Agnipath Scheme
-
నైపుణ్యమే ‘అగ్ని’కి ఆజ్యం!
అగ్నిపథ్ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. పైగా అగ్నివీర్లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. నిజానికి గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయటకు వచ్చే అవకాశం లేదు. ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ లేదా నిర్వహణను కొత్తగా చేరినవారికి అప్పగించాలంటే వారి అనుభవం చాలదు. అలాగని మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించ డానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్ పదవీ కాలాన్ని నాలుగేళ్ల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు.కార్గిల్ జిల్లాలోని హిల్ స్టేషన్ అయిన ద్రాస్లో గత శుక్రవారం జరిగిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ, కాస్త తీవ్రంగానే స్పందించి ఉండవచ్చు. అగ్నిపథ్ అంశాన్ని ప్రతి పక్షాలు రాజకీయం చేస్తున్నాయని ఆయన ఆరోపణ. సైన్యాన్ని నిత్య యవ్వనంతో ఉంచడం, అలాగే దానిని నిరంతరం యుద్ధానికి సన్నద్ధం చేయటం ఈ పథకం లక్ష్యం. ‘‘దురదృష్టవశాత్తు కొంత మంది వ్యక్తులు జాతీయ భద్రతకు సంబంధించిన ఈ సున్నితమైన విషయాన్ని రాజకీయ అంశంగా మార్చారు’’ అని ఆయన అన్నారు.మోదీ మరింత శక్తిమంతంగా చెప్పడానికి మరిన్ని పదాలు వాడి ఉండవచ్చు కానీ ఈ సందర్భం వాటికి తగినదా అనేది ఒక ప్రశ్న. నిజానికి ఒక ఆదర్శవంతమైన, హూందా అయిన సంప్రదాయానికి నాంది పలుకుతూ ప్రతిపక్షం, ప్రధానమంత్రి ఈ వేదికను ఉమ్మడిగా పంచుకుని ఉండవలసింది. కానీ బహుశా అది మరీ ఎక్కువగా ఆశించటమే అవుతుంది. గడచిన 10 ఏళ్లలో సైన్యాన్ని సంస్కరించడం కోసం చాలా ఎక్కువగానే కృషి జరిగిందనటంలో సందేహం లేదు. ‘చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్’ నియామకం, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్’ ఏర్పాటు, ‘డిఫెన్స్ అక్విజిషన్ పాలసీ’ సంస్కరణ, రక్షణ పరిశ్రమ నిర్బంధ స్వదేశీకరణ, అలాగే రక్షణ పరిశ్రమలో ప్రైవేట్ రంగానికి తలుపులు తెరవడం, ఆ రంగానికి డిఫెన్స్ ‘ఆర్ అండ్ డి’ నిధుల నుండి 25 శాతం అందించడం... వీటిలో కొన్ని. కానీ అగ్నిపథ్ దానికై అదిగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ఈ పథకం కింద, ఒక అగ్నివీర్ సైనికుడిని 17–21 సంవత్సరాల వయస్సులో నియమిస్తారు. అతను/ఆమె నాలుగు సంవత్సరాలు సైన్యానికి సేవలందిస్తారు. ఆ తర్వాత సైన్యం నుంచి వేరుపడి తగిన ప్యాకేజీతో నిష్క్రమిస్తారు. ఇలా రిటైరైన వారిలో 25 శాతం మందికి మరో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు తిరిగి సైన్యంలో చేరే అవకాశం ఉంటుంది. బహుశా వీరు పెన్షన్ కు అర్హులు అవుతారు. ఇక అగ్నివీర్లలో ఎక్కువ మంది విషయానికొస్తే, వారిలో 75 శాతం మంది వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో చేరే అవకాశం కలిగి ఉంటారు. అక్కడ వారు ప్రాధాన్యతా ప్రాతిపదికన రిక్రూట్మెంట్కు అర్హులు అవుతారు. 2023 చివరలో, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎమ్ఎమ్ నరవణే తన అముద్రిత జ్ఞాపకాల రచనలో ఈ పథకం నౌకాదళానికి, వాయుసేనకు పిడుగుపాటు వంటిది అని వ్యాఖ్యానించారు. ఆ రెండింటికీ కాకుండా దీనిని తాను కేవలం సైన్యం (ఇండియన్ ఆర్మీ) కోసం మాత్రమే, అది కూడా 75 శాతం సిబ్బందిని ఉంచుకొని 25 శాతం సిబ్బందిని వదిలించుకోవాలనీ ప్రతిపాదించానని వ్యాఖ్యానించారు. అయితే రక్షణ మంత్రిత్వ శాఖ దీనిని కాస్తా మార్చేసి, 75 శాతం అగ్నివీర్లను పంపించి, 25 శాతం మందిని మాత్రమే ఉంచుకోవటం జరుగుతోందని అనడంతో వివాదం తలెత్తింది. అగ్నిపథ్ విషయంలో మొదటి నుంచీ సమస్య ఉంది. సైన్యం కోసం ఒక అగ్నివీర్ ఏమి చేయగలడు లేదా ఏమి చేయాలి?అన్నదే ఆ ప్రశ్న. ఆర్మీ సగటు వయస్సును అగ్నిపథ్ తగ్గించేస్తుంది అనేది ప్రాథమిక వాదన. ఒక ప్రభుత్వ అఫిడవిట్... ప్రపంచవ్యాప్తంగా కనిష్ఠస్థాయి ర్యాంక్ సిబ్బంది సగటు వయస్సు 26 సంవత్సరాలు కాగా, ఇండియాలోనే ఆ సగటు వయస్సు 32 ఏళ్లు అని పేర్కొంది. కానీ మన సైన్యంలో నియామక వయస్సు దశాబ్దాలుగా 16.5–21 ఏళ్ల వయస్సులోనే ఉంటోంది. ఇప్పుడు అగ్నిపథ్లో భాగంగా 75 శాతం అగ్నివీర్లను బయటికి పంపించటం ద్వారా, ప్రతి వలయంలో కొత్త సిబ్బందిని చేర్చడం ద్వారా, ఈ పథకం సైనిక వయస్సును తగ్గించాలని ఆశిస్తోంది. అయితే దాని వల్ల ప్రతిఫలంగా ఏం పొందుతుంది?భారతీయ నియామకాలలో గ్రహించవలసిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి. యువకులు లేదా యువతులు మొదట సైనికులుగా నియ మితులు అయినప్పుడు వారు తరచుగా తక్కువ బరువుతో, పోషకాహార లోపంతో ఉండి, విభిన్న నేపథ్యాల నుండి వచ్చినవారై ఉన్నారు. తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ కేవలం శరీరాకృతి, క్రమశిక్షణ పరంగా వారిని ఒక కొలిక్కి తెస్తుంది. ఆ తర్వాత ట్యాంకులు, ఫిరంగిదళాలు, వాయు రక్షణ వ్యవస్థల నిర్వాహకులుగా మరింత సాంకేతిక ఉద్యోగాలు చేయగలిగిన పదాతిదళానికి తగిన ట్లుగా వీరికి వృత్తిపరమైన శిక్షణ అవసరం. ఇది కేవలం నైపుణ్యం కోసం. ఇది కాక మరొక సంవత్సరం వరకు ఎక్కడైనా వీరికి శిక్షణ అవసరం కావచ్చు.ఇప్పుడు, అగ్నివీర్లను కేవలం ఆరు నెలల శిక్షణతో సైన్యంలోకి చేర్చుకున్నారు. గ్రామీణ నేపథ్యం, విద్యా స్థాĶæయులు, చేర్చుకున్న వయస్సు దృష్ట్యా, అగ్నివీరుడు సమర్థమైన నైపుణ్యాలతో బయ టకు వచ్చే అవకాశం లేదు. మెరుగైన దేశాల్లో, ఒక రిక్రూట్ అయిన సైనికుడు ముందే డ్రైవింగ్ వంటి నైపుణ్యంతో వస్తాడు, కానీ భారత దేశంలో దానికి మాత్రమే మూడు నెలలు పట్టవచ్చు.కాగా, మాజీ అడ్మిరల్ అరుణ్ ప్రకాశ్ ఒక సందర్భంలో మాట్లా డుతూ... పదాతి దళ సిబ్బందికి, సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా అవసరం లేని సైన్యానికి అగ్నిపథ్ ఉపయోగపడుతుందనీ, అయితే వైమానిక దళానికి, నౌకాదళానికి ఇది పెద్ద సమస్యగా మారుతుందనీ పేర్కొన్నారు. ‘‘ప్రాణాంతక ఆయుధాల వ్యవస్థలు, సంక్లిష్టమైన యంత్రాలు, ఎలక్ట్రానిక్స్ ఆపరేషన్ లేదా నిర్వహణను అప్పగించ డానికి ముందు తగినంత అనుభవాన్ని పొందడానికి కనీసం అయి దారేళ్ల సమయం అవసరం అవుతుంది’’ అంటారాయన. అగ్నిపథ్ పథకంలో యువతీయువకుల ప్రొఫైల్ మిలటరీ అవసరాలకు కాకుండా మరి దేనికోసమో ఉద్దేశించినట్లు అనిపిస్తోందన్న ఆరోపణలు ఉండగా ప్రభుత్వం వాటిని ఖండించింది. వాస్తవానికి ప్రభుత్వం పునరాలోచన తర్వాతనైనా ఈ పథకం దేశానికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చే అంశాలతో ప్రేరేపితమైందనే వాస్తవాన్ని ముందుగా తెలియజేయాల్సింది. అయితే ఈ పరిపుష్టి ఒక దశాబ్దం తర్వాత మాత్రమే ప్రారంభమవుతుంది. తాజా బడ్జెట్ ప్రకారం రూ. 1.41 లక్షల కోట్లు లేదా రక్షణ బడ్జెట్లో 22.7 శాతాన్ని వినియో గిస్తున్న పెన్షన్ బిల్లు సైన్యానికి గుదిబండ అయింది. యువశక్తి కోసం గతంలో వచ్చిన పిలుపుల దృష్ట్యా, మనం మొత్తానికే ఈ పథకాన్ని అవతల పడేయవలసిన అవసరం లేదు. ఈ పథకాన్ని రద్దు చేసే బదులు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి వంటి లోపాలను అధిగమించడానికి ప్రభుత్వం ఈ çపథకాన్ని సవరించాలి. అగ్నివీర్ పదవీ కాలాన్ని నాలుగు సంవత్సరాల నుండి ఏడేళ్లకు పొడిగించడం మంచి ఆలోచన కావచ్చు, ఇది కొంతకాలంగా ఉన్న ఆలోచన. ఇది శిక్షణ కోసం తగినంత సమయాన్ని నిర్ధారిస్తుంది. అలాగే సేవకు సమర్థవంతమైన సహకారాన్ని అందిస్తుంది. అగ్నివీర్లు సైన్యం నుంచి బయటికి వచ్చినప్పుడు వారి వయస్సు 24–28 సంవత్సరాల మధ్య ఉంటుంది, ఇది వారికి కొంత ఆలస్యంగా తెరచుకునే అనేక అవకాశాలకు అనువుగా ఉంటుంది.1999లో కార్గిల్ యుద్ధంలో మరణించిన 550 మంది సైనికులు అగ్నివీరులు కాదని, శిక్షణ పొందిన, దృఢమైన, అంకితభావం కలిగిన సైనికులు అనే విషయం గుర్తుంచుకోండి. ఆ రకమైన సామర్థ్య పరీక్ష ఇప్పటికీ అగ్నివీర్ పథకం కోసం వేచి ఉంది.మనోజ్ జోషీ వ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లోడిస్టింగ్విష్డ్ ఫెలో ‘ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అగ్నిపథ్పై విపక్షాల విమర్శలు.. ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనికుల నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా లడఖ్లోని ద్రాస్ సెక్టార్లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ.. విపక్షాలపై ధ్వజమెత్తారు.భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశంపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని మోదీ మండిపడ్డారు. భారత సైన్యం ప్రారంభించిన కీలకమైన సంస్కరణలకు అగ్నిపథ్ పథకం ఒక ఉదాహరణ అని చెప్పారు. ప్రపంచ దేశాల సైనికుల సగటు వయసు కంటే భారత సైనికుడి సగటు వయసు ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. దీనిపై అనేక కమిటీలు చర్చించాయే కానీ, ఏ ప్రభుత్వం కూడా సరైన చర్యలు తీసుకోలేదు. అగ్నిపథ్ స్కీం ద్వారా మేం ఈ సమస్యకు పరిష్కారం తీసుకువచ్చాం. ఈ పథకం ద్వారా భారత సైన్యంలో యువరక్తం పొంగిపొర్లుతుంది... అన్నివేళలా యుద్ధానికి సిద్ధంగా ఉంటుంది.భారత బలగాలకు సంబంధించిన పెన్షన్ సొమ్మును పొదుపు చేయడానికే ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు విధుల్లో చేరిన ఉద్యోగులకు 30 ఏళ్ల తర్వాత పింఛన్ అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ మేమే ఈ అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకున్నాం, అది తర్వాత వచ్చే ప్రభుత్వాలకే వదిలేయాలని ఆలోచించలేదు. ఎందుకంటే ఎందుకంటే రక్షణ దళాలు అంటే మాకు గౌరవం ఉంది, వారి నిర్ణయం పట్ల మాకు గౌరవం ఉంది. మేం 'రాజనీతి' కోసం కాకుండా 'రాష్ట్రనీతి' కోసం పని చేస్తున్నాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
ఒకే యూనిఫామ్, విధులతో.. లక్ష మంది అగ్నివీరులు చేరిక
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్ ప్రథకం కింద ఇప్పటివరకు లక్షమంది అగ్నివీరులు శిక్షణపొంది వివిధ విభాగాల్లో చేరినట్లు ఆర్మీ పేర్కొంది. సుమారు 70 శాతం మంది అగ్నివీరులు వివిధ ఆర్మీ యూనిట్ల పనిచేస్తున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ (ఆర్మీ అడ్జటెంట్ జనరల్) సీబీ పొన్నప్ప ఆదివారం తెలిపారు.‘2022 జూన్లో అగ్నిపథ్ పథకం అమలులోకి వచ్చింది. జనవరి, 2022 నుంచి 2023 మధ్య మొదటి బ్యాచ్ నియామకం పూర్తి అయింది. ఈ పథకం ద్వారా లక్ష మంది అగ్నివీరులో అర్మీలో జాయిన్ అయ్యారు. ఇందులో 200 మంది మహిళలు ఉన్నారు. ఇక.. రిక్రూట్ అయిన 70 వేల మంది అగ్నివీరులు వివిధ విభాగాలు, బెటాలియన్లలో చేరారు. ఇందులో కూడా 100 మంది మహిళలు ఉన్నారు’అని తెలిపారు.దీంతోపాటు మరో 50 వేల అగ్నివీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని 2024-25 ఏడాదికి గాను నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద రెండు రకాల సైనికులను ఆర్మీ తయారు చేస్తోందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.‘ఇతర సైనికుల మాదిరిగానే అగ్నివీరు అన్ని రకాల విధులను నిర్వర్తించాలి. నిబంధనల్లో కూడా పేర్కొన్నాం. ఆపరేషనల్, వృత్తిపరమైన విధులను అగ్నివీరులు నిర్వహించాలి. వీరంతా ఆయా యూనిట్లలో చేరి విధులు చేపడతారు. ఒకే విధమైన యూనిఫామ్, ఒకే విధమైన విధులు నిర్వహిస్తారు’అని లెఫ్టినెంట్ జనరల్ సీబీ పొన్నప్ప తెలిపారు.కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో సెలెక్ట్ అయినవారు నాలుగు సంవత్సరాల పాటు సాయుధ బలగాల్లో పనిచేస్తారు. వారిని అగ్నివీర్లు అంటారు. 17.5 ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నాలుగు ఏళ్ల తర్వాత కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగిస్తారు. మిగతావారంతా రిటైర్ అవుతారు. ఈ పథకం విధివిధానాలు నియామక ప్రక్రియ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ప్రతిపక్షాలు సైతం ఈ పథకాన్ని రద్దు చేయాని డిమాండ్ చేస్తున్నాయి. లోక్సభ ఎన్నికల మేనిఫెస్ట్లో సైతం ఈ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. -
ఎన్డీయే సర్కార్కు ‘అగ్ని’పరీక్ష తప్పదా?
న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీయే సర్కార్ ఇంకా కొలువు దీరలేదు. ఈలోపే మిత్రపక్షాల నుంచి డిమాండ్లు మొదలవుతున్నాయి. అయితే అవి కేబినెట్ కూర్పు విషయంలోనే కాదులేండి.దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా ఉన్న అగ్నివీర్ పథకాన్ని సమీక్షించాల్సిందేనని ఎన్డీయే మిత్రపక్షం జనతా దళ్ యునైటెడ్(జేడీయూ) ఇప్పుడు కోరుతోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ ఈ స్వరం వినిపించారు. ’’అగ్నిపథ్ పథకం మీద దేశవ్యాప్తంగా ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ పథకం తెచ్చినప్పుడు సైన్యం వర్గాలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. .. వాళ్ల కుటుంబాలు కూడా రోడ్డెక్కి పోరాటం చేశాయి. ఎన్నికల్లోనూ ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది కూడా. కాబట్టి, దానిని కచ్చితంగా సమీక్షించాల్సిందే. ఈ పధకంపై ప్రజలు లేవనెత్తిన లోటుపాట్లను వివరంగా చర్చించి వాటిని చక్కదిద్దాలని మా పార్టీ కోరుకుంటోందని చెప్పారు.‘‘ అని కేసీ త్యాగి అన్నారు.ఇక.. ఉమ్మడి పౌరస్మృతిపై పార్టీ అధ్యక్షుడి హోదాలో బిహార్ సీఎం నితీష్ కుమార్ లా కమిషన్ చీఫ్కు లేఖ రాసిన సందర్భాన్ని కూడా త్యాగి గుర్తుచేశారు. తాము ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకం కాదని, అయితే యూసీసీపై ప్రభావితమయ్యే అన్ని వర్గాల ప్రజలతో చర్చించి ఓ పరిష్కారం అన్వేషించాలని త్యాగి పేర్కొన్నారు.రెండేళ్ల కిందట.. త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం గత ఎన్డీయే హయాంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘అగ్నిపథ్’. అయితే నాలుగేళ్ల కాలపరిమితితో ఉండే ఈ సర్వీసు అంశంపై ఆ సమయంలోనే తీవ్ర దుమారం రేగింది. దేశవ్యాప్తంగా నిరసనజ్వాలలు పెల్లుబిక్కాయి. మరోవైపు ప్రతిఏపక్షాలు సైతం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అయినప్పటికీ.. అగ్నివీర్ పథకం ద్వారా అగ్నీవీర్లను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా.. ఇండియా కూటమిలో ఉన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం అగ్నివీర్ పథకాన్ని రద్దు చేయాల్సిందేననే గళం బలంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వం ఆ తప్పిదాన్ని ఒప్పుకుని.. వెంటనే దానిని రద్దు చేయాలని కోరుతున్నారాయన. కిందటి నెలలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ పథకానికి మార్పులు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వెలిబుచ్చారు. అయితే ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ ఏడాది మార్చిలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కాంగ్రెస్ ఇది ఎన్నికల జిమ్మిక్కు అంటూ మండిపడింది. -
Rahul Gandhi: ‘అగ్నిపథ్’లో వివక్షను అడ్డుకోండి
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలులో జోక్యం చేసుకుని అమర జవాన్ల కుటుంబాలకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయమే అయినప్పటికీ జాతి భద్రతపై ప్రభావం కలిగించే ఈ అంశంపై సాయుధ బలగాల సుప్రీం కమాండర్గా ప్రత్యేక పరిస్థితుల్లో జోక్యం చేసుకోవచ్చన్నారు. ఈ మేరకు శనివారం రాహుల్ ఒక లేఖ రాశారు. దేశం కోసం జీవితాలనే త్యాగం చేస్తున్న అగ్నివీర్లకు మిగతా సైనికుల మాదిరిగానే ప్రయోజనాలను వర్తింపజేయాలని కోరారు. -
‘అగ్నిపథ్’ స్కీమ్పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ:అగ్నిపథ్ స్కీమ్పై దేశ ప్రజలకు తామిచ్చిన హామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పరిధిలోకే వస్తుందని ఎన్నికల కమిషన్(ఈసీ)కి కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు పార్టీ ఈసీకి ఒక లేఖ రాసింది. సాయుధ దళాలను రాజకీయం చేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈసీ సూచించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.అగ్నిపథ్ స్కీమ్ విషయమై శుక్రవారం(మే24) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సర్వీస్మెన్ విభాగం చీఫ్ కల్నల్ రోహిత్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘సాయుధ దళాలు దేశ భద్రత కోసం గొప్పగా పనిచేస్తున్నాయి. మేం కేవలం అగ్నిపథ్ స్కీమ్ గురించే మట్లాడుతున్నాం. ఈ స్కీమ్ను తీసుకువచ్చి ఆర్మీని మోదీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఈ స్కీమ్ దేశ ప్రజలు, ఆర్మీ జవాన్ల ప్రయోజనాలకు ఎంత మాత్రం మేలు చేయదు. అందుకే రద్దు చేస్తాం’అని తెలిపారు. -
‘అగ్నివీర్’ అమరుడైతే ఆర్థిక సాయం అందదా? ఇండియన్ ఆర్మీ ఏమంటోంది?
ఇండియన్ ఆర్మీలో ‘అగ్నిపథ్’ పథకం ప్రారంభమైనప్పటి నుంచి విమర్శలకు గురవుతూనే ఉంది. కేవలం నాలుగేళ్ల పరిమితితో సైన్యంలో చేరిన అగ్నివీరుడు అమరుడైతే ఆర్థిక సాయం అందిస్తారా? అనే అంశంపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. ఇటీవల ఒక సైనికుడు మరణించిన నేపధ్యంలో అతనిని ‘అమరవీరుడు’గా గుర్తించలేదు. అలాగే ఆర్మీ తరపున తగిన గౌరవం అందించలేదు. దీనిపై విమర్శలు చెలరేగడంతో సైనికాధికారులు సమాధానమిస్తూ ఆ సైనికుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అయితే సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ అక్షయ్ లక్ష్మణ్ గవాటే వీరమరణం పొందారు. లక్ష్మణ్ ‘అగ్నివీరుడు’ కావడంతో అతని కుటుంబానికి ఎలాంటి ఆర్థిక సహాయం చేయరా? అంటూ ప్రతిపక్షం ఇండియన్ ఆర్మీకి సవాల్ విసిరింది. ఈ ఆరోపణలపై భారత సైన్యం స్వయంగా క్లారిటీ ఇచ్చింది. ఆర్మీ ఒక ప్రకటనలో ‘అగ్నివీర్’ స్కీమ్ కింద రిక్రూట్ అయిన సైనికుడు అమరుడైన సందర్భంలో అందించే ఆర్థిక సహాయంపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే వాదనలు జరుగుతున్నాయి. అందుకే దీనిపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. అగ్నివీర్ యోజన కింద రిక్రూట్ అయిన సైనికులకు అందించే ప్రయోజనాలివే.. రూ. 48 లక్షల జీవిత బీమా సేవా నిధి సొమ్ము. ఇందులో అగ్నివీర్ జీతం నుంచి 30 శాతం జమ అవుతుంది. అంతే మొత్తాన్ని ప్రభుత్వం దానికి జత చేరుస్తుంది. ఈ డబ్బుపై వడ్డీని కూడా అందిస్తారు. రూ. 44 లక్షల ఆర్థిక సహాయం మిగిలిన సర్వీస్ జీతం.. ఇటువంటి సందర్భంలో రూ. 13 లక్షలకు మించి అందిస్తారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ నుండి రూ.8 లక్షల సహాయం. ఏడబ్ల్యుడబ్ల్యు నుండి రూ.30 వేలు సత్వర సహాయం అగ్నివీర్ అమరవీరుడైతే సుమారు రూ. ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అతని కుటుంబానికి అందుతుంది. సేవా నిధి రూపంలో వచ్చిన డబ్బుపై పన్ను ఉండదు. ఒక అగ్నివీర్ జవాన్ విధులలో లేని సమయంలో మరణిస్తే, అతని కుటుంబానికి రూ. 48 లక్షల బీమా, మరణించిన తేదీ వరకు లెక్కించిన సేవా నిధి సొమ్ము, కార్పస్ ఫండ్ సొమ్ము అందిస్తారు. ఇది కూడా చదవండి: లాక్డౌన్ దిశగా ఢిల్లీ? స్కూళ్ల మూసివేత? వర్క్ ఫ్రమ్ హోమ్కు ఆదేశాలు? #Agniveer (Operator) Gawate Akshay Laxman laid down his life in the line of duty in #Siachen. #IndianArmy stands firm with the bereaved family in this hour of grief. In view of conflicting messages on social media regarding financial assistance to the Next of Kin of the… pic.twitter.com/46SVfMbcjl — ADG PI - INDIAN ARMY (@adgpi) October 22, 2023 -
అగ్నిపథ్ స్కీమ్లో కీలక మార్పులు.. అగ్నివీర్లకు గుడ్న్యూస్!
ఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలోని త్రివిధ దళాల్లో అగ్నిపథ్ స్కీమ్ను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక, ఈ పథకం కింద త్రివిధ దళాల్లో ఎంపికైన వారిని అగ్నివీర్లు అని పిలుస్తున్నారు. అయితే, అగ్నిపథ్ పథకంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో అగ్నివీర్లకు శుభవార్త అందించింది. వివరాల ప్రకారం.. అగ్నిపథ్ పథకంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. అగ్నివీర్ల కాల పరిమతి, వయస్సును పెంచే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. ఈ పథకం కింద ఎంపిక చేసిన యువతలో 25 శాతం మందినే నాలుగేళ్ల తర్వాత ఆర్మీలో రెగ్యూలర్ క్యాడర్ తీసుకోనున్నారు. అయితే దీనిని 25 నుంచి 50 శాతంకు పెంచాలనే కేంద్రం తీసుకున్నట్టు సమాచారం. అలాగే, సాంకేతిక నేపథ్యం ఉన్న యువకులను చేర్చుకోవడం, గరిష్ట వయోపరిమితిని 21 నుంచి 23 సంవత్సరాలకు పెంచాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. జూన్ 2022లో ప్రారంభించబడిన అగ్నిపథ్ స్కీమ్ కింద 17.5-21 సంవత్సరాల మధ్య వయస్సు గల అభ్యర్థులను అగ్నివీర్ పోస్టుల కోసం పరిశీలిస్తున్నారు. అయితే, సాంకేతిక నేపథ్యం ఉన్న అభ్యర్థుల విషయంలో గరిష్ట రిక్రూట్మెంట్ వయస్సు 21 ఏళ్లలోపు పరిమితిని సడలించే అవకాశాలు ఉన్నాయని బలగాలు అభిప్రాయపడుతున్నాయి. గరిష్ట వయోపరిమితిని సవరించడం.. దానిని 23 సంవత్సరాలకు పెంచడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు.. 2026 నాటికి దాదాపు 1.75 లక్షల మంది యువకులు అగ్నిపథ్ పథకం కింద చేరనున్నారనే అంచనాలు ఉన్నాయి. కాగా, ప్రతీ ఏడాది దాదాపు 60వేల మంది సైనికులు పదవీ విరమణ చేయడం గమనార్హం. ఈ క్రమంలోనే మూడు సర్వీసుల్లో సైనికుల కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఇండియన్ ఆర్మీలోనే 1.18 లక్షల మంది కావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: బీజేపీ కీలక నిర్ణయం.. రాజ్యసభ బరిలో ఆయనకు సీటు ఫైనల్ -
మాజీ అగ్నివీర్లకు బీఎస్ఎఫ్ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్
న్యూఢిల్లీ: సైనిక దళాల్లో ఎంపికల కోసం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అగ్నిపథ్ పథకం పట్ల యువతను ఆకర్షితులను చేసే దిశగా కేంద్రం ఒక ప్రకటన చేసింది. అగ్నివీర్ ద్వారా ఎంపికై నిబంధనల మేరకు నాలుగేళ్లు సర్వీసు పూర్తి చేసుకుని రిటైరైన అభ్యర్థులకు సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించింది. అంతేకాదు, గరిష్ట వయోపరిమితిలో కూడా సడలింపులు ఉంటాయని తెలిపింది. ఇందుకు వీలు కల్పిస్తూ బీఎస్ఎఫ్ జనరల్ డ్యూటీ కేడర్(నాన్ గెజిటెడ్) రిక్రూట్మెంట్–2015 నిబంధనల్లో మార్పులు చేపట్టినట్లు వెల్లడించింది. ఇవి మార్చి 9వ తేదీ నుంచే అమల్లోకి వచ్చాయని ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి బ్యాచ్ మాజీ అగ్నివీర్లకు గరిష్ట వయో పరిమితిలో ఐదేళ్ల వరకు సడలింపు ఉంటుందని కేంద్ర హోం శాఖ అందులో వివరించింది. ఇతర బ్యాచ్ల వారికైతే మూడేళ్ల వరకు సడలింపు ఉంటుంది. మాజీ అగ్నివీర్లకు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ నుంచి మినహాయింపు కూడా ఉంటుంది. -
అగ్నిపథ్ను సమర్థించిన హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేత
ఢిల్లీ: కేంద్రం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అగ్నిపథ్ పథకాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలో అగ్నిపథ్ను సవాల్ చేస్తూ వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా అగ్నిపథ్ స్కీమ్ను ఆపేందుకు ఎలాంటి కారణాలు లేవని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పథకం జాతీయ భద్రత ప్రాతిపదిక కేంద్రం తీసుకున్న విధానమని హైకోర్టు పేర్కొంది. అయితే, 2019 అగ్నిపథ్ రిక్రూట్మెంట్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో వాదనల అనంతరం.. హైకోర్టు పైవ్యాఖ్యలు చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు కోర్టు తెలిపింది. -
Indian Army Day: సెల్యూట్..సైనికుడా..!
తమ బతుకునే ఫణంగా పెట్టి తన కోసం, తన కుటుంబం కోసం కాకుండా దేశం కోసం ఉద్యోగం చేస్తుంటారు కొందరు. పుట్టిన ఊరికి దూరంగా, కన్నవారికి, కట్టుకున్న వారికి కనపడకుండా ఎండా, వానను లెక్క చేయకుండా చలికి వణుకుతూ అనుక్షణం ఎదురయ్యే ప్రమాదాలతో సహజీవనం చేస్తూ దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుంటారు. వారే మన భారత సైనికులు. త్యాగానికి నిదర్శనంగా నిలుస్తున్న నిజమైన దేశ భక్తులు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఏటా జనవరి 15వ తేదీన ఆర్మీ డే జరుపుకుంటాం. పోరాటాల పురిటిగడ్డగా పేరొందిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎందరో యువకులు ఆర్మీలో పనిచేస్తున్నారు. అనేక మంది రిటైర్డ్ అయి సమాజ సేవలో ఉన్నారు. నేడు సైనిక దినోత్సవం సందర్భంగా.. వారిపై ప్రత్యేక కథనం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 1300 మంది వరకు త్రివిధ దళాల్లో పనిచేశారు. వీరిలో ఎయిర్ఫోర్స్లో 50 మంది, నేవీలో 20 మంది వరకు పని చేశారు. ప్రస్తుతం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన వారు దాదాపు 400 మంది వరకు జవాన్ స్థాయి నుంచి కల్నల్ హోదా వరకు సైన్యంలో పనిచేస్తున్నారు. సైనిక సంక్షేమ శాఖ వద్ద ఉన్న సమాచారం ప్రకారం 1300 మందిలో కొంతమంది యుద్ధంలో వీరమరణం పొందారు. వివిధ కారణాలతో మరో 350 చనిపోయారు. మన జిల్లాకు చెందిన పలువురు సైనికులు 1965లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో, 1977లో జరిగిన బంగ్లాదేశ్ విభజన సమయంలో, 1999 కార్గిల్ యుద్ధంలో, 2021లో చైనా బలగాలను నిలువరించిన ఘటనలో పాల్గొన్నారు. నల్లగొండ, సూర్యాపేట ప్రాంతానికన్నా భువనగిరి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో సైన్యంలో చేరుతున్నారు. వలిగొండ మండలం ఎదుళ్లగూడెంలో 15 మంది మాజీ సైనికులు ఉన్నారు. ముగ్గురు ప్రస్తుతం సైన్యంలో పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా.. త్రివిధ దళాల్లో పనిచేసిన పలువురు రిటైర్డ్ అయిన తరువాత ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవలందిస్తున్నారు. కోదాడ, హుజూర్నగర్ ఎమ్మెల్యేగా, ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా పనిచేస్తున్న ఉత్తమ్కుమార్రెడ్డి భారత వాయుసేనలో మిగ్ యుద్ధవిమానం ఫైలెట్గా పనిచేశారు. శాలిగౌరారం మండలం ఇటుకులపహాడ్ సర్పంచ్ సైదులు సైన్యంలో పనిచేసినవాడే. హాలియా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సుధాకర్ కూడా సైన్యంలో పనిచేశారు. ఇలా చాలా మంది ఉన్నారు. అల్లి గంగరాజు, అల్లి సైదులు, అల్లి వెంకటేశ్వర్లు దేశసేవకు ఆ కుటుంబం అంకితం ఆర్మీలో ఉద్యోగం అంటేనే బయపడే కాలంలో దాదాపు మూడు దశాబ్దాల క్రితం మారుమూల గ్రామంలో పుట్టిపెరిగి, ఒకే ఇంటి నుంచి ముగ్గురు అన్నదమ్ములు దేశసేవ కోసం సైన్యంలో చేరి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరిలో ఇద్దరు ఉద్యోగ విరమణ పొందగా మరొకరు దేశమాత సేవలోనే ఉన్నారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఇటుకులపçహాడ్ గ్రామానికి చెందిన అల్లి రామచంద్రయ్య– లక్ష్మి దంపతులకు నలుగురు కుమారులు సైదులు, వెంకటేశ్వర్లు, గంగరాజు, సురేష్ ఉన్నారు. పెద్ద కుమారుడు సైదులు 1998లో తొలిప్రయత్నంలోనే ఆర్మీలో ఉద్యోగం సాధించాడు. అన్నను స్పూర్తిగా తీసుకొని తమ్ముళ్లు వెంకటేశ్వర్లు 2005లో గంగరాజు 2011లో సైన్యంలో చేరారు. నాలుగవవాడైన సురేష్ అన్ని రకాల పరీక్షలు పాసై ఆర్మీలో చేరుదామనుకొనే సమయంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఉద్యోగంలో చేరలేకపోయాడు. అతను ఇంటి వద్ద ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాడు. 1998లో ఉద్యోగంలో చేరిన సైదులు 2014లో నాయక్ హోదాలో ఉద్యోగ విరమణ పొందాడు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ సర్పంచ్గా ఎన్నికై సేవలందిస్తున్నాడు. వెంకటేశ్వర్లు 2022లో లాన్స్నాయక్ హోదాలో రిటైర్ అయ్యాడు. గ్రామంలోనే ఉండి సైన్యంలో చేరాలనుకుంటున్న వారికి శిక్షణ ఇస్తున్నాడు. గంగరాజు ప్రస్తుతం హవాల్దార్ హోదాలో జమూకశ్మీర్లో పనిచేస్తున్నాడు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని గ్రామానికి చెందిన మరో ఐదుగురు యువకులు సైన్యంలో చేరారు. క్రమశిక్షణ అలవడుతుంది ఆర్మీ ఉద్యోగం అంటేనే క్రమశిక్షణ, నీతి నిజాయితీలకు మారుపేరు. సైన్యంలో చేరిన ప్రతి ఒక్కరూ కఠోర శిక్షణతో పాటు శరీరదారుఢ్యం, మానసికస్థైర్యం, ఆత్మరక్షణలో రాటుదేలుతారు. నేడు సైన్యంలో చేరేందుకు యువత ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. ఇది దేశరక్షణకు మంచి పరిణామంగానే భావించవచ్చు. నాడు సైన్యంలో చేరేందుకు ఒక్క ఉద్యోగానికి 10 మంది పోటీపడితే నేడు సైన్యంలో ఒక్క ఉద్యోగానికి వందల సంఖ్యలో పోటీపడుతున్నారు. – అల్లి సైదులు, మాజీ సైనికుడు, ఇటుకులపహాడ్ సర్పంచ్ సైనిక నియామకాల కోసం ప్రభుత్వం ఇటీవల కొత్తగా ‘అగ్నిపథ్’ విధానాన్ని తీసుకొచ్చింది. దీనిలో చేరడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి దాదాపు 7000 మంది యువకులు ముందుకొచ్చారు. వీరికి ఫిజికల్, మెడికల్ టెస్ట్లు పూర్తి కాగా త్వరలో రాత పరీక్ష జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం విజయరాఘవాపురానికి చెందిన మాజీ సైనికుడు కల్నల్ డాక్టర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో వివిధ అంశాలలో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. 2020 సంవత్సరం జూన్లో చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు అర్పించిన సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్బాబు ఆదుకుంటున్నామా.. యుక్త వయస్సులో అన్నీ వదులుకొని దేశసేవ కోసం పనిచేసిన సైనికులు రిటైర్డ్ అయిన తరువాత వారికి అందాల్సిన సౌకర్యాలు సక్రమంగా అందడం లేదనే విమర్శలున్నాయి. మాజీ సైనికుల డిమాండ్లు అపరిష్కృతంగా ఉన్నాయి. చాలా మంది తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ సైనికుల డిమాండ్స్ ఇవీ.. ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లు 2 శాతం నుంచి 5 శాతానికి పెంచాలి. మాజీ సైనికులకు కేటాయించిన ఉద్యోగాలు ఒకసారి భర్తీ కాకుంటే వాటిని బ్యాక్లాగ్ చేసి మళ్లీ మాజీ సైనికులకే కేటాయించాలి. మాజీ సైనికుల పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యనందించాలి. ఉచితంగా ఇంటి స్థలాలు కేటాయించాలి. రాయితీ మీద మాజీ సైనికులకు ఇచ్చే సరుకుల కోసం ఉమ్మడి జిల్లాలో క్యాంటీన్ ఏర్పాటు చేయాలి. సరుకుల కోసం హైదరాబాద్కు వెళ్లి రావడం ఇబ్బందిగా ఉంది. ఉమ్మడి జిల్లాలో మాజీ సైనికులకు స్మారక చిహ్నం నిర్మించాలి. మాజీ సైనికులకు జీఓ నంబర్ 69 ప్రకారం సత్వరమే అన్ని సౌకర్యాలు కల్పించాలి. దేశసేవకు మించిన తృప్తి మరొకటి లేదు దేశం కోసం పనిచేయడానికి మించిన తృప్తి దేనిలోనూ ఉండదు. ఇటీవల ఆగ్నిపథ్ నియామకాల కోసం సూర్యాపేట జిల్లా నుంచి నేను ఏర్పాటు చేసిన ‘ది షోల్జర్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో జిల్లా అధికారుల సహకారంతో 225 మందికి శిక్షణ ఇవ్వగా తుది రాత పరీక్షకు 167 మంది ఎంపికయ్యారు. ఇది ఆనందించదగ్గ విషయం. యువత ఇంకా ముందుకు రావాలి. – రిటైర్డ్ కల్నల్ సుంకర శ్రీనివాసరావు, విజయరాఘవాపురం, మునగాల దేశం రుణం తీర్చుకున్నా సైన్యంలో పనిచేసి దేశం రుణం తీర్చుకున్న తృప్తి మిగిలింది. నేను చదువుకునే రోజుల్లో సికింద్రాబాద్ వెళ్లాను. అక్కడ మిలటరీ వారిని చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నాను. 20 సంవత్సరాల వయస్సులో 1962లో సైన్యంలో చేరాను. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో, 1971లో బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్నా. 1977లో రిటైర్డ్ అయ్యాను. తరువాత ఫైర్ ఆఫీసర్గా పనిచేశాను. రెండు యుద్ధాల్లో పాల్గొని దేశం కోసం పనిచేసిన తృప్తి ఎప్పటికీ ఉంటుంది. యువత కూడా దేశం కోసం పనిచేయడానికి ముందుకు రావాలి. – సంధి పాపిరెడ్డి, అయిటిపాముల, కట్టంగూర్ మండలం (చదవండి: టోల్ ప్లాజాకు ‘పండుగ’) -
Roundup 2022: మెరుపులు..మరకలు
ప్రగతి పథంలో సాగుతున్న ‘స్వతంత్ర’ కవాతుకు అమృతోత్సవ సంబరాలు... ఆదివాసీ మహిళను దేశ అత్యున్నత పీఠంపై కూర్చోబెట్టిన ప్రజాస్వామ్య సొగసులు... ‘ఆత్మ నిర్భర్’ లక్ష్యంతో రక్షణ రంగంలో అగ్ని, ప్రచండ, విక్రాంత్ మెరుపులు... అంతరిక్ష రంగంలో ఇతర దేశాలతో పోటీ పడేలా తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ చిమ్మిన నిప్పులు... బ్రిటన్ను దాటేసి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వడివడిగా పెట్టిన పరుగులు... కంటికి కనిపించని క్రిమిపై పోరాటంలో ప్రపంచ దేశాలకు చూపిన ఆదర్శం... ...ఇవన్నీ ఈ ఏడాది మనం సాధించిన ఘన విజయాల్లో కొన్ని. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు తెరలేపిన ‘అగ్ని’పథం, మైనార్టీ మహిళల హిజాబ్ ధారణపై వివాదం ...వంటి కొన్ని మరకలు. ఎంతో ఇష్టం, కొంచెం కష్టంగా సాగిన 2022లో ముఖ్య ఘటనలపై విహంగ వీక్షణం... మెరుపులు ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత పదవిని అధిష్టించడం ఒక చరిత్రగా నిలిచింది. సంతాల్ గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము (64) అధికార ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో నెగ్గి కొత్త చరిత్ర లిఖించారు. దేశ 15వ రాష్ట్రపతిగా సగర్వంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ఒడిశాలో మయూర్భంజ్ జిల్లాకు చెందినవారు. ► భారత్ ఈ ఏడాది ఆర్థికంగా పుంజుకొని యూకేను కూడా దాటేసి ప్రపంచంలోని అతి పెద్ద అయిదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని నవంబర్ 15న అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్ఎఫ్) తన నివేదికలో వెల్లడించింది. ► భారత్ తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్–ఎస్ నవంబర్ 18న శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా దూసుకుపోయింది. హైదరాబాద్కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ అనే స్టార్టప్ కంపెనీ రూపొందించిన ఈ రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకువెళ్లింది. ► దేశంలో డిజిటల్ లావాదేవీలు పెంచడానికి, కాగితం కరెన్సీ నిర్వహణకయ్యే ఖర్చుని తగ్గించడం కోసం ఆర్బీఐ డిసెంబర్ 1 నుంచి ప్రయోగాత్మకంగా డిజిటల్ రుపీని అమల్లోకి తీసుకువచ్చింది. ► ఆత్మనిర్భర్ భారత్కు ఊతమిస్తూ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బాహుబలి యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2న కొచ్చితీరంలో జాతికి అంకితం చేశారు. రూ.20వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ నౌక క్షిపణి దాడుల్ని తట్టుకోగలదు. ఇలాంటి సామర్థ్యం కలిగిన యుద్ధనౌకలున్న అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన సగర్వంగా తలెత్తుకొని నిల్చున్నాం. భారత వాయుసేనలో తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ ప్రచండని అక్టోబర్లో ప్రవేశపెట్టారు. ఇక అణు పేలోడ్లను మోసుకువెళ్లే సామర్థ్యం కలిగిన అగ్ని–5 క్షిపణిని డిసెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించడంతో త్రివిధ బలగాలు బలోపేతమయ్యాయి. మరకలు ► సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. యువకులకు నాలుగేళ్లు సైన్యంలో పనిచేసే అవకాశం మాత్రమే కల్పించడంతో పాటు పింఛన్ సదుపాయం కూడా లేని ఈ పథకానికి జూన్ 14న కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హర్యానా, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆందోళనలు హింసకు దారితీశాయి. ► కర్ణాటకలో ఉడిపిలో కళాశాలలో జనవరిలో హిజాబ్ ధరించి వచ్చినందుకు కొందరు ముస్లిం అమ్మాయిలను తరగతి గదుల్లోకి రానివ్వకపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. వీరికి పోటీగా కొందరు విద్యార్థులు కాషాయ దుస్తులు ధరించి రావడంతో మతఘర్షణలకు దారి తీసింది. కర్ణాటక ప్రభుత్వం ఫిబ్రవరి 5న హిజాబ్పై నిషేధం విధిస్తే మార్చి 15న హైకోర్టు దానిని సమర్థిస్తూ తీర్పు చెప్పింది. అక్టోబర్ 13న సుప్రీంకోర్టు భిన్న తీర్పులు వెలువరించడంతో తుది నిర్ణయం భారత ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని బెంచ్ చేతుల్లోకి వెళ్లింది. ► గుజరాత్లోని మోర్బిలో అక్టోబర్ 30 కుప్పకూలిపోయిన కేబుల్ వంతెన దుర్ఘటనలో 138 మంది మరణించారు. మానవ తప్పిదాల కారణంగానే ఈ వంతెన కుప్పకూలిపోయింది. ఒకేసారి వంతెనపైకి వంద మంది వెళ్లడానికి మాత్రమే వీలుంటే, నిర్వాహకులు 500 మందిని పంపడంతో ప్రమాదం జరిగింది. ► ఢిల్లీలో నివాసముంటున్న శ్రద్ధా వాకర్ అనే యువతిని ఆమెతో సహజీవనం చేస్తున్న అఫ్తాబ్ పూనెవాలె మే 18న గొంతు కోసి హత్య చేయడంతో పాటు ఆమె మృతదేహాన్ని 35 ముక్కలు చేసి చుట్టుపక్కల అడవుల్లో పారేసిన ఘటన దేశంలో సంచలనం సృష్టించింది. మృతదేహం ముక్కల్ని ఫ్రిజ్లో ఉంచి రోజుకి కొన్ని పారేసిన వైనం ఒళ్లు జలదరించేలా చేసింది. నవంబర్ 11న అఫ్తాబ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విషాదాలు ► యావత్ భారతావనిని దుఃఖసాగరంలో ముంచేస్తూ భారతరత్న, గానకోకిల లతామంగేష్కర్ (92); పద్మవిభూషణ్, కథక్ దిగ్గజం పండిట్ బిర్జు మహరాజ్ (83) తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ► సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ములాయం సింగ్ యాదవ్ కన్నుమూయడంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఉజ్జ్వల శకానికి తెర పడింది. యాత్రలు, విజయాలు, చీలికలు ► కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 12 రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన 150 రోజుల భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న ప్రారంభమైంది. ఇటీవల వంద రోజులు పూర్తి చేసుకుంది. ► గాంధీ కుటుంబానికి చెందని సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టి రికార్డు సృష్టించారు. ► ఈ ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా; చివర్లో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా... ఇలా ఐదు రాష్ట్రాల్లో నెగ్గి బీజేపీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. కాంగ్రెస్ హిమాచల్తో సరిపెట్టుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా పంజాబ్లో అఖండ విజయం సాధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ నెగ్గి బీజేపీ 15 ఏళ్ల పాలనకు తెరదించింది. జాతీయ పార్టీగానూ అవతరించింది! ► బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి యూ టర్న్ తీసుకున్నారు. ఆగస్టులో ఎన్డీయేకి గుడ్ బైకొట్టి తిరిగి మహాఘట్బంధన్లో చేరి ఆర్జేడీ, కాంగ్రెస్ మద్దతుతో మళ్లీ సీఎం పగ్గాలు చేపట్టారు. ► మహారాష్ట్రలో శివసేన కనీవినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంది. పార్టీని ఏక్నాథ్ షిండే రెండు ముక్కలు చేశారు. భారీగా ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ► నేషనల్ హెరాల్డ్ కేసు గాంధీ కుటుంబాన్ని వెంటాడుతోంది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు తొలిసారిగా ఈ ఏడాది ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. కేంద్ర విచారణ సంస్థలైన ఈడీ, సీబీఐ ఈ ఏడాదంతా బిజీగా గడిపాయి. పలు విపక్ష పార్టీల నేతలను విచారించాయి. పలువురిని అరెస్టు చేశాయి. దీని వెనక రాజకీయ కక్షసాధింపు ఉందంటూ విపక్షాలు మండిపడ్డాయి. చరిత్రాత్మక తీర్పులు... ► అత్యంత వివాదాస్పదమైన దేశద్రోహ చట్టంపై 124ఏ అమలుపై స్టే విధిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం మే 11న తీర్పు చెప్పింది. 124ఏపై కేంద్ర ప్రభుత్వం పునఃపరిశీలన పూర్తయ్యేవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ► మహిళల శరీరంపై వారికే హక్కు ఉందని అత్యున్నత న్యాయస్థానం చరిత్రాత్మక తీర్పునిచ్చింది. పెళ్లితో సంబంధం లేకుండా మహిళలందరూ 24 వారాలవరకు సురక్షిత గర్భవిచ్ఛిత్తికి అనుమతినిచ్చింది. సెప్టెంబర్ 29న ఈ తీర్పు చెప్పిన సుప్రీం అబార్షన్ చట్టాల ప్రకారం పెళ్లయినవారు, కాని వారు అన్న తేడా ఉండదని స్పష్టం చేసింది. ► భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారం చేసినా అది అత్యాచారం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. ఎంటీపీ చట్టం ప్రకారం మారిటల్ రేప్లు కూడా అత్యాచారం కిందకే వస్తాయని స్పష్టం చేసింది. ► ఇంటి అల్లుడు ఇంటి నిర్మాణం కోసం డబ్బులు డిమాండ్ చేసినా అది కట్నం కిందకే వస్తుందని సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. విశ్వవేదికపై... ► ప్రపంచంలో అత్యంత శక్తిమంతదేశాల కూటమి జీ20కి అధ్యక్ష బాధ్యతల్ని భారత్ స్వీకరించింది. 2023 నవంబర్ 30 దాకా ఈ బాధ్యతల్లో కొనసాగనుంది. 50 నగరాల్లో 200 సన్నాహక భేటీల అనంతరం 2023 సెప్టెంబర్లో ఢిల్లీలో జీ20 సదస్సును నిర్వహించనుంది. ► ఐరాస భద్రతా మండలి అధ్యక్ష హోదాలో కౌంటర్ టెర్రరిజం కమిటీ (సీటీసీ) సదస్సును అక్టోబర్ 28, 29 తేదీల్లో ముంబై, ఢిల్లీల్లో జరిగింది. ► అరుణాచల్ప్రదేశ్లో తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య డిసెంబర్ 9న ఘర్షణలు జరిగాయి. వాస్తవాధీన రేఖ దాటి చొచ్చుకొచ్చేందుకు చైనా చేసిన ప్రయత్నాలను మన బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. -
హిమాచల్లో పోలింగ్.. దృష్టి మాత్రం ‘కాంగ్రా’పైనే
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రమంతా పోలింగ్ జరుగుతోన్నా.. అందరి చూపు మాత్రం ఒక్క జిల్లాలో ఏ పార్టీకి ఓట్లు పడుతున్నాయన్నదానిపైనే ఉంది. హిమాచల్ రాజకీయాల్లో ఆ జిల్లా అత్యంత కీలకమని ఇప్పటికి ఎన్నో సార్లు నిరూపితమయింది. అక్కడ పాగా వేస్తే అధికారం దాదాపు ఖరారైనట్టే. మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. అందుకే ఈసారి పార్టీలు అదే రిపీట్ అవుతుందా..? అని వేచి చూస్తున్నాయి. ఈ జిల్లా చుట్టే బీజేపీ డబుల్ డ్రీమ్స్, కాంగ్రెస్ అగ్నిపథ్ స్కీమ్ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాయి. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాంగ్రా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అత్యధిక సీట్లున్న జిల్లా కాంగ్రా. 15మంది ఎమ్మెల్యేలు శాసనసభకు నేతృత్వం వహిస్తున్నారు. 1993 నుంచీ కాంగ్రా జిల్లాలో అధిక సీట్లు గెల్చుకుంటున్న పార్టీయే రాష్ట్రంలో పగ్గాలు చేపడుతోంది. 15 సీట్లలో కనీసం 9 వచ్చినవారు హిమాచల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు. 2017 ఎన్నికల్లో బీజేపీ 11 సీట్లు గెల్చుకుంది. అగ్నిపథ్ బీజేపీకి అగ్ని పరీక్ష కాంగ్రా జిల్లాలో రాజ్పుత్ల ప్రాబల్యం ఎక్కువ. ఓబీసీలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. ఏదో ఒకపార్టీ వైపు సూటిగా నిలవటం ఈ జిల్లా ప్రత్యేకత. ప్రధాని మోదీపై రాష్ట్రంలో ఆదరణ ఉన్నా.. స్థానిక బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా పెరిగిన ధరలు కమలదళాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కనిపిస్తోంది. సైన్యంలో ప్రవేశాలకు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కూడా హిమాచల్ ఎన్నికల్లో ప్రధానాంశం అవుతోంది. కాంగ్రాతోపాటు పక్కనున్న హమీర్పుర్, ఉనా, మండి జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువత సైన్యంలో చేరుతుంటారు. ఈ నాలుగు జిల్లాలు కలిపి మొత్తం 35 అసెంబ్లీ సీట్లున్నాయి. అగ్నిపథ్ స్కీమ్తో సైన్యంలో ప్రవేశం తగ్గిపోతుందనే ఆందోళన హిమాచల్ వాసులకు ఉంది. విపక్షాలకిది బలమైన అస్త్రంగా మారింది. పక్కలో తిరుగుబాటు బళ్లెం కాంగ్రాలోని 15 స్థానాలకు 91 మంది పోటీలో ఉన్నారు. అన్ని పార్టీలకూ ఇక్కడ తిరుగుబాటు అభ్యర్థులు సమస్యగా తయారయ్యారు. ఫతేపుర్, ధర్మశాల, ఇందోరా, కాంగ్రా, దెహ్రా స్థానాల్లో బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థులు తలనొప్పిగా మారారు. పార్టీ అధ్యకుడు నడ్డా, అధిష్ఠానం ఎంతగా నచ్చజెప్పినా రెబెల్స్ వెనక్కి తగ్గలేదు. మొత్తానికి 1993 నుంచీ ఒకసారి కాంగ్రెస్, మరోసారి బీజేపీకి అధిక సీట్లు ఇస్తూ వస్తోంది కాంగ్రా జిల్లా. అలాగే రాష్ట్రంలో అధికారం మారుతూ వస్తోంది. మరి ఈసారి కాంగ్రా ఎటువైపు మొగ్గుతుందో అని పార్టీలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ చదవండి: హిమాచల్ ప్రదేశ్ పోలింగ్: ఈ పోలింగ్ బూత్ ప్రపంచంలోనే ఎంతో ప్రత్యేకం! 52 మంది ఓటర్లతో ఏకంగా.. -
అది ప్రధాని మోదీ ల్యాబ్లో చేసిన కొత్త ప్రయోగం: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై మరోమారు ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాబ్లో చేస్తున్న ఆ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రతి ఏడాది 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చెందితే.., అందులో కేవలం 3వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ‘ప్రతి ఏటా 60వేల మంది జవాన్లు రిటైర్ అవుతున్నారు. అందులో 3వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. నాలుగేళ్ల కాంట్రాక్ట్ తర్వాత రిటైర్ అయ్యే వేలాది మంది అగ్నివీర్ల భవిష్యత్తు ఏమిటి? ప్రధానమంత్రి ల్యాబోరేటరీలో చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రతా, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయి.’ అని రాసుకొచ్చారు రాహుల్ గాంధీ. 60,000 सैनिक हर साल रिटायर होते हैं, उनमें से सिर्फ 3000 को सरकारी नौकरी मिल रही है। 4 साल के ठेके पर हज़ारों की संख्या में रिटायर होने वाले अग्निवीरों का भविष्य क्या होगा? प्रधानमंत्री की प्रयोगशाला के इस नए Experiment से देश की सुरक्षा और युवाओं का भविष्य दोनों खतरे में हैं। — Rahul Gandhi (@RahulGandhi) July 24, 2022 అగ్నిపథ్ పథకం ద్వారా త్రివిధ దళాల్లోకి అగ్నివీర్లను నాలుగేళ్ల కాంట్రాక్ట్ పద్ధతిన 17-21 ఏళ్ల అవివాహిత యువతను నియమిస్తామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత అందులోని 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. సికింద్రబాద్ సహా పలు చోట్ల రైళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఈ క్రమంలో వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది కేంద్రం. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదీ చదవండి: Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్ -
Monsoon session: ఆగని వాయిదాల పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయసభల్లో వరుసగా ఐదో రోజు కూడా వాయిదాల పర్వం కొనసాగింది. ధరల పెరుగుదల, జీఎస్టీపై విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. శుక్రవారం ఉదయం లోక్సభ ఆరంభమైన వెంటనే ధరలు, ద్రవ్యోల్బణం, జీఎస్టీ పెంపు తదితర అంశాలపై ప్లకార్డులతో విపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభను 12 గంటలకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు, ఆ తర్వాత మళ్లీ సోమవారం మధ్యాహ్నానికి స్పీకర్ వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ విపక్ష ఎంపీల ఆందోళనల కారణంగా మొదట 12 గంటలకు, తర్వాత గంట పాటు కొనసాగిన అనంతరం మధ్యాహ్నం 2.20 గంటలకు సభ వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చ కొనసాగింది. ఇక ఉభయ సభల ప్రారంభానికి ముందు టీఆర్ఎస్ సహా విపక్ష పార్టీల ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. జీఎస్టీ పెంపును వెనక్కి తీసుకోవాలని, ప్రజా సమస్యలపై పార్లమెంట్లో తక్షణమే చర్చించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడాలని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు కోరారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకు ఆమోదం లోక్సభలో ప్రతిపక్షాల ఆందోళన, నినాదాల మధ్యే ఇండియన్ అంటార్కిటిక్ బిల్లు–2022 ఆమోదం పొందింది. అంటార్కిటిక్ ప్రాంతంలో భారత్ నెలకొల్పిన పరిశోధనా కేంద్రాల విషయంలో దేశీయ చట్టాలను అమలు చేయడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన మొదటి బిల్లు ఇదే కావడం విశేషం. బిల్లుపై లోక్సభలో స్వల్పచర్చ జరిగింది. ‘అగ్నిపథ్’పై మాట్లాడనివ్వడం లేదు డిఫెన్స్పై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సమావేశం నుంచి ప్రతిపక్ష సభ్యులు శుక్రవారం వాకౌట్ చేశారు. అగ్నిపథ్ పథకంపై మాట్లాడేందుకు తమకు అవకాశం ఇవ్వడం లేదని ఆరోపించారు. అగ్నిపథ్పై చర్చించాలని కాంగ్రెస్, బీఎస్పీ సభ్యులు కేసీ వేణుగోపాల్, ఉత్తమ్కుమార్రెడ్డి, దానిష్ అలీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ జువాల్ ఓరామ్ను కోరగా, ఆయన నిరాకరించారు. కేవలం అజెండాలో ఉన్న అంశాలపై చర్చించాలని తేల్చిచెప్పారు. కావాలంటే పార్లమెంట్లో అగ్నిపథ్ అంశాన్ని ప్రస్తావించాలని సూచించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నిరసనగా వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. -
Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్
‘చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయి ఉండాలి’ అని ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షా చెప్పేవారు. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. స్వాతంత్య్ర కాలం నుంచీ వీరు భారత సైన్యంలో విడదీయలేని శక్తిగా ఉంటున్నారు. సాహసానికి పేరొందిన నేపాలీ గోర్ఖాలకు ఇప్పటికీ తొలి ప్రాధాన్యం సైన్యంలో చేరడమే. వీరంతా నేపాల్లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. 1947లో భారత్, బ్రిటన్, నేపాల్ మధ్య కుదిరిన త్రైపాక్షిక ఒప్పందానికి తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్ను భారత్ సంప్రదించలేదు. గోర్ఖా జానీ, గోర్ఖా సాథీ, లహురే... పేరు ఏదైనా కావొచ్చు; కీర్తి, సంపద ఆర్జించడం కోసం వీరు మహారాజా రంజిత్ సింగ్ సైన్యంలో చేరడానికి అప్పట్లో లాహోర్ వరకు వెళ్లారు. వీరిని నేపాలీ అమ్మాయిలు ఏరికోరి పెళ్లాడేవారు. ఇప్పటికీ చేసుకుంటున్నారు. ‘గోర్ఖాలు మీతో యుద్ధానికి దిగారు’ అనేది వీరి సమర నినాదం. పిరికివాడిగా ఉండటం కంటే చావడం మేలనేది వీరి ఆదర్శం. అలా వీరి పేర్లలో బహదూర్ (సాహసి), జంగ్ (సమరం) అనేవి వచ్చి కలిసేవి. ఫీల్డ్ మార్షల్ శామ్ మానెక్షాకు ‘శామ్ బహదూర్’ అని గుర్తింపు ఉండటం తెలిసిందే. తాను చావుకు భయపడటం లేదని ఏ సైనికుడు అయినా మీతో అన్నాడంటే, అతడు అబద్ధమాడుతూ ఉండాలి, లేదా గోర్ఖా అయివుండాలి అని మానెక్షా చెప్పేవారు. ఇండియన్ మిలిటరీ అకాడెమీలో నన్ను ఇష్టమైన మూడు ఆయుధాలు ఎంచుకొమ్మ న్నప్పుడు... నేను గోర్ఖాలు, గోర్ఖాలు, గోర్ఖాలు అని చెప్పేవాడిని. ఇప్పుడు చరిత్రలో మొదటిసారిగా వారిని అగ్నిపథ్ గోర్ఖాలు అని పిలవనున్నారు. ఈ బిరుదు, లేదా గుర్తింపు వారికి ఏమాత్రం సరిపోనిది అనే చెప్పాలి. ‘కిరాయి’ సైనికులు కాదు దేశ విభజనకు ముందు భారతీయ అధికార్లను గోర్ఖాల్లో చేరడానికి బ్రిటిష్ అధికార్లు అనుమతించేవారు కాదు. 1947 తర్వాత అంటే గోర్ఖా ట్రూప్ కమాండ్ను భారతీయ అధికారులు ప్రారంభించిన తర్వాతే బ్రిటిష్, ఇండియన్ ఆర్మీల మధ్య గోర్ఖా రెజిమెంట్లను విభజించారు. 1947లో కుదిరిన త్రైపాక్షిక రిక్రూట్మెంట్ ఒప్పందం... బ్రిటిష్, ఇండియన్, నేపాలీ సైన్యాల్లో నేపాలీ గోర్ఖాలను చేరడానికి అనుమతించింది. అయితే వేతనాలు, పెన్షన్లలో తేడాలు ఉండేవి. గోర్ఖాలను కిరాయి సైనికులు అని పిలవవద్దని నేపాల్ షరతు పెట్టడమే ఈ ఒప్పందంలోని చివరి అంశం. నేపాలీ గోర్ఖాలు ఇప్పుడు ఫ్రెంచ్ ఆర్మీలో చేరుతున్నారు. అనేకమంది రిటైరయిన గోర్ఖాలు ప్రైవేట్ కాంట్రాక్టర్లుగా చేరుతున్నారు. సారాంశంలో, మాతృ బెటాలియన్లతో సాంప్రదాయ వారసత్వ బంధం కారణంగా గోర్ఖాలు ఇప్పటికీ భారతీయ రెజిమెంట్లలో చేరుతున్నారు. మన సైన్యంలోని 1,3,4,5,8 సంఖ్యలు గల గోర్ఖా రెజిమెంట్లు ప్రధానంగా మాగర్లు, గురుంగులతోనూ; 9వ గోర్ఖా రెజిమెంట్ ఛెత్రీలు, ఠాకూర్లతోనూ; 11వ గోర్ఖా రెజిమెంట్ రాయిలు, లింబూలతోనూ ఉంటున్నాయి. వీళ్లందరూ భారతీయ సైన్యంలో భాగంగా ఉంటున్నారు. దివంగత భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ 11వ గోర్ఖా రైఫిల్స్కి చెందిన 5వ బెటాలియన్కి నాయకత్వం వహించేవారు. బ్రిటిష్ ఆర్మీ నాయకత్వం 1947 తర్వాత 2, 6, 7, 10 రెజిమెంట్లను తమతో తీసుకుపోయింది. వాటిని ఇప్పుడు కేవలం రెండు బెటాలియన్లుగా కుదించారు. గోర్ఖా రెజిమెంట్లలోకి నియామకాలను ప్రారంభంలో భారత్–నేపాల్ సరిహద్దులోని భైర్హవా సమీపంలోని నౌతన్వాలో జరిగేవి. తర్వాత కుంరాఘాట్, గోరఖ్పూర్, డార్జిలింగ్ సమీపంలోని ఘూమ్ ప్రాంతాలను శాశ్వత ప్రాంతాలుగా ఎంపిక చేశారు. ఈ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంట్లకు యువ గోర్ఖాలను తీసుకురావడానికి గల్లా వాలాస్ అని పిలిచే నేపాలీ రిక్రూటర్లను ఉపయోగించుకునే వారు. భారతీయ సైన్యంలో భర్తీ కావడం కోసం వీరు 20 నుంచి 24 రోజులపాటు ట్రెక్కింగ్ చేసి వచ్చేవారు. శారీరక, వైద్య పరీక్షలు అనంతరం ఎంపికైన∙వారిని రెజిమెంటల్ శిక్షణా కేంద్రాలకు పంపించేవారు. వ్యూహాత్మక సంపద తర్వాతి కాలంలో భారతీయ సైన్య నియామక బృందాలు నేపాల్ మారుమూల ప్రాంతాలకు వెళ్లి రాటుదేలిన యువత కోసం ప్రయత్నించడంతో సైనిక రిక్రూట్మెంట్ వ్యవస్థ మారిపోయింది. నేపాల్ పశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని పోఖ్రా, ధరాన్ తదితర చోట్ల రిక్రూట్మెంట్ ర్యాలీలను నిర్వహించేవారు. నియామక వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉంటూ వచ్చింది. ఇప్పుడు దానికి రాత పరీక్షను కూడా చేర్చారు. మొదట్లో నేపాల్ నుంచే 100 శాతం చేర్చుకునేవారు. తర్వాత దీన్ని కాస్త మార్చి, నేపాల్ దేశస్థులైన గోర్ఖాల నుంచి 70 శాతం, భారతీయ గోర్ఖాల నుంచి 30 శాతం రిక్రూట్ చేస్తూ వచ్చారు. కోవిడ్ మహమ్మారి రిక్రూట్మెంట్ను అడ్డుకున్నప్పుడు రిక్రూట్మెంట్ విభాగాలు 60:40 నిష్పత్తిలో చేర్చుకున్నాయి. 2018లో 6/1 గోర్ఖా రైఫిల్స్ని పూర్తిగా భారతీయ గోర్ఖాల నుంచే తీసుకున్నారు. సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో నేపాల్కు రాజకీయ సందేశాన్ని ఇవ్వడమే దీని ఉద్దేశం. నేపాల్లోని కమ్యూనిస్టులు కూడా 1990లో పాలక పక్షానికి విధించిన తమ 40 పాయింట్ల డిమాండ్లలో ఒకటి, భారత సైన్యంలో నేపాలీల చేరికను ఆపడం. కానీ సైనికుడు కావాలన్న కోరిక గోర్ఖాల్లో ఇప్పటికీ అలాగే ఉంది. 1970లలో భారత సైన్యం నుంచి గోర్ఖాలను తొలగించాలంటూ వచ్చిన సంకుచిత ప్రతిపాదనను భారత్ తోసి పుచ్చింది. నాటి ఆర్మీ చీఫ్ జనరల్ గోపాల్ బెవూర్ నాటి ప్రధాని ఇందిరాగాంధీకి గోర్ఖాలు మనకు వ్యూహాత్మక సంపద అని నొక్కి చెప్పారు. భారత అనుకూల బృందం రెజిమెంటల్ వ్యవస్థను కొనసాగిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. అయితే అగ్నిపథ్ పథకం నేపాలీ గోర్ఖాలకు కూడా వర్తిస్తుంది. భారతీయ సైన్యంలో 38 ఇన్ఫాంట్రీ బెటాలియన్లు, రెండు రాష్ట్రీయ రైఫిల్స్ బెటాలియన్లు, రెండు టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్లు, ఆర్టిల్లరీకి చెందిన 64 ఫీల్డ్ రెజిమెంట్లు మొత్తం గోర్ఖాలతో కూడి ఉన్నాయి. అందుకే భారత గోర్ఖా బ్రిగేడ్ అతిపెద్ద రెజిమెంట్గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం భారతీయ సైన్యంలో పనిచేస్తున్న, రిటైర్ అయిన గోర్ఖాలు 17 లక్షల మంది ఉన్నారని అంచనా. వీరంతా నేపాల్లో బలమైన భారత్ అనుకూల బృందంగా ఉంటున్నారు. చైనా ప్రభావంలో ఉన్న నేపాల్తో ప్రత్యేక సంబంధాలు కొనసాగించడానికి, ఆ దేశంతో పూర్వ ప్రాధాన్యతా స్థానం పొందడానికి ఈ బృందం చాలా అవసరం. మాజీ సైనికులు నేపాల్ వ్యాప్తంగా ఇండియన్ రెజిమెంటల్ అసోసియేషన్లను ఏర్పర్చుకున్నారు. బెటాలియన్లలో తాము ఎదిగిన రోజులను తల్చుకుంటూ, యుద్ధ గౌరవాలను అందుకుంటూ ఇండియా సైనికులతో వీరు పరస్పర సంబంధాలు కొనసాగిస్తున్నారు. సైన్యంలో తాత్కాలిక నియామకాలకు సంబంధించి భారత ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకంపై నేపాల్ ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. 1947లో త్రైపాక్షిక ఒప్పందంపై తీవ్ర ప్రభావం కలిగిస్తూ, గోర్ఖా యువత ఆకాంక్షలను దెబ్బ తీయబోతున్న అగ్నిపథ్ పథకం గురించి నేపాల్ను భారత్ సంప్రదించలేదు. అగ్నిపథ్ ఒక పెద్ద అసంతృప్తి పథకంగా కనబడుతోంది. నాలుగేళ్లపాటు నియంత్రణ రేఖ, వాస్తవాధీన రేఖల వద్ద ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో పనిచేయటం కంటే, ఏ దుబాయ్లోనో మరింతగా సంపాదించగలరు. మొత్తం మీద చూస్తే, ఏదో ఒకరోజున గోర్ఖా వారసత్వానికి ముగింపు పలకాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోంది. 2014లో నేపాల్ని తొలిసారిగా సందర్శించినప్పుడు గోర్ఖా సైనికుల త్యాగాలను ఎత్తిపడుతూ తానాడిన మాటల్ని ప్రధాని నరేంద్రమోదీ అప్పుడే మర్చిపోయినట్లు కనబడుతోంది. భారత్తో గోర్ఖా బంధాన్ని అగ్నిఫథ్ బలహీనపరుస్తుంది. అశోక్ కె. మెహతా వ్యాసకర్త ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్) (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
అగ్నిపథ్ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకు
న్యూఢిల్లీ: సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని సవాలు చేస్తూ తన ముందు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, పట్నా, ఉత్తరాఖండ్ హైకోర్టులు కూడా తమ వద్ద దాఖలైన పిల్స్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిన నేపథ్యంలో అగ్నిపథ్పై వివాదం సుప్రీంకోర్టును తాకింది. అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు.. ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదీ చదవండి: Agnipath Recruitment: అగ్నిపథ్లో ‘కుల’కలం? -
Agnipath Recruitment: అగ్నిపథ్లో ‘కుల’కలం?
న్యూఢిల్లీ: అగ్నిపథ్ నియామకాలకు సైన్యం కులాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుంటోందన్న వార్తలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా అభ్యర్థులను సైన్యం కులం, మతం సర్టిఫికెట్ అడుగుతోందని విపక్షాలు మంగళవారం ఆరోపించాయి. అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీ(యూ) కూడా వాటితో గొంతు కలిపింది. వీటిని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ ఖండించగా, సైన్యం వద్ద ఇలాంటి సమాచారముంటే సైనికుల అంత్యక్రియల వంటి సమయంలో సహాయకారిగా ఉంటుందంటూ అధికార బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా స్పందించడం విశేషం! అగ్నిపథ్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిని కులం, మతం సర్టిఫికెట్లు జతపరచాలని అడుగుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్సింగ్తో పాటు అధికార ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీ(యూ) నేత ఉపేంద్ర కుశ్వాహా కూడా ఆరోపించారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కూడా కులమతాలను అడగాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ ట్వీట్ చేశారు. బీసీలు, దళితులు, గిరిజనులు సైన్యంలో చేరేందుకు అనర్హులని ప్రధాని మోదీ భావిస్తున్నారా అని సంజయ్సింగ్ ట్వీట్ చేశారు. తప్పుడు ప్రచారం.. ఇదంతా పూర్తిగా తప్పుడు ప్రచారమని రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ స్పష్టం చేశారు. సైన్యంలో స్వాంతంత్య్రానికి ముందునుంచీ వస్తున్న నియామక పద్ధతులే కొనసాగుతున్నాయి తప్ప కొత్తగా ఎలాంటి మార్పులూ చేయలేదని రాజ్యసభలో స్పష్టం చేశారు. సైన్యంపై వివాదాలు పుట్టించే ప్రయత్నాలు విపక్షాలకు పరిపాటేనన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ను ఆప్ చీఫ్ కేజ్రివాల్ అనుమానించడాన్ని గుర్తు చేశారు. నియామకాల్లో కులమతాలను ఏ విధంగానూ పరిగణనలోకి తీసుకోవడం జరగదంటూ 2013లో యూపీలో హయాంలో సుప్రీంకోర్టులో సైన్యం అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. ఇదీ చదవండి: IAF Agnipath Recruitment 2022: భారత వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ షురూ -
Parliament Monsoon Session: తొలి రోజే రగడ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్య పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకు కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో తొలిరోజు ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. లోక్సభకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు. సభ ఉదయం ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు ఓటు వేయడానికి గాను సభను మధ్యాహ్నం 2 గంటల వరకు స్పీకర్ ఓం బిర్లా వాయిదా వేశారు. ఎన్నికలంటే ఒక పండగ లాంటిదేనని అన్నారు. ఈ పండగలో పాలుపంచుకోవాలని ఎంపీలకు సూచించారు. లోక్సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత వామపక్ష సభ్యులు వెల్లోకి ప్రవేశించారు. ద్రవ్యోల్బణంపై నిరసన వ్యక్తం చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ సభ్యుడు అధిర్రంజన్ చౌదరి మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కుటుంబ న్యాయస్థానాల(సవరణ) బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన ఆగకపోవడంతో సభాధ్యక్ష స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. రాజ్యసభలోనూ ఉదయం కాంగ్రెస్ సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు ప్రారంభించారు. సభను అడ్డుకోవడమే లక్ష్యంగా కొందరు సభ్యులు వచ్చినట్లు కనిపిస్తోందని చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అసహనం వ్యక్తం చేశారు. ఎంపీలంతా రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయడానికి వెళ్లాలని సూచిస్తూ సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుగుతున్న వేళ ఈ సమావేశాలను చిరస్మరణీయ సమావేశాలుగా మార్చుకోవాలని సూచించారు. చక్కటి పనితీరు ప్రదర్శించాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల మాదిరిగా కాకుండా ఈసారి వైవిధ్యంగా వ్యవహరించాలన్నారు. జపాన్ దివంగత ప్రధాని షింజో అబె, యూఏఈ మాజీ అధ్యక్షుడు, అబూదాబీ నాయకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, కెన్యా మూడో అధ్యక్షుడు మావై కిబాకీకి, ఇటీవల మరణించిన ఎనిమిది మంది మాజీ ఎంపీలకు ఉభయ సభలు నివాళులర్పించాయి. కొత్త సభ్యుల ప్రమాణం ఎగువ సభకు ఇటీవల ఎన్నికైన సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మాజీ మంత్రులు పి.చిదంబరం, కపిల్ సిబల్, ప్రఫుల్ పటేల్, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, శివసేన నేత సంజయ్ రౌత్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్సింగ్ సూర్జేవాలా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసా భారతి, కాంగ్రెస్ నాయకుడు రాజీవ్ శుక్లా, వైఎస్సార్సీపీ నేతలు వి.విజయసాయిరెడ్డి, బీద మస్తాన్రావు, నామినేటెడ్ సభ్యుడు, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ లోక్సభలో శత్రుఘ్న సిన్హా తదితరులు ప్రమాణం చేశారు. ఓపెన్ మైండ్తో చర్చిద్దాం ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు లోతైన, వివరణాత్మక చర్చలతో వ్రర్షాకాల సమావేశాలను ఫలవంతం చేయాలని ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతా కలిసి ఓపెన్ మైండ్తో చర్చిద్దామని సూచించారు. సునిశిత విమర్శ, చక్కటి విశ్లేషణల ద్వారా ప్రభుత్వ విధానాలు, నిర్ణయాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని విన్నవించారు. సోమవారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘‘సభలు సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి. అందరి కృషితోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. అందరి సహకారంతోనే సభ సజావుగా నడుస్తుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటుంది. సభ గౌరవాన్ని పెంపొందించేలా మన విధులను నిర్వర్తించాలి. పంద్రాగస్టు సమీపిస్తున్న వేళ... దేశ స్వాతంత్య్రం కోసం జీవితాలను దేశానికి అంకితం చేసి, జైళ్లలో గడిపినవారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలి. వారి ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని మర్చిపోవద్దు’ అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్ను పవిత్ర స్థలంగా భావించాలన్నారు. దేశానికి కొత్త శక్తినివ్వాలి ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేళ, మరో పాతికేళ్ల తర్వాత దేశ ప్రయాణం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళికలు రూపొందించుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. మరింత వేగంగా ముందుకు సాగే తీర్మానాలతో జాతికి దిశానిర్దేశం చేయాలన్నారు. ఎంపీలంతా దేశానికి కొత్త శక్తిని సమకూర్చడంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు కీలకమన్నారు. -
Parliament Monsoon Session: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
Parliament Monsoon Session 2022 LIVE అప్డేట్స్ ► పార్లమెంటు ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్షాలు ఆందోళనలు కొనసాగించడం వల్ల సభను రేపటికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు. మరోవైపు రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఉదయం లోక్సభ ప్రారంభం కాగానే మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఆ తర్వాత సభ 2 గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే మంగళవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ► విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే, యూఏఈ మాజీ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జయద్ అల్ నహన్ మృతి నేపథ్యంలో భారత పార్లమెంట్ నివాళి అర్పించింది. Rajya Sabha observes silence as a mark of respect to the memory of the departed. Chairman Naidu made obituary reference to former Japanese PM Shinzo Abe, ex-UAE President Sheikh Khalifa Bin Zayed Al Nahyan, legendary Hindustani classical musician Pandit Shivkumar Sharma & others pic.twitter.com/GlWBNIVPhc — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ ఆవరణలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతున్నందునా.. మధ్యాహ్నం రెండు గంటల వరకు లోక్సభను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. Monsoon session of Parliament | Lok Sabha adjourned till 2pm for voting in Presidential election in Parliament premises pic.twitter.com/knnvVEhl22 — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మొత్తం 32 బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే తెలంగాణ గిరిజన సెంట్రల్ యూనివర్సిటీ బిల్లు ప్రస్తావనకు రానుంది. ► కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ కార్యక్రమం జరిగింది. Delhi | Newly elected MPs take oath as Rajya Sabha members as the Monsoon session of Parliament begins pic.twitter.com/tFLspbBm7b — ANI (@ANI) July 18, 2022 BJP MP from Azamgarh (Uttar Pradesh) Dinesh Lal "Nirahua" Yadav, TMC MP from Asansol (West Bengal) Shatrughan Sinha, and BJP MP from Rampur (Uttar Pradesh) Ghanshyam Singh Lodhi take oath as Members of the Lok Sabha.#MonsoonSession pic.twitter.com/AKVAXg2qRQ — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2022 ప్రారంభం అయ్యాయి. ఆగష్టు 12వ తేదీ వరకు సమావేశాలు జరగనున్నాయి. #MonsoonSession of the Parliament commences; visuals from Lok Sabha. pic.twitter.com/UYj92rMHzW — ANI (@ANI) July 18, 2022 ► పార్లమెంట్ సమావేశాలు: ఓపెన్ మైండ్తో చర్చించాలి ఈ కాలం చాలా ముఖ్యమైనది. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కాలం. ఆగస్ట్ 15 & రాబోయే 25 సంవత్సరాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది - దేశం 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను నిర్వహించుకోబోయే సమయానికి, మన ప్రయాణాన్ని, కొత్త ఎత్తులను నిర్ణయించడానికి ఒక తీర్మానం చేయాల్సిన సమయం ఇది. పార్లమెంట్లో ఓపెన్ మైండ్తో చర్చలు జరగాలి, అవసరమైతే చర్చ జరగాలి. ఎంపీలందరూ లోతుగా ఆలోచించి చర్చించాలని నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రపతి & ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు జరుగుతున్నందున ఈ సెషన్ కూడా ముఖ్యమైనది. ఈరోజు (రాష్ట్రపతి ఎన్నికలకు) ఓటింగ్ జరుగుతోంది. ఈ సమయంలో, కొత్త రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి దేశానికి మార్గనిర్దేశం చేయడం ప్రారంభిస్తారు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు ►రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు రాజ్యసభలో విపక్షాల వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. అగ్నిపథ్ పథకంపై చర్చకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. రూల్ 297 కింద వాయిదా తీర్మానాలు ఇచ్చిన కాంగ్రెస్, సీపీఎం ఎంపీలు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం(ఇవాళ్టి) నుంచి ప్రారంభం కానున్నాయి. ► సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని విపక్ష నేతలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. ధరల పెరుగుదల, దేశ ఆర్థిక పరిస్థితిపై పార్లమెంట్లో తప్పనిసరిగా చర్చించాలంటున్నారు. 14 రోజుల్లో 32 బిల్లులా? అన్ని పార్టీల సమావేశంలో 13 అంశాలను లేవనెత్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే చెప్పారు. వీటిపై ఉభయ సభల్లో చర్చించాలని అఖిలపక్ష భేటీలో కోరామన్నారు. వర్షకాల సమావేశాల్లో 32 బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నద్ధమవుతోందని, కేవలం 14 రోజుల్లో వాటిపై చర్చించి, ఆమోదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో చెప్పాలన్నారు. అఖిలపక్ష భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాకపోవడం పట్ల కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ట్విట్టర్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో 32 బిల్లులూ పెడతామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి చెప్పారు. వీటిపై ఇప్పటికే పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు చర్చించాయన్నారు. సభల్లో ప్రజాస్వామ్య యుతంగా వీటిపై ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలి అన్పార్లమెంటరీ పదాల జాబితాపై వివాదం అవసరం లేదని బిజూ జనతాదళ్ సీనియర్ నేత పినాకీ మిశ్రా చెప్పారు. శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలన్నారు. ఒడిశాకు శాసన మండలిని ప్రకటించాలని విన్నవించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడానికి ఇదే సరైన సమయమని ఏఐఏడీఎంకే నాయకుడు ఎం.తంబిదురై పేర్కొన్నారు. శ్రీలంకలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ చొరవ తీసుకోవాలని తంబిదురైతోపాటు డీఎంకే నేత టీఆర్ బాలు కోరారు. అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధం అఖిలపక్ష సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నిబంధనలు, ప్రక్రియ ప్రకారం అన్ని అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్రం ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ప్రతిపక్షాలు ప్రతి చిన్న విషయానికి అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఔన్నత్యాన్ని దిగజారుస్తున్నాయని తప్పుపట్టారు. శ్రీలంక సంక్షోభంపై చర్చించడానికి కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్ నేతృత్వంలో మంగళవారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. -
అగ్నిపథ్కు షింజో అబే హత్యకు ముడిపెడుతూ..
కోల్కతా: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు.. కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ఆర్మీ రిక్రూట్మెంట్ పథకం అగ్నిపథ్కు ముడిపెడుతూ ప్రచురితమైన ఓ కథనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అదే టైంలో విమర్శలకూ దారి తీసింది. జపాన్ రాజకీయవేత్త షింజో అబేను హతమార్చిన వ్యక్తి పేరు టెత్సుయ యమగామి(41). జపాన్ నావికా దళంలో మూడేళ్లపాటు పని చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం లేకుండా.. పెన్షన్ రాకుండా ఇబ్బంది పడ్డాడు. ఆ కోపంతోనే షింజోను కాల్చి చంపేశాడు అంటూ సదరు కథనం హాట్ హాట్ చర్చకు దారి తీసింది. ఈ కథనాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక ‘జాగో బంగ్లా’ ఫ్రంట్పేజీ కథనంగా ప్రచురించింది ఇవాళ. అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కూడా యువతను రక్షణ దళంలో నాలుగేళ్ల పాటు పని చేయించుకుని.. పెన్షన్, ఇతర రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా చూడాలని ప్రయత్నిస్తోందని, భవిష్యత్తులో భారత్లోనూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవచ్చంటూ ఆ కథనంలో కేంద్రంపై విమర్శలు గుప్పించింది. మరోవైపు శుక్రవారం ఘటన జరిగిన కొన్ని గంటలకే.. కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్పుత్ కూడా దాదాపు ఇలాంటి అర్థం వచ్చేలా ఓ ట్వీట్ చేశాడు. యమగామి జపాన్ ఎస్డీఎఫ్లో పని చేశాడు. కానీ, ఎలాంటి పెన్షన్ అతను పొందలేకపోయాడు అంటూ ట్వీట్ చేశాడాయన. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత ట్వీట్తో పాటు టీఎంసీ అధికార పత్రిక జాగో బంగ్లా కథనంపై బీజేపీ మండిపడింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగానే ఆ పత్రిక కథనాలు ప్రచురిస్తుంది. అసలు అగ్నిపథ్కు అబే మరణానికి మృతి పెట్టి కథనం రాసింది ఎవరు?. దేశం మీద గౌరవం, ప్రేమ ఉన్న ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయరు. జాగో బంగ్లా చేసింది ముమ్మాటికీ తప్పే. భారత యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది టీఎంసీ. షింజో అబే మీద గౌరవంతో భారత్ సంతాప దినం పాటిస్తున్న వేళ.. ఇలాంటి కథనం దురదృష్టకరం అని పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ విప్ మనోజ్ తిగ్గా ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: షింజో అబేపై కాల్పులకు అసలు కారణం ఇదే.. -
Agnipath Scheme: అగ్నివీరుల్లో 20 శాతం మహిళలే!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో నియామకాల కోసం నరేంద్ర మోదీ సర్కార్ కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం కింద ఈ ఏడాది నేవీలో చేపట్టే నియామకాల్లో 20 శాతం మంది మహిళలు ఉండొచ్చని అధికారులు చెప్పారు. నేవీలో ఈసారి మూడువేల మందిని ఎంపికచేస్తారు. అగ్నిపథ్ ద్వారా నేవీ తొలిసారిగా మహిళా నావికులను నౌకాదళంలోకి తీసుకోనుంది. అన్ని విభాగాల అప్లికేషన్లు జూలై 30వ తేదీ దాకా తీసుకుంటారు. ఉద్యోగ నియామకాల కోసం ఇప్పటివరకు 10 వేల మందిపైగా మహిళా అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని రద్దుచేయాలంటూ మంగళవారం సుప్రీంకోర్టులో మాజీ సైనికాధికారి రవీంద్రసింగ్ షెకావత్ పిటిషన్ దాఖలుచేశారు. (క్లిక్: ఉపరాష్ట్రపతి ఎన్నిక.. చాయ్వాలా నామినేషన్) -
అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీన పడుతుంది
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్ వల్ల ఆర్మీ బలహీనపడుతుందని, 16 ఏళ్లు పనిచేసే ఆర్మీలో నాలుగేళ్ల విధానమేంటని ఏఐసీసీ అధికార ప్రతినిధి నాజర్ హుస్సేన్ ప్రశ్నించారు. గాంధీభవన్లో ఆదివారం ఆయన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి మీడియాతో మాట్లాడారు. అగ్నిపథ్పై యువత నిరసనలు చేపడుతున్నా, ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ విధానం ద్వారా 14 లక్షల ఆర్మీ బలాన్ని 6 లక్షలకు కుదిస్తున్నారని తెలిపారు. పదవీ విరమణ పొందిన 5.70 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే కేవలం 15 వేల మందికి మాత్రమే ఉద్యోగాలు దొరుకుతాయన్నారు. రేవంత్ మాట్లాడుతూ మోదీ చదువుకోకపోవడం వల్ల ఆర్మీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, ఆర్మీకి, బీఎస్ఎఫ్కు తేడా ఏంటో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. -
అగ్నిపథ్ భేష్! పథకంపై ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ప్రశంసల వర్షం!
దేశాన్ని కుదిపేస్తున్న అగ్నిపథ్ అంశంపై కార్పొరేట్ దిగ్గజాలు స్పందిస్తున్నారు. ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ అగ్నివీరుల భవిష్యత్పై హామీ ఇవ్వగా.. తాజాగా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని అగ్నిపథ్ స్కీంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్ఫోసిస్ 41వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అగ్నివీరులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై ఇన్ఫోసిస్ పరిశీలిస్తుందా అని షేర్ హోల్డర్ అడిగిన ప్రశ్నకు నందన్ నిలేకని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేం నమ్ముతున్నాం. యువతకు అగ్నిపథ్ అనేది గొప్ప అవకాశం. అగ్నిపథ్లో చేరి కెరియర్ను ప్రారంభించడమే కాదు, క్రమశిక్షణతో కూడిన వ్యవస్థను నిర్మించుకోవచ్చు. వీటితో పాటు భవిష్యత్ కోసం కావాల్సిన నైపుణ్యాలని మెరుగుపరుచుకోవచ్చు' అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, ఇన్ఫోసిస్ యువతలో ఉన్న టాలెంట్ను ప్రోత్సహిస్తుంది. సంస్థ నిర్దేశించిన సెలక్షన్ క్రైటీరియా మేరకు ఉద్యోగుల్ని నియమించుకుంటామని అన్నారు. -
రాకేశ్ సోదరునికి ఉద్యోగం.. తెలంగాణ సీఎస్ ఉత్తర్వులు జారీ
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన హింసాత్మక ఘటనల సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించిన దామెర రాకేశ్ సోదరునికి ఉద్యోగం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కారుణ్య నియా మకాల కింద మృతుని సోదరునికి ఉద్యోగం కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం తెలిసిందే. ఈ మేరకు రాకేశ్ సోదరుడు దామెర రామ్రాజుకు అతని విద్యార్హతల ఆధారంగా వరంగల్ జిల్లాలో ఉద్యోగం ఇవ్వాలని సీఎస్ సోమేశ్కుమార్ వరంగల్ జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. (క్లిక్: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!) -
Agnipath Protests: పేద యువతను నిందించగలమా?
అగ్నిపథ్ పథకంపై రాజకీయ దుమారం ఇక చాలంటూ... ‘ప్రభుత్వం సదుద్దేశంతో చేపట్టిన పథకాలకు రాజకీయరంగు పులమటం దేశ దౌర్భాగ్యం. ఇప్పుడు బాధాకరంగా తోచినా దీర్ఘ కాలిక ప్రయోజనాలున్నాయనీ, దేశ హితాన్ని దృష్టిలో పెట్టుకో వాల’నీ ప్రధాని మోదీ వివరించారు. ఈ పథకాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు అని సైనికాధికార్లు స్పష్టం చేశారు. సైన్యం దేశ రక్షణ లక్ష్యంతో పని చేస్తుందనీ, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాదనీ సూటిగా చెప్పారు. ప్రతిపక్షాలు రాజకీయంగా ప్రశ్నించటం సహజమే అని మరోసారి నిరూపించాయి. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపాదించిన వాటినే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించటం అవకాశవాదం. నిజానికీ పథకం 1989 నుంచి పెండింగులో ఉన్నదని అధికారికంగా చెప్పారు. బీజేపీ కూడా ఇలాగే వ్యవహరించింది కదా. దేశభక్తి పేరిట రాజకీయం తగదు. కపట రాజకీయాలకు దేశభక్తి ముసుగు పరిపాటి అయింది. అధికార పార్టీల ఈ అవకాశవాదాన్ని స్వతంత్ర మేధావులు ఎత్తిచూపాలి; ప్రజలు తిరస్కరించాలి. రైళ్ళు, బస్సుల వంటి ప్రజల ఆస్తుల ధ్వంసం; ప్రయాణికుల పార్సెళ్ల దహనం... రేపు సైన్యంలో చేరాలనుకుంటున్న యువతరం చేయాల్సిన పనులేనా ఇవని వారిని మాత్రమే నిందిస్తే లాభం లేదు. కలుషిత రాజకీయాల పర్యవసానమే ఇది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? సెల్ టవర్సుని ధ్వంసం చేసే నక్సల్స్కీ, వివిధ పార్టీలు ప్రోత్సహిస్తున్న అరాచకత్వానికీ తేడా ఏముంది? కొన్ని అగ్రవర్ణ మూకలు గుజరాత్లో తమకు రిజర్వేషన్లు కావాలని చేసిన హింసాకాండ సందర్భంగా అన్ని పార్టీలు పాటించిన మౌనాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పేరిట విధ్వంసం తాజా ఉదాహరణ! ఆందోళనంటే ఇలా, అలా చేయకపోతే ప్రభుత్వాలు స్పందించవు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. గోరక్షణ పేరుతో మానవ హత్యలను ప్రోత్సహిస్తున్న వాతావరణంలో... కేవలం ఆ నిరుద్యోగ పేద యువకులు భవిష్యత్ పట్ల ఉన్న భయంతో పాల్పడిన హింసను నిందించగలమా? కఠినంగా శిక్షించాలని, వారికి ఆర్మీలో ఉద్యోగాలివ్వడం అసాధ్యమని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి, మర్నాడే బుల్డోజర్లతో వారి ఇళ్లను యూపీలో ఆదిత్యనాథ్ ప్రభుత్వం కూల్చి వేసింది. తెలంగాణను నిందిస్తూ, ఇక్కడా బుల్డోజర్ ప్రభుత్వం రావాలని బీజేపీ నేతలు బాహాటంగా ప్రకటిస్తున్నారు. వారిని ఖండించకుండా కేంద్ర నాయకుల పరోక్ష మద్దతు! యధా రాజా తథా ప్రజా! మన దేశరక్షణను మన అవసరాలకూ వనరులకూ తగిన రీతిలో నిర్వహించుకోవాలి. అమెరికాలో ఇజ్రాయెల్లోనూ ఇలాగే చేస్తున్నారంటూ... ప్రభుత్వమూ, జాతీయవాద అధికార పార్టీ అగ్నిపథ్ను సమర్థించటం విడ్డూరం. టెక్నాలజీ అవసరమే కానీ మానవ వనరులే ప్రధానంగా ఉన్న మన దేశానికి ఆయా విధానాల్ని తగిన రీతిలో అన్వయించుకోవడం అవసరమనేది గుర్తించాలి. దేశరక్షణ కేవలం భారీ డిఫెన్స్ బడ్జెట్తో పటిష్టం కాజాలదు. బడ్జెట్, టెక్నాలజీ... రెండిటా నంబర్వన్ అయిన అమెరికా సైన్యం వియత్నాం, ఆఫ్గానిస్తాన్లో అధర్మ యుద్ధాల్లో ఘోర పరాజయం పొందింది. విదేశీ వ్యవహారాల్లో శాంతి లక్ష్యం, సరైన దౌత్యం లేకపోతే ఎవరికైనా అంతే. ఈ అన్ని సంగతులనూ దృష్టిలో పెట్టుకుని అన్ని పక్షాలూ అగ్నిపథ్ ఉచితానుచితాలను ఆలోచించాలి. (క్లిక్: కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి?) - డాక్టర్ ఎం. బాపూజీ సీఎస్ఐఆర్ విశ్రాంత శాస్త్రవేత్త -
సికింద్రాబాద్ ఘటన: సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు!
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అల్లర్ల తర్వాత సాక్ష్యాలను తారమారు చేశారని రైల్వే ఎస్పీ అనురాధ తెలిపారు. వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి విధ్వంసం సృష్టించే విధంగా ప్లాన్ చేశారన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం పోలీసుల అదుపులో 8 మంది ఉండగా, పరారీలు మరో 8 మంది ఉన్నారు. అగ్నిపథ్ స్కీంతో ఆర్థికంగా నష్టపోతామనే ఆందోళనలకు అకాడమీలను ప్రోత్సహించినట్లు గుర్తించారు. మరొకవైపు పోలీసుల అదుపులో మహబూబ్నగర్, కరీంనగర్కు చెందిన ఇద్దరు అకాడమీ డైరెక్టర్లు ఉన్నారు. మరో ఇద్దరు మల్లారెడ్డి, శివసాయి డిఫెన్స్ అకాడమీ ఉద్యోగులు, రెడ్డప్ప, హరి సహా మరొకరు ఆందోళనలో ప్రత్యేకంగా పాల్గొన్నట్లు గుర్తించారు. 12 అకాడమీ అభ్యర్థులతో 8 వాట్సాప్ గ్రూప్ల ఏర్పాటు చేసి విధ్వంసానికి కుట్ర చేశారు.ఈ 8 వాట్సాప్ గ్రూపుల్లో 2 వేల మంది ఆందోళనకారులు ఉన్నారు. రైల్వే స్టేషన్ అల్లర్ల వెనుక అసలు సూత్రధారి సుబ్బారావును ఏ-64గా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనగా, ఏ-65 మల్లారెడ్డి, ఏ-66 శివ కుమార్, ఏ-67 బూరెడ్డిలుగా పేర్కొన్నారు. సుబ్బారావు తగలబెట్టమన్నాడు.. శివ అమలు చేశాడు వీరంతా బోడుప్పల్లోని ఎస్వీఎం హోటల్లో అల్లర్లకు ప్లాన్ చేసినట్లు రిపోర్ట్లో వెల్లడించగా, శివ కుమార్తో కలిసి సుబ్బారావు రూ. 35వేలు ఖర్చు చేసి విద్యార్థులను అల్లర్లకు పురి కొల్పాడు. అదే సమయంలో సీఈఈ సోల్జర్స్ గ్రూపు, సోల్జర్స్ టూ డై పేరుతో వాట్సాప్ గ్రూపులు సృష్టించి విద్యార్థులను అల్లర్లకు ప్రోత్సహించాడు. బిహార్లో జరిగినట్లు రైలును తగటబెట్టాలని సుబ్బారావు చెప్పగా, శివ దానిని అమలు చేశాడు. ఆవుల సుబ్బారావుతో నిరంతరం శివ టచ్లో ఉన్నాడని, శివ ఆదేశాలతోనే రైలును తగులుబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. -
Agnipath Scheme: స్వార్థపర శక్తులతో జాగ్రత్త!
ఒక్క క్షణం సహనం, కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే... ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది – స్వామి వివేకా నంద దేశంలో రోజు రోజుకూ మారుతున్న పరిణామాల కారణంగా అమాయకులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొందరు స్వార్థపరులు ఆడుతున్న క్రీడలో పలువురు అనవసరంగా పావులుగా మారుతున్నారు. అగ్నిపథ్ పథకంపై నిరసనల్లో పాల్గొని కేసుల పాలైన నిరుద్యోగ యువత ఉదంతం ఇందుకు తాజా ఉదాహరణ. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ రక్షణకు ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ‘అగ్నిపథ్’ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే వాస్తవాలూ, పూర్తి వివరాలూ తెలుసు కోకుండానే స్వార్థ రాజకీయ నాయకులూ, కోచింగ్ సెంటర్ల యజమానులూ కుట్రపూరితంగా అమాయక నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి హింసకు పాల్పడేలా చేస్తున్నారు. వీరి మాటలు విన్న యువత రెచ్చి పోయి కేసుల్లో ఇరుక్కుంటూ తమ బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటున్నారు. ఈ అగ్నిపథ్ కింద... 18 నుంచి 23 ఏళ్ల యువకులు నాలుగేళ్లపాటు నెలకు 30 నుంచి 40 వేల జీతంతో దేశ సేవ చేసిన తర్వాత... వారికి రూ. 11.71 లక్షల సేవా నిధి అందు తుంది. సైన్యంలో పొందిన క్రమశిక్షణ, ఆత్మస్థైర్యంతో బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం యువతకు లభిస్తుంది. కానీ ఈ వాస్తవాల గురించి తెలుసుకుని పూర్తి అవగాహన పెంపొందించుకునే అవకాశాన్ని స్వార్థపర శక్తులు యువతకు ఇవ్వకుండా వారిని భయాందోళనకు గురిచేశారు. వారి మాటలను నమ్మి విధ్వంసానికి పాల్పడి కేసుల్లో ఇరుక్కున్న యువకుల భవిష్యత్తు మాటేంటి? అగ్నిపథ్నే కాదు అంతకుముందూ స్వార్థ రాజకీయ శక్తులు మోదీ తలపెట్టిన సంస్కరణలను వ్యతిరేకించాయి. రైతులకు మేలుచేసే నూతన వ్యవసాయ చట్టాలు తెస్తే రైతులను రెచ్చగొట్టి వాటిని వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెచ్చారు. నోట్ల రద్దును పదేపదే విమర్శించేవారు మోదీ నిర్ణయం తర్వాత తీవ్రవాద చర్యలు ఎందుకు తగ్గుముఖం పట్టాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. మోదీ ప్రభుత్వం డిజిటల్ మనీ విధానాన్ని ప్రవేశపెట్టిన కొత్తలో మార్కెట్కు వెళ్ళి కిలో ఆలుగడ్డలు కొనడానికి డిజిటల్ మనీ కావాలా అని ఎద్దేవా చేసిన మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం లాంటి వారికీ గంగిరెద్దుల వారు కూడా ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా భిక్షం స్వీకరించటం చెంపపెట్టులాంటిది కాదా? గతంలో కూడా ఇలాంటి విమర్శలకు భయపడి అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు నిలిపివేసి ఉంటే పలు దేశాలలాగా మన దేశం కూడా ఆర్థికమాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చేది. మోదీ ప్రభుత్వ 8 ఏళ్ల పరిపాలన చూసి కూడా... ఇంకా స్వార్థపరుల మాటలు వింటూ సహాయ నిరాకరణ, ఆందోళనలు చేస్తే మన చేతితో మన కంటిని మనమే పొడుచుకున్న వారమవుతాం. గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసిన మనం ఎవరి పరిపాలన బాగుంది, ఎవరికి మద్దతుగా నిలబడాలి అని తులనాత్మకంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది. - శ్యామ్ సుందర్ వరయోగి బీజేపీ నాయకుడు -
వాయుసేనలో ‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్.. రిజిస్ట్రేషన్ షురూ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్ పథకం కింద భారత వైమానిక దళం(ఐఏఎఫ్) అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించింది. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి ‘అగ్నివీర్వాయు’ ద్వారా రిజిస్ట్రేషన్ మొదలైందని ఐఏఎఫ్ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అగ్నిపథ్ పథకం ద్వారా 17.5–23 ఏళ్ల మధ్య యువతను నాలుగేళ్ల సర్వీసులోకి తీసుకుంటారు. వీరిని అగ్నివీర్గా పిలుస్తారు. వీరిలో 25% మందిని రెగ్యులర్ సేవలకు వినియోగించుకుంటారు. ఈ పథకం వల్ల సైనిక బలగాల కార్యాచరణ సామర్థ్యం దెబ్బతింటుందంటూ దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు హింసాత్మక రూపం దాల్చడం తెలిసిందే. Registration window to apply for #Agniveervayu is operational from 10 am today. To register, candidates may log on to https://t.co/kVQxOwkUcz#Agnipath#भारतीयवायुसेनाकेअग्निवीर pic.twitter.com/2ZQl8Ak6nn — Indian Air Force (@IAF_MCC) June 24, 2022 -
కాలపరీక్షకు నిలబడినవి మార్చడమా?
అగ్నిపథ్ పథకం లక్ష్యం స్పష్టం. పెన్షన్లు, సైనికుల వేతన బిల్లుల కోతే దీనికి కారణం. సైనిక నియామకాల వ్యవస్థను మాత్రమే కేంద్రం మరమ్మతు చేయడం లేదు... సైనిక చర్యల సమయంలో సైనికుల సంఖ్య విస్తృతంగా అవసరమయ్యే కూర్పునే మార్చేయాలని చూస్తున్నారు. సుదీర్ఘకాలానికి బదులుగా నాలుగేళ్ల వ్యవధి నియామకాల వ్యవస్థను తేవడమే యువత ఆగ్రహానికి కారణం. ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదం ఏమిటంటే, కాలపరీక్షకు నిలిచిన రెజిమెంటల్ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం. అఖిల భారత స్థాయిలో ఉన్న సైన్యాన్ని సింగిల్ క్లాస్గానూ, వ్యవస్థీకృత యూనిట్లను సబ్ యూనిట్లుగానూ మార్చేయాలని చూస్తున్నారు. తండ్రి నుంచి కుమారుడి వరకు తరాలపాటు సైన్యంలో కొనసాగిన బంధాలు ఇకపై కనిపించవు. ప్రభుత్వంలోని మిత్రులతో ఎవరు శత్రుత్వం కోరుకుంటారు? ప్రభుత్వం మొత్తంగా ఇప్పుడు అగ్నివీర్లను కాపాడుకునేందుకు అగ్నిపోరాటం చేస్తోంది. సీనియర్ ఆర్మీ అధికారులతో చర్చించామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది కానీ, తనతో ఏకీభవించేవారితోనే ప్రభుత్వం చర్చించిందని స్పష్టంగా తెలుస్తోంది. అగ్నిపథ్ అనే అవివేకపు పథకం వల్ల సైన్యంతో పోలిస్తే తక్కువగా ప్రభావితమయ్యే భారతీయ వాయుసేన, నేవీ చీఫ్లు ఈ పథకానికి వ్యతిరేకంగా రేగిన హింసా కాండను చూసి దిగ్భ్రాంతి చెందినట్లు అంగీకరించారు. తప్పుడు సమాచారం, అనవగాహనే ఈ హింసాకాండకు కారణమని వీరు తేల్చి చెప్పేశారు. నాలుగేళ్ల సైనిక సేవలో పెన్షన్ తదితర ప్రయోజనాలకు దూరమవడంతోపాటు గౌరవాన్ని కూడా కోల్పోతున్న అగ్నివీర్లను సరిగా అర్థం చేసుపోవడంలో విఫలమవుతున్నారు కాబట్టే ఈ హింసా కాండను చూసి ప్రభుత్వవర్గాలు భీతిల్లుతున్నాయి. 2032 నాటికి భారత సైన్యంలో 50 శాతం మంది రెగ్యులర్ సైనికులుగానూ, 50 శాతంమంది అగ్నివీర్లుగానూ ఉండబోతున్న తరహా వ్యవస్థలో నిర్వహణాత్మక లోపాలను గురించి అతిశయోక్తులు చెప్పనవసరం లేదు. జనరల్స్, వారికి సమానమైన హోదా కలిగిన వారు ప్రభుత్వ బాకారాయుళ్లగా ఉంటారు. అగ్నివీర్లు మాత్రం రాజకీయ ఫుట్ బాల్లో పావులుగా తయారవుతారు. ఈ విప్లవాత్మకమైన ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి ప్రకటించిన అయిదు రోజుల తర్వాత త్రివిధ దళాధిపతులు అసాధారణంగా మీడియో ముందుకు వచ్చి మరోసారి అగ్నివీర్ పథకం విశిష్టత గురించి వివరించారు. సైన్యంలో వ్యవస్థీకృత మార్పు నకు యువశక్తి ప్రధాన చోదకశక్తిగా ఉంటుందని వీరు నొక్కిచెప్పారు. పెన్షన్లు, సైనికుల వేతన బిల్లుల కోతే అగ్నివీర్ పథకానికి వెనుక ఉన్న హేతువు అని వీరు ఒక్కసారి కూడా తమ బ్రీఫింగులో పేర్కొనలేదు. గత రెండు సంవత్సరాలుగా రిక్రూట్మెంట్ని సస్పెండ్ చేయడానికి కోవిడ్ కారణం అని చెప్పడం అసత్యం. ఈ రెండేళ్ల కాలంలో అనేక ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహించ గలిగినప్పుడు రిక్రూట్మెంట్ ర్యాలీలను ఎందుకు చేపట్టలేకపోయా రని వీధుల్లోకి వచ్చిన యువత ప్రశ్నిస్తోంది. అగ్నివీర్ పథకం ప్రక టించిన నాటికి సైన్యంలో చేరదలిచిన అభ్యర్థులు మెడికల్ పరీక్షలు, శారీరక పరీక్షలు పూర్తి చేసుకుని రాత పరీక్షకు సిద్ధమవుతున్నారు. భారతీయ వాయుసేన విషయంలో అన్ని ప్రక్రియలనూ అభ్యర్థులు పూర్తి చేసుకున్నారు కానీ ఇప్పటికీ వీరికి కాల్ రాలేదు. మనం ఈ విషయంలో స్పష్టంగా ఉందాం. సుదీర్ఘకాలం సైనిక కెరీర్లో కొన సాగడానికి బదులుగా నాలుగేళ్ల వ్యవధి ఉండే మౌలిక నియామకాల వ్యవస్థను తీసుకురావడమే యువత ఆగ్రహానికి కారణమైంది. పైగా అగ్నిపథ్ నుంచి వెనక్కు మళ్లే ప్రశ్నే లేదు; క్రమశిక్షణా వ్యతిరేక చర్యల్లో పాల్గొనలేదని యువత ప్రతిన చేయటమే కాకుండా ఆగస్ట్ మధ్యనాటికి రిక్రూట్మెంట్ ర్యాలీకి వచ్చేటప్పటికి పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సి ఉంటుందని త్రివిధ దళాధిపతుల తమ బ్రీఫింగ్లో తెలియపర్చారు. అగ్నిపథ్ పథకం వెనకాల లక్ష్యం స్పష్టంగా వెల్లడవుతోంది. సైనిక నియామకాల వ్యవస్థను మాత్రమే మీరు మరమ్మతు చేయడం లేదు... సైనిక చర్యల సామర్థ్యంలో సైనికుల సంఖ్య విస్తృతంగా అవసర మయ్యే కూర్పునే మౌలికంగా మార్చివేయాలని చూస్తున్నారు. సైనిక నిర్వహణాపరమైన సవాళ్లు ‘రెండున్నర’ (చైనా, పాకిస్తాన్, తీవ్ర వాదం) యుద్ధరంగాలలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అంతేకాక పలు అంతర్గత ఇబ్బందులు దీనికి అదనం. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, బ్రెజిల్ లాంటి దేశాలు భారత్ ఎదుర్కొంటున్న ప్రమాదాలు, సవాళ్లను కలిగి లేవన్నది గుర్తుంచుకోవాలి. మన ప్రస్తుత రాజకీయ, సైనిక నాయకత్వం యుద్ధాలను చూడలేదు. తీవ్రవాద వ్యతిరేక, ఉగ్రవాద వ్యతిరేక చర్యల అనుభవం మాత్రమే ఉంది. టైగర్ హిల్స్ను కైవసం చేసుకున్న యువ సైనికులు రెగ్యులర్ సైనికులు అని గుర్తించాలి. వీరికి పెన్షన్లు అందుతాయి. నైపు ణ్యంతో కూడిన రెజిమెంటల్ వ్యవస్థ వీరికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆ వ్యవస్థ జవాన్ను ఆద్యంతం కాపాడుకుంటూ వస్తోంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు విక్టోరియా క్రాస్లను గెల్చుకుంటా రంటూ కొంతమంది వృద్ధ ఆఫీసర్లు సైనికుల స్థితిని తప్పుగా కోట్ చేస్తున్నారు. ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా సైనిక వృత్తిలో పనిచేసిన వారికి మాత్రమే 95 శాతం అవార్డులు వచ్చాయని మర్చిపోరాదు. ఒకే ఒక్క రైఫిల్మ్యాన్ మాత్రమే విక్టోరియా క్రాస్ గెలుచుకున్నారు. చిన్నవయసులో నాలుగేళ్ల సేవ పూర్తి చేసుకునే అగ్ని వీర్లకు 26 నుంచి 32 సంవత్సరాల వయస్సులో సైనికజీవితంలో లభ్యమయ్యే విశిష్టమైన అనుభవం సిద్ధించదు. నాలుగేళ్ల సేవ తర్వాత కూడా సైన్యంలో కొనసాగాలనుకునే అగ్నివీర్లలో 75 శాతాన్ని సాగ నంపుతారు. పైగా వీరికి ఉద్యోగాలు, విద్యావకాశాలు, ధన సహాయం కల్పించి వారు రెండో కెరీర్ ప్రారంభించడానికి మద్దతునిస్తామని ఇప్పుడు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ నోటిమాటలు పనిచేయవు కదా. నా తరంలోని సైనికులు అన్ని యుద్ధాలు, తీవ్రవాద వ్యతిరేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పిదం ఏమిటంటే కాలపరీక్షకు నిలిచిన, జాగ్రత్తగా పెంచిపోషించిన రెజిమెంటల్ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవ డమే. ఈ వ్యూహాత్మక సంపదను అర్థం చేసుకోవడంపై మన రాజకీయ నాయకత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. అఖిల భారత స్థాయిలో ఉన్న సైన్యాన్ని సింగిల్ క్లాస్గానూ, వ్యవస్థీకృత యూనిట్లను సబ్ యూనిట్లుగానూ మార్చేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో సిక్కు, గర్వాల్, కుమావూ, అస్సామ్ తదితర రెజిమెంట్లు తమ గుణాన్ని, ఆత్మను కోల్పోతాయి. రెజిమెంట్ సంప్రదాయాలు, తండ్రి నుంచి కుమారుడి వరకు తరాలపాటు సైన్యంలో కొనసాగిన స్నేహబంధం కూడా ఇకపై కనిపించవు. క్లాస్ అస్తిత్వం, యుద్ధ నినాదం అనేవి మార్చలేని ప్రేరణ శక్తులు. గతంలోకూడా ప్రభుత్వాలు ఆల్ ఇండియా, ఆల్ క్లాస్ అని ప్రబోధిస్తూ ఇలాంటి విశిష్ట బృందాలను తొలగించాలని ప్రయత్నించాయి కానీ అలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయి. ఒకే భారత్, ఒకే క్లాస్ అనే భావాన్ని సైన్యంపై రుద్దడం అంటే రెజిమెంటల్ విలువలపై దాడి చేయడమే అవుతుంది. నమ్రత కలిగిన గూర్ఖాల గురించి కాస్సేపు ఆలోచిద్దాం. 43 ఇన్ఫాంట్రీ బెటాలియన్లతో కూడిన గూర్ఖా బ్రిగేడ్ని ప్రధానంగా నేపాల్ నుంచి రిక్రూట్ చేసుకునేవారు. అగ్నివీర్ ప్రధాన శిల్పి అయిన ప్రధాని మోదీ 2014లో నేపాల్ సందర్శించినప్పుడు, భారత సార్వ భౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో నేపాలీ గూర్ఖాల త్యాగాలను ఎంతగానో కొనియాడారు. నేపాల్తో భారత్ సంబంధా లను, ప్రభావాన్ని చైనా దెబ్బతీస్తున్న సమయంలోనే లక్షలాదిమంది మాజీ సైనికులు, ప్రస్తుత గూర్ఖా సైనికులు భారత అనుకూల వైఖరిని ప్రదర్శించేవారు. ఒకే భారత్, ఒకే శ్రేణి అనే విధానాన్ని గూర్ఖా అగ్నవీర్లకు కూడా వర్తిస్తే భారత్, నేపాల్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి. జనరల్ ఇయాన్ హామిల్టన్ రాసిన ‘మై రెజిమెంటల్ హిస్టరీ’ ముందుమాట చివరలో ఈ కొటేషన్ ఉంది. ‘‘ఉత్కృష్టమైన 5వ గూర్ఖా రైఫిల్స్ కీర్తి ఎన్నడూ అంతరించదు. ఏ రాజకీయ నేత అయినా గూర్ఖా కేడర్ను తొలగించాలని కానీ, వారి సంఖ్యను మార్చాలని కానీ భావిం చినట్లయితే అతడి చెయ్యి పక్షవాతానికి గురై స్తంభించిపోవచ్చు.’’ వ్యాసకర్త: అశోక్ కె. మెహతా, ఆర్మీ మేజర్ జనరల్ (రిటైర్డ్), (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం.. తూటా రూట్ మారెన్
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసం చోటు చేసుకున్న రోజు జరిగిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) బలగాల కాల్పులపై స్పష్టత వచ్చింది. ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. సాంకేతిక అంశాలు పరిశీలించిన నేపథ్యంలో బలగాలు గాల్లోకి కాల్పులు జరిపినప్పటికీ రికోచెట్ కారణంగానే పిల్లెట్లుగా మారిన బుల్లెట్లు ఆందోళన కారులపైకి దూసుకువెళ్లినట్లు తేల్చారు. ఈ మేరకు సమగ్ర నివేదికను రూపొందించారు. ఆందోళనకారులను చెదరగొట్టాలనే.. విధ్వంసానికి దిగిన ఆందోళనకారులతో ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకూడదనే ఉద్దేశంతోనే ఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు వారిని చెదరగొట్టాలని భావించారు. దీనికోసం గాల్లోకి కాల్పులు జరపాలంటూ ఆదేశాలు జారీ చేశారు. రైల్వే స్టేషన్లో ఇంజిన్లకు విద్యుత్ సరఫరా చేసే 220 కేవీ విద్యుత్ తీగలు ప్రతి ప్లాట్ఫాంపైనా ఉంటాయి. అలాంటప్పుడు తుపాకులు పైకెత్తి, నేరుగా గాల్లోకి కాల్పులు జరిపితే బుల్లెట్లు తగిలి విద్యుత్ తీగలు తెగే ప్రమాదం ఉంది. అదే జరిగి ఆ తీగలు కింద ఉన్న ఆందోళనకారులు, అధికారులుపై పడితే ప్రాణనష్టం భారీగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న ఆర్పీఎఫ్ బలగాలు నేరుగా పైకెత్తి కాకుండా తుపాకులను కాస్త వాలుగా ఉంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల కోసం ఆర్పీఎఫ్ బలగాలు వినియోగించిన తుపాకులు ఇన్సాస్ రైఫిళ్లు. వీటిలో 5.56 క్యాలిబర్ తూటాలను వాడతారు. ఇది కనిష్టంగా 400 మీటర్ల దూరం దూసుకుపోతుంది. దీన్నే ఆ తుపాకీ రేంజ్గా పిలుస్తారు. లెడ్తో తయారైన ఈ తూటాకు కాపర్ జాకెట్ (పై పొర) ఉంది. మ్యాగ్జైన్లో ఉండే తూటా తుపాకీ కాగ్ అయినప్పుడు ఛాంబర్లోకి చేరుతుంది. అక్కడ ఫైర్ అయ్యాక బ్యారెల్గా పిలిచే ముందు భాగం నుంచి అతి వేగంగా దూసుకువస్తుంది. ఈ బ్యారెల్ లోపలి భాగం రింగులతో కూడి ఉండటంతో బుల్లెట్ తన చుట్టూ తాను తిరుగుతూ.. వేగాన్ని పెంచుకుంటూ బయటకు వస్తుంది. ఇలా వచ్చిన తూటా ఎదురుగా గోడ ఉంటే తగిలి కిందపడుతుంది. సాంకేతిక పరిభాషలో ‘రికోచెట్’.. అదే చెక్క, ఫ్లైవుడ్ వంటి ఉంటే వాటిలోకి దూసుకుపోతుంది. గాజు, అద్దాలు ఉంటే వాటినీ ఛిద్రం చేస్తూ తన ‘దారి’లో ముందుకు వెళ్లిపోతుంది. గన్పౌడర్, బ్యారెల్లోని రింగుల ద్వారా వచ్చిన వేగం తగ్గే వరకు ఇలా వెళ్తూనే ఉంటుంది. రైల్వేస్టేషన్లో ఇనుప స్తంభాలు, ఉక్కుతో తయారైన రైలు ఇంజిన్లు, పెట్టెలు ఉంటాయి. అత్యంత వేగంగా ప్రయాణిస్తూ వెళ్తే తూటా ఇలాంటి లోహాలతో చేసిన వస్తువులు, ప్రత్యేకంగా పటిష్టంగా నిర్మించిన గోడలకు తాకితే పరిస్థితి మారుతుంది. ఆ ధాటికి తన తన దిశను మార్చుకుంటుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో రికోచెట్ అంటారు. వేగంగా ప్రయాణిస్తున్న మార్గంలో అడ్డు తగిలిన గట్టి వస్తువు కారణంగా దాని దిశను మార్చుకుని, ఒక్కోసారి ఫైర్ చేసిన దిశలోకి మారి దూసుకు వచ్చేస్తుంది. ముక్కలై.. పిల్లెట్లుగా.. వాటిని తాకిన ప్రభావంతో కొన్నిసార్లు లెడ్ బుల్లెట్ ముక్కలై పిల్లెట్లుగానూ మారిపోతుంది. ఇవి దాదాపు తూటా అంత వేగంగానూ దూసుకుపోతాయి. వీటి కారణంగానే రైల్వేస్టేషన్లో అనేక మంది ఆందోళనకారులు గాయపడ్డారు. పరిమాణంలో పెద్దగా ఉన్న పిల్లెట్ దూసుకువచ్చి శరీరంలోకి వెళ్లి ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేయడంతోనే రాకేశ్ కన్నుమూశాడని అధికారులు తేల్చారు. గదులు వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు రికోచెట్ నష్టం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. రికోచెట్ అయిన తూటా ఏ దిశలో వెళ్తుందో చెప్పలేని పరిస్థితి ఉంటుంది. తూటా పేలేది ఇలా... ఇన్సాస్ రైఫిల్ కింది భాగంలో ఉండే మ్యాగ్జైన్లో తూటాలు ఉంటాయి. సేఫ్టీ లివర్ రిలీజ్ కావడంతో మ్యాగ్జైన్లో ఉండే తూటా ఛాంబర్లోకి వెళిపోతుంది. ఇన్సాస్ మ్యాగ్జైన్ కెపాసిటీ 20 రౌండ్లు (తూటాలు) కాగా.. స్ప్రింగ్ మూమెంట్ కోసం 18 లేదా 19 మాత్రమే పెడుతుంటారు. చూపుడు వేలితో ట్రిగ్గర్ను నొక్కితే తుపాకీ వెనుక ఉండే హ్యామర్... ఫైరింగ్ పిన్ను ప్రేరేపిస్తుంది. దీంతో తూటా పేలి ముందు ఉండే బ్యారెల్ నుంచి దూసుకుపోతుంది. ఈ బుల్లెట్ బలమైన లోహం, వస్తువులను తాకినప్పుడు పిల్లెట్లుగా మారడం, రికోచెట్ కావడం జరుగుతుంది. (చదవండి: ‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్) -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్యంసం కేసులో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు
-
‘సికింద్రాబాద్ విధ్వంసం’ కేసులో నిందితులకు రిమాండ్
సాక్షి, హైదరాబాద్: కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెనువిధ్వంసమే సృష్టించారు ఆందోళనకారులు. అయితే ఈ విధ్వంసం కేసులో.. అల్లర్ల నిందితులకు బుధవారం రిమాండ్ విధించింది కోర్టు. ‘సాయి అకాడమీ’ సుబ్బారావు సహా 15 మందిని కోర్టులో హాజరు పరిచారు పోలీసులు. సుబ్బారావు పాత్రపై కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఇక పృథ్వీరాజ్ అనే అదిలాబాద్ వాసి.. విధ్వంసంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అలాగే పరారైన 25 మంది నిందితుల కోసం గాలింపు చేపట్టారు. చదవండి: అగ్నిపథ్ అల్లర్లు.. భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం -
అగ్నిపథ్ అల్లర్లు: పోలీసుల భయంతో.. యువకుడి ఆత్మహత్యాయత్నం
సాక్షి, వరంగల్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ ఆందోళనల్లో పాల్గొన్న వరంగల్ యువకుడు గోవింద్ అజయ్ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం సృష్టించింది. స్టేషన్ ఘన్పూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అజయ్.. ఆందోళనల్లో పాల్గొని ఓ టీవీ ఛానల్తో మాట్లాడాడు. దీంతో, అజయ్ గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారన్న విషయం తెలుసుకున్నాడు. ఈ క్రమంలో తనపై కేసులు పెడతారేమోనని భయపడిన అజయ్.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అది గమనించిన అజయ్ పేరెంట్స్.. అతడిని వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా అజయ్.. వాట్సాప్ మెసేజ్ రావడం వల్లే తాను అక్కడికి వెళ్లానని చెప్పాడు. తాను వెళ్లిన 10 నిమిషాలకు అక్కడ ఫైరింగ్ జరిగినట్టు తెలిపాడు. ఆర్మీ ఫిజికల్ టెస్టులో పాస్ అయి రాత పరీక్ష కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. ఆర్మీకి ప్రిపేర్ కావడంతోపాటు కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా అప్లై చేశానన్నాడు. ఆందోళనల్లో భాగంగా కేసు అయితే ఉద్యోగం రాదనే భయంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు చెప్పుకొచ్చాడు. ఇది కూడా చదవండి: హైదరాబాద్ పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు -
అగ్నిపథ్ పథకం: ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ స్కీం విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు సృష్టించిన గందరగోళం వల్ల కొంతమంది యువకులలో అపోహలు, అనుమానాలు తలెత్తాయి. దాని ఫలితమే సికిందరాబాద్ రైల్వే స్టేషన్తో పాటు దేశంలో కొన్ని ప్రాంతాలలో జరిగిన హింసాకాండ. ముందు ‘అగ్నిపథ్’ అంటే ఏమిటి, దాని మంచి చెడులు ఏమిటనే విషయాలు తెలుసుకుంటే కానీ ఈ నిరసనలు ఎంత అవగాహనా రాహిత్యంతో చేస్తున్నవో అర్థం కావు. ఆర్మీలో పని చేయడాన్ని ప్రతిపక్షాలు ఒక ఉపాధి మార్గంగా చూపెడుతూ యువతను పక్కదారి పట్టిస్తున్నాయి. సైన్యంలో పనిచేయడం అంటే దేశానికి సేవచేసే అవకాశం దక్కించు కోవడమే. ఈ అవకాశం అందరికీ లభించదు. కానీ, ఇప్పుడు ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకం ద్వారా ఎంతో మంది యువతకు దేశానికి సేవచేసే అవకాశం లభిస్తుంది. 17.5 నుండి 23 ఏళ్ల వయసున్న యువకులను ‘అగ్నిపథ్’ క్రింద త్రివిధ దళాల్లోకి ఎంపిక చేసుకుంటారు. ఇలా ఎంపికైన వారిని ‘అగ్నివీర్’ అని పిలుస్తారు. ఈ అగ్నివీరులకు 6 నెలల పాటు శిక్షణ ఇస్తారు. వీరికి ప్రతి నెలా ఇచ్చే ప్యాకేజీలో 70 శాతం చేతికిస్తారు. మిగిలిన 30 శాతాన్ని ‘అగ్నివీర్ కార్పస్ ఫండ్’కు జమ చేస్తారు. దీనికి సమానమైన 30 శాతం డబ్బులను కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఫండ్కు జమ చేస్తుంది. తమ నాలుగేళ్ల సర్వీస్ కాలంలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 25 శాతం మంది అగ్నివీరులను సైన్యంలో కొనసాగిస్తారు. మిగిలిన 75 శాతం మందికి కార్పస్ ఫండ్లో జమ చేసిన నిధికి వడ్డీని జోడించి మొత్తం 11 లక్షల 71 వేల రూపాయల ‘సేవా నిధి ప్యాకేజీ’ అందిస్తారు. దీనిపై ఆదాయపు పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఈ నాలుగేళ్ల కాలంలో నిబంధనల ప్రకారం ఇతర సౌకర్యాలు, రాయితీలు కూడా ఉంటాయి. అగ్నివీరు లకు ఎలాంటి ప్రీమియం చెల్లించకుండా రూ. 48 లక్షలు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సైన్యంలో ఉండగా ఏ కారణం వల్ల మరణించినా ఈ జీవిత బీమా సొమ్ము వారి కుటుంబానికి అందుతుంది. అంతేకాక విధి నిర్వహణలో చనిపోతే రూ. 44 లక్షల ఎక్స్గ్రేషియా (నష్టపరిహారాన్ని) కూడా చెల్లిస్తారు. శాశ్వత అంగవైకల్యం సంభవించిన వారికి రూ. 44 లక్షలు, పాక్షిక అంగ వైకల్యం సంభవించిన వారికి రూ. 25 లక్షలు, తాత్కాలిక అంగ వైకల్యం సంభవించిన వారికి రూ. 15 లక్షలు పరిహారంగా అందిస్తారు. ఈ పథకం క్రింద 4 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసు కున్న యువతకు 12వ తరగతికి సమానమైన సర్టిఫికెట్, బ్రిడ్జి కోర్సు, ఇతర నైపుణ్యాలు వారికి అందుతాయి. ఒకవేళ వారు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే బ్యాంకు రుణాలు సుల భంగా అందేలా ఏర్పాట్లు కూడా చేస్తారు. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మరో మంచి నిర్ణయాన్ని ప్రకటించారు. ‘అగ్నిపథ్’లో పనిచేసిన వారికి కేంద్ర సాయుధ బలగాల ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సశస్త్ర సీమా బల్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వంటి ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు మాజీ అగ్నివీరులకు కల్పిస్తారు. ఇదో గొప్ప నిర్ణయం. అలాగే రక్షణ శాఖ ఉద్యోగాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు వీరికి కల్పిస్తా మని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. ఇండి యన్ కోస్ట్గార్డ్స్, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో పాటు రక్షణ రంగం కిందకు వచ్చే 16 శాఖల్లో ఈ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతమున్న రిజర్వేషన్ కోటాకు అదనంగా ఉంటుందని ఆయన తెలి పారు. ప్రతిపక్షాలు ఈ వివరాలను ఏమీ చెప్పకుండా యువతను తప్పుదోవ పట్టించి, హింసాత్మక ఘటనలకు ప్రేరేపించే పనికి పూనుకోవడం బాధాకరం. ఒక నిరుద్యోగి ఖాళీగా ఉంటూ ఇబ్బంది పడటం కంటే, ‘అగ్నిపథ్’లో నాలు గేళ్లు పనిచేయడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. అంతకంటే గొప్ప విషయం ఏమిటంటే ఆర్మీలో పని చేయడంవల్ల దేశభక్తి, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత పెరుగుతుంది. తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది. ‘అగ్నిపథ్’ వంటి విధానాలు అనేక దేశాలలో ఇప్పటికే విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రష్యా, బ్రెజిల్, ఇజ్రా యిల్, యూఏఈ, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, సింగ పూర్, స్విట్జర్లాండ్, థాయిలాండ్, టర్కీ దేశాల్లో ఈ విధానం ఎప్పటి నుండో అమల్లో ఉంది. ఇజ్రాయిల్లో అమ్మాయి లైనా, అబ్బాయిలైనా కనీసం 2 సంవత్సరాల పాటు ఆర్మీలో పని చేయాలి. అవసరమైతే అబ్బాయిలు మరో ఏడాది, అమ్మాయిలు మరో 8 నెలలు పనిచేయాలి. బ్రెజిల్లో 18 ఏళ్లు దాటగానే... ప్రతి యువకుడూ 12 నెలలు తప్పని సరిగా ఆర్మీలో పనిచేయాలి. ఇరాన్లో కూడా 18 ఏళ్లు దాట గానే ప్రతి అబ్బాయూ కనీసం 20 నెలల నుంచి 24 నెలలు తప్పనిసరిగా ఆర్మీలో పనిచేయాలి. ఉత్తర కొరియాలో పది హేడేళ్లు నిండిన ప్రతి కుర్రవాడూ ఆర్మీలో చేరి 30 ఏళ్ల వయసు వరకు సైన్యంలో పనిచేయాలి. దక్షిణ కొరియాలో 18 ఏళ్లు నిండి, శారీరకంగా దృఢంగా ఉన్న ప్రతి యువ కుడూ 2 సంవత్సరాలు ఆర్మీలో పని చేయాలి. 28 సంవత్స రాలు నిండే లోపు ఈ 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయాలి. రష్యాలో ఒకప్పుడు ప్రతి అబ్బాయీ 2 సంవత్సరాలు ఆర్మీలో పనిచేయాల్సిందే. ఆ నిబంధనను 2008లో ఒక ఏడాదిగా మార్చారు. ఈ విషయాలన్నీ యువత అర్థం చేసుకోవాలి. లేని పక్షంలో బీజేపీని బదనాం చేసేందుకు కాంగ్రెస్, టీఆర్ఎస్లు మరిన్ని అభూతకల్పనలకు పాల్పడే అవకాశం ఉంది. ఆర్మీ జవాన్ కావాలనుకునే వారికి క్రమశిక్షణ, దూర దృష్టి ఉండాలి. వాస్తవాలు తెలుసుకోకుండా కొంతమంది దుందుడుకుతనంతో వ్యవహరించడం వల్ల వారికి వ్యక్తి గతంగానూ, కుటుంబ పరంగానూ తీరని నష్టం జరుగు తుంది. అంతకు మించి వీరి ప్రవర్తన సమాజానికి మరింత కీడు అనేది గుర్తుంచుకోవాలి. :::తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ -
Agnipath scheme: అగ్నిపథ్ను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు : అజిత్ దోవల్
న్యూఢిల్లీ : సైన్యంలో యువరక్తాన్ని నింపడానికి, మరింత టెక్ సేవీగా మార్చడానికే అగ్నిపథం పథకాన్ని తీసుకువచ్చామని, దానిని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ స్పష్టం చేశారు. మన జాతికి ఎంతో ప్రయోజనం చేకూర్చే ఈ పథకం విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవసరమైతే తన రాజకీయ జీవితాన్ని మూల్యంగా చెల్లించడానికి సిద్ధమయ్యారని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో 2006లోనే ఈ తరహా పథకం తీసుకువద్దామని అనుకున్నారని వెల్లడించారు. ప్రపంచ దేశాలో యువ జనాభా అత్యధికంగా ఉన్న మన దేశం ఆర్మీ విషయాన్నికొస్తే సగటు వయసు అత్యధికంగా ఉన్న దేశంగా ఉందని , అందుకే సైనిక రంగంలో సంస్కరణలు తప్పవన్నారు. మంగళవారం ఒక వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అగ్నిపథ్పై చెలరేగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న వారెవరూ అసలైన ఆశావహులు కాదని, వారంతా ఇళ్లలో కూర్చొని పరీక్షకు ప్రిపేర్ అవుతున్నారని చెప్పారు. అగ్నివీరుల భవిష్యత్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం ఒకటే జీవితం–రెండు కెరీర్లు , ఒక్కోసారి మూడు కెరీర్లు అని యువత మాట్లాడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. అగ్నివీరుల మొదటి బ్యాచ్ పదవీ విరమణ చేసిన సమయానికి భారత్ 5 లక్షల కోట్ల డాలర్లు (దాదాపుగా రూ.385 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని అప్పుడు పరిశ్రమలకి ఇలాంటి శిక్షణ పొందిన యువతరం అవసరం ఉంటుందన్నారు. యుద్ధభూమిని టెక్నాలజీ తన చేతుల్లోకి తీసుకుంటోందని ఇకపై కాంటాక్ట్లెస్ యుద్ధాలు కూడా వస్తాయని, అందుకే ఇలాంటి మార్పులు తప్పవన్నారు. అగ్నివీరులుగా శాశ్వత కెరీర్ కొనసాగించడానికి నాలుగేళ్ల తర్వాత దరఖాస్తు చేసుకోవాలని వారిలో ఎంపికైన 25% మందికి మళ్లీ కఠోర శిక్షణ ఉంటుందని అజిత్ దోవల్ వివరించారు. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి.. బయటపడ్డ సూత్రదారులు
-
అగ్నిపథ్: మేం చెప్పేది వినండి.. సుప్రీంలో కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నా అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకంగా.. పలు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఒక్కసారిగా అవి హింసాత్మకంగా మారిన పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు సుప్రీం కోర్టులోనూ ఈ పథకానికి మూడు వ్యతిరేక పిటిషన్లు సైతం దాఖలు అయ్యాయి. ఈ తరుణంలో కేంద్రం మంగళవారం ఉదయం కేవియట్ దాఖలు చేసింది. పిటిషన్లపై నిర్ణయం తీసుకోబోయే ముందు తమ వాదనలు వినాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది కేంద్రం. అయితే కేవియట్లో ప్రత్యేకించి ఎలాంటి అభ్యర్థనను చేయలేదు. కేవలం తమ చెప్పింది మాత్రం పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరడం విశేషం. అడ్వకేట్ హర్ష్ అజయ్ సింగ్, లాయర్లు ఎంఎల్ శర్మ, విశాల్ తివారీలు అగ్నిపథ్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ర్లమెంట్లో చర్చించి ఆమోదం పొందకుండానే కేంద్రం దీన్ని తీసుకొచ్చిందని పిటిషన్దారు అడ్వొకేట్ ఎం.ఎల్.శర్మ ఆరోపించారు. పథకాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక కేంద్రం అగ్నిపథ్ ప్రకటన వెలువడ్డాక.. జూన్ 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అగ్నిపథ్ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి. ‘అగ్నిపథ్’తో బీజేపీకి... సొంత సైన్యం కోల్కతా: అగ్నిపథ్ పథకంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. ఈ పథకం సైనిక దళాలను కించపర్చేలా ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఇప్పుడు జనాన్ని వెర్రివెంగళప్పలను చేస్తోందని ధ్వజమెత్తారు. -
అగ్నివీరులకు కార్పొరేట్ల రెడ్ కార్పెట్:ఉద్యోగాలు పెరుగుతాయి!
న్యూఢిల్లీ: సాయుధ బలగాల్లో రిక్రూట్మెంట్కు సంబంధించి వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ స్కీముకు కార్పొరేట్ దిగ్గజాలు మద్దతు పలికారు. దీనితో కార్పొరేట్ రంగంలో యువతకు ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గోయెంకా, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. స్కీం విషయంలో అల్లర్లు చెలరేగడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా, అగ్నివీరులుగా శిక్షణ పొందిన యువతకు తమ కంపెనీలో కొలువులిస్తామని తెలిపారు. ‘అగ్నిపథ్ స్కీముపై హింసాకాండ చెల రేగడం బాధ కలిగించింది. ఈ పథకంతో క్రమశిక్షణ, నైపుణ్యాలు పొందడం వల్ల అగ్నివీరులకు ఉద్యోగార్హతలు మెరుగు పడతాయని, వారికి మరింత ప్రాధాన్యం లభించగలదని దీన్ని గతేడాది ప్రతిపాదించినప్పుడే నేను చెప్పాను. అటువంటి సుశిక్షితులైన, సమర్ధులైన యువతను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మేము స్వాగతిస్తున్నాము‘ అని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో మహీంద్రా ట్వీట్ చేశారు. ఇంతకీ మహీంద్రా గ్రూపులో అగ్నివీరులకు ఏ తరహా ఉద్యోగాలిస్తారంటూ ఒక ట్విటర్ యూజర్ వేసిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఆపరేషన్స్ మొదలుకుని అడ్మినిస్ట్రేషన్, సరఫరా వ్యవస్థ నిర్వహణ వరకూ వివిధ విభాగాల్లో వారికి అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. సమాజంపై సానుకూల ప్రభావం.. మహీంద్రా ట్వీట్పై స్పందిస్తూ గోయెంకా ‘ఆర్పీజీ గ్రూప్ కూడా అగ్నివీరులను నియమించుకునే అవకాశాన్ని స్వాగతిస్తోంది. మన యువతకు భవిష్యత్పై నమ్మకం కలిగించేలా మిగతా కార్పొరేట్లు కూడా మా వెంట వస్తారని ఆశిస్తున్నాను‘ అని వ్యాఖ్యానించారు. ‘క్రమశిక్షణ, నైపుణ్యాలు గల అగ్నివీరులు.. మార్కెట్ తక్షణావసరాలకు తగిన పరిష్కార మార్గాలతో ఎంతగానో తోడ్పడగలరు. సమర్ధులైన యువతను రిక్రూట్ చేసుకోవడంలో పరిశ్రమ మద్దతుగా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను‘ అని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఒక ట్వీట్లో తెలిపారు. మరోవైపు, అగ్నిపథ్ స్కీము.. సమాజంపై గణనీయ స్థాయిలో సానుకూల ప్రభావం చూప గలదని, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించగలదని టీవీఎస్ మోటర్ కంపెనీ ఎండీ సుదర్శన్ వేణు అభిప్రాయపడ్డారు. ‘రాబోయే రోజుల్లో ఆర్థిక వృద్ధి సాధనలో, సమాజాన్ని పటిష్టంగా తీర్చిదిద్దడంలో అగ్నివీరులు ముఖ్య పాత్ర పోషించగలరు‘ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాయుధ బలగాల్లో చేరి దేశానికి సేవలు అందించడంతో పాటు టాటా గ్రూప్ సహా పరిశ్రమకు అత్యంత క్రమశిక్షణ గల, సుశిక్షితులైన యువతను అందించేందుకు అగ్నిపథ్ తోడ్పడగలదని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ అభిప్రాయపడ్డారు. అగ్నిపథ్ ద్వారా లభించే అవకాశాలను తాము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అగ్గి రాజేసిన అగ్నిపథ్.. పదిహేడున్నర ఏళ్ల నుంచి 21 సంవత్సరాల వయస్సు వారిని నాలుగేళ్ల పాటు సాయుధ బలగాల్లో రిక్రూట్ చేసుకునేందుకు ఉద్దేశించిన అగ్నిపథ్ స్కీమును జూన్ 14న కేంద్రం ప్రకటించింది. తర్వాత గరిష్ట వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది. ఇలా తీసుకునే వారిలో 25 శాతం మందిని మరో 15 ఏళ్ల పాటు సర్వీసులో కొనసాగించే అవకాశం ఉంది. నాలుగేళ్లకు రిటైర్ అయ్యేవారికి నిర్దిష్ట ఆర్థిక ప్రయోజనాలు కల్పించేలా రూపొందించారు. అయితే, సాయుధ బలగాల్లో పూర్తి స్థాయి రిక్రూట్మెంట్పై ఆశలు పెట్టుకున్న అభ్యర్ధులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. కొన్ని ప్రాంతాల్లో హింసాకాండకు కూడా ఇది దారి తీసింది. ఈ నేపథ్యంలోనే స్కీములోని సానుకూల అంశాలపై అవగాహన కల్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. -
Agneepath Scheme: భారత్ బంద్ పాక్షికమే!
న్యూఢిల్లీ/పట్నా: అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పలువురు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు సోమవారం పెద్దగా స్పందన లభించలేదు. ముందస్తు చర్యలు, భద్రత నడుమ .. బంద్ పాక్షికంగా సాగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. యువకులు రోడ్లపై బైఠాయించగా, అదుపులోకి తీసుకున్నారు అంతే. అయితే.. చాలా రాష్ట్రాల్లో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామైంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, అస్సాం, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో ఇటీవలి అనుభవాల దృష్ట్యా భద్రతను పటిష్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. దుకాణాలు, వ్యాపార వాణజ్య సంస్థలు యథావిధిగా కార్యకలాపాలు సాగించాయి. అగ్నిపథ్పై నిరసనల, ఆందోళనల కారణంగా.. రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సోమవారం దేశవ్యాప్తంగా 612 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. 602రెళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. మంగళవారం కూడా జాగ్రత్తలు పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24న సంయుక్త కిసాన్ మోర్చా నిరసనలు అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఆధ్వర్యంలో ఈ నెల 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ ప్రకటించారు. వాటిలో యువత, పౌర సమాజం ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తామన్నారు. బీకేయూ నేతృత్వంలో 30న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలనూ 24నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
అధిష్టానం ఆదేశిస్తే కేసీఆర్పై పోటీ
నల్లగొండ టూటౌన్: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే సీఎం కేసీఆర్పై పోటీ చేసి గెలుస్తానని ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్రావు సవాల్ విసిరారు. నల్లగొండ పట్టణంలో సోమవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో, ఆ తర్వాత విలేకరుల సమావేశంలో రఘునందన్రావు మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో జానారెడ్డి ఓటమితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగైందన్నారు. హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలిచారని, టీఆర్ఎస్ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున బీజేపీ నాయకులు ప్రజల్లోనే ఉండి పోరాడితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అగ్నిపథ్ పథకంపై ప్రతిపక్షాలు రాజకీయం చేసి కేంద్రాన్ని బద్నాం చేస్తున్నాయన్నారు. నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడమేంటని ప్రశ్నించారు. రైల్వే ఆస్తుల్ని తగులబెడుతుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేశారని, నిఘా వ్యవస్థ ఎక్కడ పోయిందని నిలదీశారు. పోలీసు కాల్పుల్లో ఒక అభ్యర్థి మరణించడం బాధాకరమని, అతని అంతిమయాత్రలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు కట్టి ఇతరులను రానీయకుండా అడ్డుకోవడాన్ని శవరాజకీయంగా అభివర్ణించారు. ఆర్మీ అభ్యర్థులు బలిపశువులు కావద్దని, ఒకసారి కేసులు నమోదైతే ఉద్యోగాలు రావడం కష్టమన్నారు. -
Agnipath scheme: దేశ హితానికే నిర్ణయాలు
సాక్షి, బెంగళూరు: కొత్త నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అసమంజసంగా తోచినా, అసంతృప్తికరంగా అనిపించినా అంతిమంగా జాతి నిర్మాణానికే తోడ్పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అగ్నిపథ్ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరులో రూ.33 వేల కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు, కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. అనంతరం కొమ్మఘట్టదల్లిలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సరికొత్త లక్ష్యాలను, సంకల్పాలను సాకారం చేసుకునే దిశగా మనల్ని తీసుకెళ్లగలిగేది కేవలం సంస్కరణల పథం మాత్రమేనని పునరుద్ఘాటించారు. ‘‘దశాబ్దాల తరబడి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటుకు కూడా అవకాశం కల్పించడానికి అదే కారణం. 21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి అవకాశాలను, సంపదను సృష్టించే వారిదే. అందుకే ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం వారిని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. అధికార లాలసులైన వ్యక్తులు తమ భావజాలాన్ని మార్చుకోవాలి. బెంగళూరు సాధించిన ప్రగతి మనకు చెబుతున్న పాఠం కూడా అదే’’ అన్నారు. అగ్నిపథ్ ఆందోళనలపై మోదీ ఇప్పటిదాకా నేరుగా స్పందించలేదు. సదుద్దేశంతో చేసే పనులు కూడా రాజకీయ రంగు పులుముకోవడం దేశ దౌర్భాగ్యమంటూ ఆదివారం కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. బెంగళూరులో బిజీబిజీ బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. బెంగళూరు–కొమ్మఘట్టదల్లి సబర్బన్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇదిప్పటికే 40 ఏళ్లు ఆలస్యమైందన్నారు. విద్యుద్దీకరణ చేసిన కొంకణ్ రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) క్యాంపస్లో రూ.280 కోట్లతో నిర్మించిన సెంటర్ ఫర్ బ్రెయిన్ రీసెర్చ్ (సీబీఆర్)ను ప్రారంభించారు. దీనికి శంకుస్థాపన చేసింది కూడా తానే కావడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. బాగ్చీ–పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏ దేశమైనా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు. బెంగళూరు కలలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఏక్ భారత్–శ్రేష్ఠ్ భారత్ స్ఫూర్తిని బెంగళూరు చక్కగా ప్రతిబింబిస్తోంది. లక్షలాది మంది కలల సాకారమే కొన్నేళ్లుగా నగర ప్రగతి రూపంలో ప్రతిఫలిస్తోంది. డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలతో ఎన్ని లాభాలుంటాయో, ప్రభుత్వం అతి జోక్యాన్ని తగ్గించి సరైన అవకాశాలు కల్పిస్తే భారత యువత ఎన్ని అద్భుతాలు సాధిస్తుందో చెప్పేందుకు బెంగళూరే నిదర్శనం. భారత యువతకు ఇదో కలల నగరి. పారిశ్రామిక చొరవ, ఇన్నోవేషన్, ప్రభుత్వ–ప్రైవేటు రంగాలను సమపాళ్లలో వినియోగించుకోవడం వంటివి బెంగళూరును ఇలా తీర్చిదిద్దాయి. బెంగళూరు వర్సిటీ ఆవరణలో అంబేడ్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ విశ్వవిద్యాలయ(బేస్) క్యాంపస్ను, రూ.4,700 కోట్లతో రూపొందించిన 150 టెక్నాలజీ హబ్లను మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగారు. ఉక్రెయిన్లో బాంబు దాడిలో మరణించిన వైద్య విద్యార్థి నవీన్ తల్లిదండ్రులను పరామర్శించారు. మైసూరులోనూ పలు శంకుస్థాపనలు చేశారు. త్రివిధ దళాధిపతులతో నేడు విడిగా మోదీ భేటీలు అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు. సైన్యం, నావికా దళం, వైమానిక దళాధిపతులు ప్రధాని మోదీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. మొదట నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ ప్రధానమంత్రిని కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నాకు కుర్తా కుట్టిస్తావా? మైసూరులో కేంద్ర పథకాల లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి తాను 10 పథకాల ద్వారా లబ్ధి పొందానని అంబిక అనే మహిళ చెప్పింది. కుట్టుమిషన్ కూడా తీసుకున్నానడంతో, ‘అయితే నాకు కుర్తా కుట్టిస్తావా?’ అని మోదీ అడిగారు. ‘తప్పకుండా. మంచి కుర్తా కుట్టిస్తా’ననడంతో నవ్వారు. అనంతరం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం మైసూరు ప్యాలెస్ ఆవరణలో ప్రపంచ యోగా ఉత్సవాల్లో మోదీ పాల్గొంటారు. -
రూపాయి, సిపాయి విలువలను దిగజార్చింది
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కేంద్రంలోని బీజేపీ సర్కారు రూపాయి విలువను దిగజార్చిందని, సిపాయిల విలువను తగ్గించిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేంద్రం ప్రకటించిన నూతన సైనిక నియామక విధానంపై ఆయన స్పందించారు. దేశం కోసం ప్రాణాలను అర్పించే సిద్ధపడి ఆర్మీలో చేరే యువత నాలుగేళ్లు పనిచేసిన అనంతరం కటింగ్ చేసుకుని, ఇస్త్రీ చేసుకుని బతకాలంటూ అవమానపరిచే విధంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడటం సబబు కాదన్నారు. సిపాయిల విలువను కూడా తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూపాయి విలువ గతంలో ఎన్నడూ లేనంతగా పతనావస్థకు చేరుకుందన్నారు. హరీశ్రావు సోమవారం సంగారెడ్డి జిల్లా తాలెల్మలో రూ.37 కోట్లతో నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించాక బహిరంగసభలో మాట్లాడారు. ఉన్న ఊరును, కుటుంబాలను వదిలి ఇరవై, ముప్పై ఏళ్లు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో పనిచేసిన సైనికులకు కేంద్రం పింఛను, ఉద్యోగభద్రత లేకుండా చేస్తోందన్నారు. రైళ్లు, రైల్వేస్టేషన్, విమానాలను అమ్మేసి, బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగులను తొలగించిన కేంద్రం.. ఇప్పుడు ఆర్మీని కూడా ప్రైవేటుపరం చేస్తోందని దునుమాడారు. బీజేపీ పాలిత కర్ణాటకలో కరెంట్ లేదు.. డబుల్ ఇంజిన్ సర్కారంటూ గొప్పలు పోయే బీజేపీ పాలిత కర్ణాటకలో కరెంట్ లేదని హరీశ్రావు విమర్శించారు. తెలంగాణలో రూ.రెండు వేలు పింఛను ఇస్తే కర్ణాటకలో రూ.500తో సరిపెడుతున్నారన్నారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెడితే కేంద్రం ఏటా రూ.ఐదు వేల కోట్లు ఇస్తామంటోందని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోబోమని స్పష్టం చేశారు. కేంద్రం కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆ హోదా ఎందుకు ప్రకటించదని ప్రశ్నించారు. బహిరంగ సభలో ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, నల్లమడుగు సురేందర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీని కూడా కించపరిచిన ఘన చరిత్ర బీజేపీది ‘నల్లచట్టాలను తెచ్చి 750 మంది రైతుల ఉసురుపోసుకున్నారు. సిలిండర్ ధరను రూ.400 నుంచి రూ.వెయ్యికి పెంచి మహిళల ఉసురుపోసుకున్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి సామాన్యుల ఉసురుపోసుకున్నారు. జీఎస్టీ తెచ్చి వ్యాపారుల ఉసురుపోసుకున్నారు.. ఇప్పుడు అగ్నిపథ్ పేరుతో యువత ఉసురు పోసుకుంటున్నారు’అని మోదీ సర్కారుపై హరీశ్రావు ధ్వజమెత్తారు. గాడ్సేను వీరుడంటూ గాంధీని కూడా కించపరిచిన ఘన చరిత్ర బీజేపీ ఎంపీలదని హరీశ్రావు దుయ్యబట్టారు. గాడ్సేని వీరుడంటూ బీజేపీ ఎంపీలు మాట్లాడారని, సోషల్మీడియాలో వైరల్ చేస్తున్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన ఎంపీలపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. -
రైల్వే స్టేషన్ విధ్వంసం కేసులో.. ఏ1గా మధుసూదన్
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన విధ్వంసం కేసులో 45 మందిని అరెస్టు చేసిన పోలీసులు యల్లారెడ్డికి చెందిన స్పోర్ట్స్ పర్సన్ మలవెల్లి మధుసూదన్ను ఏ1 గా చూపించారు. ప్రస్తుతానికి ఇతడే ప్రధాన నిందితుడు అయినప్పటికీ.. దర్యాప్తులో వేరే వ్యక్తుల పాత్ర తేలే అవకాశం ఉందని చెపున్నారు. మధుసూదన్తో సహా అరెస్ట్చేసిన నిందితులను పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖ లు చేశారు. ఇందులో మొత్తం 56 మందిని ఇప్పటివరకు నిందితులుగా గుర్తించినట్లు సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు పేర్కొన్నారు. 13 మంది పరారీలో ఉన్నట్లు తెలిపారు. శుక్రవారం నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో ఐపీసీ, రైల్వే, ప్రజా ఆస్తుల విధ్వంసక నిరోధక చట్టాల్లోని 15 సెక్షన్ల కింద నిందితులపై ఆరో పణలున మోదుచేశారు. ప్రాథమిక దర్యాప్తులో కుట్రకోణం వెలుగులోకి రావడంతో ఆదివారం నాటి నిందితుల రిమాండ్ రిపోర్ట్లో ఆమేరకు ఐపీసీలోని 120బీ సెక్షన్ను జోడించారు. కాగా, మధుసూదన్ జాతీయ కబడ్డీ ఆటగాడు. 18 మంది ప్రత్యక్ష సాక్షులు ఈ కేసులో క్షతగాత్రులు సహా 18 మందిని ప్రత్యక్ష సాక్షులుగా చేర్చారు. నిందితులుగా ఉన్న 56 మందీ ఫిజికల్, మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణత సా«ధించి ఆర్మీ ఉద్యోగం కోసం ఎదు రుచూస్తున్న వారేనని పోలీసులు పేర్కొన్నా రు. కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ నియా మక పథకానికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూపు లు ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు 8 గ్రూపులను గుర్తించామని, బిహార్లో జరిగిన అలర్ల వీడియోలను వీటిలో పోస్టు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ఏడు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లు పరారీలో ఉండగా.. ‘రైల్వేస్టేషన్ బ్లాక్’అడ్మిన్ రమేశ్ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ గ్రూప్ ద్వారా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసానికి ప్లాన్ చేశారని, పలు ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీలకు చెందిన నిర్వాహకులు, యజమానులు, డైరెక్టర్లు సహకరించారని పొందుపరిచారు. ఆస్తి, ఆత్మ రక్షణ కోసం పోలీసులు నిరసనకారులపై కాల్పులు జరిపారని బుల్లెట్ తగిలి రాకేష్ మరణించగా... మరో 12 మందికి గాయాలయ్యాయని రాశారు. ఈ రిపోర్ట్లో ఎక్కడా ఏపీలోని నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ యజమాని ఆవుల సుబ్బారావు పేరు కనిపించ లేదు. సికింద్రాబాద్ స్టేషన్ మేనేజర్ రాజ నర్సు ఫిర్యాదుతో ఈ కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ వెల్లడించింది. విధ్వంసంలోని ప్రతి ఘట్టమూ సెల్ఫోన్లలో రికార్డింగ్ సికింద్రాబాద్ స్టేషన్లో స్వయంగా విధ్వంసం సృష్టించిన వారే సాక్ష్యాధారాలను పరోక్షంగా ఇచ్చారని అధికారులు చెప్తున్నారు. ఈ విధ్వంసంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తాము చేసే చర్యలను తమ ఫోన్లలో ఇతరుల ద్వారా రికార్డు చేయించారు. రైలు ఇంజిన్ పగలకొట్టడం దగ్గర నుంచి బోగీలు కాల్చడం వరకు ప్రతి ఘట్టాన్నీ ఇలా చిత్రీకరించారు. ఓ ఆందోళనకారుడు ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏసీ బోగీలోకి ఎక్కి, అక్కడ దొరికిన కాగితాలను సీటులో వేసి, మంట అంటిస్తున్నదీ తన సెల్ఫోన్లో రికార్డు చేయించాడు. ఇలాంటి ఫొటోలు, వీడియోలను కొన్నింటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయగా మరికొన్ని గ్యాలరీల్లో సేవ్ అయి ఉన్నాయి. 45 మంది నిందితులను అరెస్టు చేసిన జీఆర్పీ పోలీసులు వారి నుంచి 44 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని విశ్లేషించి ఈ విధ్వంసానికి పథక రచన చేసిన వారి వివరాలను వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలుసుకున్నారు. ఫోన్లలో ఉన్న వీడియో, ఫొటో సాక్ష్యాలను సేకరిం చారు. న్యాయస్థానం అనుమతితో ఈ ఫోన్ల ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపి వీటిని పక్కా ఆధారాలుగా తయారు చేయాలని నిర్ణయిం చారు. మరోపక్క విధ్వంసం కేసును హైదరాబాద్ పోలీసులకు బదిలీ చేశామని రైల్వే ఎస్పీ ఆదివారం రాత్రి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించి డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు ఇవ్వాలని, సోమవారం వరకు అలాంటివి అందలేదని నగర పోలీసులు చెప్తున్నారు. సుబ్బారావుని తెస్తారా? లేదా? ఆంధ్రప్రదేశ్లోని నరసరావుపేటకు చెందిన సా యి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఈ కేసులో అరెస్టు చేయడంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. విధ్వంసానికి పాల్పడిన నిందితుల్లో 272 మంది నగరంలోని ఇతడి బ్రాంచ్ అభ్యర్థులని పోలీసులు గుర్తించారు. అభ్యర్థులను రెచ్చగొట్టడంతోపాటు ఉదంతం జరగడానికి ముందు రోజు రాత్రి సికింద్రాబాద్ వచ్చాడని, ఘటన జరిగిన రోజు కొన్ని గంటలు ఉన్నాడని తేల్చారు. అయితే నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న ఇతడిని తమకు అప్పగించాలంటూ రైల్వే పోలీసులు కోరలేదు. సుబ్బారావును నిందితుడిగా చేర్చడానికి మరికొన్ని ఆధారాలు అవసరమని ఓ అధికారి పేర్కొన్నారు. కీలక నిందితులది కామారెడ్డి జిల్లా సాక్షి, కామారెడ్డి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేసులో కీలక నిందితులు కామారెడ్డి జిల్లాకు చెందిన వారే ఉన్నారు. కేసులో ఏ1గా ఉన్న మలపెల్లి మధుసూదన్ (20)ది ఎల్లారెడ్డి కాగా.. ఏ5 సంతోష్ (22) గాంధారి మండలం మాతుసంగెంకు చెందిన వాడు, ఏ13 బూక్య పెంట్య (19) మాచారెడ్డి మండలం ఎల్లంపేటకు చెందిన వ్యక్తిగా తేల్చారు. వీరితోపాటు విధ్వంసంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్లకు చెందిన మరో 12 మంది ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం పోలీసులు జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. -
ఉన్నవి అమ్ముతూ వ్యయం తగ్గింపా?
దేశవ్యాప్తంగా ‘అగ్నిపథ్’ సృష్టించిన అగ్నిగుండం ఏమిటో మనకు తెలుసు. త్రివిధ దళాల్లో యువ సైనికుల్ని తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకానికి కేంద్రం తెర లేపింది. తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని భావించినందునే అభ్యర్థులు భారీ ఆందోళనకూ, విధ్వంసకాండకూ దిగారు. అయితే ఈ పథకం తేవడానికి కారణం ఏమిటి? సైన్యంలో పెన్షన్ వ్యయం పెరగడం! దీనికి నిజంగా చేయవలసింది – ఇరుగు పొరుగు దేశాలతో దౌత్య సంబంధాలు మెరుగుపర్చుకుని రక్షణ బడ్జెట్ను తగ్గించుకోవడం! కానీ ప్రభుత్వం దీనికి బదులుగా లాభసాటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అప్పజెబుతోంది; పెద్ద నోట్ల రద్దు అని చెప్పి ఎదురుడబ్బులు ఖర్చుచేసింది. ఇన్ని అస్తవ్యస్త విధానాలను అమలుచేస్తున్న ప్రభుత్వం సైన్యంలో వ్యయం పేరిట ఉద్యోగావకాశాల మీద నీళ్లు జల్లితే అభ్యర్థులకు ఆగ్రహం రాదా? భారతదేశంలో క్రమక్రమంగా ప్రభుత్వ రంగం కొడిగట్టిపోతూ వస్తోంది. 2014 ఎన్నికల తర్వాత అది మరింత వేగంగా బీజేపీ–ఆరెస్సెస్ ‘హిందూత్వ’ ఎజెండా చాటున ప్రైవేట్ ‘దుకాణం’గా స్థిరపడుతోంది. ఆ పరిణామంలో భాగంగానే – త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ పేరిట కేంద్రం ప్రవేశపెట్టిన సరికొత్త పథకం ‘అగ్నిపథ్’! సైనిక దళాల్లో చేరడానికి పాత రిక్రూట్మెంట్లలో అవసరమైన వివిధ దశల్ని (పరీక్షల్ని) పూర్తి చేసుకున్న అభ్యర్థులను డైరెక్టు రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా తాత్కాలిక సేవల కోసం ఉపయోగించుకుని మధ్యలో వదిలేసే పథకా నికి కేంద్రం తెర లేపింది. రిక్రూట్మెంట్ పరీక్షలు రాసి పాసైన అభ్య ర్థులు తమను ప్రభుత్వం మోసం చేస్తోందని భావించి, దీనికి నిరస నగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకూ, విధ్వంసకాండకూ దిగారు. శాశ్వత రిక్రూట్మెంట్ పథకం ద్వారా కాకుండా తాత్కాలిక అవసరాల కోసం తమ ప్రయోజనాల్ని ప్రభుత్వం పక్కన పెట్టేసిందని అభ్యర్థులు భావించినందునే ఈ స్థాయిలో భారీ విధ్వంసకాండకు దిగారు. ఎందుకీ కొత్త ఎత్తుగడ? అభ్యర్థుల్ని ‘స్వల్ప కాలం పాటు’ ఆర్మీలో పని చేయడానికి మాత్రమే అనుమతించాలన్న నిబంధనను ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఎందుకు ప్రవేశపెట్టింది? సైనిక, నావిక, విమాన సర్వీ సుల్లో పనిచేసే ఉద్యోగులకు పెరిగిపోతున్న పెన్షన్ చెల్లింపులకు కోత పెట్టడానికి ఈ కొత్త ఎత్తుగడను ప్రభుత్వం ఎత్తింది. ఇది పేరుకు ‘అగ్నిపథ్’. మరో మాటలో అగ్నిగుండం అనుకోవచ్చు. అయితే, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ రంగానికి ధారాదత్తం చేసే పథకాల్ని బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలకులు 2014 నుంచే అమలు చేస్తున్నారు. దీని పరాకాష్ఠ – కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తూన్న ప్రతిష్ఠాత్మక విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సహితం ప్రభుత్వ రంగం నుంచి తప్పించడం. దాన్ని ప్రైవేట్ రంగానికి కట్టబెట్టాలని నిర్ణయిం చినప్పుడే ఇది దేశ ప్రజలందరికీ అర్థమయింది. విశాఖ కర్మాగారాన్ని పబ్లిక్ రంగంలో కాపాడుకునేందుకు విశాఖలోనూ, దేశ వ్యాప్తం గానూ ఈ రోజుకూ ప్రజలు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ‘మొండికీ, బండకూ’ ఆయుష్షు ఎక్కువన్నట్టుగా దేశ పాలనా వ్యవస్థ ప్రవర్తిస్తోంది. ఇక్కడ గుర్తించవలసింది ఏమంటే– ఇలాంటి ఆందోళ నలు తలెత్తడానికి గల కారణాలను విశ్లేషించుకొని సకాలంలో సవర ణలను చేసుకోవాలనీ, ‘కక్షలు, కార్పణ్యాల’తో పరిష్కారాలు కుదర వనీ ప్రపంచవ్యాప్తగా మొండి పాలకులకూ, ప్రభుత్వాలకూ తెలియని పాఠమా? ప్రతి సంవత్సరమూ, దేశ రక్షణ బడ్జెట్లో సగానికి పైగా ఉద్యోగుల పెన్షన్ల కిందనే పోతోందనీ, పరిశోధన, అభివృద్ధి రంగా లకు ఐదు శాతం కన్నా తక్కువే అందుతోందనీ, రెవెన్యూ ఖర్చులో 70 శాతం రక్షణ బడ్జెట్కే ఖర్చు అవుతోందనీ ‘నీతులు’ చెప్పడానికి అలవాటు పడ్డారు పాలకులు. కానీ ఇరుగు పొరుగు దేశాలతో స్నేహ సంబంధాలు, దౌత్య సంబంధాలు ఇతోధికంగా పెంచుకోవడం పట్ల పాలనా వ్యవస్థ శ్రద్ధ పెట్టడం లేదు. రక్షణ విధానాల్లో మార్పు వచ్చేలా దేశ రక్షణ బడ్జెట్ను రూపొందించుకోవడం లేదు. ఏదో ఒక మిషతో ఉద్రిక్తతల సడలింపుపైన శ్రద్ధ వహించడం లేదు. ఇందువల్ల దేశానికీ, ప్రజల ప్రాథమిక ప్రయోజనాలకూ కలుగుతున్న నష్టాన్ని గుర్తించడం లేదు. దీన్నే భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ‘ది ఇండియా వే’ (భారత మార్గం) అన్న తన కొత్త గ్రంథంలో కూడా స్పష్టం చేస్తున్నారు. గత మూడు దశాబ్దాల్లో దేశాల మధ్య సంబంధాలు మెరుగై ఉన్నందున, ఆ పరిస్థితిని చెక్కు చెదుర్చుకోరాదనీ... దేశాల సరి హద్దులు, సంబంధ బాంధవ్యాలు పరస్పరం విడదీయరానివనీ జై శంకర్ చెబుతున్నారు. ఈ నిర్వాకాలతో ఒరిగిందేమిటి? కానీ గత పదేళ్ల వ్యవధిలో జరుగుతున్నదేమిటి? ఏదో ఒక మిష పైన, లేదా పాలక అవసరాల పైన, దేశ సైన్యం పేరిట... ‘హిందూత్వ’ ఎజెండా పేరిట... నల్లధనాన్ని వెలికి తీయకుండానే దాని పేరిటా దేశీయ కరెన్సీతో పాలకులు చెలగాటం ఆడుకున్నారు. దీనివల్ల మాసాలు, సంవత్సరాల తరబడీ సామాన్య, మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బులు ఆడక, బ్యాంకుల వద్ద గంటల తరబడీ పడిగాపులు పడవలసి వచ్చింది. ఆ క్రమంలో సుమారు 150 మంది బ్యాంకుల వద్దనే కుప్పకూలి ప్రాణాలు విడిచిన సంగతి మనకు తెలుసు! అంతకుమించి, కొత్త నోట్ల సృష్టి కోసం ఎదురు 25 వేల కోట్ల రూపా యలు ప్రింటింగ్ ప్రెస్లకు ధారాదత్తం చేసుకోవలసి వచ్చింది. ఇన్ని అనవసర ఖర్చులు పెడుతున్న ఈ అనుభవాలన్నింటి దృష్ట్యా ‘అగ్నిపథ్’ పథకాన్ని అగ్నితో చెలగాటం అనక తప్పదు. ఇది శిక్షణ పొందిన యువకుల రిక్రూట్మెంట్ విధానాన్నేగాక, యువ సైనికుల స్వభావాన్ని కూడా మౌలికంగానే దెబ్బ తీస్తుంది. అంతే గాదు, నిజానికి ఇదే బీజేపీ ప్రభుత్వం ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ అన్న పథకాన్నే అమలు జరుపుతామని హామీ ఇచ్చి పరిపాలనకు వచ్చింది. తీరా ఆచరణలో ‘ర్యాంకూ లేదూ, పెన్షనూ లేదు’ పొమ్మనే నిర్ణయా నికి రావడం ప్రస్తుత గందరగోళానికి దారితీసింది. ఇది ఆర్మీ ఉద్యో గార్థులకూ మింగుడుపడని అంశం కాదా? ఆర్మీ ఉద్యోగార్థుల రిక్రూట్ మెంట్ గరిష్ఠ వయఃపరిమితిని 21 నుంచి 23 ఏళ్లకు పెంచినట్టు పాల కులు చేతులు కాలిన తరువాత ప్రకటించబోవడం మరొక విడ్డూరం! దేశ భద్రతకు ప్రమాదం అంతేగాదు, సైన్యంలోకి రాష్ట్రాల వారీగా జనాభా ప్రాతిపదికపై రిక్రూట్ చేయడం 1966 నుంచీ అమలులో ఉంది. అలాగే, మన పార్ల మెంట్ను కూడా రానురానూ 500 మంది సభ్యుల్లో ఎక్కువగా పురు షులతోనే నింపడం ఎక్కువైంది. ఒకనాడు– 1952లో భారత రిపబ్లిక్ తొలి పార్లమెంట్ సమావేశంలోనే హేమాహేమీలైన 22 మంది మహిళా ప్రతినిధులు ఉన్నారు. విశేషమేమంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్న వేళ, అమృత మహోత్సవాలు నిర్వహించు కుంటున్న దశలో కూడా నాయక స్థానాల్లో ఉన్న మహిళలను అధ్య క్షులనో లేదా పార్టీ నాయకురాళ్లనో చెబుతూ ఉంటారేగానీ, గౌరవ పార్లమెంట్ సభ్యురాళ్లని మనం పిలుచుకోలేకపోతున్నాం. ఈ రోజుల్లో కేంద్రంలో పాలక రాజకీయ పక్ష సైద్ధాంతిక దృక్పథం కారణంగా దేశంలో ఫెడరల్ (సమాఖ్య) వ్యవస్థలో అస్తవ్యస్త స్థితి దాపురించింది. ఫెడరల్ వ్యవస్థ ఉనికికి అత్యధిక పార్లమెంట్ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ పాలకులు గండి కొడుతున్నారు. ఆర్మీ రిక్రూట్మెంట్ అస్తవ్యస్త విధానం కూడా ఈ కోవ లోనిదే. తాజాగా కేంద్ర పాలకులు వ్యయాన్ని మిగిల్చే పేరిట తీసుకున్న నిర్ణయం మూలంగా వృత్తి గౌరవాన్నీ, సమాజ సుస్థిరతనూ, తద్వారా దేశ భద్రతనూ ప్రమాదంలోకి నెట్టినట్టే అవుతుందని సుప్రసిద్ధ పరిశోధనా సంస్థ ‘సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్’ కేంద్రం సీనియర్ పరిశోధకులు సుశాంత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘హిందూత్వ’ రాజకీయాల్లో భాగంగా మత మైనారిటీల ఆస్తుల్ని కూలగొట్టే దుర్మార్గపు చర్యల్ని సుప్రీంకోర్టు నిశితంగా విమర్శించ వలసి వచ్చింది. అలాగే, కేంద్ర అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్మీలో విశిష్ట పాత్ర నిర్వహిస్తూన్న సిక్కు, డోగ్రా, మద్రాసు రెజిమెంట్ వగైరా ఫెడరల్ యూనిట్లను తక్కువ చేసినట్టు అవుతోందని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఖండించవలసి వచ్చింది! ఏది ఏమైనా, ప్రతిష్ఠ కోసం పెద్దనాయుడు చస్తే ఈడ్వలేక ఇంటిల్ల పాదీ చచ్చారన్నట్టుగా పాలకుల ప్రవర్తన ఉండకూడదు సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సికింద్రాబాద్ అల్లర్లు: ‘సాక్షి’ చేతిలో రిమాండ్ రిపోర్ట్.. కీలక అంశాలు వెలుగులోకి..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ అల్లర్ల కేసులో రైల్వే పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో రూ.20 కోట్ల నష్టం వాటిల్లినట్టు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు. ఏ2 నుంచి ఏ12 వరకు నిందితులు తప్పించుకుని తిరుగుతున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో రైల్వే పోలీసులు పేర్కొన్నారు. ‘రైల్వే స్టేషన్ బ్లాక్’ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ రమేష్గా గుర్తించారు. రమేష్ను ఏ3గా రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. చదవండి: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..! డిఫెన్స్ కోచింగ్సెంటర్లే అభ్యర్థులను రెచ్చగొట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్లో సాయి అకాడమీ సుబ్బారావు పేరు కనిపించలేదు. ఈ నెల 17న మధ్యాహ్నం 12:10కి స్టేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ బ్లాక్ వాట్సాప్ గ్రూప్లో 500 మంది సభ్యులున్నట్లు గుర్తించారు. రిమాండ్ రిపోర్ట్లో మొత్తం 56 మందిని రైల్వే పోలీసులు చేర్చారు. వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టి విధ్వంసానికి కుట్ర పన్నినట్లు పోలీసులు తేల్చారు. -
Agnipath Scheme: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నేత అనుచిత వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ మంటల్లో రాజకీయ నాయకులు చలికాచుకుంటున్న తీరుగా వ్యవహారం తయారైంది. పథకంలోని లోపాలేంటి, చేపట్టాల్సిన చర్యలేంటి? అనే సంగతి మరచి రాజకీయ నాయకులు పరస్పర విమర్శలతో రెచ్చిపోతున్నారు. స్థాయి మరచి దూషణలకు దిగుతుండటంతో విషయం పక్కదారి పట్టేలా ఉంది! తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ ప్రధాని నరేంద్రమోదీపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. హిట్లర్ మాదిరిగా మొండిగా ముందుకెళ్తే.. ఆయనకు పట్టిన గతే పడుతుందని సుబోధ్ సోమవారం ఓ సభలో వ్యాఖ్యానించారు. చదవండి👉 తమిళనాడు సీఎం స్టాలిన్కు అస్వస్థత.. ఇక మోదీపై అనుచిత వ్యాఖ్యలపట్ల జార్ఖండ్ మాజీ సీఎం రఘుబర్దాస్ స్పందించారు. నోటి దురుసుగా మాట్లాడటం కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని దుయ్యబట్టారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో సోనియాగాంధీ కూడా ఇలాగే నోరుపారేసుకున్నారని, ఆయనను అవమానించిన కాంగ్రెస్ ఏపాటి లాభపడ్డదో గుర్తుంచుకోవాలని అన్నారు. కాంగ్రెస్ విపరీత వ్యాఖ్యలపట్ల కన్నెర్ర జేసిన గుజరాత్ ప్రజలు మరోసారి మోదీకి అఖండ మెజారిటీ కట్టబెట్టారని రఘుబర్దాస్ చెప్పుకొచ్చారు. మోదీపై అభిమానంతోనే జనం ఆయనను ప్రధానిగా వరుసగా గెలిపిస్తున్నారని, కాంగ్రెస్ నీచ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. విర్రవీగి మాట్లాడితే కాంగ్రెస్ ఎప్పటికీ ప్రతిపక్షానికి పరిమితమవుతుందని మరికొందరు బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారు. కాగా, తాత్కాలిక ప్రాతిపదికన రక్షణ రంగంలో నియామకాలకు కేంద్రం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. చదవండి👉 ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న దేశ్యవాప్త నిరసన -
‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా 24న దేశ్యవ్యాప్త నిరసన
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం అమలుపై కేంద్రం దూకుడు ప్రదర్శిస్తుండగా... అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో భాగంగా సోమవారం భారత బంద్కు విపక్షాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాలు కూడా అగ్నిపథ్ వ్యతిరేక ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అగ్నిపథ్ సైనిక నియామక పథకానికి వ్యతిరేకంగా జూన్ 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) సోమవారం ప్రకటించింది. హరియాణాలోని కర్నాల్లో జరిగిన ఎస్కెఎం సమన్వయ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు రైతు నాయకుడు రాకేష్ తికాయిత్ తెలిపారు. జిల్లా, తహసీల్ ప్రధాన కార్యాలయాల్లో శుక్రవారం జరిగే నిరసన ప్రదర్శనలకు యువత, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువతను సమీకరించాలని పౌర సంఘాలు, రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) కూడా నిరసనల్లో పాల్గొంటుందని వెల్లడించారు. కాగా, అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జూన్ 30న నిరసనలకు బీకేయూ పిలుపునిచ్చింది. (క్లిక్: ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల) -
అగ్నిపథ్ ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆర్మీలో అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ నియామకాలకు నోటిషికేషన్ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. మంగళవారం ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్.. ఈనెల 24న ఎయిర్ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ రోజు నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. ఇదిలా ఉండగా ఓ వైపు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలపై తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది. చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: వందల సంఖ్యలో రైళ్లు రద్దు 📢 #Agniveer aspirants, get ready! Notification dates for recruitments under #AgnipathScheme 👇 🇮🇳 Indian Army @adgpi - June 20, 2022. 🇮🇳 Indian Navy @indiannavy - June 21, 2022. 🇮🇳 Indian Air Force @IAF_MCC - June 24, 2022.#AgnipathRecruitmentScheme #Agnipath #Agniveers pic.twitter.com/ZFPxcOZTcX — Ministry of Information and Broadcasting (@MIB_India) June 20, 2022 పథకం స్వరూపం... ►ఇది ఆఫీసర్ దిగువ ర్యాంకు సిబ్బంది (పీబీఓఆర్) నియామక ప్రక్రియ. ►త్రివిధ దళాలకు సంయుక్తంగా ఆన్లైన్ సెంట్రలైజ్డ్ విధానంలో ర్యాలీలు, క్యాంపస్ ఇంటర్వ్యూ తదితర మార్గాల్లో నాలుగేళ్ల కాలానికి నియామకాలు చేపడతారు. ►ఈ ఏడు 46,000 నియామకాలుంటాయి. 90 రోజుల్లో ప్రక్రియ మొదలవుతుంది. ►వయో పరిమితి 17.7–21 ఏళ్లు. ఆర్నెల్ల శిక్షణ, మూడున్నరేళ్ల సర్వీసు ఉంటాయి. ►త్రివిధ దళాల్లో ప్రస్తుతమున్న అర్హత ప్రమాణాలే వర్తిస్తాయి. ►సైన్యంలో ఇప్పటిదాకా జరుగుతున్న ప్రాంతాలు, కులాలవారీ నియామకాలకు భిన్నంగా ‘ఆలిండియా–ఆల్ క్లాస్’ విధానంలో రిక్రూట్మెంట్ ఉంటుంది. దీంతో రాజ్పుత్, మరాఠా, సిక్కు, జాట్ వంటి రెజిమెంట్ల స్వరూప స్వభావాలు క్రమంగా మారతాయి. ►విధుల్లో చేరేవారిని అగ్నివీర్గా పిలుస్తారు. వీరికి ప్రస్తుత ర్యాంకు లు కాకుండా ప్రత్యేక ర్యాంకులిస్తారు. ►వేతనం తొలి ఏడాది నెలకు రూ.30,000. రూ.21 వేలు చేతికిస్తారు. రూ.9,000 కార్పస్ నిధికి వెళ్తుంది. కేంద్రమూ అంతే మొత్తం జమ చేస్తుంది. నాలుగో ఏడాదికి రూ.40,000 వేతనం అందుతుంది. ►నాలుగేళ్ల సర్వీసు పూర్తయ్యాక రూ.11.71 లక్షల సేవా నిధి ప్యాకేజీ అందుతుంది. దీనిపై ఆదాయ పన్నుండదు. ►సర్వీసు కాలావధికి రూ.48 లక్షల ఉచిత జీవిత బీమా కవరేజీ ఉంటుంది. ►గ్రాట్యుటీ, పెన్షన్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. ► ప్రతిభ, ఖాళీల ఆధారంగా 25 శాతం మందిని శాశ్వత సర్వీసుకు పరిగణనలోకి తీసుకుంటారు. ►మిగతా వారికి రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు రంగ నియామకాల్లో ప్రాధాన్యం. -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లలకు ఏ పాపం తెలియదు..!
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానని వ్యతిరేకిస్తూ భారీ ఆందోళన చేపట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంస సృష్టించిన కేసులో 46 మంది చంచల్గూడా జైలులో ఉన్న సంగతి తెలిసిందే. వీరిని కలిసేందుకు తల్లి, దండ్రులు జైలు వద్దకు వచ్చారు. సోమవారం ఉదయం చంచల్గూడ జైలుకు చేరుకున్న నిందితుల తల్లిదండ్రులు.. తమ పిల్లలతో ములాఖత్లో కలవడానికి వచ్చారు. నిందితులుగా జైలులో ఉన్న తమ పిల్లలకు ఏమౌతుందోననే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలకు ఏ పాపం తెలియదని జైలు సిబ్బంది వద్ద కన్నీరుమున్నీరు అవుతున్నారు. కాగా, అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థులు నిరసనలు హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. అగ్నిపథ్కు వ్యతిరేకంగా యువత తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ నిర్వహించిన ఆందోళనలు విధ్వంసాన్ని సృష్టించాయి. నిరసనకారుల దాడులతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ భీతావహంగా మారింది. ఈ హింసాత్మక నిరసనల్లో రూ. ఏడు కోట్లకుపైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. -
భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ తీసుకొచ్చారా..?
కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తుతున్నాయి. అగ్నిపథ్కు నిరసనగా సోమవారం రాజకీయ పార్టీలు భారత్ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. అగ్నివీర్ల అంశంలో బీజేపీ నేతల వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్లో యువత డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, బార్బర్లుగా ఉపాధి పొందవచ్చని కేంద్ర మంత్రి అన్నారు. అగ్నివీరులను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారని మరో బీజేపీ నేత చెప్పారు. ప్రధాని మోదీని అర్థం చేసుకోలేదని మళ్లీ యువతను నిందిస్తున్నారా? భారతీయుల దృష్టి మళ్లించేందుకే అగ్నిపథ్ను తీసుకొచ్చారా.? శ్రీలంక ఆరోపణల నుంచి మోదీ-అదానీ అవినీతిపై ప్రజల దృష్టిని మరల్చడానికి ఒక ఉపాయమా..? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. Was #AgnipathScheme announcement just a ruse to divert India’s attention from #Srilanka allegations on Modi - Adani corruption nexus?#JustAsking — KTR (@KTRTRS) June 20, 2022 ఇది కూడా చదవండి: సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్ -
అగ్నివీరులకు స్వాగతమంటున్న ఆనంద్ మహీంద్రా
అగ్నిపథ్ ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తోన్న అంశం. గత నాలుగైదు రోజులుగా అన్ని అంశాలు అగ్నిపథ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ఈ పథకానికి సానుకూలంగా కొందరు కామెంట్లు చేస్తే విమర్శిస్తూ మరికొందరు మాట్లాడుతున్నారు. కాగా కాంటెంపరరీ ఇష్యూస్పై ఎప్పుడూ స్పందించే ఆనంద్ మహీంద్రా ఈ విషయంపై తన అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు ఓ అడుగు ముందుకేసి బంపరాఫర్ ఇచ్చారు. అగ్నిపథ్ చుట్టూ చెలరేగిన వివాదం పట్ల ఆనంద్ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. ఈ పథకం వస్తుందని ఏడాది కిందట విన్నప్పుడు చెప్పిన అభిప్రాయాలే ఇప్పుడు తనకు ఉన్నాయని ఆయన తెలిపారు. శిక్షణ, క్రమశిక్షణ కలిగిన అగ్ని వీరులకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. విజయవంతంగా శిక్షణ, సర్వీసు పూర్తి చేసుకున్న అగ్నివీరులకు మహీంద్రా గ్రూపులో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ ముందుకొచ్చారాయన. Saddened by the violence around the #Agneepath program. When the scheme was mooted last year I stated-& I repeat-the discipline & skills Agniveers gain will make them eminently employable. The Mahindra Group welcomes the opportunity to recruit such trained, capable young people — anand mahindra (@anandmahindra) June 20, 2022 చదవండి: ఆర్నాల్డ్ సుభాష్నగర్.. ఎక్కడున్నాడీ వ్యక్తి ! -
35 వాట్సాప్ గ్రూప్లపై నిషేధం విధించిన కేంద్రం
అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని.. ప్లాన్స్ సిద్దం చేసుకున్నారు. ఈ క్రమంలో అగ్నిపథ్ పథకం, అగ్నివీర్లకు సంబంధించి వాట్సాప్ గ్రూప్లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం గుర్తించింది. దీంతో, 35 వాట్సాప్ గ్రూప్లను నిషేధించినట్లు కేంద్ర సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేసినవారిని, హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించినవారిని గుర్తించేందుకు పోలీసులు కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అయితే, నిషేధం విధించిన వాట్సాప్ గ్రూపుల వివరాలను మాత్రం కేంద్రం గోప్యంగా ఉంచింది. ఇక, ఈ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడుల నుంచి మొదలు కొని బీహార్లో ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి దాడి, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం సహా పలు రాష్ట్రాల్లో నిరసనలపై కేంద్ర హోం శాఖ ఫోకస్ పెట్టింది. ఈ దాడులకు వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగిస్తున్నారనే నివేదికలపై చర్యలు చేపట్టింది. ప్రజలను రెచ్చగొట్టేందుకు, ఆస్తికి నష్టం కలిగించే ఉద్దేశంతో పుకార్లను వ్యాప్తి చేసేందుకు అభ్యంతరకరమైన కంటెంట్ను ప్రసారం చేయడానికి ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. Centre bans 35 WhatsApp groups for spreading misinformation on Agnipath scheme, 10 arrested for fake news#AgnipathScheme pic.twitter.com/Fqv0N8DF2n — Pandurang Dhond (@PandurangDhond7) June 20, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
భారత్ బంద్ ఎఫెక్ట్: విజయవాడలో స్పెషల్ రోబో టీమ్స్ ఏర్పాటు
అగ్నిపథ్కు వ్యతిరేకంగా అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అభ్యర్థులకు మద్దతుగా రాజకీయ పార్టీలు సోమవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు దేశవ్యాప్తంగా ప్రశాంతంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. విజయవాడలో పాక్షికంగా భారత్ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీ బందోబస్త్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా రోబో టీమ్స్ను ఏర్పాటు చేసినట్టు పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. స్టేషన్కు వెళ్లే ప్రతీ ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. భారత్ బంద్ నేపథ్యంలో తిరుపతి రైల్వే స్టేషన్లోనూ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అలర్ట్ అయ్యారు. ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు -
సైన్యంలో చేరమని మిమ్మల్ని ఎవరు అడిగారు: మాజీ ఆర్మీ చీఫ్ ఫైర్
అగ్నిపథ్పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ స్కీమ్పై తగ్గేదేలే అంటూ త్రివిధ దళాధిపతులు క్లారిటీ ఇచ్చిన విషయాన్ని తెలిసిందే. ఇక, తాజాగా కేంద్ర మంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్ అగ్నిపథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న వారిపై వీకే సింగ్ మండిపడ్డారు. వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. అగ్నిపథ్ స్కీమ్ నచ్చకపోతే అభ్యర్థులు.. దానిని ఎంచుకోవద్దని ఘాటుగా స్పందించారు. అగ్నిపథ్ స్కీమ్ నచ్చని వారు సాయుధ దళాల్లో చేరవద్దని కోరారు. భారత సైన్యం సైనికులుగా చేరమని బలవంతం చేయదని, సైన్యంలో చేరాలనుకునే వారు తమ ఇష్టానుసారం డెసిషన్ తీసుకోవచ్చని తెలిపారు. ‘‘అగ్నిపథ్ రిక్రూట్మెంట్ స్కీమ్ నచ్చకపోతే, అందులో చేరండి అని మిమ్మల్ని అడుగుతున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా బస్సులు, రైళ్లను తగలబెడుతున్న వారిని సాయుధ దళాల్లోకి తీసుకుంటామని ఎవరు చెప్పారు. మీరు అర్హత ప్రమాణాలను పూర్తి చేస్తేనే మిమ్మల్ని ఎంపిక చేస్తారని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే 1999 యుద్ధం తర్వాత కార్గిల్ కమిటీని ఏర్పాటు చేసినప్పుడు అగ్నిపథ్ గురించి ప్రస్తావన వచ్చిందని ఆయన వెల్లడించారు. #WATCH | Nagpur | It's a voluntary scheme... Those who want to come can come...Who is saying you to come? You are burning buses and trains, has anyone told you that you will be taken to the army?..: Union Minister and former Army chief VK Singh on #AgnipathScheme pic.twitter.com/Egh1VqQX7Y — ANI (@ANI) June 19, 2022 ఇది కూడా చదవండి: భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత -
అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు సత్యాగ్రహ దీక్ష
-
భారత్ బంద్ ఎఫెక్ట్: విద్యా సంస్థలు మూసివేత, పరీక్షలు రద్దు
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే నేడు(సోమవారం) దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర సంస్థలు, రైల్వే స్టేషన్ల వద్ద రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇదిలా ఉండగా.. అగ్నిపథ్ పథకానికి నిరసనగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) జార్ఖండ్ బంద్కు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం జార్ఖండ్లోని అన్ని పాఠశాలలు మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న 9, 11 తరగతుల పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్బంగా పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం కార్యదర్శి రాజేష్ కుమార్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కొన్ని సంస్థలు పిలుపునిచ్చిన బంద్ దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు సోమవారం మూసివేయాలని నిర్ణయించాము. పాఠశాల విద్యార్థులకు, ముఖ్యంగా బస్సులో ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బందులు తల్తెతకుండా ఉండేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. అగ్నిపథ్కు వ్యతిరేకంగా బీహార్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న కారణంగా 20జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులను నిలిపివేశారు. పంజాబ్లో కూడా శాంతి భద్రతలు అదుపు తప్పకుండా పోలీసుల అలర్ట్ ప్రకటించారు. యూపీలోనూ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. జైపూర్, నోయిడాలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. All schools in Jharkhand will remain closed today in view of the #BharatBandh protests. #AgnipathProtests #AgnipathScheme https://t.co/I2m9R2IM59 — India.com (@indiacom) June 20, 2022 ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే లవ్ ఎఫైర్.. సెక్స్ రాకెట్ బట్టబయలు -
Agnipath Scheme: దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు
సైన్యంలో అగ్నిపథ్ నియామకాలకు సోమవారం(నేడు) డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు లెఫ్టినెంట్ జనరల్ బన్సీ పొన్నప్ప చెప్పారు. మొదటి బ్యాచ్లో 25,000 మందికి డిసెంబర్ మొదటి, రెండో వారాల్లో శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పొన్నప్ప తెలియజేశారు. రెండో బ్యాచ్ అభ్యర్థులకు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో శిక్షణ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్నారు. దాదాపు 40,000 మందిని నియమించడానికి దేశవ్యాప్తంగా 83 రిక్రూట్మెంట్ ర్యాలీలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. నేవీలో మొదటి బ్యాచ్కు ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ అగ్నిపథ్ కింద నావికా దళంలో త్వరలో చేపట్టనున్న నియామకాల ప్రణాళిక గురించి వైస్ అడ్మిరల్ (పర్సనల్) దినేష్ త్రిపాఠి ప్రకటించారు. ఈ నెల 25 నాటికి నేవీ ప్రధాన కార్యాలయం పూర్తి వివరాలు వెల్లడిస్తుందన్నారు. అగ్నిపథ్ రిక్రూట్మెంట్లో ఎంపికైన మొదటి బ్యాచ్కు ఈ ఏడాది నవంబర్ 21 నాటికి ఒడిశాలోని ఐఎన్ఎస్ చిల్కాలో శిక్షణ ప్రారంభిస్తామని తెలియజేశారు. అగ్నివీరులుగా యువకులను, యువతులను ఎంపిక చేస్తామని దినేష్ త్రిపాఠి ఉద్ఘాటించారు. ఐఏఎఫ్లో డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభం భారత వైమానిక దళం(ఐఏఎఫ్)లో రిక్రూట్మెంట్ల గురించి ఎయిర్ మార్షల్ ఎస్.కె.ఝా వివరించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 24న ప్రారంభమవుతుందని, మొదటి దశ ఆన్లైన్ పరీక్ష ప్రక్రియ జూలై 24 నుంచి మొదలవుతుందని పేర్కొన్నారు. ఐఏఎఫ్లో అగ్నిపథ్ కింద మొదటి బ్యాచ్ అభ్యర్థులకు ఈ ఏడాది డిసెంబర్ 30 నాటికి శిక్షణ ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. -
Agnipath Scheme: కాంగ్రెస్ సత్యాగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ సత్యాగ్రహం చేపట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ఆదివారం నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా మాట్లాడుతూ... నకిలీ జాతీయవాదులను, నకిలీ దేశభక్తులను గుర్తించాలని యువతకు పిలుపునిచ్చారు. అసలైన దేశభక్తిని ప్రదర్శించే ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. జైరాం రమేష్, రాజీవ్ శుక్లా, సచిన్ పైలట్, సల్మాన్ ఖుర్షీద్, దిగ్విజయ్ సింగ్, హరీశ్ రావత్, రేవంత్రెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, జేడీ శీలం, కొప్పుల రాజు, వంశీచంద్రెడ్డి, రుద్రరాజు పాల్గొన్నారు. నేడు కాంగ్రెస్ దేశవ్యాప్త శాంతియుత ర్యాలీలు అగ్నిపథ్ కార్యక్రమంతోపాటు, తమ నేత రాహుల్ లక్ష్యంగా మోదీ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా లక్షలాదిగా తమ కార్యకర్తలు శాంతియుతంగా ర్యాలీలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇదే విషయమైన పార్టీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలుస్తారని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆదివారం ట్విట్టర్ ద్వారా తెలిపారు. బిహార్లో 804 మంది అరెస్ట్ అగ్నిపథ్పై హింసాత్మక నిరసనలకు పాల్పడిన 804 మందిని అరెస్ట్ చేసినట్లు బిహార్ పోలీసులు తెలిపారు. 145 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. గుజరాత్లోని అహ్మదాబాద్లో పోలీసులు 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. యూపీలో 34 కేసులు నమోదు చేసి, 387 మందిని అదుపులోకి తీసుకున్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు వ్యాప్తి చేసినట్లు గుర్తించిన 35 వాట్సాప్ గ్రూపులపై నిషేధం విధించినట్లు కేంద్రం తెలిపింది. ఆందోళనల కారణంగా దేశవ్యాప్తంగా 483 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపింది. -
‘బ్లాక్ గ్రూప్’ అగ్గి పెట్టింది!
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసం ఘటనలో కొత్త అంశాలు బయటికి వస్తున్నాయి. అభ్యర్థులను ఆందోళనకు ఉసిగొల్పినది ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు కాగా.. విధ్వంసానికి రెచ్చగొట్టినది కొందరు అభ్యర్థులేనని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేర ఓ వాట్సాప్ గ్రూపు, దానికి అనుబంధంగా మరో 3 గ్రూపులు ఏర్పాటు చేసుకుని.. తీవ్రస్థాయిలో ఆందోళనకు పక్కాగా పథకం రూపొందించుకుని, అమలు చేసినట్టు తేల్చారు. ఇక విధ్వంసం కేసులో అదుపు లోకి తీసుకున్నవారిలో 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి రిమాండ్కు తరలించారు. ఇక పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు రాష్ట్రంతోపాటు పొరుగు రాష్ట్రా ల్లోనూ గాలిస్తున్నాయి. నిందితులను కస్టడీకి ఇవ్వాలని సికింద్రాబాద్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సోమవారం పిటిషన్లు దాఖలు చేయనున్నారు. బిహార్ ఉదంతాలను చూసి ప్లాన్..: కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించాక మొదట్లో బిహార్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో విధ్వంసం ఘటనలు జరిగాయి. వాటిని చూసిన కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆర్మీ అభ్యర్థి శ్రీను ఈనెల 15న మధ్యాహ్నం 1.58 గంటలకు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ పేరుతో వాట్సాప్ గ్రూపును క్రియేట్ చేశాడు. దిల్సుఖ్నగర్లోని ఓ హాస్టల్లో ఉంటున్న అతను.. ఈ వాట్సాప్ గ్రూపునకు ఎనిమిది మంది అభ్యర్థులను అడ్మిన్లుగా చేశాడు. దీనికి అనుబంధంగా మరికొన్ని గ్రూపులు ఏర్పాటయ్యాయి. అడ్మిన్లు ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూప్లోకి దాదాపు 400 మందిని సభ్యులుగా చేర్చారు. తన పేరు బయటికి రాకూడదనే ఉద్దేశంతో శ్రీను ఆ గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు. అయితే ఈ గ్రూపులో సభ్యులు బిహార్ మాదిరిగా హల్చల్ చేద్దామని చర్చించుకున్నారు. సికింద్రాబాద్ వచ్చిన అందరూ ఒకచోట ఉండొద్దని, వేర్వేరుగా బస చేయాలని సూచించుకున్నారు. ఆదిలాబాద్ నుంచి వచ్చి దిల్సుఖ్నగర్లోని హాస్టల్లో ఉంటున్న సాబేర్ అనే అభ్యర్థి జెండాలు, కర్రలు, రాళ్లు వంటివి తెచ్చే బాధ్యత తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం అవన్నీ తీసుకుని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్దకు వచ్చి అందరికీ అందించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు శ్రీను, సాబేర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరో పది మంది అనుమానితులను కూడా పట్టుకున్నారు. నిప్పుపెట్టిన వాళ్లూ చిక్కారు మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన అభ్యర్థి రాజా సురేంద్ర కుమార్ ‘సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ బ్లాక్’ గ్రూపులో సభ్యులందరినీ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడు. ఆందోళనకు వచ్చే వారంతా పాత టైర్లు, వస్త్రాలు, రాడ్లు, పెట్రోల్ తీసుకుని రావాలని.. వాటిని వినియోగించి విధ్వంసం సృష్టిద్దామని సూచించాడు. శుక్రవారం ఉదయం ఆందోళనకారులు రైల్వేస్టేషన్లోకి ప్రవేశించే ముందు బస్టాండ్లో ఆర్టీసీ బస్సు అద్దాలను, ప్లాట్ఫామ్పై ఉన్న రైళ్ల ఏసీ బోగీల అద్దాలను పగలగొట్టింది అతడేనని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీల ద్వారా గుర్తించారు. ఇక రైలుబోగీల్లోకి ప్రవేశించి నిప్పుపెట్టిన వారిలో ఆదిలాబాద్కు చెందిన పృథ్వీరాజ్, కామారెడ్డికి చెందిన సంతోష్ కీలకంగా వ్యవహరించినట్టు తేల్చారు. ప్రత్యేక బృందాలు ఆదివారం రాత్రి ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నాయి. బస్సు అద్దాల ధ్వంసంపై మరో కేసు ఆర్మీ అభ్యర్థులు శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లోకి ప్రవేశించే ముందు రాజేంద్రనగర్, హయత్నగర్ డిపోలకు చెందిన మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. దీనికి సంబంధించి గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను రైల్వే పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు పంపాక.. పీటీ వారెంట్పై కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. మొత్తంగా రైల్వే స్టేషన్ ఘటనకు సంబంధించి శనివారం 45 మందిని రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆదివారం ఉదయం నాగోల్లోని రైల్వే కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు. ఆయన ఆదేశాల మేరకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోసం చంచల్గూడ జైలుకు తరలించారు. నిం దితులను ఆదివారం ఉదయం 8.15 గంటలకు జైలులోకి తీసుకున్నామని చంచల్గూడ అధికారులు చెప్పారు. ఛాతీలోంచి బుల్లెట్ దూసుకెళ్లి.. ఊపిరితిత్తులు ఛిద్రమై.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో శుక్రవారం జరిగిన కాల్పుల్లో వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం దబ్బీర్పేటకు చెందిన రాకేశ్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు.. రాకేశ్ మరణానికి తుపాకీ బుల్లెట్ కారణమని గుర్తించారు. ఛాతీపై కుడివైపు నుంచి శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్ ఊపిరితిత్తుల్ని ఛిద్రం చేస్తూ ఎడమ వైపు నుంచి బయటికి వెళ్లిందని తేల్చారు. ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో వెంటనే చనిపోయాడని.. పెల్లెట్ (రబ్బరు/ఇతర పదార్థాలతో కూడిన బుల్లెట్) అయితే ఇలా బయటికి దూసుకెళ్లదని పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది. మిగతా ఐదుగురు క్షతగాత్రుల నుంచి ఏడు బుల్లెట్లను వెలికితీసి, పోలీసులకు అందజేసినట్టు సమాచారం. నేడు 8 మంది బాధితుల డిశ్చార్జి! రైల్వేస్టేషన్ ఘటనలో గాయపడిన 14 మందిలో ఒకరు మృతి చెందగా.. మిగతా 13 మందికి మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఇందులో కోలుకున్న ఎనిమిది మందిని సోమవారం డిశ్చార్జి చేసే అవకాశముందని వెల్లడించారు. -
సికింద్రాబాద్ విధ్వంసం.. మూల కారుకులు వారే: ఎస్పీ అనురాధ
సాక్షి, హైదరాబాద్: అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో రైల్వే సంస్థకు తీవ్ర నష్టం జరింది. కాగా, ఈ ఘటనపై రైల్వే ఎస్పీ అనురాధ ఆదివారం స్పందించారు. ఈ సందర్భంగా ఎస్పీ అనురాధ మాట్లాడుతూ.. ఆందోళనకారులు పోలీసులు, ప్రయాణికులపై రాళ్లు రువ్వారు. కోచింగ్ సెంటర్ల వారే ఉద్యోగార్థుల్ని రెచ్చగొట్టారు. దాడులకు కారకులైన కోచింగ్ సెంటర్లను గుర్తించాము. వారంతా వాట్సాప్ గ్రూపుల్లోనే చర్చించుకున్నారు. దాడులకు పాల్పడిన 46 మందిని ఆధారాలతో అరెస్ట్ చేశాము. సీసీ టీవీ ఫుటేజీలు మా దగ్గర ఉన్నాయి. 17వ తేదీన ఉదయం 8 గంటలకు 300 మంది రైల్వే స్టేషన్లో చొరబడ్డారు. వారంతా ఈస్ట్కోస్ట్, దానాపూర్ ఎక్స్ప్రెస్లో వచ్చారు. ఒక కోచ్ను పెట్రోల్పోసి కాల్చేశారు. ఈ దాడిలో 2వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. వారికి రైల్వే యాక్ట్ సెక్షన్ 150 కింద యావజ్జీవ శిక్ష పడే అవకాశం ఉంది. వారు ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. అరెస్ట్ అయిన ఉద్యోగార్థులందరూ తెలంగాణకు చెందినవారే. రైల్వే స్టేషన్లో దాడిలో మొత్తం 58 రైల్వే కోచ్లు ధ్వంసమయ్యాయి. 9 మంది రైల్వే ఉద్యోగులు గాయపడ్డారు. 12 కోట్ల నష్టం జరిగింది’’ అని వివరించారు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత -
ఎట్టి పరిస్థితుల్లోను అగ్నిపథ్ ను ఆపేది లేదు
-
దేశ ప్రగతికోసం అగ్నిపథ్లో నడుస్తున్నారు మోదీ!
న్యూఢిల్లీ: దేశ ప్రగతికి ప్రధాని నరేంద్ర మోదీ అగ్నిపథ్ పై నడిచారంటూ బీజేపీ అధికార ప్రతినిధి మోదీపై ప్రశంసల జల్లు కరిపించారు. ఈ అగ్నిపథ్ పథకం పై పెద్ద ఎత్తు ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తగలడంతో... సంస్కరణలు, పనితీరులో మార్పులు రూపాంతరం చెందకపోతే భారత్ ఎలా గొప్పగా మారుతుందని ఆయన ఎదురు ప్రశ్నించారు. ఈ మేరకు అగ్నిపథ్ పథకానికి సంబంధించి భారత సాయుధ బలగాల ఉన్నతాధికారులతో జరిగిన మీడియా సమావేశం బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సమావేశంలో సంబిత్ పాత్రా మాట్లాడుతూ...లెఫ్టినెంట్ జనరల్ పూరి ఆర్మీ కాన్ఫరెన్స్లో అగ్నిపథ్ కార్యక్రమాన్ని వివరించిన తీరు.. అందులో ఎలాంటి సందేహం లేదని అనుకుంటున్నా. కొన్ని విషయాల్లో రాజకీయాలు ఉండకూడదని చెప్పడం బాధాకరమన్నారు. జాతీయ విధానాలపై కూడా దేశంలో రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. ఆర్మీ అధికారులు ముందుకు వచ్చి ఈ దేశంలో కాల్పులకు, హింసకు తావు లేదని, హింసకు పాల్పడవద్దని నిరసనకారులకు చెప్పాలి. భారతదేశ ప్రగతి కోసం మోదీ అగ్నిపథ్లో నడవడం చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ జాతీయవాదాన్ని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ సమావేశంలో ఒక సీనియర్ ఆర్మీ అధికారి మాట్లాడుతూ..."ఈ పథకాన్ని వెనక్కి తీసుకోమని స్పష్టం చేశారు. దేశాన్ని యవ్వనంగా మార్చడానికి ఇదోక ప్రగతిశీల. మేము జాతీయ భద్రతలో తలామునకలవుతున్నాం, మాకసలు తీరికనేది ఉండేదు. ఒక చిన్న ఉదాహరణ చెబుతున్నా...ఎత్తైన ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నప్పుడు ఆరోగ్యం పై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా అని ప్రశ్నించారు. ఏటా చాలా మంది ఈ ప్రాంతాల్లో చనిపోతున్నారు. ఎంత ప్రాణ నష్టం వాటిల్లుతోందో కూడా మీకు తెలియదు. ముందు వీటి గురించి కూలంకషంగా తెలుసుకోండి. ఆ తర్వాత యువత ఎందుకు ముఖ్యమో మీకు అర్థమవుతుంది." అని అన్నారు. (చదవండి: అగ్నిపథ్పై కీలక ప్రకటన) -
నిరసనల వేళ అగ్నివీర్లపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా అగ్నిపథ్పై ఆందోళనలు కొనసాగుతున్న వేళ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అగ్నివీరులకు బీజేపీ ఆఫీసుల్లో సెక్యూరిటీ ఉద్యోగాలు ఇస్తామంటూ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ.. అగ్నివీర్లపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. అగ్నిపథ్పై నిరసనల నేపథ్యంలో విజయవర్గీయ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక అగ్నివీర్ సైనిక శిక్షణ పొంది, నాలుగు సంవత్సరాల తర్వాత సేవ నుండి నిష్క్రమించినప్పుడు రూ.11 లక్షలు అందుకుంటాడు. అగ్నివీర్ బ్యాడ్జ్ని ధరిస్తాడు. బీజేపీ కార్యాలయానికి సెక్యూరిటీని నియమించాలనుకుంటే, నేను అగ్నివీర్కు ప్రాధాన్యత ఇస్తా’ అని వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విపక్ష నేతలు.. కైలాష్ వర్గీయపై మండిపడ్డారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. కైలాష్ వర్గీయపై నిప్పులు చెరిగారు. దేశ యువత, భారత ఆర్మీని అగౌరవపర్చవద్దని హితవు పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. కైలాష్ విజయవర్గీయ మాటలతో అగ్నిపథ్ స్కీమ్పై ఉన్న అన్ని అనుమానాలు తొలగిపోయాయని విమర్శలు చేసింది. ఇందుకోసమేనా అగ్నిపత్ స్కీమ్కు తీసుకువస్తున్నారంటూ ఎద్దేవా చేసింది. అగ్నివీరులు సెక్యూరిటీ గార్డులుగా ఉండేందుకు కూడా మన ఆర్మీ శిక్షణ ఇస్తున్నది అంటూ శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. देश के युवाओं और सेना के जवानों का इतना अपमान मत करो। हमारे देश के युवा दिन-रात मेहनत करके फ़िज़िकल पास करते हैं, टेस्ट पास करते हैं, क्योंकि वो फ़ौज में जाकर पूरा जीवन देश की सेवा करना चाहते हैं, इसलिए नहीं कि वो BJP के दफ़्तर के बाहर गार्ड लगना चाहते हैं। https://t.co/PQ8B30FYHz — Arvind Kejriwal (@ArvindKejriwal) June 19, 2022 -
బీజేపీ నేతలకు ధైర్యముంటే రాకేశ్ ఇంటికి రావాలి: జగ్గారెడ్డి
బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సవాల్ విసిరారు. జగ్గారెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కాల్పులకు బాధ్యులు ఎవరూ అంటూ ప్రశ్నించారు. బీజేపీ నేతలకు ధైర్యం ఉంటే వరంగల్ రాకేశ్ ఇంటికి రావాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ రద్దు అయ్యే వరకు బండి సంజయ్, కిషన్రెడ్డిని అడ్డుకుంటామన్నారు. రాకేశ్ మృతదేహంపై టీఆర్ఎస్ జెండా ఎందుకు కప్పారు?. బీజేపీ ప్రభుత్వం రాకేశ్ మృతికి కారణమైతే.. టీఆర్ఎస్ శవయాత్ర రాజకీయం చేసింది’’ అని విమర్శించారు. ఇది కూడా చదవండి: బాసర ట్రిపుల్ ఐటీ వద్ద టెన్షన్.. టెన్షన్ -
Agnipath Scheme: అగ్నిపథ్పై కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ స్కీమ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రివిధ దళాల అధిపతులు అగ్నిపథ్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా డీఎంఏ అడిషన్ సెక్రటరీ అనిల్పురి మాట్లాడుతూ.. ‘‘అగ్నిపథ్పై రెండేళ్లుగా అధ్యయం చేశాము. అగ్నిపథ్పై త్రివిధ దళాధిపతులు సమగ్ర అధ్యయనం చేశారు. 1989 నుంచి అగ్నిపథ్ పెండింగ్లో ఉంది. సగటు వయస్సును తగ్గించేందుకు సంస్కరణలు తీసుకువచ్చాము. సైన్యాన్ని యువకులతో నింపాలన్నదే లక్ష్యం. ఆర్మీలోకి వచ్చి వెళ్లేందుకు చాలా అవకాశాలు కల్పించాము. మా కంటే ఇప్పడున్న యువత చాలా శక్తివంతమైనది. సెల్ఫోన్లు, డ్రోన్లతో యువత అద్భుతాలు చేస్తున్నారు. రానున్న కాలంలో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర. నేటి యువతకు టెక్నాలజీపై మంచి పట్టుంది. ఈసారి ఎక్కువ మందిని నియమించాలని భావించాము. అగ్నివీర్లు సైన్యంలో కొనసాగే వీలుంది. 'అగ్నివీర్స్' దేశ సేవలో తన జీవితాన్ని త్యాగం చేస్తే కోటి రూపాయల పరిహారం అందుతుంది. ప్రస్తుతం 46వేల మంది అగ్నివీర్ల నియామకం చేపడుతున్నాము. వచ్చే నాలుగైదు ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50వేల నుంచి 60వేల వరకు ఉంటుంది. దీన్ని క్రమంగా 90 వేల నుంచి లక్ష వరకు పెంచుతాం. భవిష్యత్తులో ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుంది. అగ్నివీర్లకు వివిధ మంత్రిత్వ శాఖలు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాయి. ఆందోళనలకు ముందే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఈ నెల ఎయిర్ఫోర్స్లో 24 నుంచి తొలి బ్యాచ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. జూలై 24 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ, ఫేజ్-1 ఆన్లైన్ టెస్టు ఉంటుంది. డిసెంబర్ 30 నాటికి తొలిబ్యాచ్ ట్రైనింగ్కు వెళ్తారు. త్రివిధ దళాల్లో ఇకపై సాధారణ నియామకాలు ఉండవు. అగ్నిపథ్ ద్వారానే ఇకపై నియామకాలు జరుగుతాయి. సైన్యానికి క్రమశిక్షణ తప్పనసరి. విధ్వంసాలకు పాల్పడిన వారికి సైన్యంలో చోటులేదు. యువత ఆందోళనల్లో పాల్గొనవద్దు. కేవలం అగ్నిపథ్ వల్లే ఆర్మీ నుంచి సిబ్బంది బయటకు వెళ్తారన్న వాదన సరికాదు. త్రివిధ దళాల నుంచి ఏటా సగటున 17,600 మంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తున్నారు. వీరంతా రిటైర్మెంట్ తర్వాత ఏం చేస్తారని ఎవరూ అడగడం లేదు ’’ అని వ్యాఖ్యానించారు. 'Agniveers' will get a compensation for Rs 1 crore if he sacrifices his life in service of the nation: Lt Gen Anil Puri https://t.co/p4navR0VRZ pic.twitter.com/Z9Pj58L9Ew — ANI (@ANI) June 19, 2022 -
సాక్షాత్తు ముఖ్యమంత్రి కాన్వాయ్ ఆపీ... : వీడియో వైరల్
చండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రోడ్షోలో ప్రజలను పలకరిస్తున్నారు. ఈ మేరకు ఆయన ఎస్యూవీ కారులో నుంచుని ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇంతలో ఒక నల్లని టీషర్టు ధరించిన వ్యక్తి ముఖ్యమంత్రి కాన్యాయ్ని ఆపాల్సిందిగా చేతులు ఊపాడు. దీంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆ వ్యక్తితో మాట్లాడేందుకు తన కారుని ఆపారు. సదరు వ్యక్తి మొదటగా ముఖ్యమంత్రికి కరచలనం చేసి అగ్నిపథ్ గురించి మాట్లాడాడు. ఈ అగ్నిపథ్ పథకాన్ని అమలు చేసే ముందు నాయకులంతా సమావేశమై చర్చించి ఉంటే బావుండేది కదా అని అడిగాడు ఆ వ్యక్తి. దీంతో భగవంత్ మాన్ సదరు వ్యక్తి చేతిని పట్టుకుని అగ్నిపథ్ గురించి చర్చించడానికి ఎంపీలంతా సమావేశమైతే...తానే స్వయంగా వెళ్లి మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఈ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు చెలరేగిన సంగతి తెలిసిందే. మరోవైపు సాయుధ దళాల రిక్రూట్మెంట్లో సమూల మార్పులను ప్రకటించే ముందు ప్రభుత్వం సంప్రదింపులు జరిపి ఇతర నాయకుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకుని ఉండాల్సిందని ప్రతిపక్షాలు కూడా దుమ్మెత్తిపోస్తున్నాయి. అంతేకాదు ఈ విషయమై చర్చలకు కూర్చొవల్సిందే అంటున్న జౌత్సాహిక నిరసనకారులకు వంత పాడుతున్నాయి ప్రతిపక్షాలు. ఐతే ప్రభుత్వం ఇంకా కొన్ని చోట్ల నిరసనలు జరుగుతుండటంతో దిద్దుబాటు చర్య చేపట్టడమే కాకుండా పలు రాయితీలను కూడా ప్రకటించింది. ఈ మేరకు కోస్ట్గార్డు, డిఫెన్స్ సివిలియన్ పోస్టులతో సహా మొత్తం 16 డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్లో విస్తరించి ఉన్న రక్షణ మంత్రిత్వశాఖ ఉద్యోగాల్లో 10 శాతం కోటా కల్పించింది. ఈ రిజర్వేషన్ మాజీ సైనికులకు ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్కు అదనంగా ఉంటుంది. The reason why Punjab loves @BhagwantMann ❤️ Punjab CM STOPPED his roadshow for #SangrurBypoll to listen to a youth protesting against #AgnipathScheme pic.twitter.com/PVXiTU0MYI — AAP (@AamAadmiParty) June 19, 2022 (చదవండి: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్) -
Sakshi Cartoon: ...‘ఈడీ పథకం’ సక్సెస్ సార్!
...‘ఈడీ పథకం’ సక్సెస్ సార్! -
అగ్నిపథ్ అల్లర్లు: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్
అగ్నిపథ్.. పేరుకు తగ్గట్టే దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. త్రివిధ దళాల్లో రిక్రూట్మెంట్ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ యువకుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్, ఉత్తర ప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసనలు మరో రూపం దాల్చి హింసాత్మక రంగు పులుముకున్నాయి. గత నాలుగు రోజుల క్రితం రాజుకన్న అగ్గి ఇప్పటి వరకు చల్లారడం లేదు. 700 వందల కోట్ల ఆస్తి హాంఫట్ నిరసనకారుల ఆందోళనలో ఇప్పటి వరకు 60 రైళ్లకు నిప్పంటించారు. బిహార్లో 11 ఇంజిన్లను తగలబెట్టారు. గత నాలుగు రోజుల అల్లర్లలో ఇప్పటి వరకు ఆందోళనకారులు సుమారు 700 వందల కోట్ల రూపాయల ఆస్తిని అగ్నికి ఆహుతి చేశారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతోపాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం కేవలం అధికారులు అంచనా వేసినవి మాత్రమే.. అధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత వార్త: సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు 718 మంది అరెస్ట్ దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బిహార్ నిరసనలు విధ్వంసానికి దారి తీశాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లు లక్ష్యంగా దాడి జరుగుతోంది. బిహార్లో హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు 25 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. మొత్తం 250 మందిని అరెస్టు చేశారు. అగ్నిపథ్ నిరసనలు ఒక్క బిహార్ రాష్ట్రంలోనే 15 జిల్లాలకు విస్తరించాయి. రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది., అదే స్లీపర్ కోచ్కు 1.25 కోట్లు, ఏసీ కోచ్ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్ల ట్రైన్ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. ఆస్తి నష్టం వాటిల్లిన రాష్ట్రాల్లో బిహార్లో ఎక్కువగా ఉంది. ఇది కూడ చదవండి: Agnipath Scheme: అనుమానాలు, వివరణలు 60 కోట్ల మంది టికెట్లు రద్దు ఇప్పటి వరకు సుమారు రూ. 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తూర్పు-మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆస్తి నష్టంపై పూర్తి నివేదికను రైల్వే రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు అధికారిక సమాచారం మేరకు 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు. ట్రాక్లు దెబ్బతిని రైళ్ల రద్దు ఫలితంగా రైల్వేకు భారీ ఆర్థిక దెబ్బ తగిలింది. అయినప్పటికీ వీటన్నిటిపై రైల్వే శాఖ అధికారిక అంచనాను విడుదల చేసే పరిస్థితిలో లేనట్లు కనిపిస్తోంది. చదవండి: ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు! -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటన: మా పిల్లల జాడేది?
రాంగోపాల్పేట్ (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో పాల్గొని పోలీసులకు చిక్కిన ఆర్మీ ఉద్యోగార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. శుక్రవారం రాత్రి నుంచి వారిని గోపాలపురం, జీఆర్పీ, టాస్క్ఫోర్స్ పోలీస్ స్టేషన్లలో ఉంచి విచారణ జరుపుతున్నారు. శనివారం రాత్రి వరకు పోలీసులు వారి అరెస్టు చూపించలేదు. టీవీల్లో వార్తలు చూసిన ఆర్మీ అభ్యర్థుల తల్లిదండ్రులు శనివా రం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వచ్చి తమ పిల్లల గురించి ఆరాతీస్తూ కనిపించారు. పోలీసులు అరెస్టు చేశారా, ఎక్కడికైనా వెళ్లిపోయా రా.. వారికి ఏం జరిగిందోనని ఆందోళనకు లోనయ్యారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్, గోపాలపురం పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తమ పిల్లల గురించి ఆరా తీశారు. కానీ పోలీసులు ఏ విషయం చెప్పకపోవడంతో పిల్లల జాడ ఎక్కడ అంటూ విలపించారు. పోలీసులు ఏమీ చెప్పడం లేదు నిన్న టీవీలో సికింద్రాబాద్ ఘటన చూసి చాలా ఆందో ళన చెందాం. మా అక్క కు మారుడు మహేందర్కు చా లా సార్లు ఫోన్ చేసినా కలవడం లేదు. దీంతో రాత్రి హైదరాబాద్ వచ్చి గోపాలపురం, సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లలో అడిగాం. కానీ ఎవరూ సమాధానం చెప్పడంలేదు. – సాయప్ప, తాండూరు రాంపూర్ గ్రామం -
సికింద్రాబాద్ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు
గాంధీ ఆస్పత్రి (హైదరాబాద్): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కాల్పుల్లో గాయపడ్డ 13 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి మేజర్, ముగ్గురికి మైనర్ ఆపరేషన్లు చేసిన వైద్యులు.. వారి శరీరంలోకి దిగిన ఎనిమిది తుపాకీ పెల్లెట్లను వెలికితీశారు. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం గుండ్రేటిపల్లికి చెందిన దండు మహేశ్ (21)కు వీపు భాగంలో శస్త్రచికిత్స చేసి రెండు పెల్లెట్లు బయటికి తీశారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు నాగేందర్బాబు (21) కాలులోకి దూసుకుపోయిన రెండు పెల్లెట్లను.. కామారెడ్డిజిల్లా నిజాంసాగర్కు చెందిన పి.మోహన్ తొడ, నడుము భాగాల్లో దిగిన రెండు పెల్లెట్లను వెలికి తీశారు. మహబూబ్నగర్కు చెందిన లక్కం వినయ్ (20)కు ఛాతీపై కుడివైపు.. కర్నూల్ జిల్లా మంత్రాలయానికి చెందిన జగన్నాథ్ రంగస్వామి(20)కి పక్కటెముకల్లో దిగిన ఒక్కో పెల్లెట్ను బయటికి తీశారు. వీరంతా ఐసీయూలో కోలుకుంటున్నారని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఇక స్వల్ప గాయాలైన మరో ఎనిమిది మంది కోలుకున్నారని.. కానీ వారు మానసిక ఆందోళనలో ఉండటంతో కౌన్సెలింగ్ ఇప్పిస్తున్నామని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. వారిని మరో 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచాక డిశ్చార్జి చేస్తామన్నారు. (చదవండి👉🏻 ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!) మానసిక నిపుణులతో కౌన్సెలింగ్.. రైల్వేస్టేషన్ ఘటనతో క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు లోనయ్యారని.. వారికి ఆస్పత్రి మానసిక నిపుణులు కౌన్సెలింగ్ చేస్తున్నారని వైద్యులు తెలిపారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న వీరు ఆత్మహత్యకు యత్నించే అవకాశాలూ ఉన్నాయని.. అందుకే కౌన్సెలింగ్ ఇచ్చి, వారి ప్రవర్తనలో మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నామని సంబంధిత వైద్యాధికారి వెల్లడించారు. (చదవండి👉🏻 ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి) -
AP: భద్రతా వలయంలో రైల్వేస్టేషన్లు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/తాటిచెట్టపాలెం(విశాఖ ఉత్తర)/కొత్తవలస రూరల్/ఆముదాలవలస: ‘అగ్నిపథ్’ ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతా బలగాలు శనివారం పెద్దఎత్తున మోహరించాయి. రైల్వేస్టేషన్లతో పాటు పరిసర ప్రాంతాలను, రైలు పట్టాలను ఆక్టోపస్, ఆర్ఫీఎఫ్, జీఆర్పీ, సివిల్ పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. విశాఖపట్నంలో శుక్రవారం అర్ధరాత్రి నుంచే రైల్వేస్టేషన్కు చేరుకునే మార్గాలను మూసివేశారు. శనివారం మధ్యాహ్నం వరకు రైల్వేస్టేషన్లోకి ఎవ్వరినీ అనుమతించలేదు. మధ్యాహ్నం నుంచి మాత్రం పలు రైళ్లు రాకపోకలు సాగించేందుకు రైల్వే వర్గాలు అనుమతించాయి. చదవండి: ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి దీంతో హౌరా–యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, తిరుమల ఎక్స్ప్రెస్, గోదావరి తదితర రైళ్లు విశాఖ నుంచి బయల్దేరాయి. చెన్నై మెయిల్, హౌరా మెయిల్, బొకారో, వాస్కోడగామా, టాటా–యశ్వంత్పూర్, గుంటూరు–రాయగడ, తిరుచ్చి–హౌరా తదితర రైళ్లు మాత్రం విశాఖకు రాకుండా దువ్వాడ మీదుగా రాకపోకలు సాగించాయి. అంతకుముందు విజయవాడ మీదుగా విశాఖ రావాల్సిన పలు రైళ్లను అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో నిలిపివేశారు. గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడికి యత్నించిన ఆర్మీ అభ్యర్థులను పోలీస్స్టేషన్కు తరలిస్తున్న దృశ్యం అలాగే హౌరా వైపు నుంచి విశాఖ రావాల్సిన మరికొన్ని రైళ్లను పెందుర్తి, కొత్తవలస స్టేషన్లలో నిలిపివేశారు. మరోవైపు 19వ తేదీన షాలిమార్లో బయల్దేరాల్సిన షాలిమార్–హైదరాబాద్(18045), గుంటూరు–విశాఖ(17239) సింహాద్రి ఎక్స్ప్రెస్, రాయగడ–విశాఖ(18527) ఎక్స్ప్రెస్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్లో పలు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేసేందుకు ప్రయతి్నంచగా.. డీఎస్పీ వాసుదేవరావు ఆధ్వర్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలను అడ్డుకున్న పోలీసులు ‘గుంటూరు రైల్వేస్టేషన్ ముట్టడి’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. గుంటూరులోని నెహ్రూనగర్ రైలు పట్టాల మీదుగా 20 మంది ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులు నడుచుకుంటూ రావడాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే గుంటూరు రైల్వేస్టేషన్కు వచ్చిన ఇద్దరు యువకులను తనిఖీ చేయగా.. వారి వద్ద ఉన్న ఫోన్లో ‘జస్టిస్ టూ ఆర్మీ’ అనే వాట్సాప్ గ్రూప్లో ఆందోళనలకు సంబంధించిన సమాచారం చేరవేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కడప, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వారిద్దరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గుంటూరులోని వివిధ ప్రాంతాల్లో మరో 40 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ఆగిన ఊపిరి.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల సమయానికి వైద్యమందక ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి మరణించారు. ఒడిశాలోని కలహండి జిల్లా నౌహుపాడకు చెందిన జోగేష్ బెహరా(70)కు గుండె సంబంధిత సమస్యలున్నాయి. విశాఖలో వైద్యం చేయించుకునేందుకు కోర్బా–విశాఖ ఎక్స్ప్రెస్లో బయల్దేరాడు. మరికొన్ని నిమిషాల్లో విశాఖ చేరుకుంటాడనగా.. అగ్నిపథ్ ఆందోళనల వల్ల రైలును శనివారం ఉదయం 10.45 గంటలకు విజయనగరం జిల్లా కొత్తవలసలో నిలిపివేశారు. ఆ తర్వాత కొంతసేపటికి జోగేష్ అస్వస్థతకు గురవ్వడంతో.. ఆయన్ని వెంటనే కొత్తవలస ఎస్ఐ హేమంత్ తన వాహనంలోనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
Agnipath Scheme: అనుమానాలు, వివరణలు
అగ్నిపథ్ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం... ► 17.5 నుంచి 21 ఏళ్ల వారిని సైన్యంలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత 75% మందిని వెనక్కు పంపుతారు. పెన్షనూ ఉండదు. అప్పుడు భవిష్యత్ అగమ్యగోచరం కాదా? అగ్నివీరుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రిటైరయేప్పుడు సేవానిధి ప్యాకేజీ కింద ఆదాయ పన్ను మినహాయింపుతో రూ.11.71 లక్షలిస్తారు. దానికి తోడు వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. పన్నెండో తరగతితో సమానమైన సర్టిఫికెట్ ఇస్తారు. సైన్యంలో అనుభవంతో తేలిగ్గా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. పైగా రక్షణ శాఖ నియామకాలతో పాటు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్ నియామకాల్లోనూ వారికి 10 శాతం కోటా ఉంటుంది. పలు రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లోనూ ప్రాధాన్యముంటుంది. ► కేవలం నాలుగేళ్ల సర్వీస్ కోసం ఎవరైనా ఎందుకు అంతగా కష్టపడతారు? అగ్నిపథ్ ఒక అవకాశాల నిధి. దేశంలో 14 లక్షల మంది సైనికులున్నారు. వీరిలో ఏటా 60 వేల మంది రిటైరవుతారు. అగ్నిపథ్లో భాగంగా ఖాళీల కంటే 75 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. అంటే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఆర్మీ శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. జీవితాన్ని నచ్చినట్టుగా మలచుకునే అవకాశముంటుంది. ► నాలుగేళ్లకే ఉద్యోగం కోల్పోతే యువత అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదముంది. ఒక్కసారి యూనిఫాం ధరిస్తే అలా ఎప్పటికీ మారరు. నియమబద్ధమైన జీవితం గడుపుతారు. ► రిటైర్డ్ సైనికాధికారులు తదితరులతో సంప్రదింపులు జరపకుండా హడావుడిగా అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చారు. వారితో రెండేళ్లు విస్తృతంగా సంప్రదింపులు జరిపాకే తీసుకువచ్చాం. దీనితో ఎన్నో లాభాలంటూ మాజీ అధికారులు స్వాగతించారు. ► బలగాల సామర్థ్యాన్ని పథకం దెబ్బ తీస్తుంది. స్వల్పకాలిక సర్వీసు కోసం సైన్యంలో నియామకాలు చేపడుతున్న దేశాలెన్నో ఉన్నాయి. భారత్ కూడా అలాగే ముందుకెళ్లాలి. ప్రతి 100 మందిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పర్మనెంట్ అవుతారు. వారు దేశ రక్షణకు కోటగోడలా మారతారు. ► 21 ఏళ్ల వయసులో మానసిక పరిపక్వత ఉండదు. నమ్మకంగా పని చేయలేరు. ఎన్నో దేశాలు యువ రక్తాన్నే సైన్యంలోకి తీసుకుంటున్నాయి. ఉడుకు రక్తం ఉన్నప్పుడే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదు గనుక ఈ ఏడాదికి వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాం. యువత, అనుభవజ్ఞులు సగం సగం ఉండేలా చూస్తాం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Agnipath scheme: అగ్నివీరులకు మరో ఆఫర్
న్యూఢిల్లీ: నిరసనలను చల్లార్చేందుకు అగ్నిపథ్ పథకానికి కేంద్రం మార్పుచేర్పులు చేసింది. నాలుగేళ్ల సర్వీసు అనంతరం బయటికొచ్చే అగ్నివీరుల్లో అర్హులకు రక్షణ శాఖ ఖాళీల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ శనివారం ఆమోదముద్ర వేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్, డిఫెన్స్ సివీలియన్ పోస్టులతో పాటు రక్షణ శాఖ పరిధిలోని 16 ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అలాగే సెంట్రల్ ఆర్మ్డ్ పారా మిలటరీ ఫోర్స్ (సీఏపీఎఫ్), అసోం రైఫిల్స్లో కూడా అగ్నివీర్లకు 10 శాతం కోటా కల్పించే ప్రతిపాదనకు కేంద్ర హోం శాఖ కూడా ఆమోదముద్ర వేసింది. అంతేగాక వారికి గరిష్ట వయోపరిమితిని మూడేళ్లు పెంచింది. అగ్నిపథ్ నియామకాలకు ఈ ఏడాది గరిష్ట వయో పరిమితిని ఇప్పటికే రెండేళ్లు పెంచడం తెలిసిందే. ఆ లెక్కన తొలి బ్యాచ్ అగ్నివీర్లకు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్లో నియామకాలకు ఐదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుందంటూ హోం శాఖ ట్వీట్ చేసింది. వారికి మరిన్ని ఉపాధి కల్పన అవకాశాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్లతో కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే చర్చలు జరిపింది. పెట్రోలియం శాఖలోనూ అవకాశాలు అగ్నివీరులను సర్వీసు అనంతరం హౌసింగ్, పెట్రోలియం శాఖల్లో తీసుకుంటామని ఆ శాఖల మంత్రి హరదీప్సింగ్ పురీ చెప్పారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇప్పటికే అగ్నివీరులకు పలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ప్రకటించాయి. పోలీసు, సంబంధిత సర్వీసుల్లో వారికి ప్రాధాన్యమిస్తామని యూపీ, మధ్యప్రదేశ్, అసోం పేర్కొన్నాయి. అద్భుత పథకం: కేంద్రం మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి హామీ ఎక్కడుంది: రాజ్నాథ్ అగ్నిపథ్ను కేంద్రం గట్టిగా సమర్థించింది. మాజీ సైనికాధికారులు తదితరులతో రెండేళ్ల పాటు విస్తృతంగా సంప్రదింపులు జరిపిన అనంతరమే ఏకాభిప్రాయంతో పథకానికి రూపకల్పన చేసినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. పథకంపై దేశవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో త్రివిధ దళాధిపతులతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. ‘‘సైనిక నియామక ప్రక్రియలో అగ్నిపథ్ విప్లవాత్మక మార్పులు తెస్తుంది. రాజకీయ అవసరాల కోసం కొందరు దీనిపై అపోహలు వ్యాప్తి చేస్తున్నారు. దాంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. నాలుగేళ్ల తర్వాత బయటికొచ్చాక ఉపాధి హామీ లేదనడం సరికాదు. లక్షలు పెట్టి మెడిసిన్, ఇంజనీరింగ్ చదువుతున్న యువతకు కూడా ఉపాధి హామీ లేదు కదా!’’ అన్నారు. వారికి సైనికోద్యోగాలు రావు హింసాత్మక నిరసనలకు పాల్పడే వారికి సైనికోద్యోగాలకు దారులు శాశ్వతంగా మూసుకుపోతాయని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి అన్నారు. కేసుల్లో ఇరుక్కుంటే పోలీస్ క్లియరెన్సులు రావన్నారు. -
Agnipath Scheme: ఆరని అగ్గి
న్యూఢిల్లీ: సైన్యంలో నియామకాల కోసం తెచ్చిన అగ్నిపథ్ పథకంపై దేశమంతటా నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, హరియాణా, రాజస్తాన్, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్, కేరళ, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శనివారం సైతం ఆందోళనలు కొనసాగాయి. పలుచోట్ల హింసాకాండ చోటుచేసుకుంది. కొన్ని రాష్ట్రాల్లో యువత రోడ్లు, రైలు పట్టాలపై బైఠాయించారు. పుషప్లు చేస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 369 రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు నరకం చూశారు. బిహార్లో రైల్వేస్టేషన్కు నిప్పు బిహార్లో యువకులు బంద్కు పిలుపునిచ్చారు. తారేగానా రైల్వే స్టేషన్కు నిప్పుపెట్టారు. రైల్వే పోలీసుల వాహనాన్ని ధ్వంసం చేశారు. దానాపూర్లో అంబులెన్స్పై దాడికి దిగారు. అందులోని ముగ్గురిని తీవ్రంగా కొట్టారు. రాళ్లు విసరడంతో భద్రతా సిబ్బంది గాయపడ్డారు. జెహానాబాద్ జిల్లాలో ఔట్పోస్టుపై దాడిలో పోలీసులు గాయపడ్డారు. రాష్ట్రంలో ఇంటర్నెట్ నిలిపివేత కొనసాగుతోంది. బంద్కు ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిచ్చాయి. కర్ణాటకలోని ధార్వాడలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జి చేశారు. బెంగాల్లో రైలు పట్టాల దిగ్బంధం పశ్చిమ బెంగాల్లో శనివారం కూడా నిరసనకారులు పట్టాలపై బైఠాయించడంతో ఉత్తర 24 పరగణాల జిల్లాలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్నిపథ్ వద్దంటూ యువకులు పట్టాలపైనే పుషప్స్ చేశారు. తమ భవిష్యత్తుతో ఆటలాడొద్దంటూ నినదించారు. ఆర్మీలో చేరేందుకు కొన్నేళ్లుగా సన్నద్ధమవుతున్న తమకు అన్యాయం చేయొద్దన్నారు. వారిని పోలీసులు చెదరగొట్టారు. కేరళలో భారీ నిరసన ర్యాలీలు కేరళలో నిరసనలు హోరెత్తాయి. ఫిజికల్, మెడికల్ ఫిట్నెస్ పూర్తి చేసుకొని ఫలితాల కోసం చూస్తున్న యువకులు తిరువనంతపురం, కోజికోడ్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. అగ్నిపథ్తో తమ అవకాశాలు దెబ్బతింటాయన్నారు. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే పుషప్స్ చేశారు. పథనంథిట్టలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు రాళ్లు విసరడంతో పోలీసులు గాయపడ్డారు. యూపీలో 400 మందిపై కేసులు యూపీలో మీరట్, జాన్పూర్, కన్నౌజ్లో యువకులు నిరసన కొనసాగించారు. బస్సులు తగలబెట్టారు. యమునా ఎక్స్ప్రెస్వేపై బైఠాయించారు. బలియా, అలీగఢ్, గౌతమ్బుద్ధ నగర్, వారణాసి తదితర 17 ప్రాంతాల్లో నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 400 మందిపై కేసులు పెట్టినట్టు పోలీసులు ప్రకటించారు. అరెస్టు చేసిన 109 మందిని కోర్టులో హాజరు పరిచి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. లూథియానా రైల్వేస్టేషన్లో బీభత్సం హరియాణాలోని మహేందర్గఢ్లో ఆందోళనకారులు ఓ వాహనాన్ని తగలబెట్టారు. సోనిపట్, కైతాల్, ఫతేబాద్, జింద్లో భారీ నిరసనలకు దిగారు. రోహ్తక్–పానిపట్ హైవేను దిగ్బంధించారు. పంజాబ్లోని లూథియానా రైల్వే స్టేషన్లో నిరసనకారులు బీభత్సం సృష్టించారు. కిటికీల అద్దాలను, టికెట్ కౌంటర్లను ధ్వంసం చేశారు. రాజస్తాన్లోని జైపూర్, జోద్పూర్లోనూ వందలాదిగా రోడ్లపైకి వచ్చారు. అల్వార్లో జైపూర్–ఢిల్లీ హైవేను దిగ్బంధించారు. ఓ బస్సును ధ్వంసం చేశారు. చిదావాలో పట్టాలపై బైఠాయించిన వారిని పోలీసులు చెదరగొట్టారు. -
ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ విధ్వంసానికి సంబంధించి ఒకసారి కేసు నమోదైతే, ఇక ఉపసంహరణ ప్రక్రియ ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తీవ్రమైన రైల్వే యాక్ట్లోని సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో నేరం నిరూపణ అయితే గరిష్టంగా మరణశిక్ష విధించే ఆస్కారమూ ఉంది. సికింద్రాబాద్ ఘటనలో కొందరే విధ్వంసానికి పాల్పడినప్పటికీ ఆ సమయంలో అక్కడున్న అందరూ నిందితులుగా మారే అవకాశాలు ఉన్నాయి. ఐపీసీ, రైల్వే యాక్ట్, ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం(పీడీపీపీఏ)లోని సెక్షన్లలో నమోదైన ఈ కేసు కారణంగా నిందితులకు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు రావు. హత్యాయత్నం, విధ్వంసం, దాడులుసహా మూడు చట్టాల్లోని 15 సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం తదితరాల్లోనూ విధ్వంసాలు చోటు చేసుకున్నాయి. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ, ప్రభుత్వం మారిన తర్వాత ఏపీలోనూ ఆ కేసులను ఉపసంహరించారు. దీన్నే విత్డ్రాల్ ఆఫ్ ప్రాసిక్యూషన్గా పిలుస్తారు. అయితే రైల్వే యాక్ట్ కింద నమోదైన కేసుల్లో ఈ వెసులుబాటు ఉండదు. వీటి విచారణ సైతం ప్రత్యేక రైల్వే కోర్టులో జరుగుతుంది. ఈ కారణంగానే ఇదివరకు రైల్రోకో చేసిన రాజకీయ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇంకా ఆ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా కోర్టులో కేసు వీగినా ఇదే పరిస్థితి ఉంటుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. మరోపక్క మల్టీ నేషనల్ కంపెనీల సహా అనేక ప్రైవేట్ సంస్థలు సైతం ఇటీవల ఉద్యోగం ఇచ్చే ముందు పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ కచ్చితంగా అడుగుతున్నాయి. ఈ కేసు నేపథ్యంలో నిందితులుగా ఉన్న ఆందోళనకారులకు పోలీసు విభాగం క్లియరెన్స్ సర్టిఫకెట్లు జారీ చేయదని, పాస్పోర్టులు జారీ కావని, కొన్ని దేశాలకు ప్రత్యేక వీసాలు కూడా పొందడం కష్టసాధ్యమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాలకు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాంటి సందర్భంలోనూ ఈ కేసు అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఈ కేసులోని సెక్షన్లు, ఆరోపణలు, నిరూపణ అయితే గరిష్ట శిక్షలు ఇలా ► ఐపీసీలోని 143: చట్ట విరుద్ధంగా ఓ ప్రాంతంలో గుమిగూడటం, ఆరు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 147: అల్లర్లు చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 324: మారణాయుధాలతో గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 307: హత్యాయత్నం, పదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 435: అగ్ని లేదా పేలుడు పదార్థం విని యోగించి విధ్వంసం సృష్టించడం, ఏ డేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 427: రూ.50 అంతకంటే ఎక్కువ విలువైన వస్తువును ధ్వంసం చేయడం, రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 448: అనుమతి లేకుండా ఓ ప్రాంతంలోకి ప్రవేశించడం, ఏడాది జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 336: ఎదుటి వారికి ముప్పు వాటిల్లే అవకాశం ఉన్న పని చేయడం, మూడు నెలల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 332: విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకుని గాయపరచడం, మూడేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 341: నిర్భంధించడం, నెల రోజుల జైలు లేదా జరిమానా లేదా రెండూ ► 149: గుంపుగా ఆందోళన చేసినప్పుడు అందులోని ప్రతి ఒక్కరూ నేరానికి బాధ్యులే ఇండియన్ రైల్వే యాక్ట్ ►సెక్షన్ 150: తాము చేస్తున్న పని వల్ల ఎదుటి వారి ప్రాణాలకు హాని ఉందని తెలిసీ చేయడం, మరణ శిక్ష లేదా జీవిత ఖైదు ►151: రైల్వే ఆస్తులకు నష్టం కలిగించడం, ఐదేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండూ ►152: రైళ్లపై రాళ్లు విసరడం, కర్రలతో దాడి చేయడం, పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకు పీడీపీపీ యాక్ట్: ► సెక్షన్ 3: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం, 6 నెలల నుంచి ఐదేళ్ల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ -
ప్రైవేటు అకాడమీల ‘డేంజర్ గేమ్’! కీలక అంశాలు వెలుగులోకి
సాక్షి, హైదరాబాద్: మధ్యలో ఉన్న రిక్రూట్మెంట్ ప్రక్రియ ఆగిపోయిందనే ఆవేదన.. ‘అగ్నిపథ్’తో ఉద్యోగ అవకాశం పోతుందేమోనన్న ఆందోళన.. నిరాశా నిస్పృహల్లో ఉన్న ఆర్మీ అభ్యర్థులను ప్రైవేటు డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు రెచ్చగొట్టారు. గట్టిగా నిరసన తెలిపితే ప్రభుత్వం దిగొస్తుందంటూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులతో ఉసి గొల్పారు. ఆ మాటలు నమ్మిన ఆర్మీ అభ్యర్థులు ఆవేశంతో ఆందోళనకు దిగారు. కానీ ఎవరూ పట్టిం చుకోవడం లేదన్న భావనతో వారిలో కొందరు విధ్వంసం మొదలుపెట్టారు. మరికొందరూ వారిని అనుసరించారు. చివరికి బోగీలకు నిప్పుపెట్టడం, రైళ్లను ధ్వంసం చేయడం వంటి చర్యలకూ దిగారు.. శుక్రవారం నాటి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనపై పోలీసుల దర్యాప్తులో ఇలాంటి కీలక అంశాలెన్నో బయటపడుతున్నాయి. ఏపీలోని నరసరావుపేటలో సాయి డిఫెన్స్ అకాడమీని నడుపుతున్న ఆవుల సుబ్బారావు ఈ వ్యవహారంలో సూత్రధారి అని పోలీసులు గుర్తించారు. ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి రైల్వే, హైదరాబాద్ సిటీ పోలీసులు.. మొత్తంగా 150 మందికిపైగా అదుపులోకి తీసుకున్నా, రైల్వేస్టేషన్లో ఎవరెవరు విధ్వంసం సృష్టించారో నిర్ధారించి అరెస్టులు చేస్తున్నారు. అందులో శనివారం 52 మందిని అరెస్టు చేసి.. కోర్టులో హాజరుపర్చారు. వైద్య పరీక్షల కోసం నిందితులను గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తున్న పోలీసులు ఫీజుల కోసం ప్రైవేట్ అకాడమీలు కుట్రతో, పక్కా పథకం ప్రకారం జరిగిన రైల్వేస్టేషన్ విధ్వంసం వెనుక.. సాయి డిఫెన్స్ అకాడమీ సహా తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల పాత్ర ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వీటిలో కొన్ని అభ్యర్థులు ఎంపికయ్యా ఫీజుల చెల్లించేలా ఒప్పందాలు చేసుకున్నాయి. ఎంపిక పరీక్షల్లో ఒక్కోదశ దాటే కొద్దీ అభ్యర్థులు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లిస్తుంటారు. ఈ నెల 14న రాజ్నాథ్సింగ్ ‘అగ్నిపథ్’ ప్రకటన చేయడంతో రిక్రూట్మెంట్లు నిలిచిపోతాయని.. తమకు రావాల్సిన ఫీజులు, భవిష్యత్తులో చేరే అభ్యర్థుల సంఖ్యపై ప్రభావం ఉంటుందని అకాడమీలు భావించాయి. ఈ క్రమంలో నిర్వాహకులు అప్పటికే తమవద్ద శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులతో సృష్టించిన వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో వీడియోలు పోస్టు చేశారు. ఈ నెల 17న నిరసన తెలపడానికి సికింద్రాబాద్ రైల్వే జంక్షన్కు రావాలని సందేశాలు పెట్టారు. ఇలా పాత గ్రూపులు, కొత్తగా క్రియేట్ చేసిన వాటితో కలిపి మొత్తం 12 గ్రూపుల్లో ఈ సమాచారం సర్క్యులేట్ అయింది. సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావుతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన తొమ్మిది ప్రైవేట్ డిఫెన్స్ అకాడమీల నిర్వాహకులు, ఏపీకి చెందిన అభ్యర్థులు గురువారం రాత్రి హైదరాబాద్కు చేరుకున్నారు. కొందరు లాడ్జిల్లో, మరికొందరు హైదరాబాద్లోని డిఫెన్స్ అకాడమీల్లో బస చేశారు. వారికి ప్రైవేటు అకాడమీల నిర్వాహకులే భోజనం, ఇతర వసతులు ఏర్పాటు చేశారు. 17న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు రావాలంటూ వాట్సాప్ మెసేజ్ వచ్చిన తర్వాతే పెట్రోల్ తెచ్చి.. శుక్రవారం ఉదయం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఆర్మీ అభ్యర్థులు కృష్ణ, గోదావరి, గౌతమి, ఇతర రైళ్లలో హైదరాబాద్కు చేరుకున్నారు. వారు తమ ప్రతి కదలికనూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసుకున్నారు. ఈ క్రమంలో హకీంపేట ఆర్మీ సోల్జర్స్ సహా నాలుగు గ్రూపులను గుర్తించిన పోలీసులు.. వాటిలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు. వాటిలో ఉన్న వాయిస్ మెసేజీల ప్రకారం.. ఆర్మీ అభ్యర్థులు తొలుత సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలపాలని మాత్రమే భావించారు. కానీ ఈ నిరసన ఆశించిన స్థాయిలో అందరి దృష్టీ ఆకర్షించలేదని, బలగాలు వచ్చి తమను తరిమేసే లోపు అందరి దృష్టి ఆకర్షించేలా విధ్వంసానికి దిగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిరసన మొదలయ్యాకే వెళ్లి పెట్రోల్ తెచ్చి.. బోగీలకు నిప్పంటించారని పోలీసులు భావిస్తున్నారు. అంతేకాదు స్టేషన్లోకి పోలీసు బలగాలు ప్రవేశించడంతో.. బయట రేతిఫైల్ బస్టాప్ వద్ద బస్సులకూ నిప్పుపెట్టాలని అభ్యర్థులు ప్రయత్నించినట్టు గుర్తించారు. ► హకీంపేట్ వాట్సాప్ గ్రూప్లోని వాయిస్ మెసేజీలలో.. ‘‘ఎంతసేపు ఒర్రుతార్రా ఒర్రోర్రి నోర్లు నోస్తయ్. అందుకే గమ్మునపోయి పెట్రోల్ తీసుకువచ్చి తగలబెట్టేసినం అనుకో.. బయటికి పోతాది న్యూస్. అంతేగని ఎంతసేపు ఒర్రినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా ఏమీ అవ్వదు. రెండు గంటలు, ఒక గంటల స్క్వాడ్ వస్తది. అందరినీ వెల్లగొడ్తది. అందుకే పోయి పెట్రోల్ తీసుకొస్తే రెండు నిమిషాల్లో తగలబెట్టొచ్చు’ అంటూ ఒక వాయిస్ మెసేజీ.. ► ‘‘అరే పెట్రోల్ పంప్కు పోతున్నా పెట్రోల్ తీస్కరానీకి, ఎవరైనా వస్తే పెట్రోల్ తీస్కరానికి రండి’’ అంటూ మరో వాయిస్ మెసేజీ ఉన్నాయి. ► ఇక మరో వాట్సాప్ గ్రూపులో.. ‘‘బెటాలియన్ ఆగయా.. సబ్ లోగ్ రేతిఫైలి కనే ఆజావ్.. బస్ జలాదేంగే..’’ అంటూ ఇంకో వాయిస్ మెసేజీని పోలీసులు గుర్తించారు. ఈ మూడు సందేశాలను పోస్టు చేసినది ఒకే వ్యక్తి కావడంతో.. అతడే విధ్వంసానికి సూత్రధారి అని అనుమానిస్తున్నారు. అడ్మిన్ల ఫోన్ నంబర్లు.. టవర్ లొకేషన్లతో.. రైల్వేస్టేషన్ విధ్వంసం కేసులో పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీలు, వాట్సాప్ గ్రూపులు, సాంకేతిక ఆధారాల ద్వారా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 12 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసినట్టు నిందితుల ద్వారా తెలుసుకున్న అధికారులు.. అందులో నాలుగింటిని గుర్తించారు. వీటిలో అడ్మిన్లు, సభ్యుల ఫోన్ నంబర్లు సేకరించి.. వారి సెల్ టవర్ లోకేషన్లను పరిశీలిస్తున్నారు. తద్వారా విధ్వంసం సమయంలో రైల్వేస్టేషన్లో ఉన్నవారిని గుర్తిస్తున్నారు. కేసు తీవ్రమైనది కావడంతో అనుమానితులను పూర్తిగా పరిశీలించి, ప్రశ్నించాకే అరెస్టు చేస్తున్నారు. పోలీసులు శుక్రవారం రైల్వే స్టేషన్ వద్ద సుమారు 150 మందిని అదుపులోకి తీసుకుని వివిధ ఠాణాలకు తరలించారు. పరిశీలన అనంతరం 52 మందిని నిందితులుగా గుర్తించి శనివారం అరెస్టు చేశారు. వారికి గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి, మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమని భావిస్తున్న మరో ఏడుగురిని ప్రశ్నిస్తుండగా.. మిగతా వారిని విడిచిపెట్టారు. మొత్తంగా ఈ కేసులో నిందితులుగా 200 మందిని గుర్తించారు. వారి కోసం సికింద్రాబాద్ జీఆర్పీతోపాటు హైదరాబాద్ టాస్క్ఫోర్స్, నార్త్జోన్ పోలీసులకు చెందిన ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దర్యాప్తును హైదరాబాద్ అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్రావు, డీసీపీ చక్రవర్తి గుమ్మి పర్యవేక్షిస్తున్నారు. పట్టుకున్నాక తెలిసింది పోలీసని.. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విధ్వంసం మొదలయ్యాక మీడియాకు ఓ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆర్మీ అభ్యర్థులు విధ్వంసానికి దిగారని, రావాలని ఆ ఫోన్ చేసిన వ్యక్తి కోరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కూడా అభ్యర్థేనని, కీలక వ్యక్తి కావడంతోనే మీడియాను పిలిచి ఉంటాడని భావించారు. ఆ నంబర్కు ఫోన్ చేస్తే అప్రమత్తమై తప్పించుకోవచ్చని భావించి.. సాంకేతిక ఆధారాలు, ముమ్మర గాలింపుతో ఆయనను గుర్తించి పట్టుకున్నారు. కానీ ఆయన జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ అని తెలిసింది. రైల్వేస్టేషన్లో ఆందోళనకు దిగిన అభ్యర్థులను వెళ్లిపోవాలని కోరగా.. మీడియా వస్తే తప్ప వెళ్లబోమని భీష్మించారని, దాంతో మీడియా వస్తే త్వరగా నిరసన ముగుస్తుందనే ఫోన్ చేశానని ఆయన వివరించారు. దీంతో ఆయన్ను అధికారులు విడిచిపెట్టారు. కీలక నిందితుడు.. ఏపీ పోలీసుల అదుపులో.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఘటనలో అభ్యర్థులను ప్రేరేపించిన నిందితుడు, సాయి డిఫెన్స్ అకాడమీ నిర్వాహకుడు ఆవుల సుబ్బారావును ఏపీ పోలీసులు శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆవుల సుబ్బారావు పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని రావిపాడు పంచాయతీ పరిధిలో డిఫెన్స్ అకాడమీని నడుపుతున్నారు. గురువారం అర్ధరాత్రి సికింద్రాబాద్ వెళ్లిన సుబ్బారావు శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో నరసరావుపేటకు చేరుకున్నట్టు పోలీసులు గుర్తించారు. అక్కడి పాతూరులోని సాయి రెసిడెన్సీ లాడ్జిలో శుక్రవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు చెందిన డిఫెన్స్ అకాడమీ కార్యాలయంలో తనిఖీలు చేసి.. రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట పోలీసుల అదుపులో ఉన్న సుబ్బారావును ఆదివారం తెలంగాణ పోలీసులకు అప్పగించే అవకాశమున్నట్టు తెలిసింది. అయితే సుబ్బారావు గుంటూరు, విశాఖపట్నంలలోనూ ఆర్మీ అభ్యర్థుల నిరసనలకు ప్రేరేపిస్తూ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెట్టినట్టు గుర్తించారు. దీనితో అక్కడే కేసులు నమోదు చేసి, అరెస్టు చేయవచ్చే వాదన వినిపిస్తోంది. సుబ్బారావు అప్పగింతపై శనివారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. -
సైన్యాన్ని ప్రైవేటీకరించేందుకే అగ్నిపథ్
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: భారత సైన్యాన్ని ప్రైవేటీకరించే దిశగానే మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ ప్రవేశపెడుతోందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా భీంగల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. జై జవాన్, జై కిసాన్ బదులు నై జవాన్, నై కిసాన్ చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే సైన్యంలో సర్వీసు నాలుగేళ్లే అంటున్నారన్నారు. దేశంలో ప్రభుత్వరంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్న మోదీ ప్రభుత్వం ఇప్పటికే ఎల్ఐసీ, విశాఖ ఉక్కును అమ్మేసిందని మండిపడ్డారు. అగ్నిపథ్ రద్దు చేయాలంటూ యువత చేసిన ఆందోళన వెనుక టీఆర్ఎస్ ఉందని బీజేపీ నాయకులు చెబుతున్నారని, అలా అయితే ఉత్తరప్రదేశ్, బిహార్లో ఎవరు ఆందోళన చేయించారని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతిఆయోగ్ సిఫారసులను కూడా వినడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీకి అధికారం ఇస్తే ఉచిత విద్యుత్ రద్దు చేసి వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతుందని హరీశ్ తెలిపారు. సభలో రోడ్లు, భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పాల్గొన్నారు. -
‘అగ్ని’లో నిగ్గుతేలిన నిజాలు
‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’... ఇది ‘సిరి వెన్నెల’ రాసిన గేయంలో ఒక పంక్తి. అగ్గి తోటి కడిగితే అది పునీతమవుతుందని మన విశ్వాసం. నిఖార్సయిన నిజాన్ని గురించి చెప్పడానికి నిప్పును ఉపమానంగా తెచ్చుకోవడం మన అలవాటు. అగ్నిపరీక్షలో పాసైతే పవిత్రత అనే సర్టిఫికెట్ ఆటో మేటిక్గా లభిస్తుంది. ఇది మన సాంస్కృతిక భావజాలంలో ఊడలు దిగిన విశ్వాసం. సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ కూడా సమాజ వాస్తవికతలపై ఒక అగ్నిపరీక్షగా పనిచేసింది. ఈ విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన దావానలం యథార్థాల ముసుగుల్ని దహించి, నగ్నంగా నిలబెట్టింది. ఈ దేశంలోని లక్షలాదిమంది యువకులు సైన్యంలో చేరడానికి చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారనేది ఒక వాస్తవం. ఎదురు చూపులు ఉపాధి కోసమా? దేశభక్తి ప్రపూరితమా అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరుద్యోగం పెనుభూతమై పీడిస్తున్న దేశంలో ఉపాధి ఆరాటమే తొలి కారణం కావచ్చు. దానికి దేశభక్తి కూడా జతకూడి ఉండవచ్చు. కారణమేదైనా సుమారు లక్షా డెబ్బయ్ ఐదు వేలమంది యువకులు ఏడాది కిందనే ఫిజికల్ టెస్టులూ, మెడికల్ టెస్టులూ గట్టెక్కి ఉన్నారు. నెలల తరబడి శిక్షణ తీసుకుని గురిపెట్టి విడిచిన బాణాల్లా పరుగులు తీసి పరీక్షలు పాసయ్యారు. ఇంకొక్క పరీక్ష. రాత పరీక్ష. అది పూర్తయితే ఇక సైన్యంలో చేరడమే! ఆలివ్ గ్రీన్ యూనిఫామ్లో తమను తాము ఎన్నిసార్లు ఊహించుకున్నారో! కరాన మర తుపాకీ... శిరాన ఉక్కుటోపీతో సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్టు ఎన్ని కలలు కన్నారో! దూరంగా, సొంత ఊరిలో ఉన్న తల్లి దండ్రులకు నెలనెలా జీతం డబ్బులు పంపి అండగా నిలబడ బోతున్నామని ఎంత సంబరపడ్డారో! జస్ట్... ఒక్క పరీక్ష!! అధికారులు చెబుతున్నట్టు కరోనా కారణంగానే అది వాయిదా పడుతూ వస్తున్నదని సర్దిచెప్పుకున్నారు. నేడో రేపో ఆ పరీక్ష పూర్తవబోతున్నదని ఎదురుచూస్తున్నారు. సైనిక బలగాల నియామకానికి పాత పద్ధతిని రద్దుచేస్తూ సరికొత్తగా ‘అగ్నిపథ్’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు్ట ప్రకటన వెలువడగానే హతాశులయ్యారు. ఎదురుచూస్తున్న కొలువు ఎగిరిపోయింది. నోటి దగ్గర ముద్ద నేల రాలింది. ‘కొత్తగా వచ్చే కొలువులు నాలుగేళ్లు మాత్రమే’ అని చెప్పడంతో వారి కలలన్నీ కరిగి పోయాయి. ఒక్కసారిగా లక్షా డెబ్బైఐదు వేల గుండెలు పగిలిన శబ్దానికి త్రీగోర్జెస్ డ్యామ్ బద్దలైనంత విధ్వంసం దేశమంతటా ప్రవహించింది. ఈ విధ్వంసంలో కొన్ని ప్రతిపక్షాల పాత్ర ఉన్న దని కేంద్రం ఆరోపిస్తున్నది. ప్రజల్లో అసంతృప్తి ఉన్న ప్పుడు ప్రతిపక్షం ఆజ్యం పోయడం సహజమే! ప్రభుత్వం చెబుతున్నట్టు సైనిక బలాల నియామకాల హేతుబద్ధీకరణ చాలాకాలంగా పెండింగ్లో ఉన్న అంశమే. ఇందుకు పైకి చెబుతున్న కారణాలు ఎన్ని వున్నా ప్రధానమైన అంతర్గత కారణం పెన్షన్ భారం. రక్షణ రంగంలో ఇప్పటికే 32 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. రక్షణ శాఖ మొత్తం వార్షిక బడ్జెట్లో పెన్షన్ల వాటా 26 శాతానికి చేరుకున్నది. ఏటా యాభై వేలమంది పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ శాతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. అమెరికా రక్షణ బడ్జెట్లో పెన్షన్ల వాటా 10 శాతమే. యూ.కే.లో అది 14 శాతం. సైనిక బలగాలకోసం ఖర్చుచేసే పెన్షన్ను భారంగా భావించే దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికైన వారికి జీవితాంతం ఇచ్చే పెన్షన్ను ఎలా సమర్ధించగలుగు తారు? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకే ప్రభుత్వం ఇతర కారణాలను చెబుతున్నది. ‘అగ్నిపథ్’ కింద నియమించేవారిలో నాలుగో వంతు మందిని 15 ఏళ్ల సర్వీస్ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయంఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది. ఈ పద్ధతి ప్రపంచంలోని చాలా దేశాల్లో అమల్లో ఉన్నదని ఉదాహరణలిస్తున్నది. ఏదైనా ఒక రంగంలో సమూల మార్పు లకు సిద్ధపడినప్పుడు అందుకు సంబంధిత ప్రజానీకాన్ని ముందుగానే సిద్ధం చేయడం అవసరమని ఈ వివాదం మరో సారి చాటి చెప్పింది. వ్యవసాయ చట్టాల సందర్భంలోనూ, ఇప్పుడు రక్షణ శాఖ నియామకాల హేతుబద్ధీకరణలోనూ ప్రభుత్వం తొందరపాటుగానే వ్యవహరించింది. ఈ పథకంలోని గుణదోషాల అంశాన్ని పక్కనపెట్టి పరిశీ లిస్తే... మన విద్యావ్యవస్థలోని లోపాలనూ, నిరుద్యోగ సమస్య తీవ్రతనూ ఈ సందర్భం ఎత్తిచూపింది. విద్యావ్యవస్థలోని నాణ్యతా ప్రమాణాల క్షీణత, నైపుణ్య లేమి యువతరానికి శాపంగా పరిణమిస్తున్న వైనానికి అద్దం పట్టింది. దేశంలో ఏటా 24 లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తు న్నారు. వారిలో 10 లక్షల మందికే క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో చదువుకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగిలిన వారిలో సగం మంది అతికష్టం మీద చదువుతో సంబంధం లేని దిగువశ్రేణి ఉద్యో గాల్లో సర్దుకోగలుగుతున్నారు. సుమారు ఆరేడు లక్షలమంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ప్రతియేటా రోడ్డు మీద మిగిలి పోతున్నారు. నాన్–ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యు యేషన్ పూర్తిచేసిన వారిలో ఇంగ్లిష్ నైపుణ్యం, సాఫ్ట్ స్కిల్స్ ఉన్న కొంతమంది మాత్రమే మెరుగైన ఉద్యోగాలు పొందగలుగుతున్నారు. మిగిలిన వారంతా తమ సోదర ఇంజనీరింగ్ సేన లతో కలిసి ఒక రిజర్వు నిరుద్యోగ ఫోర్స్గా ఉండిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేస్తున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉపాధి వీరికి లభిస్తున్నది. లేదంటే అన్యాయమైన పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. నైపుణ్యాల క్షీణతతోపాటు విద్యారంగాన్ని వేధిస్తున్న మరో సమస్య... డ్రాపవుట్లు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సౌకర్యాల లేమి, ఆర్థిక పరిస్థితుల వలన ప్రైవేట్ చదువు కొనలేని పరిస్థితి. ప్రోత్సాహం లేకపోవడం ఈ డ్రాపవుట్లకు కారణంగా కని పిస్తున్నది. ఫలితంగా ఉన్నత విద్యాప్రస్థానంలో టెన్త్, ఇంటర్ మజిలీల దగ్గరే చాలామంది మిగిలిపోతున్నారు. వీళ్లంతా నిరుద్యోగ రిజర్వు ఫోర్సే! దినసరి కూలీపై దొరికే లేబర్ పనులే వీరికి దిక్కు. వీళ్ల క్వాలిఫికేషన్కు తగిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వచ్చినప్పుడు మెరుగైన జీతం, జీవితం కోసం పోటీపడుతున్నారు. సైనికోద్యోగాలు కూడా అందులో ఒక భాగం. ఆర్థిక వృద్ధి నమోదవుతున్న ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ నిరుద్యోగ పెద్దన్నల మాదిరిగానే టెన్త్, ఇంటర్ నిరుద్యోగ సేన కూడా ఏదో ఒక పనిలో కుదురుకుంటున్నది. ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్న ప్రాంతాల్లో ఉపాధి లభించక నిస్పృహతో నిరుద్యోగ సేన రోడ్డెక్కుతున్నది. ఈ దేశాన్ని రానున్న కాలంలో నవజీవన బృందావనంగా తీర్చిదిద్దగల యువతరం రూపొందడానికి 4 కీలక అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ‘అగ్నిపథ్’ సందర్భం గుర్తు చేసింది. 1. ఆర్థిక వ్యవస్థను వృద్ధి గమనంలో నిలపడం, 2. రిజర్వు నిరుద్యోగసేనల సమస్య పరిష్కారం, 3. విద్యా రంగంలో ప్రమాణాలు, నైపుణ్యాల పెంపుదల, 4. డ్రాపవుట్లు లేకుండా చేయడం. ఈ అంశాల ప్రాధాన్యాన్ని తొలిదశలోనే గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రచించిన ఒకే ఒక్క రాజకీయ నేత ఏపీ సీఎం జగన్. ఇది వైఎస్సార్సీపీ చెప్పుకుం టున్న ఘనత కాదు. ఏపీ ప్రభుత్వం చాటింపు చేసుకుంటున్న విషయం కూడా కాదు. స్వతంత్ర ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు ఘంటాపథంగా చెబుతున్న అక్షర సత్యాలు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎమ్ ఐఈ) నివేదిక ప్రకారం జాతీయ నిరుద్యోగితా రేటు 7.8 శాతం. ఆంధ్రప్రదేశ్లో అది 4.4. శాతం మాత్రమే! ఎల్లో మీడియా నిత్యం బ్యాండు మేళం మోగిస్తూ స్వర్ణయుగంగా కీర్తించే చంద్ర బాబు హయాం చివరిరోజు నాటికి నిరుద్యోగితా రేటు 5.2 శాతం. ఆ తర్వాత కోవిడ్ కారణంగా దేశమంతటా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెండేళ్లపాటు వరసగా కోవిడ్ మహమ్మారి పీడించింది. ఈ పరిస్థితుల్లో నిరుద్యోగితా రేటు పెరగడం సహజం. అలా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కూడా! కానీ ఏపీలో తగ్గింది. దీని వెనుక ఏ మాయా, మంత్రం లేవు. అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదు. చిత్తశుద్ధి, దూరదృష్టి, తపన మాత్రమే ఉన్నాయి. ఎక్కువమంది ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ, చిన్న పరిశ్రమల (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగాలను గుర్తించి వాటిని డైనమిక్గా నిలబెట్టడానికి పడిన శ్రమ ఉన్నది. చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం ఏపీలో 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 20 శాతం మందిని కోవిడ్ కాలం లోనే ఈ రంగం ఇముడ్చుకోగలిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎమ్ఎస్ఎమ్ఈలను గతిశీలకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాలు అర్థం చేసుకోవడానికి! 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్డీపీ 18.47 శాతం వృద్ధి (ప్రస్తుత ధరల ప్రకారం)ని నమోదు చేసింది. ఇందులో భాగంగా వ్యవసాయ రంగం కూడా 14.50 శాతం వృద్ధిని సాధించింది. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్బీకే సెంటర్ల వలన, రైతు భరోసా వలన, సకాలంలో ఇస్తున్న ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా ఫలితంగా, ఉత్పత్తుల ధరలు తగ్గకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్ వ్యూహాన్ని అమలు చేస్తున్నం దువలన ఈ విజయం సాధ్యమైంది. జగన్ ప్రభుత్వం రిజర్వ్ నిరుద్యోగ సేనల సమస్యను పరిష్కరించిన తీరు నభూతో నభవిష్యతి. పరిపాలనా వికేంద్రీకరణలో విప్లవాత్మక కార్యక్రమా నికి శ్రీకారం చుడుతూ, అందులో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించగలిగింది. లక్షా 34 వేలమందికి ఒకేసారి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పించింది. వలంటీర్ వ్యవస్థ ద్వారా మరో 2 లక్షల 60 వేల మంది గౌరవభృతితో సేవా పథంలోకి అడుగు పెట్టగలిగారు. విద్యారంగ సమూలక్షాళనకు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి – ఉన్నత ప్రమాణాల కోసం భారీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చింది. గేమ్ ఛేంజర్గా ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఆధునిక బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది. ఎడ్టెక్ కంపెనీ ‘బైజూస్’తో ఒప్పందం చేసుకొని లెర్నింగ్ యాప్ ద్వారా శిక్షణ అందించే ఏర్పాట్లు చేసింది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించింది. రెండు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలతో పాటు 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే విద్యార్థి తరాలు ప్రపంచస్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఏ స్థాయిలోనూ డ్రాపవుట్లు ఉండకుండా అందరూ ఉచి తంగా, నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన... ఇలా పలు పథకాలతో విద్యా రంగంలో డ్రాపవుట్ లేకుండా చూసే ప్రయత్నాన్ని చేస్తున్నది. ఇవన్నీ అక్షరాలా అమలు జరుగుతున్న కార్యక్రమాలు. కానీ చంద్రబాబూ, మీడియా మొఘల్ శ్రీమాన్ రామోజీరావు నేతృ త్వంలో వాలతుల్యులు, తోకమాత్రులతో కూడిన యెల్లో మీడియా ఈ కార్యక్రమాలను రివర్స్ గేర్లో చూపెడుతున్నారు. ఇది రివర్స్ పాలన నమ్మండని చెబుతున్నారు. మన విద్యార్థు లను పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది ఈ ముఠా. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట, ఇంగ్లిష్ మీడి యంలో చదివిస్తే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవు తారని రోడ్డు పక్కనున్న పల్లె జనానికి చంద్రబాబు సుద్దులు చెప్పబోయారు. వారు జై జగన్ అని బదులు చెప్పేసరికి పలాయనం చిత్తగించారు. ఇంగ్లిష్ మీడియానికి వ్యతిరేకంగా తెలుగు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి యెల్లో మీడియా శాయ శక్తులా ప్రయత్నించి తల్లిదండ్రుల వ్యతిరేకతతో తోక ముడి చింది. ఇప్పుడు బైజూస్ మీద విషపు దాడి ప్రారంభించారు. ఏటా 24 వేల ఖర్చు చేయాల్సిన ఈ బోధన ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా లభించనుంది. విద్యాబోధనను ఆధునికం చేసే అదనపు ఉపకరణం. సమగ్ర అవగాహనకు దోహదపడే ఆయుధం. పేదల చేతికి ఆయుధం దొరకకూడదు. వారు సాధి కారత సాధించకూడదు. ఇదీ చంద్రబాబు, యెల్లో మీడియా జాయింట్గా అమలు చేస్తున్న కార్యక్రమం. చంద్రబాబు లాంటి విజనరీ ప్రపంచాన లేడని పాత డప్పునే ఇప్పుడు మళ్లీ∙వాయిస్తున్నారు. ఈ ప్రచారం హోరులో నిజంగా తాను విజనరీ అనే భ్రమలోకి బాబు జారిపోయి చాలా కాలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో నిన్న విజయనగరంలో మాట్లాడారు. ‘‘నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’’ అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలు సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడినా జనం అనుమానిస్తారు. ‘ఎవరికైనా చూపెట్టండర్రా’ అని సలహా ఇస్తారు. ఇలా మాట్లాడటం ఆయనకు కొత్త కాదు. ఒకసారి తాను తుపాన్లను అడ్డుకున్నానని చెప్పారు. విజయవాడలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గించాలని ఆదేశించారు. రెయిన్ గన్స్తో ఒక ట్యాంకర్ నీళ్లను చిలకరించి కరువును జయించానని ప్రకటించారు. ఎవరు అడి గినా అడక్కపోయినా మధ్యమధ్య ‘నేను మెంటల్లీ ఫిట్’ అని ప్రకటిస్తుంటారు. ఆయన మాటలన్నీ గొప్ప విజన్తో కూడిన వని యెల్లో మీడియా ఊదరగొడుతున్నది. ఆయనొస్తే అభివృద్ధి పరుగులు పెట్టుకుంటూ వస్తుం దని దండోరా వేస్తున్నది. జగన్ హయాంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై మసిపూసే ప్రయత్నం చేస్తున్నది. నిజాలపై ముసుగు కప్పుతున్నది. కానీ నిజం నిప్పు లాంటిది. నిప్పునూ దాచలేరు! నిజాన్నీ దాచలేరు! వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com