
కర్ణాటక: తగ్గింపు ధరలకు చీరలు కొనే సమయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం జరిగింది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం 8వ మెయిన్ రోడ్డులోని ఒక షాపులో జరిగింది. మైసూరు పట్టు చీరలను 35 శాతం తగ్గింపు ధరలతో అమ్ముతున్నట్లు బోర్డు పెట్టారు.
ఆదివారం సెలవు కావటంతో పెద్దసంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. ఒకే చీరను ఇద్దరు మహిళలు ఎంచుకున్నారు, చీరను వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలై జడలు పట్టుకొని కొట్టున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఇతర మహిళలు ఇద్దరినీ విడిపించారు.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023
Comments
Please login to add a commentAdd a comment