Agneepath Scheme Protest: Union Railways Minister Vaishnaw Appeals Against Agnipath Violent Protesters - Sakshi
Sakshi News home page

దేశ సంపదను ధ్వంసం చేయకండి: రైల్వే మంత్రి విజ్ఞప్తి

Published Fri, Jun 17 2022 5:07 PM | Last Updated on Fri, Jun 17 2022 5:21 PM

Union Railways Minister Ashwini Vaishnaw Request On Agnipath Protests - Sakshi

నిరసనలను హింసాత్మక మార్గంలో వెళ్లనివ్వకండి. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేయకండి.

సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ నిరసనల్లో భారత రైల్వే వ్యవస్థ దెబ్బ తింటున్న పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరుణంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. 

‘‘యువతకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. నిరసనలను హింసాత్మక మార్గంలో వెళ్లనివ్వకండి. రైల్వే ఆస్తుల్ని ధ్వంసం చేయకండి. రైల్వేస్‌ దేశానికి ఆస్తి’’ అని జాతీయ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారాయన.

ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా జరిగిన అగ్నిపథ్‌ నిరసనల్లో పలు రైళ్లకు నిరసనకారులు నిప్పుపెట్టారు. అలాగే పదుల సంఖ్యలో రైళ్లను ధ్వంసం చేశారు. కోట్ల విలువైన రైల్వే ఆస్తులను నాశనం చేయడంతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించారు నిరసనకారులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement