
న్యూఢిల్లీ: అయోధ్యలో భవ్య రామమందిరం 2024 జనవరి రెండోవారం నాటికి సిద్ధమవుతుందని రామ జన్మభూమి మందిర్ తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ చెప్పా రు. ఆయన శనివారం ఢిల్లీలో ఆయోధ్య పర్వ్ కార్యక్రమంలో మాట్లాడారు. 2024లో మకర సంక్రాంతి రోజున రామాలయాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి మందిర నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. రాళ్లను చెక్కే పని ఇప్పటికే మొదలయ్యిందన్నారు.