
భాగల్పూర్: బీహార్(Bihar)లో గతకొన్ని రోజులుగా పోలీసులపై వరుస దాడులు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటన భాగల్పూర్లో జరిగింది. శనివారం రాత్రి పోలీసులు గస్తీలో తిరుగుతుండగా, వారిపై దాడి జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. ఈ ఘటన భాగల్పూర్ పరిధిలోని అంతీచక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేశారు.
ఈ ఘటన గురించి అంతీచక్ పోలీసు అధికారి అశుతోష్ కుమార్ మాట్లాడుతూ తమ పోలీసు బృందం(Police team) పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో మాధవ్ రామ్పూర్ హరిచక్ గ్రామ సమీపంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుండటాన్ని గమనించారన్నారు. పోలీసులు ఆ వివాదాన్ని ఆపేందుకు ప్రయత్నించారని, అయితే ఇంతలోనే గ్రామస్తులు పోలీసులపై రాళ్లు రువ్వడం ప్రారంభించారన్నారు. ఈ ఘటనలో ఐదుగురు పోలీసులు గాయపడ్డారని, పోలీసు వాహనం కూడా కొంతమేరకు ధ్వంసమయ్యిందని తెలిపారు.
దాడికి పాల్పడినవారిని పోలీసులు అరెస్టు చేశారని, గాయపడిన పోలీసులు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అశుతోష్ తెలిపారు. ఈ దాడికి ముందు అరారియా, ముంగేర్లో పోలీసు బృందాలపై దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు.
ఇది కూడా చదవండి: అమెరికాలో తుపాను బీభత్సం.. 17 మంది దుర్మరణం
Comments
Please login to add a commentAdd a comment