![Santhanam Says Rajya Seat For Joining Of Political Party In Tamil Nadu - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2021/02/10/santhanam-1.jpg.webp?itok=zp5CmAJP)
చెన్నై: రాజ్యసభ సీటు ఇస్తే పార్టీలో చేరతానని సంతానం అన్నారు. నటుడు సంతానం కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం ప్యారిస్ జయరాజ్. ఈ చిత్రం ద్వారా కె.జాన్సన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో సంతానంకు జంటగా నటి అనైకా సోటి, సస్టిక రాజేంద్రన్ కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 12న తెరపైకి రానుంది. మంగళవారం చిత్ర యూనిట్ సాలిగ్రామంలోని ప్రసాద్ల్యాబ్లో మీడియా సమావేశాన్ని నిర్వహించింది. మీరు ఏ పార్టీలో చేరతారని విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఏ పార్టీ రాజ్యసభ సీటు ఇస్తే ఆ పార్టీలో చేరతానని సరదాగా పేర్కొన్నారు. రాజకీయాల్లో చేరే ఆలోచన లేదని, నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచడానికే ఇష్టపడతానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment