు ససేమిరా అనటంతో సమావేశం అర్ధంతరగా ఆగిపోయింది. ఇంతలో ఆలయ నిర్మాణం తమ ప్రమేయంతోనే జరగాలనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్రామంలోని రామాలయాన్ని ట్రాక్టర్ల సాయంతో కూల్చివేశారు. కాగా కొత్త ఆలయాన్ని నిర్మించే యోచనలో మూడు నెలల క్రితమే ఆలయంలోని విగ్రహాన్ని తొలగించి తాత్కాలికంగా పక్కనే ప్రతిష్టించారు. ఇంతలోనే ఆలయాన్ని కూల్చివేయడంతో వైఎస్సార్సీపీ వర్గీయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నరేంద్రకుమార్ దీనిపై మాట్లాడుతూ ఇరు వర్గీయులను కోర్టుకెళ్లాలని, కేసులు పెట్టాల్సి వస్తే ఇరువర్గాలపై పెట్టాల్సి వస్తుందని చెప్పటంతో సమస్య అలాగే ఉండిపోయింది. ఆలయం కూల్చిన సంఘటనకు సంబంధించి టీడీపీ వరీ ్గయులైన లెక్కల సుధాకర్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, అంకిరెడ్డిపల్లె చిన్న కొండారెడ్డి, మురళీమోహన్రెడ్డి,సుబ్బరామిరెడ్డి ఇంకా పలువురిపై పోలు వెంకటరామిరెడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
తిరుమలలో కూలిన నూతనంగా నిర్మిస్తున్న మఠం
-
హాల్ విమానాశ్రయం వద్ద కుప్పకూలిన మిరాజ్ 2000
-
వరద బీభత్సం :చెన్నైలో కూలిన బ్రిడ్జి
-
కూలిన కల్వర్టు
దేవరాపల్లి (మాడుగుల): దేవరాపల్లి నుంచి చోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో బోయిలకింతాడ గ్రామం వద్ద ఆర్అండ్బి కల్వర్టు కూలిపోయింది. సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ప్రమాదం జరగడ,తో ఆ రోడ్డుకు ఇరువైపుల రాకపోకలు నిలిచిపోయాయి. సుమారు 25 అడుగుల వెడల్పున ఉన్న కల్వర్టు కూలిపోయే సమయంలో దేవరాపల్లి నుంచి చోడవరం వైపు వెళ్తున్న బస్సు తృటిలో పెను ప్రమాదం నుండి తప్పించుకుంది. వందమందికి పైగా కాలేజీ విద్యార్థులతో చోడవరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు కల్వర్టు కూలిపోవడానికి ఒక్క క్షణం ముందు దాటిపోవడంతో రెప్పపాటులో ప్రమాదం నుండి బయటపడింది. దేవరాపల్లి నుంచి గవరవరం మీదుగా చోడవరం వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడంతో నిత్యం వేలాది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వాణిజ్య కేంద్రమైన చోడవరంలో కోర్టుల సముదాయంతోపాటు ట్రెజరీ కార్యాలయం తదితర సదుపాయాలు ఉండటంతో మండలంలోని దేవరాపల్లి, కాశీపురం, చిననందిపల్లి, పెదనందిపల్లి, తారువా, ఏ.కొత్తపల్లి, కెఎం పాలెం, మారేపల్లి, తెనుగుపూడి, వెంకటరాజుపురం, గరిశింగి, వాకపల్లి, తిమిరాం, కలిగొట్ల తదితర గ్రామాల ప్రజలు బోయిలకింతాడ మీదుగానే చోడవరానికి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే కల్వర్టు కూలిపోడంతో మండల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 8 కిలోమీటర్ల మేర అదనంగా ప్రయాణించి తారువా బ్రిడ్జి, మామిడిపల్లి, వేచలం మీదుగా గవరవరం శారదానదిపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాజ్వే పైనుంచి వెళ్లాల్సివుంటుంది. కాజ్వేపై నుంచి శారదానది ఉప్పొంగి ప్రవహిస్తే ఆ అవకాశం కూడా ఉండదు. అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా.. ఈ శిథిల కల్వర్టు కూలిపోతుందని స్థానిక తాజా మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ మండల యువజన అధ్యక్షుడు బూరె బాబురావు పలు మార్లు ఆర్అండ్బి అధికార్లు దృష్టికి తీసుకెళ్లడంతోపాటు మండల సర్వ సభ్య సమావేశంలో సైతం పలుమార్లు ఇదే సమస్యపై గళమెత్తారు. అప్పట్లో అధికార్లతో పాటు అధికార పార్టీ నేతలు పట్టించుకోలేదు. ఇసుక లారీ వలనే కూలిపోయింది..... బోయిలకింతాడ వద్ద కూలిపోయిన కల్వర్టును ఆర్అండ్బి ఏఈ కె.వెంకటేశ్వరరావు సోమవారం సిబ్బందితో కలిసి పరిశీలించారు. 10 టన్నులు బరువుకు మాత్రమే పర్మిషన్ ఉన్న ఈ రహదారిలో సుమారు 50 టన్నుల మేర అధిక బరువుతో ఉన్న ఇసుక లారీలు రాకపోకలు సాగించడం వలనే కల్వర్టు కూలిపోయిందని ఆయన స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి దేవరాపల్లి–చోడవరం ప్రధాన రహదారిలో బోయిలకింతాడ వద్ద కూలిన కల్వర్టు సమస్యను ఆర్అండ్బి ఎస్ఈ దృష్టికి తీసుకెళ్తాను. ప్రతీ రోజు వందలాది మంది విద్యార్దులు కాలేజీలకు, మండల ప్రజలు నిత్యం కోర్టులు, ట్రెజరీ తదితర పనులపై చోడవరం వెళ్లే ప్రధాన రహదారిలో కూలిన కల్వర్టుకు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులను యుద్దప్రాతిపదకన చేపట్టేలా అధికార్లుపై ఒత్తిడి తీసుకువస్తాను. ప్రజల రాకపోకలకు ఇబ్బంది లేకుండా తాత్కాలికంగా డైవర్షన్ రోడ్డు ఏర్పాటు చేసేలా కృషి చేస్తాను.–బూడి ముత్యాలనాయుడు, ఎమ్మెల్యే, మాడుగుల -
కుప్పకూలిన సీబీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదిన్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన గౌలిగూడలోని సెంట్రల్ బస్స్టేషన్(సీబీఎస్) నేలకూలింది. మిసిసిపీ హేంగర్గా నగర ప్రజలకు సుపరిచితమైన ఈ ప్రయాణ ప్రాంగణం గురువారం తెల్లవారుజామున కూలిపోయినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు వేలాది మంది ప్రయాణికులు, వందలకొద్దీ బస్సుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉన్న సీబీఎస్ శిథిలావస్థకు చేరడంతో ఆర్టీసీ అధికారులు కొద్దిరోజులుగా బస్సుల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అందులో ఉన్న దుకాణాలు, ప్రయాణికుల సదుపాయాలు, టికెట్ బుకింగ్ కేంద్రాలను తొలగించారు. అధికారులు ఊహించినట్లుగానే గురువారం సీబీఎస్ ఒకవైపు పూర్తిగా నేలకొరిగింది. రవాణా మంత్రి మహేందర్రెడ్డి, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మిసిసిపీ హేంగర్ను పరిశీలించారు. బస్స్టేషన్ కూలిపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తం చేశారు. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్స్టేషన్ నిర్మిస్తామని, ఈ అంశంపై ముఖ్యమంత్రితో చర్చించనున్నామని తెలిపారు. ఎంతోకాలంగా సీబీఎస్లోనే ఉపాధి పొందుతున్న స్థానికులు తమకు ప్రత్యామ్నాయం కల్పించాలని మంత్రిని కోరారు. దుకాణాలు కోల్పోయిన వారికి మరోచోట వాటిని ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇదీ మిసిసిపీ హేంగర్ చరిత్ర.. నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో మిసిసిపీ హేంగర్ను నిర్మించారు. 1926లో హైదరాబాద్ సంస్థాన ప్రధాన మంత్రి మహారాజా కిషన్ పరిషద్ అధ్యక్షతన నగరంలో బస్సు రవాణా వ్యవస్థ కోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఏడాది పాటు వివిధ రకాల రవాణా వ్యవస్థలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. అప్పటికే ఇంగ్లండ్లో పేరొందిన అల్బియన్ మోటర్ కంపెనీకి చెందిన బస్సులను హైదరాబాద్లో నడిపేందుకు చర్యలు చేపట్టారు. నిజాం స్టేట్ రైల్వేలో భాగంగా ఇవి రోడ్డెక్కాయి. అప్పట్లో పుతిలీబౌలీ కేంద్రంగా 27 బస్సులు, 166 మంది ఉద్యోగులతో బస్సు సదుపాయం అందుబాటులోకి వచ్చింది. బస్సులతో పాటు వాటిని నిలిపేందుకు బస్స్టేషన్ అవసరమని గ్రహించి.. విదేశాల్లో బస్సులు, రైళ్లు, విమానాల రిపేరింగ్కు ఉపకరించే షెడ్డుల మాదిరిగా గౌలిగూడలో ఒక భారీ షెడ్ నిర్మించాలని నిర్ణయించారు. ఏవియేషన్ హేంగర్ సాంకేతిక పరిజ్ఞానంతో ఇంగ్లండ్కు చెందిన బట్లర్ స్టీల్ కంపెనీ మిసిసిపీ హేంగర్ను నిర్మించింది. ఇందుకోసం ఆ దేశానికి చెందిన ఇంజనీరింగ్ నిపుణులు విడిభాగాలతో హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ సమశీతోష్ణ వాతావరణానికి అనుగుణంగా 1.77 ఎకరాల విస్తీర్ణంలో ఒక భవనంలా కాక అర్థచంద్రాకారంలో బస్సులు దక్షిణ దిశ నుంచి వచ్చి ఉత్తరం వైపు వెళ్లేలా నిర్మించారు. 1932 నుంచి వినియోగంలోకి రాగా.. మొదట్లో బస్సుల రిపేరింగ్, నైట్ హల్ట్ కోసం దీనిని వినియోగించారు. ఆ తర్వాత ప్రయాణికుల ప్రాంగణంగా సేవలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకూ.. 1951లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో భాగమైంది. మిసిసిపీ హేంగర్ నుంచే ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ బస్సులు నడిచేవి. 2004లో మహాత్మాగాంధీ బస్స్టేషన్(ఎంజీబీఎస్) నిర్మించే వరకూ గౌలిగూడ బస్స్టేషనే ప్రధాన బస్స్టేషన్గా ఉండేది. ఆ తర్వాత దీనిని సిటీ బస్సుల నిర్వహణ కోసం వినియోగించారు. ఇటీవల వరకూ గ్రేటర్ హైదరాబాద్లోని 29 డిపోలకు చెందిన 510 బస్సులు మిసిసిపీ హేంగర్ నుంచి రాకపోకలు సాగించాయి. ఈ మార్గంలో నిత్యం 2,385 ట్రిప్పులు తిరిగేవి. 85 వేల మంది రాకపోకలు సాగించేవారు. అలాగే కర్నూలు, కడప, నెల్లూరు, మహబూబ్నగర్ తదితర జిల్లాల బస్సులకు ఇది నైట్హాల్ట్గా ఉండేది. సంక్రాంతి, దసరా వంటి రద్దీ రోజుల్లో జిల్లాల బస్సులు ఎక్కువ శాతం ఇక్కడి నుంచే రాకపోకలు సాగించేవి. అనుమానాలెన్నో..? మిసిసిపీ హేంగర్ నుంచి నాలుగైదు రోజుల క్రితం వరకూ బస్సులు రాకపోకలు సాగించాయి. అలాంటి ప్రయాణ ప్రాంగణం దానికదిగా కూలిపోయినట్లుగా కాకుండా ‘యు’ఆకారంలో ఉన్న షెడ్డు దిగువ భాగం నిదానంగా నేలలోకి కూరుకుపోయిన తీరు, ముందస్తుగానే బస్సుల రాకపోకలను నిలిపివేయడం అనుమానాలకు తావిస్తోంది. షెడ్డు కింద ఉన్న నట్లు, బోల్టులు తొలగించడంద్వారా అది కుంగిపోయేలా చేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా దీనిని కూల్చివేశారని ఇంటాక్ సంస్థ ప్రతినిధి అనురాధారెడ్డి ఆరోపించారు. చారిత్రక, వారసత్వ కట్టడాలను పరిరక్షించకుండా కూల్చివేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అధునాతన బస్స్టేషన్ నిర్మాణం.. మిసిసిపీ హేంగర్ స్థానంలో అధునాతన బస్స్టేషన్ను నిర్మించేందుకు తెలంగాణ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అతిపెద్ద వాణిజ్య సముదాయాలను నిర్మించనున్నట్లు రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్శర్మ తెలిపారు. మొదటి అంతస్తులో బస్స్టేషన్.. ఆ పైఅంతస్తుల్లో షాపింగ్ మాల్స్, మల్టిప్లెక్స్లు, వినోద కేంద్రాలను నిర్మించనున్నారు. దీని ద్వారా ఆర్టీసీకి భారీగా ఆదాయం లభించగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఇందుకు కార్యాచరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సిటీ బస్సులతో పాటు కొన్ని జిల్లాల బస్సులను కూడా ఇక్కడి నుంచే నడపనున్నారు. -
ముంబైలో తప్పిన ఘోర ప్రమాదం
సాక్షి, ముంబై: మంగళవారం ఉదయం ముంబైలో ఘోర ప్రమాదం తప్పింది. భారీ వర్షాల కారణంగా అంధేరీ రైల్వే స్టేషన్ను ఆనుకుని ఉన్న గోఖలే రోడ్ ఓవర్ బ్రిడ్జి కొంత భాగం కుప్పకూలి ట్రాక్పై పడిపోయింది. ఆ సమయంలో రైళ్లేవి ఆ మార్గంలో రాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే పశ్చిమ లైన్పై రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. శకలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉండొచ్చని భావించిన అధికారులు.. వాటిని తొలగించేశారు. మరోవైపు బ్రిడ్జిపై ట్రాఫిక్ను నిలిపివేశారు. తూర్పు-పశ్చిమ అంధేరీలను కలుపుతూ గోఖలే బ్రిడ్జిని నిర్మించారు. వేలాది మంది ఈ వంతెనను వినియోగిస్తుంటారు. అయితే వేకువ ఝామున ప్రమాదం జరగటం, రద్దీ లేకపోవటంతో భారీ ప్రమాదం తప్పిందని అధికారి తెలిపారు. ఘటనలో ఇప్పటిదాకా ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు రైల్వేశాఖ వెంటనే చర్యలు చేపట్టింది. -
పేదల బతుకులు కూల్చేశారు!
కర్నూలు సీక్యాంప్ : వారంతా పేదలు. రెక్కల కష్టాన్ని నమ్ముకుని బతుకుతున్నారు. పొద్దున్నే బతుకు‘బండి’ తీసుకుని రోడ్డుపైకి వెళితే..రాత్రి పొద్దుపోయాక గానీ ఇళ్లకు తిరిగి రారు. వారంతా 40 ఏళ్లుగా అక్కడే బతుకుతున్నారు. అప్పట్లో ఖాళీ స్థలాల్లో పూరిగుడిసెలు, చిన్నపాటి ఇళ్లు నిర్మించుకున్నారు. వీటిని గురువారం నగర పాలక సంస్థ అధికారులు ఉన్నఫళంగా కూల్చేశారు. దాదాపు వంద కుటుంబాలను వీధిన పడేశారు. ‘అయ్యా..మాలాంటి పేదోళ్లపైనా మీ ప్రతాపం’ అంటూ బాధితులు కన్నీటి పర్యంతమైనా అధికారులు కనికరం చూపలేదు. కర్నూలు నగరంలోని సోనియాగాంధీ నగర్లో రోడ్డుపక్కన ఉన్న ఇళ్లు, గుడిసెల్లో పలువురు పేదలు నివాసముంటున్నారు. నగర పాలక సంస్థకు నీటి పన్ను, ఇంటిపన్నులు కడుతున్నారు. విద్యుత్ కనెక్షన్లు తీసుకుని..వాటి బిల్లులూ చెల్లిస్తున్నారు. అయితే..వీరి కారణంగా రోడ్డు ఆక్రమణకు గురైందని,ఇళ్లు, గుడి సెలను తొలగించాలంటూ సీతారాంనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు గతంలో హైకోర్టుకు వెళ్లారు. వారికి ప్రత్యా మ్నాయం చూపి కట్టడాలను తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో వారికి అధికారులు జగన్నాథగట్టుపై స్థలాలు చూపారు. అక్కడ నివాసముంటూ నగరంలోకి వచ్చి చిరువ్యాపారాలు, కూలి పనులు చేసుకోవడం కష్టంతో కూడుకున్న పని. ఈ నేపథ్యంలో బాధితులు సోనియాగాంధీ నగర్లోనే నివాసముంటున్నారు. అనువైన చోట ప్రత్యామ్నాయం చూపాలన్నది వారి భావన. అయితే..ఇదేమీ పట్టించుకోకుండానే గురు వారం నగర పాలక సంస్థ అధికారులు భారీ పోలీసు బందోబస్తుతో వచ్చి జేసీబీల సాయంతో ఇళ్లు,గుడిసెలను కూలగొట్టారు.సీతారాంనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యు లు ఈ స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని, వారికి అధికారులు కూడా అండగా నిలవడం బాధాకరమని బాధితులు వాపోయారు. తక్షణమే తమకు న్యాయం చేయకపోతే కలెక్టరేట్ ఎదుట మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. -
కదిరిలో రోడ్ల విస్తరణలో వివాదం
-
పసిఫిక్లో కూలిన స్కైలాబ్
బీజింగ్: చైనాకు చెందిన అంతరిక్ష ప్రయోగ కేంద్రం టియాంగంగ్–1 పసిఫిక్ మహా సముద్రంలో కూలిపోయింది. సోమవారం ఉదయం 5.45 గంటలకు (భారత కాలమానం) టియాంగంగ్–1 దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో కూలినట్లు చైనా అధికారులు వెల్లడించారు. టియాంగంగ్ వల్ల ఎక్కడా, ఎవ్వరికీ హాని జరగలేదనీ, భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే వేడికి దాదాపుగా దగ్ధమైపోయినట్లు చైనాలోని మ్యాన్డ్ స్పేస్ ఇంజనీరింగ్ ఆఫీస్ తెలిపింది. సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న ఆలోచనలో భాగంగా చైనా టియాంగంగ్–1ను 2011 సెప్టెంబరులో అంతరిక్షంలోకి పంపింది. దీని జీవితకాలం రెండేళ్లు ఉండేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొత్తం ఆరుగురు వ్యోమగాములు (ఇద్దరు స్త్రీలు, నలుగురు పురుషులు) అంతరిక్షంలో టియాంగంగ్లో పనిచేశారు. 2013 కల్లా ఇది తన ప్రధాన పనులను పూర్తి చేసినప్పటికీ టియాంగంగ్ సేవలను చైనా పొడిగించుకుంటూ వెళ్లింది. అయితే 2016లో ఇది పూర్తిగా పనిచేయడం మానేసి, నియంత్రణను కోల్పోయి కక్ష్య నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది. చివరకు సోమవారం మళ్లీ భూ వాతావరణంలోకి ప్రవేశించి సముద్రంలో కూలిపోయింది. ‘మా దగ్గర ఉన్న సమాచారం మేరకు టియాంగంగ్ కూలడం వల్ల భూమిపై ఎక్కడా ఎలాంటి హానీ జరగలేదు. 8 టన్నుల బరువు, 10.4 మీటర్ల పొడవున్న టియాంగంగ్ ఆకాశంలోనే చాలా వరకు కాలిపోయింది. అది చైనా చరిత్రలో నిలిచిపోతుంది. అంతరిక్ష కేంద్రంలో పరిశోధనల గురించి ఇది మాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెన్ షువాంగ్ చెప్పారు. -
కుప్పకూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. నలుగురు మృతి
-
ఘోర ప్రమాదం.. కూలిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి
ఫ్లోరిడా : మియామిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్తగా ప్రారంభమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి కూలిపోయిన ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 9 మందికి తీవ్ర గాయాలుకాగా వారిని ఆస్పత్రికి తరలించారు. భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో వాహనాలు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించగా.. తాజాగా దీనిని ప్రారంభించారు. సెల్ఫ్ ప్రొపెల్డ్ మాడ్యూలర్ ట్రాన్స్ పోర్టేషన్ విధానంలో అమెరికాలో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావటం గమనార్హం. ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని, ఘటనపై దర్యాప్తు చేపట్టామని అధికారులు తెలిపారు. మరోవైపు ప్రమాదంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Continuing to monitor the heartbreaking bridge collapse at FIU - so tragic. Many brave First Responders rushed in to save lives. Thank you for your courage. Praying this evening for all who are affected. — Donald J. Trump (@realDonaldTrump) March 15, 2018 -
అక్రమ కట్టడాలపై అధికారుల పంజా
మంచిర్యాలక్రైం: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టాడాలపై ఎట్టకేలకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్ శివారులో ఉన్న 345 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసి భూ పోరాటంలో భాగంగా నిరుపేదలు తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నారు. మరి కొంత మంది రియల్మాఫియాకు చెందిన వారు పక్కాగా నివాస గృహాలు నిర్మించారు. జిల్లాలో జరుగుతున్న భూ పోరాటం ముఖ్యమంత్రి వరకు చేరుకోవడంతో అధికారుల్లో కదలిక మొదలైంది. అక్రమ కట్టాడాలు నిర్మించుకున్న వారితో, వారిని ప్రోత్సహిస్తున్న పార్టీ నాయకులతో అధికారులు పలుమార్లు చర్చలు జరిపారు, ప్రభుత్వ స్థలాలను ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించారు. శుక్రవారం సుమారు 5వందల మంది పోలీస్ బలగాలతో రెవెన్యూ అధికారులు దగ్గరుండి అక్రమ కట్టాడాలను కూల్చి వేశారు. ఉదయం3 గంటల నుంచి.. డీసీపీ వేణుగోపాల్రావు, జేసీ సురేందర్రావులు పోలీసుల బలాగాలు, ఫారెస్టు, ఎక్సైజ్, మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటి, ఫైర్ సిబ్బందితో ఉదయం 3 గంటల నుంచే గుడిసెల కూల్చివేతకు ఆపరేషన్ ప్రారంభించారు. ఆక్రమితదారులను ప్రోత్సహిస్తున్నారన్న సమాచారం మేరకు అనుమానితులను 20 మందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టడాలు నిర్మించిన వారు రెండు గంటల్లో ఖాళీ చేయాలని పోలీసులు హెచ్చరించారు. అనంతరం అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన ఇళ్లను నాలుగు జేసీబీలతో కూల్చి వేశారు. ఈక్రమంలో అడ్డుపడిన మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠినచర్యలు 345 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి 330.09 ఎకరాలు ఉండగా 120 ఎకరాలు జంగు సిపాయినకు, మరో 20 ఎకరాలు ఎక్స్ సర్వీస్మెన్కు, లొంగిపోయిన మావోయిస్టులకు, 12 ఎకరాలు డబుల్ బెడ్రూం, సుమారు 90 ఎకరాల భూమి ఇళ్ల పట్టాలు, ఇందిరమ్మ నివాస గృహాలకు వివిధ దశలలో కేటాయించాం. జంగు సిపాయికి చెందిన భూమిలో 60 ఎకరాల భూమికి సబ్డివిజన్ కలదని, దీనిని ఆసరాగా చేసుకుని పలువురు భూఆక్రమణ దారులు మిగిలిన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. వీటిలో నివాస స్థలాలు, నివాస గృహాలకు అర్హులైన వారిని గుర్తించి డబుల్ బెడ్రూం పథకంలో ఇల్లు కేటాయిస్తాం. – సురేందర్రావు, జేసీ, మంచిర్యాల -
ఇక్కడెక్కడో మా ఇల్లుండాలే?!
విశాఖ సిటీ: ఈ ఫొటోలో చిన్నారిని చూడండి.. ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని ఎలా చూస్తోందో!.. నిన్నమొన్నటి వరకు అక్కడున్న గుడిసెలు, గుడారాలు మాయమై ఖాళీ ప్రదేశం వెక్కిరిస్తుంటే.. నిన్నటి వరకు అక్కడున్న తన ఇల్లు ఏమైందబ్బా.. అన్నట్లుంది కదూ!!.. కంచరపాలెం రామ్మూర్తిపంతులుపేట ఫ్లైవోవర్ రెండు దశాబ్దాలుగా 76 కుటుంబాలకు ఆవాసంగా మారింది. సంచారజాతులకు చెందిన వీరిలో కొందరికి మదీనాబాగ్లో ఇళ్లు ఇచ్చామని చెప్పి ఎన్నికల్లో నాయకులు ఓట్లు దండుకున్నారు. కానీ అధికారులు మాత్రం వారికి ఇళ్లు అప్పగించలేదు. పైగా ఉన్న పళంగా మంగళవారం పోలీసు పటాలంతో తరలివచ్చి గుడిసెలు, గుడారాలను నేలమట్టం చేశారు. ఫలితంగా ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. ఎక్కడికీ వెళ్లలేక ఖాళీ ప్రదేశంలోనే పిల్లాపాపలతో కాలం వెళ్లదీస్తుంటే.. నిన్నటివరకు నీడినిచ్చిన గూళ్లలో తమను పొదివిపట్టుకొని ప్రేమ పంచిన తల్లిదండ్రులు ఎందుకింత దీనంగా ఉన్నారో?.. నీడనిచ్చిన గూడు ఇప్పుడెందుకు కనిపించడంలేదో??.. అర్థం కాక ఇలాంటి చిన్నారులు అయోమయం చెందుతున్నారు. -
అలా చూస్తుండగానే కుప్పకూలింది..!
జకార్తా: జకార్తాలోని ఇండోనేషియా స్టాక్ ఎక్చ్సేంజ్ భవనంలో సోమవారం తీవ్ర ప్రమాదం సంభవించింది. చూస్తుండగానే భవనంలోని వాక్వే అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో వాక్వేపై నడుస్తున్న వాళ్లు హాహాకారాలు చేస్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో 72 మంది గాయపడ్డారు. ఇందులో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్టడీ టూర్లో భాగంగా విద్యార్థులు జకార్తాలోని స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించడానికి వచ్చారు. వివిధ కార్యాలయాలతో నిత్యం రద్దీగా ఉండే బహుళ అంతస్తుల(32) భవనాన్ని సందర్శిస్తుండగా.. ఒక అంతస్తులోని వాక్వే ఒక్కసారిగా కూలిపోయింది. వాక్వేపైకి పెద్దసంఖ్యలో విద్యార్థులు రావడంతో కూలినట్టు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనేకమంది పర్యాటకులు, ఇతర ఉద్యోగులను ఖాళీ చేయించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు భోజన విరామం కావడంతో స్టాక్ ఎక్సేంజ్ ఉద్యోగులు పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జకార్తాలో అత్యంత ఆధునిక భవనాలలో ఒకటైన స్టాక్ ఎక్చ్సేంజ్ భవనం కుప్పకూలడం స్థానికంగా ఆందోళన రేపింది. ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. స్టాక్ ఎక్చ్సేంజ్ డైరెక్టర్ ఈ సంఘటనపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఇదే భవనంలో ప్రపంచ బ్యాంకు సహా ఇతర ప్రముఖ కార్యాలయాలు కూడా ఉన్నాయి. అయితే ప్రాణనష్టం ఎంత అనేది అధికారికంగా పోలీసులు ఇంకా ప్రకటించలేదు. మరోవైపు ఈ ప్రమాదంపై ఇప్పటికే ట్విట్టర్లో వీడియోలు, పోస్ట్లు వెల్లువెత్తాయి. -
ముంబైలో కుప్పకూలిన భవనం.
-
5వ అంతస్తునుంచి కూలిన లిఫ్ట్
లక్నో: ఉత్తర ప్రదేశ్ జిల్లా కోర్టులోని లిఫ్ట్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 12మందికి గాయాలయ్యాయి. సోమవారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. వజీర్గంజ్ జిల్లా కోర్టులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కోర్టు ఆవరణలోని లిఫ్ట్ సడెన్గా కూలిపోవడంతో భయాందోళణ వాతావరణం నెలకొంది. వైర్లు తెగిపడటంతో అయిదవ అంతస్తునుంచి లిఫ్ట్ కూలిపోయింది. ఈ ఘటనలో సుమారు 12మందిగాయపడ్డారు. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సిఉంది. -
ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం; 9 మంది మృతి
-
హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం
-
హైదరాబాద్ లో కుప్పకూలిన భవనం
హైదరాబాద్: నగరంలోని నానక్ రాంగూడాలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోయింది. గురువారం రాత్రి దాదాపు10 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఏడంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో శిథిలాల కింద నాలుగు కార్మిక కుటుంబాలు చిక్కుకున్నట్లు సమాచారం. ఆ భవనం సత్తుసింగ్ అనే వ్యక్తికి చెందినదని అధికారులు భావిస్తున్నారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు అంబులెన్సులు కూడా ఘటనాస్ధలికి చేరుకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్ధన్ రెడ్డి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆరో అంతస్తులో ఫ్లోరింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో ఎంత మంది చిక్కుకుపోయారన్న దానిపై స్పష్టత లేదు. భవన యజమాని సత్యనారాయణ్ సింగ్(సత్తూ సింగ్) 360 గజాల్లో ఆరు అంతస్తులతో పాటు పెంట్ హౌస్ నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే రెండు అంతస్తులను సత్యనారాయణ అద్దెకు ఇచ్చారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండీ -
వైకుంఠ రథం ధ్వంసం
మదనపల్లె:పట్టణంలో మృతిచెందిన వారి పార్థివ దేహాలను శ్మశానానికి ఉచితంగా తరలిస్తున్న వైకుంఠ రథాన్ని ఆదివారం రాత్రి ఒక మందుబాబు ధ్వంసం చేశాడు. స్థానిక అవెన్యూ రోడ్డులో నిలిపిన వాహనం అద్దం పగలకొట్టాడు. వైకుంఠ రథంపై దాడి చేయడం తగదని నిర్వాహకుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు పేర్కొన్నారు. సొంత నిధులతో వాహనాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో వాహనం టైరు చోరీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా పోలీసులు, పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. -
సుడిగాలికి కూలిన టెంట్
–విద్యుత్ తీగ తెగి మంటలు –టెంట్ కర్రలు పడి ఇద్దరికి గాయాలు వాడపల్లి(మిర్యాలగూడ రూరల్): వాడపల్లిలోని పాత సిమెంట్ రోడ్డు పుష్కర ఘాట్ వద్ద టెంట్ కూలి ఇద్దరు భక్తులకు గాయాలైనాయి. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సుమారు 80 మంది భక్తులు టెంటు కింద కూర్చున్నారు. కాగా ఒకేసారి బలమైనగాలి వీచడంతో టెంట్ పైకి లేచి కుప్పకూలింది. దీంతో టెంట్ కర్ర విద్యుత్ తీగలపై పడి మంటలులేశాయి. ఊహించని పరిణామానికి భక్తులు భయాందోళనలో పరుగులు తీశారు. కొందరు టెంటుకిందే ఉండిపోగా ప్రాణ భయంతో కేకలు వేశారు. అక్కడేlవిధులు నిర్వహిస్తున్న పోలీసు కానిస్టేబుల్ భాస్కర్ నాయక్ పరిగెత్తి టెంట్ను లేపి దూరంగా విరిరేశాడు. అప్పటికే టెంటుకు మంటలు అంటుకోవడంతో భక్తురాలి బ్యాగు కాలిపోయింది. టెంటు కర్రలు తగిలి గుండాల మండలం సీతారామపురం గ్రామానికి చెందిన మొగిలిపాక యాదమ్మకు తలకు తీవ్రగాయమైంది. ఆమె కుమారుడు రవికి గాయాలైనాయి. దీంతో వైద్య సిబ్బంది వెంటనే ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. యాదమ్మను 108లో మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తర లించారు. టెంట్ కూలిన స్థలాన్ని జిల్లా వైద్యాధికారి భానుప్రసాద్ నాయక్, ఘాట్ రక్షణ ఇన్చార్జి డీఎస్పీ రామచందర్రావు పరిశీంచారు. సంఘటనకు కారణాలు అడిగి తెలుసుకొన్నారు. టెంటుకు మంటలు అంటుకున్నా సమయస్ఫూర్తిగా వ్యవహరించి ప్రమాద తీవ్రతను తగ్గించిన కానిస్టేబుల్ భాస్కర్ నాయక్ ను అధికారులు అభినందించారు. -
శివ.. శివా..
జంగారెడ్డిగూడెం రూరల్/ జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది. విగ్రహాన్ని పెకలించి పట్టుకెళ్లిన దుండగులు అక్కడి పొలాల్లో విగ్రహాన్ని పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే విగ్రహంలో అతి పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందని అనుకున్న దుండగులు ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎ.ఆనందరెడ్డి చేరుకుని ధ్వం సం చేసిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
టాటా ఏస్ బోల్తాపడి వృద్ధుడి దుర్మరణం
తొమ్మిది మందికి గాయాలు రేగొండ : టాటా ఏస్ వాహనం బోల్తాపడడంతో అం దులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండలంలోని లింగాల – కొడవటంచ గ్రామాల మధ్య శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మడ్తపల్లి గ్రామానికి చెందిన వడ్డెరలు హరితహారంలో భాగంగా మొక్కలను నాటే గుంతలు తవ్వేందుకు కూలీకి వెళ్లారు. తిరిగి సాయంత్రం తమ స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కొడవటంచ శివారు జోగంపల్లి గ్రామానికి చెందిన మిడిమిళ్ల దేవేందర్ టాటాఏస్ వాహనంలో పరకాల నుంచి రేషన్ బియ్యంతో లోడుతో జోగంపల్లికి వెళ్తున్నాడు. జోగంపల్లి మడ్తపల్లికి పక్క గ్రామం కావడంతో కూలీలు మోటపోతుల ఎర్రయ్య(60)తోపాటు మరో తొమ్మిది మంది కూలీలు లింగాల క్రాస్ వద్ద ఆ వా హనాన్ని ఆపి బియ్యం బస్తాలపై ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొడవటంచ – లింగాల గ్రామాల మధ్య మూలుమలుపు వద్ద టాటాఎస్ వాహనం అదుపుతప్పి బో ల్తాపడడంతో ఎర్రయ్య ఎగిరి టాటా ఏస్ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో గంధం రమ, రాధ, ఎల్లయ్య, మో టపోతుల భద్రయ్య, మల్లక్క, పవన్, గోళ్ళె న కుమారస్వామి, రమ, సమ్మక్క ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. -
టాటా ఏస్ బోల్తాపడి వృద్ధుడి దుర్మరణం
తొమ్మిది మందికి గాయాలు రేగొండ : టాటా ఏస్ వాహనం బోల్తాపడడంతో అం దులో ప్రయాణిస్తున్న ఒకరు మృతిచెందగా, తొమ్మిది మందికి గాయాలైన సంఘటన మండలంలోని లింగాల – కొడవటంచ గ్రామాల మధ్య శనివారం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని మడ్తపల్లి గ్రామానికి చెందిన వడ్డెరలు హరితహారంలో భాగంగా మొక్కలను నాటే గుంతలు తవ్వేందుకు కూలీకి వెళ్లారు. తిరిగి సాయంత్రం తమ స్వగ్రామానికి బయల్దేరారు. అదే సమయంలో కొడవటంచ శివారు జోగంపల్లి గ్రామానికి చెందిన మిడిమిళ్ల దేవేందర్ టాటాఏస్ వాహనంలో పరకాల నుంచి రేషన్ బియ్యంతో లోడుతో జోగంపల్లికి వెళ్తున్నాడు. జోగంపల్లి మడ్తపల్లికి పక్క గ్రామం కావడంతో కూలీలు మోటపోతుల ఎర్రయ్య(60)తోపాటు మరో తొమ్మిది మంది కూలీలు లింగాల క్రాస్ వద్ద ఆ వా హనాన్ని ఆపి బియ్యం బస్తాలపై ఎక్కి కూర్చున్నారు. ఈ క్రమంలో కొడవటంచ – లింగాల గ్రామాల మధ్య మూలుమలుపు వద్ద టాటాఎస్ వాహనం అదుపుతప్పి బో ల్తాపడడంతో ఎర్రయ్య ఎగిరి టాటా ఏస్ టైర్ల కిందపడి అక్కడికక్కడే మృతిచెందగా తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో గంధం రమ, రాధ, ఎల్లయ్య, మో టపోతుల భద్రయ్య, మల్లక్క, పవన్, గోళ్ళె న కుమారస్వామి, రమ, సమ్మక్క ఉన్నారు. వారిని ఆస్పత్రికి తరలించారు. -
భవనం కూలిన ఘటనలో బాలిక మృతి
చిత్తూరు: తిరుపతి నగరంలో బుధవారం తెల్లవారు వేకువజామున ఓ భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక బాలిక మృతి చెందగా మరో బాలిక తీవ్ర గాయాలపాలైంది. స్థానిక ఇసుక వీధిలో డ్రెయినేజి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందుకోసం తవ్విన కాలువ ఒక భవనం పునాదికి ఆనుకుని ఉంది. దీంతో ఆ భవనం పునాదులు కదిలి ఒక్కసారిగా కూలింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న గ్రీష్మ(14), నిహారిక(15) తీవ్రంగా గాయపడ్డారు. మిగతా వారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వెంటనే బాలికలను ఆస్పత్రికి తరలించారు. నిహారిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఆమె ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాసింది. గ్రీష్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు జేసీబీ సాయంతో భవన శిథిలాలను తొలగిస్తున్నారు. -
భవనం కూలి ఒకరి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీలో క్రిస్మస్ పర్వదినం రోజున ఓ కార్మికుని ఇంట్లో తీరని విషాదం నిండింది. నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఛోటు (50) అనే కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా మరో ఐదుగురు గాయపడ్డారు. బేస్మెంట్ నుంచి మట్టిని తొలగిస్తుండగా అకస్మాత్తుగా భవనం కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. భవన యజమానిపై కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు. -
ఢిల్లీలో కూలిన గురుద్వార్ మిద్దె
-
కూలిన ఐదంతస్థుల భవనం
హైదరాబాద్: నగరంలోని షేక్పేట్లో నిర్మాణ దశలో ఉన్న ఓ ఐదంతస్థుల భవనం అమాంతం కూలిపోయింది. గ్రౌండ్ఫ్లోర్ పూర్తిగా ధ్వంసమై పక్కనే ఉన్న భవంతిపై 1,2,3 ఫ్లోర్లు వాలిపోయాయి. కేవలం ఒకే అంతస్థుకు అనుమతి ఉన్నా ఐదంతస్థుల వరకు నిర్మాణం చేపట్టడంతో భవనం కూలిపోయిందని భవనాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ చెప్పారు. భవనం కూలిపోయిన వెంటనే అక్కడికి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ రాములు నాయక్, స్థానిక ఎమ్మార్వో చంద్రకళ వచ్చి పరిశీలించారు. ఈ సందర్భంగా గోపినాథ్ మాట్లాడుతూ.. విస్తీర్ణాన్ని మించి నిర్మాణం చేపట్టడంతో ఒక్కసారిగా భవంతి కూలిపోయిందని చెప్పారు. ధ్వంసమైన బిల్డింగ్ను ఈ రాత్రికే డిమాలిష్ చేసేందుకు అధికారులను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయని, అక్రమ కట్టడాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు. అదృష్టవశాత్తు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. బిల్డింగ్ అనుమతిపై జీహెచ్ఎంసీ అధికారులు చూసుకుంటారని ఎమ్మార్వో చంద్రకళ అన్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బందిగా ఇక్కడి పరిస్థితిని చక్కదిద్దే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. -
మూసీపై అక్రమ కట్టడాలు కూల్చివేత
హైదరాబాద్ : చాదర్ఘాట్లో మూసీనది పరిసరాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. పలుమార్లు ఖాళీ చేయాలని ఆక్రమణదారులకు నోటీసులిచ్చినా వినకపోవడంతో అధికారులు కూల్చివేతకు ఉపక్రమించారు. కూల్చివేతలు ప్రారంభించడంతో అక్కడ ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. భారీగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. -
కూలిన ఆంజనేయస్వామి గుడి
-
తప్పిన ప్రాణాపాయం
తిరుపతి: ఓ పాత భవనం కుప్పకూలిన ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది. స్థానిక నిమ్మకాయల వీధిలో వేణు అనే వ్యాపారికి చెందిన 60 ఏళ్ల క్రితం నాటి మూడంతస్తుల పాత భవనం మంగళవారం సాయంత్రం కుప్పకూలింది. భవనం కింది భాగంలో ఓ మొబైల్ షాపు ఉండగా, పై అంతస్తులో రెండు కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. అయితే, కూలడానికి ముందే భవనం గోడలకు నైులు ఇస్తుండడంతో అందులోని వారు భయంతోబయటకు వచ్చేశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. అయితే, మొబైల్ షాపులో విలువైన వస్తువులు ఉండడంతో, సుమారు రూ.10 లక్షల మేర ఆస్తినష్టం జరిగిందని అంటున్నారు. -
తిరుపతిలో కూలిన భవనం!
-
కుప్పకూలిన మూడంతస్తుల భవనం
తిరుపతి : తిరుపతిలో మంగళవారం భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమైనాయి. స్థానిక నిమ్మకాయల వీధిలోని మూడంతస్తుల భవనం ఒకటి కుప్పకూలింది. అయితే అప్పటికే అప్రమత్తమైన ఆ భవనంలోని వారంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. భవనం కుప్పకూలిన ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... సహాయక చర్యలు చేపట్టారు. భవనం కింద భాగంలో మొబైల్ షాపు ఉండగా, పై అంతస్తులో రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. కూలడానికి ముందే భవనం గోడలు నెరలు ఇస్తుండడంతో అందులోని వారు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. దీంతో వారికి ప్రాణాపాయం తప్పింది. భవనం కుప్పకూలడంతో సుమారు రూ. 10 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించిందని ఉన్నతాధికారులు తెలిపారు. -
అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ : బండ్లగూడలోని కందికల్ గ్రామం సర్వేనంబర్ 223లో అక్రమ నిర్మాణాలను ప్రభుత్వ అధికారులు ఆదివారం కూల్చివేశారు. సుమారు 40 ఏళ్ల క్రితం ఈశ్వర్ సింగ్ అనే వ్యక్తికి అప్పటి ప్రభుత్వం 4 ఎకరాల 23 గంటల భూమిని ఇనాం కింద ఇచ్చింది. 1994లో భూమిని అప్పగించడాన్ని అప్పటి హైదరాబాద్ కలెక్టర్ రద్దు చేశారు. ఈ విషయం గురించి ప్రభుత్వానికి, ఈశ్వర్ సింగ్కు మధ్య కేసు కోర్టులో నడుస్తుంది. తాజాగా ఆర్డీఓ నిఖిల ఆదేశాల మేరకు ఆ స్థలంలో వెలసిన కాంపౌండ్ వాల్ను, కల్లు షెడ్డును అధికారులు కూల్చివేశారు. స్థానిక మాజీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో కొంత సిక్కులు దీన్ని వ్యతిరేకించటంతో..పోలీసులు 20 మందిని అరెస్టు చేసి చత్రినాక పోలీస్ స్టేషన్కు తరలించారు. -
మూలవిరాట్ విగ్రహం ధ్వంసం
నకరికల్లు(గుంటూరు): మండల కేంద్రంలోని కొండపై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలోని మూలవిరాట్ విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. గురువారం రాత్రి ఆలయ పూజారి దీపారాధన చేసి మెయిన్ గేటుకు తాళాలు వేసి వెళ్లారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు వచ్చి చూసేసరికి విగ్రహం ధ్వంసమై కనిపించింది. దుండగులు కేవలం విగ్రహం మాత్రమే ధ్వంసం చేశారు తప్ప విలువైన వస్తువుల జోలికి మాత్రం పోలేదు. గుప్త నిధుల కోసం ఈ పని చేసి ఉండవచ్చునని స్థానికులు అనుకుంటున్నారు. 2 సంవత్సరాల క్రితం కొండ కింద ఉన్న ఊయల పల్లకి వద్ద కూడా గుప్తనిథుల కోసం తవ్వకాలు జరగటంతో ఆ కోణంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. -
మిన్ను విరిగిపడింది
చెన్నైలో కుప్పకూలిన 11 అంతస్తుల అపార్ట్మెంట్ చెన్నై/విజయనగరం, సాక్షి: పొట్ట కూటి కోసం చెన్నపట్నం వచ్చిన ఉత్తరాంధ్ర వలస కూలీలపై మిన్ను విరిగి పడింది. నిర్మాణంలో ఉన్న 11 అంతస్తుల భవనం శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలి కార్మికులను కబళించింది. భవనం శిథిలాల్లో 50 నుంచి 60 మంది చిక్కుకుపోగా.. విజయనగరం జిల్లాకు చెందిన 14 మంది చనిపోయినట్లు ఆ జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే ప్రకటించారు. శనివారం అర్థరాత్రి సమయానికి ఐదు మృతదేహాలను వెలికితీశారు. మృతుల్లో ఒకరిని విజయనగరం జిల్లా బాడంగి మండలానికి చెందిన బొంగు శాంతకుమారి (24)గా గుర్తించారు. మరో ఇద్దరిని మదురైకి చెందిన మరుదపాండి, శంకర్గా గుర్తించగా.. ఇంకా రెండు మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. శిథిలాల నుంచి మరో 16 మంది క్షతగాత్రులను ప్రాణాలతో రక్షించి రామచంద్ర మెడికల్ కాలేజ్కు తరలించారు. శిథిలాల కింద ఇంకా 40 మంది వరకూ చిక్కుకుపోయి ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన భవన నిర్మాణ కార్మికులే ఎక్కువ మంది ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగంతో పాటు.. అరక్కోణం నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసింది. భవనం కుప్పకూలిన ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించారు. చెన్నై నగరం సమీపంలోని పోరూరు వద్ద మౌళివాకం ప్రాంతంలో కొత్తగా నిర్మిస్తున్న 11 అంతస్తుల అపార్టుమెంటు భవనం ‘ట్రస్ట్ హైట్స్’ శనివారం సాయంత్రం ఒక్కసారిగా కుప్పకూలింది. అపార్ట్మెంట్ నిర్మాణ పనులు మొత్తం పూర్తికాకుండానే కొందరు ఈ భవనంలో నివసిస్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలకు వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. సరిగ్గా అదే సమయంలో పెద్ద శబ్దంతో ఈ అపార్టుమెంటు భవనం కూలిపోయింది. ఏం జరుగుతోందో తెలిసేలోగానే అందులో నివసిస్తున్న వారితో పాటు.. పనిచేస్తున్న కార్మికులందరూ శిథిలాల్లో కూరుకుపోయారు. కాంక్రీటు పలకలు, ఇనుపచువ్వల కింద చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం ధాటికి ఒక వంట గ్యాస్ సిలిండర్ కూడా పేలిపోయింది. తమిళనాడు అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టినప్పటికీ.. కొద్దిసేపటికే చిమ్మచీకట్లు అలుముకోవడంతో పనులు వేగంగా సాగలేదు. ఫ్లడ్ లైట్ల వెలుగులో పదికి పైగా అగ్నిమాపక శకటాలు, సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. సాయంత్రం 6:30 గంటలకు కందసామి అనే వ్యక్తిని శిథిలాల నుంచి స్వల్పగాయాలతో బయటకు తీశారు. రాత్రి 8.00 గంటలకు ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. రాత్రి 10 గంటల సమయంలో విజయనగరం జిల్లాకు చెందిన శాంతకుమారి మృతదేహాన్ని వెలికితీశారు. ప్రాణాలతో బయటకు తీసిన 16 మంది క్షతగాత్రుల్లో బాడంగి గ్రామానికి చెందిన చిన్నా ఉన్నారు. శిథిలాల కింద ఇంకా 40 మంది వరకూ చిక్కుకుపోయి ఉన్నట్లు ఆయన చెప్పారు. అరక్కోణంలోని రాజాలీ నుంచి జాతీయ విపత్తుల నివారణ బృందం సిబ్బంది 260 మంది హుటాహుటిని సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. చెన్నై అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, నగర పాలక సంస్థ, రెవెన్యూ విభాగాలకు చెందిన సిబ్బంది సహాయ చర్యలు చేపడుతున్నారు. శిథిలాల్లో చిక్కుకున్న వారి వివరాలు ఇవీ... కార్మికుల బంధువులు తెలిపిన సమాచారం ప్రకారం.. విజయనగరం జిల్లా మక్కువ మండలం తూరుమామిడి గ్రామానికి చెందిన భార్యాభర్తలు సీర సత్యనారాయణ (52), సీర జయమ్మ (48)లతో పాటు చింతల తిరుపతిరావు (27); బాడంగి మండలానికి చెందిన భార్యాభర్తలు బొమ్మి గౌరునాయుడు (40), బొమ్మి అనసూయ (36); దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురం గ్రామానికి చెందిన భార్యాభర్తలు కర్రి అప్పలనాయుడు, కర్రి తవుడమ్మ (35)లతో పాటు మంత్రి మీనమ్మ (35), పతివాడ బంగారునాయుడు (30), పతివాడ గౌరీశ్వరి (28), తేజేటి అప్పలరాము (40), తేజేటి లక్ష్మి (35), సిరిపురపు రాము (30), వనుము దుర్గ (18); శ్రీకాకుళం జిల్లా ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన దుక్క తౌడు (50); హిరమండలం మండలానికి చెందిన మీసాల శ్రీనివాసరావు (38), కూతురు భవాని, పెశైట్టి జ్యోతి (25), కొంగరాపు శ్రీను (40), ఆయన భార్య కృష్ణవేణి; కోటబొమ్మాళి మండలానికి చెందిన ఎముకల శ్రీను (33); నరసన్నపేట మండలం బాలసీమ గ్రామానికి చెందిన డి.పద్మ (35); కొత్తూరు మండలం కర్లెమ్మ గ్రామానికి చెందిన భార్యాభర్తలు దాసరి రాము (40), కళావతి (37)లు శిథిలాల్లో చిక్కుకుపోయారు. వెల్లంపట్టి మండలం ధనికోడు గ్రామానికి చెందిన రామారావు, కనకమ్మ సంఘటన స్థలంలో ఉన్నారు. ఈ కుటుంబం నుంచి 10 మంది చెన్నై నగరానికి రాగా.. వీరిద్దరు మాత్రం తాంబరంలో పని చేస్తున్నారు. మిగిలిన ఎనిమిది మంది కూలిన భవనం శిథిలాల్లో చిక్కుకున్నారు. చిక్కుకుపోయిన వారిలో ఎక్కువమంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే చనిపోయిన వారి వివరాలు పూర్తిగా తెలియరావటం లేదు. విజయనగరం జిల్లా వాసులు 14 మంది మృతి: కాంతిలాల్ చెన్నై నగరంలోని 11 అంతస్తుల భవనం కూలిపోయిన ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కె.కృష్ణాపురానికి చెందిన ఎనిమిది మంది, మక్కువ మండలం తూరుమామిడికి చెందిన ముగ్గురు మృతి చెందినట్టు జిల్లా కలెక్టర్ కాంతిలాల్దండే శనివారం రాత్రి ప్రకటించారు. మరో ముగ్గురు కూడా మృతి చెందారని అయితే వారి సమాచారం స్పష్టంగా తెలియదని ఆయన తెలిపారు. మృతదేహాలను గుర్తించి, పోస్టుమార్టం నిర్వహించి, స్వస్థలాలకు పంపేందుకు జిల్లా నుంచి ఆర్డీఓ, ఏపీఎంఐపీ పీడీ, కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్లను కలెక్టర్ చెన్నై పంపించారు. సంఘటన స్థలంలో చిక్కుకున్న వారి వివరాల కోసం ఆర్డీఓ 9491012021, డీఆర్ఓ 9491012012లను సంప్రదించాలన్నారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08922-236947 నంబరుకు కాల్ చేసి పరిస్థితిని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. పిడుగు వల్లే కూలింది: నిర్మాణ సంస్థ గతంలో పోరూరు నదీ ప్రాంతంలో అపార్టుమెంటును నిర్మించడం, భవనం పునాదులు బలహీనంగా ఉండడం ప్రమాదానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే.. కుప్పకూలిన భవనాన్ని అన్నిరకాల నియమ నిబంధనలకు లోబడి నిర్మించామని, నాణ్యతలో నిర్లక్ష్యం చేయలేదని అపార్ట్మెంట్ నిర్మాణ సంస్థ ‘ప్రైమ్ సృష్టి’ డెరైక్టర్ బాలగురు పేర్కొన్నారు. వర్షంతో పాటు పిడుగు పడడం వల్లనే 11 అంతస్తుల భవనం రెండుగా చీలి కూలిపోయిందన్నారు. శనివారం వేతనాలు ఇచ్చే రోజని, పెద్దగా సిబ్బంది విధుల్లో లేరని.. వర్షం వల్ల 20 నుంచి 30 మంది అక్కడ ఉండి ఉండవచ్చన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల భవనం కూలిపోయిందని.. దీనికి తామెలా బాధ్యత వహించగలమని వ్యాఖ్యానించారు. -
రంగారెడ్ది జిల్లాలో అక్రమకట్టడాల కూల్చివేత
-
లావోస్లో కూలిన విమానం
-
ఆటో బోల్తాపడి ఒకరి దుర్మరణం
రఘునాథపల్లి, న్యూస్లైన్ : అదుపుతప్పి ఆటో బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని కావేరి రైస్మిల్లు ఎదుట వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై సోమవారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఇబ్రహీంపూర్లో ఓ మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి రామచంద్రం మద్యం మత్తులో లైంగికదాడికి యత్నించాడు. దీంతో బాధితమహిళ తరఫు కులస్తులు ఆరుగురు పసులాది దయానంద్ ఆటోలో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. ఫిర్యాదు చేసి తిరిగి అదే ఆటోలో గ్రామానికి వెళుతుండగా కావేరి రైస్మిల్లు వద్ద ఎదురుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా నిలిచిపోరుుంది. దీంతో అయోమయానికి గురైన ఆటో డ్రైవర్ బస్సును తప్పించబోతుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న దోరగొల్ల చంద్రయ్య(51), దోరగొల్ల పర్వతాలు, దోరగొల్ల మల్లయ్య, ల్యాగల మల్లేష్, దోరగొల్ల యాదగిరి, ఆటో డ్రైవరు దయానంద్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న దోరగొల్ల చంద్రయ్య, దోరగొల్ల పర్వతాలును సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా చంద్రయ్య మార్గమధ్యలో మృతిచెందాడు. పర్వతాలు పరిస్థితి విషమంగా ఉంది. ఆటో డ్రైవర్ దయానంద్ను ఎంజీఎంకు తరలించగా మిగతా ముగ్గురు జనగామ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఇబ్రహీంపూర్లో విషాద ఛాయలు రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన ఒకరు మృతిచెంది, మరో ఐదుగురు తీవ్రగాయాలపాలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. జనగామ మార్చురీలో ఉన్న చంద్రయ్య మృతదేహాన్ని సందర్శించేందుకు గ్రామస్తులు పెద్దఎత్తున వెళ్లి కన్నీటిపర్వంతమయ్యారు. మృతుడి భార్య భారతమ్మ, కుమారుడు సురేష్ రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ఏఎస్సై దామెర సురేందర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తోట వాణి నిరాహార దీక్ష భగ్నం