ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష తనదైన ముద్ర | Prime Minister Modi wishes Telugu people | Sakshi
Sakshi News home page

ప్రపంచవ్యాప్తంగా తెలుగు భాష తనదైన ముద్ర

Published Fri, Aug 30 2024 4:27 AM | Last Updated on Fri, Aug 30 2024 4:27 AM

Prime Minister Modi wishes Telugu people

తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు    

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు భాష గొప్పదని.. దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ముద్ర వేసిన భాష అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. గురువారం తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగును మరింత ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న వారందరినీ అభినందిస్తున్నానని పేర్కొన్నారు. 

అలాగే తెలుగు ప్రజలందరికీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అనేది కేవలం భావవ్యక్తీకరణ కోసం ఉపయోగించే ఒక భాష మాత్రమే కాదని.. యుగయుగాలుగా కవుల ఊహలకు రెక్కలు కట్టి, మన పండితుల జ్ఞానానికి పదును పెట్టిన మన జాతి ప్రాచీన వారసత్వానికి ప్రాణం అని పేర్కొన్నారు. 

తెలుగు ప్రాముఖ్యతను, విశిష్టతను మరింతగా ఇనుమడింపజేయడానికి తమ ప్రభుత్వం అంకితభావంతో పని చేస్తోందని చెప్పడానికి గర్వపడుతున్నానని అమిత్‌ షా స్పష్టం చేశారు. అలాగే  తెలుగు వారందరికీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement