బిహార్‌లో ప్రాణాలు తీస్తున్న పిడుగులు | Frequent Lightening Endangering Lifes In Bihar | Sakshi
Sakshi News home page

బిహార్‌లో పిడుగుల భయం.. ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు

Published Sun, Jul 7 2024 9:49 PM | Last Updated on Sun, Jul 7 2024 9:51 PM

Frequent Lightening Endangering Lifes In Bihar

పాట్నా: బిహార్‌ ప్రజలను పిడుగులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలో పిడుగుపాటు వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. 

గత రెండు వారాల్లో పిడుగులు పడి దాదాపు 40 మంది మృతి చెందారు. తాజాగా గడిచిన 24 గంటల్లో మరో 10 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

పిడుగుపాటుకు గురైన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం నితీశ్‌కుమార్‌ తెలిపారు. పిడుగుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement