discount
-
ఐఫోన్ 15 రేటు ఇంత తగ్గిందా.. ఇప్పుడెవరైనా కొనేయొచ్చు!
మార్కెట్లో ఐఫోన్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే వీటి ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కొందరు డిస్కౌంట్స్ (Discounts) లేదా ఆఫర్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేద్దామని ఎదురుచూస్తారు. అలాంటి వారికి ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు ఐఫోన్ 15 కొనుగోలుపై మంచి డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.యాపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15) రూ.79,900 వద్ద మార్కెట్లో లాంచ్ అయింది. కానీ ప్రస్తుతం ఎలాంటి ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ లేకుండానే.. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో రూ.59,999లకు అందుబాటులో ఉంది. అంటే ఒక్కసారిగా ఐఫోన్ 15 ధర 19,091 రూపాయలు తగ్గింది.ఐసీఐసీఐ (ICICI) క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి కొనుగోలు చేస్తే.. 5 శాతం క్యాష్బ్యాక్ పొందవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ కింద రూ. 45,200 తగ్గింపు లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ అనేది.. మీరు ఎక్స్ఛేంజ్ చేసుకునే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే.. ఐఫోన్ 15 కొనుగోలుపై భారీ తగ్గింపు లభిస్తుందని స్పష్టమవుతోంది.ఇదీ చదవండి: అదే జరిగితే.. బంగారం రేటు మరింత పైకి!ఐఫోన్ 15 వివరాలుఐఫోన్ 15 ప్రీమియం మెటీరియల్తో తయారైంది. ఇది సిరామిక్ షీల్డ్ ఫ్రంట్ డిజైన్, అల్యూమినియం ఫ్రేమ్ను కలిగి ఉంది. అంతే కాకుండా.. వాటర్ అండ్ డస్ట్ నిరోధకత కోసం IP68 రేటింగ్ కూడా పొందింది. 6.1 ఇంచెస్ సూపర్ రెటినా XDR OLED డిస్ప్లే కలిగిన ఈ ఫోన్.. యాపిల్ ఏ16 బయోనిక్ చిప్ పొందుతుంది. డ్యూయెల్ స్పీకర్లు కలిగిన ఈ ఫోన్ USB టైప్ సీ ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. -
లేటెస్ట్ గూగుల్ ఫోన్పై రూ.26 వేల డిస్కౌంట్!
మీ పాత స్మార్ట్ఫోన్ను (smartphone) మార్చేసి ఖరీదైన కొత్త ప్రీమియం స్మార్ట్ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే లేటెస్ట్ గూగుల్ పిక్సెల్ 8 (Google Pixel 8)ని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం కావచ్చు. ఈ ఫోన్పై ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ (Flipkart)లో భారీ డీల్ అందుబాటులో ఉంది. ఐదు వేలు.. 10 వేలు కాదు.. ఏకంగా రూ. 26,000 తగ్గింపు లభిస్తోంది. ఇంత భారీ డిస్కౌంట్ ప్రీమియం ఫోన్లపై తరచుగా లభించదు. కాబట్టి పిక్సెల్ ఫోన్ కొనాలనుకుంటే ఇది సువర్ణావకాశం.34 శాతం తగ్గింపు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్పై 34 శాతం తగ్గింపు లభిస్తోంది. తగ్గింపు తర్వాత గూగుల్ పిక్సెల్ 8 (Hazel, 128 GB) (8 GB RAM) ధర రూ.49,999 అయింది. వాస్తవంగా ఈ స్మార్ట్ఫోన్ రూ. 75,999 వద్ద లిస్ట్ అయింది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్తో రూ. 28200 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ (HDFC) క్రెడిట్ కార్డ్పై రూ.3000 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఐదు శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంటుంది. నెలకు రూ.8,334 నో-కాస్ట్ ఈఎంఐ (EMI) ఆఫర్ కూడా ఉంది.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు6.2-అంగుళాల OLED డిస్ప్లేగూగుల్ టెన్సర్ G3 ప్రాసెసర్128GB, 256GB స్టోరేజ్ ఆప్షన్లు27W వైర్డు, 18W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో 4575mAh బ్యాటరీఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్అద్భుతమైన కెమెరాగూగుల్ పిక్సెల్ 8 ఫోన్లో అద్భుతమైన కెమెరా ఫీచర్లు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. సెల్ఫీల కోసం 10.5 MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ఇందులో ఏఐ సాంకేతికతను పొందుపరిచారు. కెమెరాలోని 'మ్యాజిక్ ఎరేజర్' ఫీచర్తో ఫోటో నుండి అనవసరమైన వాటిని తొలగించవచ్చు. 'రియల్ టోన్' ఫీచర్ విభిన్న స్కిన్ టోన్లను ఖచ్చితమైన రీతిలో చూపుతుంది. 'నైట్ సైట్' ఫీచర్ తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన ఫొటోలను తీస్తుంది. -
ఆఫర్లే.. ఆఫర్లు!..ఐదు రోజులు మాత్రమే
రిపబ్లిక్ డే దగ్గర పడుతున్న సందర్బంగా.. ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు ఆఫర్స్ అందించడం మొదలుపెట్టేశాయి. ఈ తరుణంలో స్మార్ట్ బజార్ (SMART Bazaar) 'ఫుల్ పైసా వసూల్ సేల్' ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ సేల్ 2025 జనవరి 22 నుంచి 26 వరకు మాత్రమే ఉంటుంది.స్మార్ట్ బజార్ ప్రారంభించనున్న ఈ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా భారీ డిస్కౌంట్స్ లభించనున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 900 కంటే ఎక్కువ స్టోర్లలో కస్టమర్లు ఈ డిస్కౌంట్స్ పొందవచ్చు. కేవలం 799 రూపాయలకే 5 కేజీల బియ్యం 3 లీటర్ల నూనె, కూల్ డ్రింక్స్ మూడు కొంటే.. ఒకటి ఫ్రీ, బిస్కెట్లు రెండు కొంటే.. ఒకటి ఫ్రీ, డిటర్జెంట్లపై 33 శాతం తగ్గింపు వాణి వాటితో పాటు చాక్లెట్లు, గృహాలంకరణ, దుస్తులపై కూడా మంచి డిస్కౌంట్స్ లభిస్తాయి.నిల్వ చేసుకోగలిగిన నిత్యావసర వస్తువులు, కిరాణా వస్తువులను కొనుగోలు చేయడానికి ఇది ఓ మంచి అవకాశం. స్మార్ట్ బజార్ ఫుల్ పైసా వసూల్ సేల్ ద్వారా కస్టమర్లు కొంత మొత్తంలో ఆదా చేసుకోవచ్చు. కంపెనీ దీనికి సంబంధించిన ఓ చిన్న వీడియోను తన ఎక్స్ (Twitter) ఖాతాలో షేర్ చేసింది.Delhi, Goa, Kashmir, Kerala. Secure karo apne travel plans best luggage ke saath. Visit SMART Bazaar Full Paisa Vasool Sale. Live from 22nd to 26th January. #SMARTBazaar #FullPaisaVasoolSale #MehengaiKaMeter#Sale pic.twitter.com/a2ygGiuqhE— SMART Bazaar (@SMARTBazaarIn) January 20, 2025 -
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) రిపబ్లిక్ డేకి ముందే.. మాన్యుమెంటల్ సేల్ను నిర్వహిస్తోంది. సేల్ సమయంలో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు & ఇతర అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాకుండా.. భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16 కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ వివరంగా చూసేద్దాం.ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16)ఐఫోన్ 16 125జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అయితే ఫ్లిప్కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో ఇది రూ. 69,999లకే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 16పై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోందని స్పష్టమవుతోంది. డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్స్ & ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి పొందవచ్చు.ఇతర ఆఫర్స్ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే.. 10 శాతం లేదా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.అంతే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 42150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 16 డీటెయిల్స్ఐఫోన్ 16 కొత్త కెమెరా లేఅవుట్, కొత్త జెన్ చిప్సెట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది . ఆపిల్ కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి లేదా ఏఐ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్ను కూడా పరిచయం చేసింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8జీబీ ర్యామ్ కలిగిన ఏ18 చిప్ కూడా పొందుతుంది.ఆపిల్ విజన్ ప్రో కోసం.. స్మార్ట్ఫోన్ నిలువుగా ఉన్న కెమెరా మాడ్యూల్స్ పొందుతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. కాబట్టి ఇది మంది ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని స్పష్టమవుతోంది.భారీగా పెరిగిన ఐఫోన్ ఎగుమతులుదేశంలో తయారవుతున్న ఐఫోన్ ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్ఆపిల్ తయారీ కేంద్రాలుభారతదేశంలో ఆపిల్ ప్రధాన తయారీదారులుగా ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. -
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్ని తీసుకొచ్చింది. ఈ డీల్ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్కార్ట్లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్లోనే వస్తుంది. -
విద్యార్థులకు ఎయిరిండియా టికెట్ ధరలో ఆఫర్
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా దేశంలోని ఇతర ప్రాంతాలతోపాటు, విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఉన్నత చదువుల కోసం దేశంలో ఇతర ప్రాంతాలతోపాటు, ఇతర దేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులకు విమాన ధరలో 10 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. అదనంగా 10 కిలోల వరకు బ్యాగేజ్ను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది.అర్హతలు ఇవే..దేశీయ ప్రయాణాలు చేయాలనుకునే విద్యార్థుల వయసు 12 ఏళ్ల వరకు ఉండాలి. అదే అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు 12-30 ఏళ్ల వయసు వరకు ఉండొచ్చు. అడ్మిషన్ పొందిన కాలేజీ లేదా యూనివర్సిటీ ప్రభుత్వ గుర్తింపు పొందిందై ఉండాలి. విద్యార్థులు కనీసం ఒక విద్యాసంవత్సరం ఫుల్ టైమ్ కోర్సులో చేరి ఉండాలి.ఇదీ చదవండి: యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సెబీ కొరడాఎక్కడ బుక్ చేసుకోవాలి..?ఈ ఆఫర్ వినియోగించుకోవాలనుకునే విద్యార్థులు ఎయిరిండియా అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్, కస్టమర్ కాంటాక్ట్ సెంటర్, ఎయిర్పోర్ట్ టికెటింగ్ కార్యాలయాల ద్వారా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఎయిరిండియా బ్యాంకు పార్టనర్లు జారీ చేసిన క్రెడిట్/ డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తే అందనంగా ప్రయోజనాలు పొందవచ్చని కంపెనీ తెలిపింది. అధికారిక వెబ్సైట్ నుంచి బుక్ చేసుకునే విద్యార్థులకు కన్వినియెన్స్ ఛార్జీల రూపంలో ఎలాంటి అదనపు ఫీజు వసూలు చేయబోమని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. దానివల్ల దేశీయ విమానాల్లో ప్రయాణించే విద్యార్థులు రూ.399, అంతర్జాతీయ విమానాల్లో వెళ్లేవారు రూ.999 వరకు అదనంగా ఆదా చేసుకోవచ్చని స్పష్టం చేశారు. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.45000 డిస్కౌంట్
2024 ముగుస్తోంది. ఈ తరుణంలో చాలా వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తులపైన డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఇందులో టూ వీలర్ బ్రాండ్ 'కవాసకి' కూడా ఉంది. ఈ కంపెనీ ఇప్పుడు నింజా 500కొనుగోలుపైన రూ.15,000, నింజా 650 బైక్ కొనుగోలుపై రూ.45,000 తగ్గింపు ప్రకటించింది. ఈ డిస్కౌంట్ డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.కవాసకి నింజా 650 బైకులో 649 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 8000 rpm వద్ద 67 Bhp పవర్, 6700 rpm వద్ద 64 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ లైట్స్, టీఎఫ్టీ డిస్ప్లే, ట్రాక్షన్ కంట్రోల్, ఏబీఎస్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్స్ ఉన్నాయి.నింజా 650 బైక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనోషాక్ వంటివి పొందుతుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇది 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్, 220 మిమీ రియర్ సింగిల్ డిస్క్ సెటప్ పొందుతుంది. ఈ బైక్ ముందు భాగంలో 120/70, వెనుక 160/60 టైర్లు ఉన్నాయి. ఇవి 17 ఇంచెస్ వీల్స్ పొందుతాయి. కాబట్టి ఇది రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.ఇదీ చదవండి: బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్లు.. చవక మాత్రమే కాదు! -
పెట్రోల్, డీజిల్పై రూ.5 తగ్గింపు!
వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్పై రూ.5 వరకు తగ్గిస్తున్నట్లు ప్రైవేటురంగ ఇంధన రిటెయిలింగ్ సంస్థ నయారా ఎనర్జీ ప్రకటించింది. అయితే అందుకు కనీసం రూ.1000 వరకు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవాల్సి ఉంటుంది. పండగ సీజన్లో నయారా ఎనర్జీ ‘సబ్ కీ జీత్ గ్యారంటీడ్ 2024’ పేరుతో ఈ ఆఫర్ను ప్రారంభించింది.ఈ ఆఫర్ జనవరి 31, 2025 వరకు కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. ఈ తగ్గింపును పొందాలంటే కస్టమర్లు డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంధన కొనుగోళ్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆఫర్తో పెట్రోల్, డీజిల్పై వినియోగదారులకు డబ్బు ఆదా అవ్వడంతోపాటు డిజిటల్ చెల్లింపులను కూడా ప్రోత్సహించేందుకు దోహదపడుతుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ మాధుర్ తనేజా వెల్లడించారు.ఇదీ చదవండి: దిగుమతులపై ఆందోళన అక్కర్లేదునయారా ఎనర్జీ రష్యాకు చెందిన రాస్నెఫ్ట్, కెసని ఎంటర్ప్రైజెస్ యాజమాన్యంలో నడుస్తోంది. ఇది ఒక ప్రైవేట్ ఆయిల్ రిఫైనింగ్ అండ్ మార్కెటింగ్ కంపెనీ. నయారా ఎనర్జీ గుజరాత్లోని వడినార్లో రెండో అతిపెద్ద సింగిల్ సైట్ రిఫైనరీని నిర్వహిస్తోంది. ఇది దేశంలో 6,600 రిటైల్ ఫ్యూయల్ అవుట్లెట్లను కలిగి ఉంది. హైదరాబాద్లోనూ చాలాచోట్ల ఈ కంపెనీ బంక్లున్నాయి. -
జపనీస్ బైక్ కొనుగోలుపై రూ.1.14 లక్షల డిస్కౌంట్
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ విఫణిలోని తన నింజా 'జెడ్ఎక్స్ 10ఆర్' బైక్ ధరను రూ. 1.14 లక్షలు తగ్గించింది. దీంతో ఈ బైక్ ధర 17.34 లక్షలకు చేరింది.కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ 2025 ఎడిషన్ ప్రారంభ ధర సెప్టెంబర్లో రూ. 17.13 లక్షలు. మార్కెట్లో అడుగుపెట్టిన తరువాత.. ఈ బైక్ ధర కొద్దిసేపటికే రూ.18.50 లక్షలకు చేరింది. అయితే ప్రస్తుతం ఇయర్ ఎండ్ సమయంలో మంచి అమ్మకాలను పొందాలనే ఉద్దేశ్యంతో కంపెనీ ఈ భారీ డిస్కౌంట్స్ ప్రకటించినట్లు తెలుస్తోంది.నింజా జెడ్ఎక్స్-10ఆర్ బైక్ 998 సీసీ ఇన్లైన్ ఫోర్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 13200 rpm వద్ద 203 hp పవర్, 11400 rpm వద్ద 114.9 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్.. బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్ వంటివి పొందుతుంది.ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశంబ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన TFT కన్సోల్, మల్టిపుల్ రైడింగ్ మోడ్లు, క్రూయిజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అనేక లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన కవాసకి నింజా జెడ్ఎక్స్-10ఆర్.. ఇప్పుడు రూ. 1.14 లక్షల తగ్గుదలతో లభిస్తోంది. -
ఎన్నికల వేళ.. తగ్గింపు ధరల జోరు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేడు (నవంబర్ 13) మొదటి దశ ఓటింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కోడెర్మా జిల్లాలోని వివిధ సంస్థలు పలు వస్తువులపై విరివిగా ఆఫర్లు ప్రకటించాయి. ఫర్నిచర్ నుండి దుస్తుల వరకూ, అలాగే రెస్టారెంట్లలోని వంటకాలను రుచి చూసేందుకు తగ్గింపు ధరలను ప్రకటించారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపించిన ఈ తగ్గింపు ధరల ఆఫర్ను సొంతం చోసుకోవచ్చు. స్థానిక పిజ్జా సిటీ రెస్టారెంట్ ఆపరేటర్ ఆదిత్య కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం ఓటుకున్న ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నదని చెప్పారు. కోడెర్మా జిల్లాలోని పలు వ్యాపార సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించి, మరింత మందిని ఓటు వేసేలా చైతన్యపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయన్నారు. ఓటు వేసిన తర్వాత ఓటర్లు తమ వేలిపై సిరా గుర్తును చూపితే, తన రెస్టారెంట్లో భారతీయ, చైనీస్, సౌత్ ఇండియన్ సహా అన్ని రకాల రుచికరమైన వంటకాలపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు ఇస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ‘నేటి పిల్లలే రేపటి సూపర్ మోడల్స్’.. 200 మంది పేరెంట్స్కు రూ. 5 కోట్ల టోకరా -
దీపావళి షాపింగ్ చేస్తున్నారా?: డబ్బు ఆదా కోసం ఐదు టిప్స్..
దీపావళి వచ్చేస్తోంది.. ఇప్పటికే చాలామంది షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు పెట్టడం. ఇలా డబ్బు ఖర్చుపెట్టే క్రమంలో కొంత ఆదా చేసే మార్గాల కోసం అన్వేషిస్తారు. దీనికోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.బడ్జెట్ ప్లాన్ వేసుకోవడంపండుగ వస్తోంది కదా అని కంటికి కనిపించిందల్లా.. కొనేస్తే పర్సు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి? దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. కిరాణా వస్తువులు, స్వీట్స్ వంటివన్నీ కూడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. పండుగ సీజన్లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్స్ వాడుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని అనవసర వస్తువులను కొనుగోలు చేయకూడదు.క్యాష్బ్యాక్ ఆఫర్స్ ఉపయోగించుకోవడందసరా, దీపావళి సమయంలో క్యాష్బ్యాక్ ఆఫర్స్ విరివిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ప్లాట్ఫామ్లలో క్యాష్బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే ఆన్లైన్ షాపింగ్లో క్యాష్బ్యాక్ లభించే అవకాశాలు ఎక్కువ. వీటిని ఉపయోగించుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.ధరలను సరిపోల్చడంఆన్లైన్ షాపింగ్ చేసే సమయంలో ఒక వస్తువు ధర ఏ ప్లాట్ఫామ్లో ఎంత ఉందో గమనించాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. ధరలను సరిపోల్చడానికి ప్రైస్ ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించడం ఉత్తమం.డిస్కౌంట్స్ తెలుసుకోవడంషాపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చాలా సైట్స్ డిస్కౌంట్స్ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డిస్కౌంట్స్ లభించే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా నష్టపోవడం ఖాయం.ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలుబ్యాంక్ ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవడంషాపింగ్ చేసే క్రమంలో బ్యాంకులు అందించే ఆఫర్స్ వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల మీద డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటివి ఈ పండుగల సమయంలో చాలానే లభిస్తాయి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే.. డబ్బు కొంత ఆదా అవుతుంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తే.. నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి. లేకుంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు. -
ప్యూర్ ఎలక్ట్రిక్ బైక్లపై రూ.20వేల డిస్కౌంట్
ముంబై: పండుగ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ టూ–వీలర్ల సంస్థ ప్యూర్ ఈవీ తమ రెండు మోడల్స్పై రూ. 20,000 డిస్కౌంటు ప్రకటించింది. ఎకోడ్రిఫ్ట్, ఈట్రైస్ట్ ఎక్స్ మోటర్సైకిల్స్పై ఇది వర్తిస్తుంది. దీనితో ప్రారంభ ధర రూ. 99,999కి తగ్గినట్లవుతుంది.నవంబర్ 10 వరకు ఈ ఆఫర్ ఉంటుందని సంస్థ వ్యవస్థాపకుడు డి. నిశాంత్ తెలిపారు. రోజువారీ వినియోగం కోసం ఎకోడ్రిఫ్ట్, శక్తివంతమైన రైడింగ్ అనుభూతి కోరుకునే వారి కోసం ఈట్రైస్ట్ ఎక్స్ (171 కి.మీ. రేంజి) అనువుగా ఉంటాయని వివరించారు. -
బుల్లి ఎస్యూవీలు.. భలే జోరు!
దేశంలో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్ (ఎస్యూవీల) క్రేజ్ ఓ రేంజ్లో ఉంది! ఒకపక్క, కార్ల అమ్మకాల్లో మందగమనం నెలకొన్నప్పటికీ.. మైక్రో ఎస్యూవీలు మాత్రం దుమ్మురేపుతున్నాయి. కస్టమర్లు చిన్న కార్లు/ హ్యాచ్బ్యాక్ల నుంచి అప్గ్రేడ్ అవుతుండటంలో వాటి సేల్స్ అంతకంతకూ తగ్గుముఖం పడుతున్నాయి. మరోపక్క, చిన్న ఎస్యూవీల సెగ్మెంట్ తగ్గేదేలే అంటూ టాప్ గేర్లో దూసుకుపోతోంది! – సాక్షి, బిజినెస్ డెస్క్గత కొంతకాలంగా దేశంలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు స్లో ట్రాక్లో వెళ్తున్నాయి. డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోతుండటంతో కంపెనీలు భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తూ వాటిని ఎలాగైనా వదిలించుకునేందుకు నానాతిప్పలు పడాల్సి వస్తోంది. అయితే, చిన్న ఎస్యూవీలు దీనికి మినహాయింపు. హాట్ కేకుల్లా సేల్ అవుతూ దేశీ మార్కెట్లో అవి భారీ వాటాను కొల్లగొడుతున్నాయి. రూ.10 లక్షల వరకు ధర ఉన్న మైక్రో ఎస్యూవీలకు డిమాండ్ ఓ రేంజ్లో ఉంది. ముఖ్యంగా హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ ఈ సెగ్మెంట్లో టాప్ లేపుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో (2024–25, ఏప్రిల్–జూలై) వీటి అమ్మకాలు 72 శాతం దూసుకెళ్లగా... మొత్తం దేశీయ ప్యాసింజర్ వాహన విక్రయాల్లో కేవలం 1.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు కావడం దీనికి నిదర్శనం. ఈ నాలుగు నెలల్లో 1,75,350 (11 శాతం వృద్ధి) చిన్న ఎస్యూవీలు అమ్ముడవడం విశేషం. మరోపక్క, చిన్నకార్లు/హ్యాచ్బ్యాక్స్ సేల్స్లో 17 శాతం (69,936 యూనిట్లు) తగ్గుదల నమోదైంది. చిన్న ఎస్యూవీల కేటగిరీలోకి ఎక్స్టర్, పంచ్తో పాటు కాంపాక్ట్ మోడల్స్ అయిన మారుతీ బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్ ఎంట్రీ వేరియంట్లు ఉంటాయి. క్యూ కడుతున్న కంపెనీలు... ఈ సెగ్మెంట్ శరవేగంగా దూసుకుపోతుండటంతో ఇతర కార్ల దిగ్గజాలు సైతం ఇందులోకి అడుగుపెట్టేందుకు తహతహలాడుతున్నాయి. కియా మోటార్స్ తన తొలి మైక్రో ఎస్యూవీ ‘క్లావియా’ను తీసుకొచ్చే ప్లాన్లో ఉండగా.. హ్యుందాయ్ మరో కాంపాక్ట్ ఎస్యూవీ ‘బేయాన్’తో మార్కెట్ షేర్ను మరింత పెంచుకోవాలనుకుంటోంది. మారుతీ సుజుకీ ఫ్రాంక్స్తో ఈ విభాగంలో పోటీ పడుతోంది. ఇక ఫోక్స్వ్యాగన్ గ్రూప్ కంపెనీ స్కోడా సైతం వచ్చే ఏడాది ఆరంభంలో తొలి కాంపాక్ట్ ఎస్యూవీ కైలాక్ను ప్రవేశపెట్టడం ద్వారా ఈ సెగ్మెంట్లోకి దూకనుంది. ప్రస్తుతం మైక్రో ఎస్యూవీల విభాగంలో పంచ్, ఎక్స్టర్ హవా కొనసాగుతుండటంతో మారుతీ కూడా ఈ విభాగంపై కన్నేసింది. కాంపాక్ట్ ఎస్యూవీ బ్రెజా కంటే తక్కువ ధరలో ప్రత్యేకంగా కొత్త మోడల్ను మారుతీ రూపొందిస్తోందని, రెండేళ్లలో రోడ్డెక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మారుతున్న ట్రెండ్... హ్యాచ్బ్యాక్స్, సెడాన్ కార్లతో పోలిస్తే మరింత విశాలమైన స్పేస్, దృఢమైన రూపంతో ఆకర్షణీయంగా ఉండటంతో దేశంలో ఎస్యూవీల క్రేజ్ కేకపుట్టిస్తోంది. దీనికితోడు ఎంట్రీ లెవెల్ మైక్రో ఎస్యూవీలు అందుబాటు ధరల్లో లభిస్తుండటం వల్ల గ్రామీణ కొనుగోలుదారులు కూడా వీటికే సై అంటున్నారని, దీంతో చిన్న ఎస్యూవీలకు డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. ‘ఈ ఏడాది అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న విభాగంగా మైక్రో ఎస్వీయూల సెగ్మెంట్ అవతరించింది. ధర విషయానికొస్తే ఎక్స్టర్ వంటి చిన్న ఎస్యూవీలు కొన్ని హ్యాచ్బ్యాక్లతో సమానమైన ధరకే లభిస్తున్నాయి. దీనికితోడు పరిశ్రమలో తొలిసారిగా సన్రూఫ్, డాష్క్యామ్, 6 ఎయిర్బ్యాగ్ల వంటి వినూత్న ఫీచర్లు చిన్న ఎస్యూవీల్లోనూ ఉండటం కూడా కస్టమర్లు వీటి వెంట పడటానికి మరో ప్రధాన కారణం. నచి్చన ఫీచర్లు, డిజైన్ ఉంటే రేటెక్కువైనా కొనేందుకు వెనుకాడటం లేదు’ అని హ్యుందాయ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ తరుణ్ గార్గ్ పేర్కొన్నారు. 2024 తొలి 8 నెలల్లో మైక్రో ఎస్యూవీల సేల్స్ 86% దూసుకెళ్లగా... మొత్తం ఎస్యూవీ విభాగం విక్రయాల వృద్ధి 19 శాతంగా ఉంది. -
ఈ కార్లపై భారీ తగ్గింపులు: రూ. లక్ష నుంచి రూ.12 లక్షలు
పండుగ సీజన్ మొదలైపోయింది. కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. కంపెనీలు కూడా తమ వాహనాల సేల్స్ పెంచుకోవడానికి ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ వంటివి ప్రకటిస్తాయి. ఈ కథనంలో రూ. 1 లక్ష కంటే ఎక్కువ తగ్గింపు ధర వద్ద లభించే కార్లు ఏవో తెలుసుకుందాం.కార్లు, వాటిపై లభించే తగ్గింపులు ● హోండా సిటీ: రూ. 1.14 లక్షలు ● టాటా నెక్సాన్: రూ. 1.25 లక్షలు ● మారుతి గ్రాండ్ వితారా: రూ. 1.28 లక్షలు ● కియా సెల్టోస్: రూ. 1.30 లక్షలు ● సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్: రూ. 1.50 లక్షలు ● టాటా సఫారీ: రూ. 1.65 లక్షలు ● ఎంజీ హెక్టర్: రూ. 2.0 లక్షలు ● మారుతి జిమ్నీ: రూ. 2.50 లక్షలు ● మహీంద్రా ఎక్స్యూవీ400: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ ఏ-క్లాస్ లిమోసిన్: రూ. 3 లక్షలు ● మెర్సిడెస్ సీ-క్లాస్: రూ. 3 లక్షలు ● టయోటా క్యామ్రీ: రూ. 3 లక్షలు ● ఫోక్స్వ్యాగన్ టైగన్: రూ. 3.07 లక్షలు ● జీప్ కంపాస్: రూ. 3.15 లక్షలు ● ఎంజీ గ్లోస్టర్: రూ. 6 లక్షలు ● టయోటా హైలక్స్: రూ. 10 లక్షలు ● కియా ఈవీ6: రూ. 10 లక్షలు ● జీప్ గ్రాండ్ చెరోకీ: రూ. 12 లక్షలుఇదీ చదవండి: ఉద్యోగులను తొలగించేందుకు ట్రైనింగ్: టెక్ సీఈఓ పోస్ట్ వైరల్కార్లపైన కంపెనీలు ఇస్తున్న ఆఫర్స్ లేదా డిస్కౌంట్స్ నగరాన్ని బట్టి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా ఈ తగ్గింపులు ఎంచుకునే మోడల్ మీద కూడా ఆధారపడి ఉంటాయి. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్లను పొందే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితమైన తగ్గింపులను గురించి తెలుసుకోవడానికి సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
వీటి కొనుగోలుపై 86 శాతం డిస్కౌంట్!.. పండగ చేసుకోండి..
దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు గొప్ప ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ 27 నుంచి (సెప్టెంబర్ 27) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తుల మీద ఏకంగా 86 శాతం డిస్కౌంట్స్ అందించనున్నట్లు సమాచారం.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ సేల్లో ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, కెమెరాలు, హెడ్ఫోన్లు, సౌండ్బార్లు మొదలైన వాటిపైన అద్భుతమైన డిస్కౌంట్స్ అందించనుంది. అయితే ఈ డిస్కౌంట్స్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. టాబ్లెట్ల మీద 55 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్, లెనోవా, యాపిల్ వంటి టాప్ బ్రాండ్ల మీద కూడా 55 శాతం డిస్కౌంట్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..అమెజాన్ హెడ్ఫోన్లు, ఇయర్బడ్ల మీద 86 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నట్లు సమాచారం. సోనీ, గోప్రో వంటి కెమెరాల మీద 53 శాతం డిస్కౌంట్స్.. స్పీకర్ల కొనుగోలుపైన 73 శాతం, యాపిల్, శాంసంగ్, నాయిస్, బోట్ వంటి స్మార్ట్వాచ్లపై అమెజాన్ 83 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కీబోర్డ్ మరియు మౌస్ కాంబోలపై కూడా 82 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.అమెజాన్ మాత్రమే కాదుఅమెజాన్ మాత్రమే కాకుండా ఫ్లిప్కార్ట్, మింత్రా వంటి కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. -
ఈ బైక్స్ కొనుగోలుపై గొప్ప బెనిఫీట్స్
కవాసకి తన నింజా లైనప్లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్ల రూపంలో లేదా డీలర్షిప్ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి. -
పేరుకుపోతున్న ప్యాసింజర్ కార్లు!
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దాంతో రిటైల్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా డీలర్ల వద్ద పోగైన వాహనాలు ఏకంగా 7 లక్షల యూనిట్లు. వీటి విలువ సుమారు రూ.73,000 కోట్లు ఉంటుందని అంచనా. పండగల సీజన్ రాబోతుండడంతో వీటిలో కొంతమేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినా క్షేత్రస్థాయిలో ఈ కార్లకు భారీగా డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది.ఫాడా తెలిపిన వివరాల ప్రకారం.. రిటైల్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) ప్యాసింజర్ కార్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్వెంటరీను అమ్మే సమయం అధికమైంది. జులై 2024 ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ క్లియరెన్స్ సమయం, ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగింది. దాంతో అమ్ముడవని వాహనాల సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యవహారం డీలర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్వెంటరీ నిర్వహణ భారంగా మారుతోంది. దాంతో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానమైన సుమారు 7 లక్షల యూనిట్ల వాహనాలు పోగయ్యాయి. ఇదిలాఉండగా, రానున్న పండగల సీజన్ల్లో విక్రయాలు పెరిగి కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పెరుగుతున్న వాహనాల ఇన్వెంటరీ నేపథ్యంలో మారుతీసుజుకీ కంపెనీ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీ అంచనాలకు తగిన అమ్మకాలు నమోదు కావడంలేదు. దాంతో ఇన్వెంటరీ నిర్వహణ భారమవుతుందని ఊహించి ఉత్పత్తిని తగ్గించింది. జులై 2024లో మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 9.65% క్షీణత నమోదైంది.రిటైల్ మార్కెట్లో కార్ల ధరలో రాయితీ ఇచ్చి ప్రముఖ కంపెనీలు వాటి ఇన్వెంటరీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా కార్ల ధర తగ్గిస్తున్నాయి. 2023 ఆగస్ట్తో పోలిస్తే ఈ సారి డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుందాయ్, టాటా మోటార్స్, స్కోడా, హోండా..వంటి ప్రముఖ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానం.. కీలకాంశాలు..నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి. -
కార్ల ధరపై భారీ డిస్కౌంట్లు
న్యూఢిల్లీ: కార్ల రిటైల్ మార్కెట్లో డిస్కౌంట్ల పండగ నడుస్తోంది. మునుపెన్నడూ లేనంతగా కార్లపై తగ్గింపు ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్తో పోలిస్తే డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. విక్రయాలు మందగించడంతో కంపెనీలు, డీలర్షిప్ కేంద్రాల వద్ద నిల్వలు పేరుకుపోయాయి. వీటిని క్లియర్ చేసుకోవడంలో భాగంగా కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్ల బాట పట్టారు. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుండై, టాటా మోటార్స్, స్కోడా, హోండా డిస్కౌంట్ల పోటీలో నిలిచాయి.నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్టర్పై రూ.40,000, ఆల్కజార్పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి.భారీగా కార్ల నిల్వలు..2019–20 తర్వాత అధిక డిస్కౌంట్లు ప్రస్తుతం ఉన్నాయని పరిశ్రమ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు. భారత్ స్టేజ్–6 ఉద్గార ప్రమాణాలు 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిల్వలను క్లియర్ చేసుకోవడానికి 2019–20లో మార్కెట్లో డిస్కౌంట్ల జోరు కొనసాగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కార్ల నిల్వలు సుమారు 3,00,000 యూనిట్ల స్థాయిలో నమోదయ్యాయి. 30 రోజుల డిమాండ్కు ఇవి సరిపోతాయి. అయితే అమ్మకాలు మందగించడంతో కొద్దిరోజుల్లోనే నిల్వలకు మరో 1,00,000 యూనిట్లు తోడయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో కార్ల తయారీ కంపెనీలు, డీలర్లు డిస్కౌంట్లకు తెరలేపారు. 2019–20 స్థాయిలో తగ్గింపులు ఉన్నాయని పరిశ్రమ చెబుతోంది. 2023–24లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు అత్యధిక స్థాయిలో 42.3 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. సెమికండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, డిమాండ్ కొనసాగడం ఈ జోరుకు కారణమైంది. మూడేళ్లు పరుగుపెట్టిన ప్యాసింజర్ వెహికిల్స్ పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు మందగించడం ప్రారంభమైంది. -
ఎంఎస్ఎంఈలకు యాక్సిస్ బ్యాంక్ ఆఫర్లు
ముంబై: ప్రస్తుత ఎంఎస్ఎంఈ కస్టమర్లకు సెక్యుర్డ్ వర్కింగ్ క్యాపిటల్ సాధనాలకు సంబంధించి ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంటును అందిస్తున్నట్లు ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. అలాగే, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజుతో ఈఎంఐ ఆధారిత అన్సెక్యూర్డ్ రుణాలు కూడా అందిస్తున్నట్లు వివరించింది. అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా తెలంగాణలో 350 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) కస్టమర్లను బ్యాంక్ సన్మానించింది. హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల్లోని బ్యాంకు శాఖల్లో ఈ మేరకు కార్యక్రమాలు నిర్వహించింది. -
ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లు
బెంగళూరు: ’ఓలా ఎలక్ట్రిక్ రష్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వాహనాల సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తమ ఎస్1 పోర్ట్ఫోలియోపై రూ. 15,000 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఇవి జూన్ 28 వరకు వర్తిస్తాయి. వీటి ప్రకారం ఎస్1 ఎక్స్+పై రూ. 5,000, ఎస్1 ప్రో.. ఎస్1 ఎయి ర్పై రూ. 2,500 ఫ్లాట్ డిస్కౌంటు లభిస్తుంది.ఎస్1 ఎక్స్+పై రూ. 5,000 వరకు ఎక్స్చేంజ్ బోనస్, మొత్తం ఎస్1 శ్రేణిపై నిర్దిష్ట క్రెడిట్ కార్డ్ ఈఎంఐలపై రూ. 5,000 వరకు క్యాష్బ్యాక్ సహా మొత్తం రూ. 10,000 వరకు అదనపు ప్రయోజనాలను కూడా కస్టమర్లు పొందవచ్చు. ఎస్1 పోర్ట్ఫోలియోలో ఆరు వేరియంట్లు ఉన్నాయి.మొత్తం ఉత్పత్తుల శ్రేణి బ్యాటరీలపై 8 ఏళ్లు/80,000 కి.మీ. మేర ఎక్స్టెండెడ్ వారంటీని కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. కావాలంటే పరిమితిని పెంచుకునేందుకు కస్టమర్లు రూ. 4,999–రూ. 12,999 వరకు చెల్లించి యాడ్–ఆన్ వారంటీని ఎంచుకోవచ్చు. -
విమానం ఎక్కేయండి.. రూ. 883 లకే!!
హైదరాబాద్: విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ తాజాగా స్ల్పాష్ సేల్ను ప్రకటించింది. దీని ప్రకారం తమ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఎక్స్ప్రెస్ లైట్ కింద బుక్ చేసుకుంటే ఛార్జీలు రూ. 883 నుంచి ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది.అలాగే ఇతర మాధ్యమాల ద్వారా ఎక్స్ప్రెస్ వేల్యూ కింద బుక్ చేసుకుంటే రూ. 1,096 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాల కోసం జూన్ 28 వరకు చేసుకునే బుకింగ్స్కి ఇవి వర్తిస్తాయని సంస్థ వివరించింది. దీనితో పాటు airindiaexpress.com లో బుక్ చేసుకునే వినియోగదారులు ఇటీవల లాంచ్ చేసిన జీరో చెక్-ఇన్ బ్యాగేజ్ ఎక్స్ ప్రెస్ లైట్ కు ప్రత్యేక డిస్కౌంట్లతో ఎక్స్ క్లూజివ్ యాక్సెస్ పొందవచ్చు. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలు అదనంగా 3 కిలోల క్యాబిన్ బ్యాగేజీని ఎటువంటి రుసుము లేకుండా ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశాన్ని అందిస్తాయి. అలాగే దేశీయ విమానాలలో 15 కిలోలకు రూ .1000, అంతర్జాతీయ విమానాలలో 20 కిలోలకు రూ .1300 చొప్పున చెక్-ఇన్ బ్యాగేజీ కోసం డిస్కౌంట్ ఫీజును అందిస్తుంది. -
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
ఐఫోన్లు, యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇది. ప్రముఖ భారతీయ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ జూన్ 8 నుంచి 17 వరకు "యాపిల్ డేస్" సేల్ ను నిర్వహిస్తోంది. ఆన్లైన్, ఇన్-స్టోర్ రెండింటిలోనూ యాపిల్ ఉత్పత్తులపై అద్భుతమైన డీల్స్ను అందిస్తోంది.ఐఫోన్లపై డిస్కౌంట్లు ఇవే..ఐఫోన్ 15 సిరీస్: ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ.64,900, ఐఫోన్ 15 ప్లస్ ధర రూ.74,290, ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డులపై రూ.6,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఐఫోన్ 15 ప్రో సిరీస్: ఐఫోన్ 15 ప్రో రూ .123,990, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రూ .145,990 నుంచి ప్రారంభమవుతాయి. ఇందులో రూ .3,000 తక్షణ డిస్కౌంట్లు ఉన్నాయి.పాత ఐఫోన్ మోడల్స్: ఐఫోన్ 14, ఐఫోన్ 13 వంటి పాత మోడల్స్పై డీల్స్ వరుసగా రూ .57,990, రూ .50,999 నుంచి ప్రారంభమవుతాయి.ఇతర యాపిల్ ఉత్పత్తులపై.. ఐప్యాడ్లు: ఐప్యాడ్ 9వ జనరేషన్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో సహా వివిధ ఐప్యాడ్ మోడళ్లపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. వీటి ధర రూ .24,990 నుంచి ప్రారంభమవుతుంది.మ్యాక్బుక్స్: శక్తివంతమైన ఎం1, ఎం2, ఎం3 చిప్లతో కూడిన మ్యాక్బుక్ ఎయిర్, మ్యాక్బుక్ ప్రో మోడళ్ల ధర రూ.67,490 నుంచి ప్రారంభమవుతుంది.యాపిల్ వాచ్: ఫిట్నెస్ను ట్రాక్ చేసే యాపిల్ వాచ్ సిరీస్ 9, ఎస్ఈ, అల్ట్రా మోడళ్ల ధరలు రూ .25,900 నుంచి ప్రారంభం.ఎక్స్క్లూజివ్ బెనిఫిట్స్ఇన్ స్టంట్ డిస్కౌంట్లు: ఐసీఐసీఐ, ఎస్బీఐ బ్యాంక్ కార్డుదారులు తమ కొనుగోళ్లపై రూ.10,000 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు.ఎక్స్ఛేంజ్ బోనస్: ఇన్-స్టోర్ కస్టమర్లు క్యాషిఫై ద్వారా రూ .12,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ పొందవచ్చు.మైవీఎస్ లాయల్టీ ప్రోగ్రామ్: అన్ని కొనుగోళ్లపై 0.75 శాతం లాయల్టీ పాయింట్లను పొందవచ్చు. వీటిని తర్వాత రీడీమ్ చేసుకోవచ్చు. -
అమెజాన్ సేల్లో ఆఫర్ల జాతర.. 95 శాతం వరకు డిస్కౌంట్
కొనుగోలు దారులకు శుభవార్త. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ సమ్మర్ సేల్ను ప్రారంభించింది. ఈ సేల్లో స్మార్ట్వాచ్లపై 95 శాతం, బ్లూటూత్ ఇయర్బడ్స్పై 95శాతం, ఇయర్ఫోన్లపై 95శాతం, నెక్ బ్యాండ్ ఇయర్ఫోన్స్పై 95 శాతం డిస్కౌంట్ పొందవచ్చారు.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024తో ప్రారంభమైన ఈ సేల్లో అన్నీ రకాల ప్రొడక్ట్లపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు రూ.15,000, రూ.25,000 సెగ్మెంట్ ధరల్లో ఉన్న ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లను కొనుగోలు దారులు సొంతం చేసుకోవచ్చంటూ అమెజాన్ ప్రతినిధులు తెలిపారు.మే 2 అర్ధరాత్రి నుంచి ప్రారంభమై మే 7 వరకు కొనసాగుతున్న ఈ సేల్లో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ శాంసంగ్, షావోమీ, వన్ప్లస్తో పాటు ఇతర ఫోన్లపై తగ్గింపు ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని అమెజాన్ కొనుగోలు దారులకు కల్పిస్తుంది. ఈ ఫోన్లలో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లార్జ్ డిస్ప్లే, పెద్ద బ్యాటరీ, పవర్ఫుల్ ప్రాసెసర్లుతో వస్తున్నట్లు అమెజాన్ వెల్లడించింది.మీరు ఐసీసీఐ, వన్ కార్డ్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ల ద్వారా కొనుగోలు చేస్తే.. ప్రతి కొనుగోలుపై 10 శాతం డిస్కౌంట్లు పొందవచ్చు.దీంతో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్లు, ఈఎంఐలు, కూపన్లు వినియోగించుకోవచ్చని అమెజాన్ వెల్లడించింది. -
ఓటేస్తే మజూరీలో రాయితీ
రాయ్పూర్: ఓటేస్తే రెస్టారెంట్లు డిస్కౌంట్ ఇవ్వడాన్ని నోయిడాలో చూశాం. బెంగళూరులో అయితే ఏకంగా ఫ్రీ బీర్ ప్రకటించారు! ఈ జాబితాలో తాజాగా ఛత్తీస్గఢ్ చేరింది. అయితే ఇందులో కాస్త వెరైటీ ఉంది! ఓటేసి వేలికి నీలి రంగు సిరా చూపిస్తే బంగారం తయారీ ధరలను (మజూరీ) తగ్గిస్తామని రాష్ట్ర వాణిజ్య మండలి ప్రకటించింది. దాంతోపాటు పలు ఇతర ఉత్పత్తులపైనా రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. వివిధ సంస్థల నిర్వాహకులు కూడా ఇందుకు అంగీకరించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అమర్ పర్వానీ నేతృత్వంలో కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ గౌరవ్ కుమార్ సింగ్ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓటేసిన వారికి తమ ఉత్పత్తుల కొనుగోలుపై ఫర్నిచర్ అసోసియేషన్ 10 శాతం, టెక్స్టైల్ ట్రేడర్స్ అసోసియేషన్ 10 శాతం, రాయ్పూర్ ఆప్టికల్ అసోసియేషన్ 15 శాతం, ప్లైవుడ్ అసోసియేషన్ 5 శాతం, బులియన్ అసోసియేషన్ 15 శాతం రాయితీ ప్రకటించాయి. ఛత్తీస్గఢ్లో 11 లోక్సభ స్థానాలకు గాను ఏడింటికి మే 7న మూడో విడతలో పోలింగ్ జరగనుంది. -
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
ఆన్లైన్లో భారీ డిస్కౌంట్ల కోసం ఎదురు చూస్తున్నవారికి గుడ్న్యూస్ ఇంది. ప్రముఖ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ (Amazon Great Summer Sale) అతి త్వరలో ప్రారంభం కానుంది. అనేక పాపులర్ స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులను అందించే ఈ సేల్ గురించి ఈ-కామర్స్ ప్లాట్ఫాం ముందుగానే ప్రకటించింది.అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ టీజర్ పేజీలో ఈ సేల్ వినియోగదారులకు ‘బెస్ట్ స్మార్ట్ఫోన్ డీల్స్' అందిస్తుందని పేర్కొంది. సేల్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సేల్ ఈవెంట్కు ముందు.. అమెజాన్ డిస్కౌంట్లు ఇవ్వనున్న కొన్ని ఫోన్ల జాబితాను వెల్లడించింది. మీరు కొనాలనుకుంటున్న ఫోన్ ఈ జాబితాలో ఉందో లేదో చూసేయండి..ఈ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు..అమెజాన్ ముఖ్యంగా 8 వన్ప్లస్ ఫోన్లపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనుంది. అధికారిక అమెజాన్ సేల్ లిస్టింగ్ ప్రకారం.. వన్ప్లస్ 12 (OnePlus 12), వన్ప్లస్ నార్డ్ సీఈ 4 (OnePlus Nord CE 4), వన్ప్లస్ 12 ఆర్ (OnePlus 12R), వన్ప్లస్ నార్డ్ 3(OnePlus Nord 3) వంటి ఫోన్లలపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ సమయంలో రెడ్మీ 13సీ (Redmi 13C), రెడ్మీ నోట్ 13 ప్రో (Redmi Note 13 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎం 34 (Samsung Galaxy M34), షావోమీ 14 (Xiaomi 14), శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 23 (Samsung Galaxy S23), ఐకూ జెడ్ 9 (iQOO Z9), గెలాక్సీ ఎస్ 24 (Galaxy S24), టెక్నో పోవా 6 ప్రో (Tecno Pova 6 Pro) వంటి మరిన్ని ఫోన్లపై కూడా డిస్కౌంట్లు ఉంటాయి. ఈ ఫోన్లపై కచ్చితమైన ధరలు రాబోయే రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు కొన్ని కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లపై కూడా డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి, డిస్కౌంట్లను పొందే ఐఫోన్ల పేర్లను వెల్లడించలేదు. అయితే, సేల్ ఈవెంట్లో యాపిల్ డివైజ్లు కూడా ఉంటాయని టీజర్ పేర్కొంది. -
కార్ల కొనుగోలు దారులకు మారుతి సుజుకి బంపరాఫర్
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకి వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఎస్యూవీ, హ్యాచ్ బ్యాక్ తదితర కార్ల సెగ్మెంట్లలో తన స్థానం పదిలం చేసుకునేందుకు భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. ఈ తరుణంలో ఏప్రిల్లో కొన్ని మోడల్ కార్లపై గరిష్టంగా రూ.1.5 లక్షల వరకూ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. మారుతి సుజుకి ఇగ్నీస్ మోడల్ కారుపై గరిష్టంగా రూ.58 వేల డిస్కౌంట్ ఆఫర్ చేసింది. మారుతి సుజుకి పాపులర్ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ బాలెనోపై రూ.58 వేల డిస్కౌంట్ అందిస్తున్నది. మారుతి సుజుకి సియాజ్ కారుపై క్యాష్ డిస్కౌంట్ రూ.25 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ.25 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3,000 కలుపుకుని మొత్తం రూ.53 వేల డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. గ్రాండ్ విటారా మైల్డ్ హైబ్రీడ్ కార్లపై రూ.58 వేలు, స్ట్రాంగ్ హైబ్రీడ్ వర్షన్లపై రూ.84 వేల వరకు డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఫ్రాంక్స్ టర్బో పెట్రోల్ వేరియంట్ మీద రూ.68 వేల వరకూ ధర తగ్గించింది. మారుతి సుజుకి జిమ్నీ కారుపై గరిష్టంగా రూ.1.50 లక్షల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది. 2022-23, 2023-24 మోడల్ కార్లలో స్పెషిఫిక్ ట్రిమ్స్ మీద గణనీయ క్యాష్ డిస్కౌంట్లు అందిస్తున్నది -
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ బంపరాఫర్!
విమాన ప్రయాణికులకు టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిరిండియా ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ శుభవార్త చెప్పింది. చెక్ ఇన్ బ్యాగేజీ లేకుండా ప్రయాణించడానికి ఇష్టపడే ప్రయాణీకులకు తగ్గింపు ధరలలో టికెట్ల ధరలను అందిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎక్స్ప్రెస్ లైట్ ద్వారా ప్రయాణికులు సాధారణ ఛార్జీల కంటే తక్కువ ధరలో విమాన టికెట్లను పొందవచ్చు. ఎక్స్ ప్రెస్ చెక్ ఇన్ ఫ్లయర్ కౌంటర్లు, బ్యాగేజీ బెల్ట్ వద్ద క్యూలను నివారించేందుకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా బుక్ చేసుకుంటే 15 కిలోలు, 20 కిలోల చెక్ ఇన్ బ్యాగేజీలపై డిస్కౌంట్ వస్తుందని తెలిపింది. ఎక్స్ప్రెస్ లైట్ ఛార్జీలపై ప్రయాణించే ప్రయాణికులు కాంప్లిమెంటరీ కింద అదనంగా 3 కిలోల బ్యాగేజీని ఫ్రీగా బుక్ చేసుకునే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ఎయిర్ పోర్ట్ ఎయిర్ లైన్ కౌంటర్లలోని ప్రయాణికులు చెక్ ఇన్ బ్యాగేజీ సేవలను వినియోగించుకోవచ్చని ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. -
రూ.31వేల ఈ లేటెస్ట్ 5జీ ఫోన్ ఇప్పుడు రూ.23వేలే..!
ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోన్లతో కస్టమర్లలో మంచి ఆదరణ పొందిన శాంసంగ్ కంపెనీకి చెందిన ప్రముఖ 5జీ మోడల్ ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ (Samsung Galaxy A34 5G) ఇప్పుడు భారీ డిస్కౌంట్తో రూ.22,999 లకే అందుబాటులో ఉంది. ఈ మీడియం రేంజ్ స్మార్ట్ ఫోన్ రూ.30,999 ప్రారంభ ధరతో గతేడాది లాంచ్ అయింది. రూ. 3,000 తగ్గింపు తాజగా శాంసంగ్ గెలాక్సీ ఏ34 ఫోన్పై రూ. 3,000 తగ్గింపు లభించింది. దీంతో 6GB+128GB మోడల్ వేరియంట్ రూ.22,999లకే అందుబాటులోకి వచ్చింది. 8GB +128GB వేరియంట్ దాని అసలు ధర రూ. 27,499లకు బదులుగా రూ. 24,499లకే లభిస్తోంది. మరోవైపు 8GB+256GB వేరియంట్ ఇప్పుడు రూ. 26,499లకే అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఇండియా వెబ్సైట్తోపాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5G ఫీచర్లు FHD+ రిజల్యూషన్తో 6.6-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లే MediaTek డైమెన్సిటీ 1080 SoC 8GB వరకూ ర్యామ్, 256GB ఆన్బోర్డ్ స్టోరేజ్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 5,000 mAh బ్యాటరీ OISతో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రావైడ్ లెన్స్ 5MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 13MP సెల్ఫీ కెమెరా స్టీరియో స్పీకర్లు 5G, Wi-Fi 802.11, బ్లూటూత్ 5.3, GPS కనెక్టివిటీ కోసం USB టైప్-సి పోర్ట్ -
తెలంగాణ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు మళ్లీ పెంపు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ట్రాఫిక్ ఛలాన్ల రాయితీ గడువును మరోసారి పెంచారు. వచ్చే నెల(ఫిబ్రవరి) 15వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత పొడిగింపు ఉండదని అధికార వర్గాలు వెల్లడించినా.. పొడిగింపు వైపే ప్రభుత్వం మొగ్గు చూపించినట్లు స్పష్టమవుతోంది. ఇదిలా ఉంటే.. గత ఏడాది డిసెంబర్ 27వ తేదీ నుంచి పెండింగ్ చలాన్లను రాయితీతో చెల్లించేందుకు అవకాశమిచ్చారు. తొలుత పదిహేను రోజులపాటు అవకాశమిచ్చిన పోలీసులు ఆ తర్వాత జనవరి 10 నుంచి ఈ నెలాఖరు వరకు పొడిగించారు. .. తద్వారా పెండింగ్ చలాన్ల రాయితీ చెల్లింపులకు నెల రోజులకు పైగా సమయం దొరికింది. ఇక.. తెలంగాణ వ్యాప్తంగా 3.59 కోట్ల పెండింగ్ చలాన్లకు గాను ఇప్పటి వరకు 1,52,47,864 చలాన్లు చెల్లించారు. వీటి ద్వారా రూ.135 కోట్ల ఆదాయం వచ్చింది. -
ఐఫోన్ కొనుగోలుపై రూ.13000 డిస్కౌంట్! - పూర్తి వివరాలు
యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ కొనాలనుకునే వారి కోసం ఫ్లిప్కార్ట్ ఓ అద్భుతమైన ఆఫర్ తీసుకువచ్చింది. రూ.79900 ప్రారంభ ధర వద్ద అందుబాటులో ఉన్న ఈ మొబైల్ మీద బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్ వంటివి అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ ఇప్పుడు రూ.13000 డిస్కౌంట్తో కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.79900 ఖరీదైన ఐఫోన్ 15 సిరీస్ 128జీబీ మోడల్ 66999 రూపాయలకు కొనేయొచ్చు. 256 జీబీ అండ్ 512 జీబీ మోడల్స్ వరుసగా రూ.76999, రూ.96999 ధరలకు అందుబాటులో ఉన్నాయి. బ్యాంక్ కార్డ్ ఉపయోగించి రూ. 2000, పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ. 54990 వరకు తగ్గింపు పొందవచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద లభించే డిస్కౌంట్ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నో కాస్ట్ ఈఎమ్ఐ, యూపీఐ తగ్గింపుల ద్వారా కూడా కొంత డబ్బు ఆడ చేసుకోవచ్చు. ఇదీ చదవండి: ఆటో రిక్షా.. అదే స్కూటర్ - ఇప్పటి వరకు ఇలాంటి వెహికల్ చూసుండరు! ఐఫోన్ 15 ప్రో కోసం.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.46149 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో ఐఫోన్ 12 వంటి పాత మోడల్ ఎక్స్చేంజ్ మీద రూ. 20850 తగ్గింపు పొందవచ్చు. ఈ తగ్గింపు ఎక్స్చేంజ్ చేసే మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. -
రూ.20000 తగ్గింపుతో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ - వివరాలు
భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బెంగళూరు బేస్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'ఏథర్ ఎనర్జీ' 2024 ప్రారంభంలోనే తమ అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి '450ఎస్' ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద అద్భుతమైన ఆఫర్స్ అందించడం ప్రారంభించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు మీద కంపెనీ ఇప్పుడు రూ. 20000 తగ్గింపును ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ఈ స్కూటర్ బెంగళూరులో రూ.1.09 (ఎక్స్-షోరూమ్) లక్షలకు, ఢిల్లీలో రూ.97,500 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరలు లభిస్తోంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ ఏథర్ 450 ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక సింగిల్ చార్జితో 115 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది కేవలం 3.9 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 90 కిమీ వరకు ఉంటుంది. ఇదీ చదవండి: అబ్బురపరుస్తున్న గ్యాడ్జెట్స్.. ఎప్పుడైనా చూసారా! ఏథర్ 450ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 80 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 6 గంటల 36 నిమిషాల సమయం పడుతుంది. సంక్రాంతి పండుగలో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారు రూ. 20000 తగ్గింపుతో కొనుగోలు చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ నెలలో మాత్రమే లభించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
TS: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
హైదరాబాద్, సాక్షి: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తున్నట్లు బుధవారం సాయంత్రం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ఇవాళ్టి(జనవరి 10)తో ముగియాల్సి ఉంది. డిస్కౌంట్ ఛాన్స్ తో పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవచ్చని... గడువు ముగిస్తే అలాంటి అవకాశం ఉండదని ట్రాఫిక్ పోలీసులు చెబుతూ వచ్చారు. మొత్తం పెండింగ్ చలాన్లు 3 కోట్ల 9 లక్షల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకు కోటీ 7 లక్షల మంది మాత్రమే ఛలాన్లు చెల్లించగా.. రూ.107 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో గడువును పొడిగిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. గడువు పొడిగించిన నేపథ్యంలో.. ఇంకా ఎవరైనా చెల్లించకుంటే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు. హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లతోపాటు తెలంగాణ వ్యాప్తంగా వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై కొద్దిరోజుల కిందట తెలంగాణ సర్కార్ రాయితీని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్ను డిస్కౌంట్పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే?
2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. వండర్లస్ట్ ఈవెంట్లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్ను అమెజాన్లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు. రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు. ఇదీ చదవండి: సచిన్కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే? ఐఫోన్ 15 ఫీచర్స్ ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది. -
వాహనదారులకు ఊరట!.. పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ
మహబూబ్నగర్ క్రైం: కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న ఈ–చలాన్లపై రాష్ట్ర పోలీస్శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ద్విచక్ర వాహనం దగ్గరి నుంచి భారీ వాహనాల వరకు కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న చలాన్స్ చెల్లించడానికి ప్రత్యేక డ్రైవ్కు శ్రీకారం చుట్టారు. వాహనదారుల నుంచి పెండింగ్ జరిమానాలు రాబట్టేందుకు భారీస్థాయిలో రాయితీలు ప్రకటించారు. ఆర్టీసీ బస్సులపై 90 శాతం, ద్విచక్ర వాహనాలపై 80 శాతం, ఆటోలు, కార్లు ఇతర ఫోర్ వీలర్స్పై 60 శాతం, లారీలు, ఇతర భారీ వాహనాలపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి ఈ నెల 26వ తేదీ నుంచి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేసి పెండింగ్ చలాన్స్ వసూలు చేసే ప్రక్రియపై దృష్టి పెట్టనున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 2021 నుంచి 2023 డిసెంబర్ వరకు 1,99,841 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.9,36,67,245 వసూలు కావాల్సి ఉంది. అత్యధికంగా మహబూబ్నగర్ ట్రాఫిక్ పోలీస్స్టేషన్లో 77,237 కేసులు ఉండగా, అత్యల్పంగా చిన్నచింతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 2,076 ఈ–చలాన్ కేసులు పెండింగ్లో ఉండడం విశేషం. జిల్లాలో ఇప్పటివరకు ఈ–చలాన్ కేసులు 2,28,622 నమోదు చేయగా వీటి ద్వారా రూ.10,71,64,164 జరిమానాలు విధించారు. ఇందులో 58,953 కేసులలో రూ.2,90,23,180 జరిమానాలు చెల్లించారు. ఇంకా 1,99,841కేసులలో రూ.9,36,67,245 జరిమానాలు ప్రభుత్వానికి చెల్లించాలి. సద్వినియోగం చేసుకోవాలి.. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై భారీ రాయితీ కల్పించిన క్రమంలో జిల్లాలో ఉన్న ప్రతి వాహనదారుడు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. ఇలాంటి అవకాశం మళ్లీ రాకపోవచ్చు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు ప్రత్యేక డ్రైవ్లు ఏర్పాటు చేయడంతో పాటు వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతాం. – టి.మహేష్, డీఎస్పీ మహబూబ్నగర్ -
TS: మళ్లీ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్?
హైదరాబాద్, సాక్షి: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేసేందుకు గతంలో చేపట్టిన కార్యాచరణను మరోసారి అమలు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఈ క్రమంలో అతిత్వరలో చలాన్లపై రాయితీల ప్రకటన అధికారికంగా చేయనుంది. అయితే ఈసారి ఆ రాయితీలు భారీగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు చలాన్లు విధించడం సాధారణమే. కేవలం రాజధాని హైదరాబాద్లోనే కాకుండా.. చిన్నచిన్న పట్టణాల స్థాయి దాకా ఉల్లంఘనకు ఛలాన్ల విధింపు ఉంటోంది. సీసీ కెమెరాలు, ఆధునిక సాంకేతికత కారణంగా ఈ పని మరింత సులభతరం అయ్యింది. అయినా కూడా చలాన్లు చెల్లించడం లేదు చాలా మంది. దీంతో పెండింగ్ చలాన్ల సంఖ్య పెరిగిపోతోంది. నవంబర్ చివరికల్లా.. తెలంగాణలో పెండింగ్ చలాన్ల సంఖ్య రెండు కోట్లు దాటినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. గతంలో మాదిరే రాయితీ ప్రకటించాలని.. అదీ కొత్త ఏడాది కానుకగా ఇవ్వాలనే ఆలోచనలో పోలీస్ శాఖ ఉన్నట్లు సమాచారం. న్యూఇయర్కి.. కుదరకుంటే జనవరి చివరకు దీనిపై ప్రకటన చేయొచ్చని పోలీసు వర్గాలు అంటున్నాయి. గతంలో.. 2022 మార్చి 31 నాటికి 2.4 కోట్ల పెండింగ్ చలాన్లు ఉంటే.. రాయితీల ద్వారా ఏకంగా రూ.300 కోట్ల వరకూ చలానాల రుసుము వసూలైంది. అందుకే ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలకైతే 75 శాతం, మిగతా వాటికి 50 శాతం రాయితీ ఇచ్చారు. మరి ఈసారి ఎలా ఉండనుందో చూడాలి. ఇదీ చదవండి: వైన్ షాపులు.. కావవి బార్లు! -
కారు కొనుగోలుపై రూ.1.10 లక్షల డిస్కౌంట్ - వివరాలు
దేశీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' తన ఈవీ పోర్ట్ఫోలియో మీద సంవత్సరాంతంలో గణనీయమైన తగ్గింపులను ప్రకటించింది. ఈ లైనప్లో టియాగో ఈవీ హ్యాచ్బ్యాక్, టిగోర్ ఈవీ ఉన్నాయి. కంపెనీ ఈ కార్లపై అందిస్తున్న ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. టిగోర్ ఈవీ టాటా టిగోర్ ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 1.10 లక్షల తగ్గింపుని అందిస్తోంది. ఇందులోని అన్ని వేరియంట్లపై రూ. 50,000 ఎక్స్చేంజ్ బోనస్తో పాటు రూ. 50,000 ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. వీటితో పాటు రూ.10,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలు లభిస్తాయి. మంచి డిజైన్, ఫీచర్స్ కలిగిన ఈ కారు ఒక చార్జితో గరిష్టంగా 315 కిమీ రేంజ్ అందిస్తుంది. టియాగో ఈవీ టాటా టియాగో ఈవీ కొనుగోలుపైన కంపెనీ రూ. 77000 వరకు తగ్గింపుని అందిస్తోంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్ల మీద కంపెనీ రూ. 1,5000 ఎక్స్ఛేంజ్ బోనస్ అందిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ లేదు. దీనికి బదులుగా కొనుగోలుదారులు రూ.55,000 వరకు గ్రీన్ బోనస్ను పొందవచ్చు. కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 7,000 తగ్గింపు లభిస్తుంది. టియాగో ఈవీ మీడియం రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. మీడియం రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 250 కిమీ పరిధిని, లాంగ్ రేంజ్ వేరియంట్ ఒక చార్జితో 315 కిమీ రేంజ్ అందిస్తుంది. NOTE: కంపెనీ అందించే ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి కొనుగోలుదారుడు సమీపంలోని సంస్థ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్..
జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి భారతీయ మార్కెట్లో అమ్మకాలను పెంచుకోవడానికి, కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి ఇయర్ ఎండ్ ఆఫర్స్ ప్రకటించింది. ఎంపిక చేసిన కొన్ని బైక్స్ మీద కంపెనీ రూ. 20,000 నుంచి రూ. 60,000 వరకు డిస్కౌంట్స్ అందిస్తోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 👉 కవాసకి వెర్సిస్ 650 అడ్వెంచర్ టూరర్ కొనుగోలుపై సంస్థ రూ. 20,000 తగ్గింపుని అందిస్తోంది. రూ. 7.77 లక్షల ధర వద్ద లభించే ఈ బైక్ డిస్కౌంట్ తరవాత రూ. 7.57 లక్షలకు కొనుగోలు చేయవచ్చు. 👉 నింజా 650 స్పోర్ట్బైక్ కొనుగోలుపైన కవాసకి రూ. 35,000 తగ్గింపుని అందిస్తోంది. దీంతో రూ. 7.16 లక్షల ధర వద్ద ఉన్న ఈ బైకుని రూ. 6.81 లక్షలకు సొంతం చేసుకోవచ్చు. 👉 కంపెనీ అందించే గరిష్ట మొత్తం రూ. 60,000. ఈ డిస్కౌంట్ కేవలం వల్కన్ S క్రూయిజర్పై మాత్రమే లభిస్తుంది. రూ. 7.10 లక్షల ఖరీదైన ఈ బైకుని డిస్కౌంట్ తరువాత రూ. 6.50 లక్షలకు కొనుగోలు చేసుకోవచ్చు. 👉 కంపెనీ ప్రస్తుతం ట్విన్ సిలిండర్ మోడళ్లపై మాత్రమే డిస్కౌంట్లను అందిస్తోంది. రానున్న రోజుల్లో సింగిల్ సిలిండర్ మోడల్స్ మీద కూడా మంచి తగ్గింపులను అందించే అవకాశం ఉందని భావిస్తున్నాము. -
అన్లిమిటెడ్ ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: అన్లిమిటెడ్ స్టోర్స్ ‘రెడ్ అలర్ట్ సేల్ ఆఫర్’ను ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వ్రస్తాలపై 50% ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే రూ.3వేల షాపింగ్పై అంతే విలువైన ఉత్పత్తులు ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా 87 స్టోర్లలో జనవరి 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఫ్యాషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాలని కోరింది. -
కొనుగోలు దారులకు బంపరాఫర్, ఫ్లిప్కార్ట్లో 80 శాతం భారీ డిస్కౌంట్కే..
ప్రముఖ దేశీయ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ కొనుగోలు దారులకు శుభవార్త చెప్పింది. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త ఏడాదిని పురస్కరించుకుని డిసెంబర్ 9 నుంచి ఫ్లిప్ కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి ప్రారంభించింది. డిసెంబర్ 9న ప్రారంభమై డిసెంబర్ 16 వరకు కొనసాగే సేల్లో 80 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ఇయర్ ఎండ్ సేల్స్లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, సహా పలు కేటగిరీల్లోని ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు పొందవచ్చని ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు తెలిపారు. వీటితో పాటు ఫ్లిప్కార్ట్ హెచ్డీఎఫ్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్తో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీ ద్వారా జరిపే కొనుగోళ్లపై ఇన్స్టంట్ డిస్కౌంట్, క్యాష్బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు పొందవచ్చు. ఐఫోన్14 రిటైల్ ధర రూ.69,900 ఉండగా.. ఈ సేల్ ద్వారా రూ.55,000కే కొనుగోలు చేయవచ్చని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. మోటోరోలా ఎడ్జ్ 40 పైనా ఫ్లిప్కార్ట్ రాయితీ అందిస్తోంది. రూ.34,999 ధర వద్ద విడుదలైన ఈ ఫోన్ రూ.25,499కే లభిస్తుంది. ఇన్ఫీనిక్స్ హాట్ 30ఐ ను రూ.7,149కే కొనుగోలు చేయవచ్చు. నథింగ్ ఫోన్2 ధర రూ.39,999 కాగా.. తాజా సేల్లో రూ.34,999కే కొనుగోలు చేయవచ్చు. -
సింగిల్ ఛార్జ్ 200 కిమీ రేంజ్! ధర కూడా తక్కువే..
Komaki LY Electric Scooter: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న తరుణంలో దాదాపు అన్ని సంస్థలు ఈ రంగం వైపే జోరుగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే దేశీయ మార్కెట్లో విడుదలైన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కంపెనీ ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లాంచ్ సమయంలో రూ. 96,968 వద్ద అమ్ముడైన ఈ స్కూటర్ ఇప్పుడు రూ. 78,000 వద్ద లభిస్తోంది. అంటే కంపెనీ ఈ స్కూటర్ మీద రూ. 18,968 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డిస్కౌంట్ కేవలం పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది. నగర ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని తయారైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సింగిల్, డ్యూయల్ బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. సింగిల్ బ్యాటరీతో కూడిన స్కూటర్ 85 కిలోమీటర్ల రేంజ్ అందిస్తే, డ్యూయల్ బ్యాటరీ స్కూటర్ 200 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే వాస్తవ ప్రపంచంలో రేంజ్ కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. ఇదీ చదవండి: కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి రిమూవబుల్ బ్యాటరీ కలిగిన 'కొమాకి ఎల్వై' (Komaki LY) ఎలక్ట్రిక్ స్కూటర్ TFT ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పొందుతుంది. ఇది బ్యాటరీ స్టేటస్, న్యావిగేషన్ వంటి మరిన్ని వివరాలను రైడర్కు తెలియజేస్తుంది. ఆన్బోర్డ్లో సౌండ్ సిస్టమ్ ఉండటం వల్ల, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ప్లే చేయవచ్చు. డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. -
ఈ బైక్ కొనుగోలుపై రూ.1.97 లక్షల డిస్కౌంట్ - నేడే ఆఖరు..
భారతీయ మార్కెట్లో ఎక్కువ మంది బైక్ రైడర్లు ఇష్టపడే బైక్ బ్రాండ్లలో ఒకటి 'డుకాటి' (Ducati). ఫెస్టివల్ సీజన్ పూర్తయిన తరువాత కూడా ఈ కంపెనీ కస్టమర్ల కోసం ఎంపిక చేసిన మోడల్ మీద భారీ డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇంతకీ ఏ బైకుపై సంస్థ డిస్కౌంట్ అందిస్తోంది, డిస్కౌంట్ తర్వాత ఈ బైక్ ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. డుకాటి కంపెనీకి చెందిన మాన్స్టర్ (Monster) బైకుపై సంస్థ ఏకాంగి రూ. 1.97 లక్షలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ బైక్ ధర రూ. 12.95 లక్షలు కాగా.. డిస్కౌంట్ తరువాత ఇది రూ. 10.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ కేవలం ఈ రోజు (నవంబర్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. డుకాటి మాన్స్టర్ బైక్ 937 సీసీ ట్విన్ సిలిండర్ ఇంజన్ కలిగి 9250 ఆర్పీఎమ్ వద్ద 109 బీహెచ్పీ పవర్, 6500 ఆర్పీఎమ్ వద్ద 92 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్లిప్పర్ క్లచ్, డుకాటి క్విక్ షిఫ్ట్ ద్వారా 6-స్పీడ్ గేర్బాక్స్ పొందుతుంది, తద్వారా అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల నిర్ణయంపై 'ఎలాన్ మస్క్' ఘాటు వ్యాఖ్యలు దేశీయ మార్కెట్లో డుకాటి మాన్స్టర్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్, ఎస్పీ వేరియంట్లు. ప్రారంభంలో ఈ బైక్ రూ. 15.95 లక్షల ధర వద్ద విడుదలైంది, ఆ తరువాత ఈ ధరలు కొంత అతగ్గుముఖం పట్టాయి. దీంతో ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. -
అమెజాన్ 'ద బ్యూటీ సేల్' - 60 శాతం డిస్కౌంట్స్.. కేవలం మూడు రోజులు మాత్రమే!
ఈ సంవత్సరం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బ్యూటీ షాపింగ్ మొదలపోతోంది. నవంబర్ 24 నుంచి ప్రారంభం కానున్న ఈ అమెజాన్ బ్యూటీ సేల్ 26 వరకు ఉంటుంది. ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద 50 నుంచి 60 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో కే-బ్యూటీ నుంచి బార్బీకోర్ లుక్స్ వరకు ట్రెండింగ్ జెన్ జడ్ ప్రాధాన్యత గల ఉత్పత్తులు, బ్యూటీ బ్రాండ్ల వంటి ఉత్పత్తులు, సౌందర్య పరికరాల నుండి ఎంచుకోవచ్చు. అసలే శీతాకాలం పైగా వివాహాల సీజన్.. కొందరు చర్మ రక్షణ కోసం మరి కొందరు ఫంక్షన్స్లో ప్రత్యేకంగా కనిపించడం కోసం అనేక సౌదర్య ఉత్పత్తులను విరివిగా కొనుగోలు చేస్తారు. అలాంటి వారికి అమెజాన్ ద బ్యూటీ సేల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కస్టమర్స్ ప్రతి లగ్జరీ బ్యూటీ కొనుగోలుతో మీద మంచి డీల్స్, ఫ్రీ గిఫ్ట్ వంటి వాటిని ఆస్వాదించవచ్చు. బై మోర్, సేవ్ ఆఫర్స్ కింద కావలసిన ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందులో 8 PM డీల్స్, సబ్స్క్రైబ్ అండ్ సేవ్తో 10% వరకు ఆదా చేసుకోవచ్చు. కస్టమర్ షాపింగ్, ఉత్పత్తి వినియోగ అనుభవాన్ని మెరుగుపరచడం నుంచి ఉత్పత్తి అనుకూలత వంటి వాటికి కంపెనీ అందిస్తుంది. మేబిలైన్, లోరియల్ ప్రొఫెషనల్, బయోటిక్, కామా ఆయుర్వేద, స్విస్ బ్యూటీ, లాక్మే, రినీ కాస్మెటిక్స్, మైగ్లామ్, కలర్ బార్ కాస్మటిక్స్, పౌలాస్ ఛాయిస్.. ఇంకా ఎన్నో 300 కంటే ఎక్కువ బ్రాండ్స్పై ఉత్తేజభరితమైన 8000 కంటే ఎక్కువ డీల్స్ పొందవచ్చు. అమెజాన్ ద బ్యూటీ సేల్ సందర్భంగా.. అమెజాన్ ఇండియా, బ్యూటీ, పర్సనల్ కేర్ & లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ 'జెబా ఖాన్' మాట్లాడుతూ.. ఇప్పటికే ది బ్యూటీ సేల్ మొదటి రెండు ఎడిషన్లకు కస్టమర్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీనిని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మూడవ ఎడిషన్ ప్రారంభించడం జరిగింది. చర్మ సంరక్షణ, మేకప్ వంటి లగ్జరీ ఉత్పత్తులతో అందాన్ని మరింత పెంచుకోవడంలో మీ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. అందం మీద ద్రుష్టి పెట్టే ప్రతి ఒకరికి ఇది సరైన చోటు అని వెల్లడించారు. -
కొనుగోలు దారులకు శుభవార్త!
హైదరాబాద్: రిలయన్స్ డిజిటల్ దీపావళి సందర్భంగా ‘అన్లిమిటెడ్సెలబ్రేషన్స్’ పేరుతో ఆఫర్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ టీవీలు, మొబైల్స్, వాషింగ్ మెషిన్లు, ల్యాప్ట్యాప్లు, వైర్లెస్ ఇయర్బర్డ్లు, స్మార్ట్వాచ్లు, గృహోపకరణాలపై భారీ రాయితీ పొందవచ్చు. క్రిడెట్, డెబిట్ కార్డులపై గరిష్టంగా రూ.15వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఈఎంఐ, సులభ ఫైనాన్స్ సదుపాయాలు ఉన్నాయి. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, మై జియో స్టోర్లు, రిలయన్స్డిజిటల్.ఇన్ ద్వారా కస్టమర్లు ఈ ఆఫర్లు పొందవచ్చు. -
పండుగ సీజన్లో గొప్ప ఆఫర్స్ - కార్లు కొనటానికి ఇదే మంచి సమయం
విజయదశమితో మొదలైన పండుగ సీజన్ జోరుగా ముందుకు సాగుతోంది. ఈ తరుణం కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు తమ ఉత్పత్తులను ఎక్కువ సంఖ్యలో విక్రయించుకోవడానికి అద్భుతమైన ఆఫర్స్ లేదా బెనిఫిట్స్ అందిస్తున్నాయి. ఇప్పటికే మహీంద్రా, సిట్రోయెన్, స్కోడా కంపెనీలు ఆఫర్స్ ప్రకటించేసాయి. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరి కొన్ని సంస్థలు చేరాయి. ఈ పండుగ సీజన్లో టాటా, మారుతి, హ్యుందాయ్ వంటి కార్ డీలర్లు తమ లైనప్లో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు, ప్రయోజనాలను అందిస్తున్నారు. ఇందులో క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్ఛేంజ్ బోనస్లు, కార్పొరేట్ ఆఫర్లు ఉన్నాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్.. 👉టాటా ఆల్ట్రోజ్ - రూ. 30,000 👉టాటా టియాగో - రూ. 40,000 👉రెనాల్ట్ క్విడ్ - రూ. 50,000 👉హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ - రూ. 55,000 👉మారుతి సుజుకి బాలెనో - రూ. 55,000 👉మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ - రూ. 58,000 👉మారుతి సుజుకి ఇగ్నిస్ - రూ. 65,000 👉మారుతి సుజుకి ఆల్టో కే10 - రూ. 70,000 👉మారుతి సుజుకి సెలెరియో - రూ. 73,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
కొత్త కారు కొనడానికి ఇదే మంచి సమయం - మునుపెన్నడూ లేనన్ని బెనిఫిట్స్
రానున్న దీపావళిని దృష్టిలో ఉంచుకుని మారుతి సుజుకి, మహీంద్రా, స్కోడా, జీప్, సిట్రోయెన్ కంపెనీలు రూ. 50000 నుంచి రూ. 3.5 లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. ఈ ఆఫర్స్ కేవలం కొన్ని ఎంపిక చేసిన మోడల్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మహీంద్రా డిస్కౌంట్స్ మహీంద్రా ఎక్స్యూవీ400 - రూ. 3.5 లక్షలు మహీంద్రా ఎక్స్యూవీ300 - రూ. 1.2 లక్షలు మహీంద్రా బొలెరో - రూ. 70,000 మహీంద్రా బొలెరో నియో - రూ. 50,000 మహీంద్రా మొరాజో - రూ. 73.300 సిట్రోయెన్ డిస్కౌంట్స్ సిట్రోయెన్ సీ3 ఎయిర్క్రాస్ - రూ. 99,000 సిట్రోయెన్ సీ5 ఎయిర్క్రాస్ - రూ. 2,00,000 సిట్రోయెన్ సీ3 - రూ. 99,000 మారుతి సుజుకి డిస్కౌంట్స్ మారుతి జిమ్నీ - రూ. 1,00,000 స్కోడా డిస్కౌంట్స్ స్కోడా కుషాక్ - రూ. 1.5 లక్షలు జీప్ డిస్కౌంట్స్ జీప్ మెరిడియన్ - 1.30 లక్షలు జీప్ కంపాస్ - రూ. 1.45 లక్షలు ఫోక్స్వ్యాగన్ డిస్కౌంట్ ఫోక్స్వ్యాగన్ టైగన్ - రూ. 1,00,000 Note: పండుగ సీజన్లో వాహన తయారీ సంస్థలు అందిస్తున్న డిస్కౌంట్లు ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ.. స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఖచ్చితమైన డిస్కౌంట్ వివరాలు తెలుసుకోవడానికి తప్పకుండా సమీపంలోని కంపెనీ అధికారిక డీలర్ను సంప్రదించి తెలుసుకోవాలి. -
వాహనదారులకు మారుతి సుజుకీ ప్రత్యేక డిస్కౌంట్లు
ప్రముఖ కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ దసరా, దీపావళి పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అక్టోబర్ 31 వరకు కార్లపై డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఎస్యూవీ మోడల్ జిమ్నీపై రూ.లక్ష వరకు రాయితీని ఇస్తున్నట్టు ప్రకటించింది. జిమ్నీ ఎస్యూవీపై రూ.50 వేల వరకు రాయితీ ఇస్తున్న సంస్థ..ఎక్సేంజ్ లేదా లాయల్టీ బోనస్ కింద రూ.50 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. ఈ ఆఫర్ మాన్యువల్, పెట్రోల్ రకం మాడళ్లకు వర్తించనున్నది. ప్రస్తుతం జెటా రకం రూ.12.74 లక్షల ప్రారంభ ధరతో లభించనున్నది. -
‘బిగ్ దసరా సేల్’లో అదిరిపోయే ఆఫర్లు
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ మరో భారీ సేల్కు సిద్ధమైంది. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బిగ్ దసరా సేల్’ పేరుతో ఈ నెల 22 నుంచి 29 వరకు ప్రత్యేక సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్లో భాగంగా ఆయా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్లపై షాపింగ్ చేసిన కస్టమర్లకు పది శాతం డిస్కౌంట్, ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు పది శాతం ఈ నెల 21 నుంచి డిస్కౌంట్ అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ వెల్లడించింది. ఇక,సూపర్ కాయిన్ల ద్వారా ఐదు శాతం అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చునని తెలిపింది. దసరా సేల్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, హోం అప్లయెన్సెస్, దుస్తులపై ఆఫర్లు అందచేస్తున్న ఫ్లిప్ కార్ట్ .. పలు కంపెనీలకు చెందిన అన్నీ రకాల స్మార్ట్ఫోన్లపై ఆఫర్లను అందిస్తున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రతినిధులు చెబుతున్నారు. ఐఫోన్ 14తోపాటు పలు స్మార్ట్ ఫోన్లపై త్వరలో ఆఫర్లు ప్రకటించనున్నది. కాగా, ఫ్లిప్కార్ట్ కొద్ది రోజుల క్రితం బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో కొనుగోలు దారులకు ఆఫర్లను అందించిన విషయం తెలిసిందే. -
బంపర్ ఆఫర్.. రూ. 24900 ఎయిర్పాడ్స్ కేవలం రూ. 16749కే..
భారత్లో ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. ఈ తరుణంలో దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటివి ప్రొడక్స్ మీద కనీవినీ ఎరుగని విధంగా డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. ఇందులో భాగంగానే యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో సెకెండ్ జెన్పై అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఎయిర్పాడ్స్ ప్రో 2 ధర రూ. 24,900 వరకు ఉంది. అయితే ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో మాత్రం రూ. 18,499కే కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ కార్డుల మీద కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తాయి. ఫలితంగా ఫ్లిప్కార్ట్లో రూ. 16,999 & అమెజాన్లో రూ. 16,749కి కొనుగోలు చేయవచ్చు. ఇదీ చదవండి: రూ.2000 నోట్లు ఇంకా ఉన్నాయా? మార్చుకోవడానికి మరో మార్గం ఇదే!! 2022లో విడుదలైన యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో ఈ ఏడాది సెప్టెంబర్లో వండర్లస్ట్ ఈవెంట్లో ప్రో 2 గా విడుదలైంది. ఇది లాస్లెస్ ఆడియో విత్ అల్ట్రా-లో లేటేన్సీ పొందుతుంది. ఇందులో హెచ్2 చిప్సెట్ ఉంటుంది. యాపిల్ విజన్ ప్రోలో కూడా ఇదే చిప్సెట్ ఉంటుంది. మొత్తం మీద ఇది వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. -
దసరాకు సొంతూళ్లకు వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త
దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఆయా తేదిల్లో ప్రయాణానికి ఈ నెల 30వ తేది వరకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే 10 శాతం రాయితీ వర్తిస్తుందని స్పష్టం చేసింది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్నీ సర్వీసుల్లో రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. “బతుక్మమ్మ, దసరా చాలా పెద్ద పండుగలు. ఈ పర్వదినాలకు హైదరాబాద్ నుంచి ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తారు. గ్రామీణ ప్రాంతాల్లోనూ అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారు ఈ డిస్కౌంట్ సదుపాయాన్ని ఉపయోగించుకొని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ని సంప్రదించాలి.” టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ సూచించారు. దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయతీ ఇవ్వాలని #TSRTC నిర్ణయించింది. అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో ప్రయాణానికి రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు… — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) September 21, 2023 -
యాపిల్ ఐఫోన్ 14 ప్రోపై భారీ డిస్కౌంట్: దాదాపు సగం ధరకే!
యాపిల్ ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్.మరికొన్ని రోజుల్లో యాపిల్ మెగా ఈవెంట్కు రడీ అవుతున్న తరుణంలో భారీ డిమాండ్ ఉన్న పాపులర్ యాపిల్ ఐఫోన్ 14 ప్రో మోడల్పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఐఫోన్ 15 రాకతో ఐఫోన్ 14 ప్రో దశలవారీగా నిలిచిపోనుంది. ఈ నేపథ్యంలో iPhone 14 Pro ఏకంగా రూ. 66,999 తగ్గింపుతో లభిస్తోంది. త్వరలోనే యాపిల్ ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లు, యాపిల్ వాచెస్ లాంచ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 14 ప్రో లభిస్తోంది. గత ఏడాది లాంచ్ అయిన ఐఫోన్ 14 ప్రో లాంచింగ్ ప్రైజ్ రూ. 1,29,900.ఇపుడు ఫ్లిప్కార్ట్ ఐఫోన్ 14 ప్రో ధరను రూ.66,999 తగ్గించింది. ఇందులో HDFC బ్యాంక్ క్రెడిట్ ,డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై అదనంగా రూ. 3000 తగ్గింపును పొందవచ్చు.అలాగే స్మార్ట్ఫోన్ ఎక్సేంజ్ ఆఫర్ దాదాపు రూ. 50,000 ఉంటుంది. ఫలితంగా iPhone 14 Pro ధర కేవలం రూ. 69,999కి దిగి వచ్చింది. (కేంద్రం మరో కీలక నిర్ణయం: విండ్ఫాల్ ట్యాక్స్ కట్) ఐఫోన్ 14 ప్రో ఫీచర్లు: 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లే, అత్యాధునిక A16 బయోనిక్ చిప్, 48ఎంపీ ట్రిపుల్ కెమెరా 12 ఎంపీ సెల్పీ కెమెరా ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. (డయానాతో ప్రమాదంలో మరణించిన డోడి తండ్రి, బిజినెస్ టైకూన్ కన్నుమూత) -
గ్యాస్ బండ రూ. 200 తగ్గింది
వంటగ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు నిర్ణయానికిఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక.– అనురాగ్ ఠాకూర్, కేంద్ర మంత్రి న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్ సిలిండర్ ధరను ఏకంగా రూ.200 చొప్పున తగ్గించింది. ఈ నిర్ణయం బుధవారం నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం మంగళవారం సమావేశమైంది. మధ్యప్రదేశ్తోపాటు తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే చౌక ధరకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ హామీ ఇస్తోంది. ఈ నేపథ్యంలో గ్యాస్ బండ ధరను రూ.200 చొప్పున తగ్గిస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దేశంలో గత రెండేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర పెరగడమే తప్ప తగ్గిన దాఖలాలు లేవు. దేశ రాజధాని ఢిల్లీలో 14.2 కిలోల సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,103 ఉండగా, బుధవారం నుంచి రూ.903కు లభించనుంది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ లబ్ధిదారులు వంట గ్యాస్ సిలిండర్పై ఇప్పటికే రూ.200 చొప్పున రాయితీ పొందుతున్నారు. తాజా తగ్గింపు ధర వారికి కూడా వర్తిస్తుంది. అంటే ఒక్కో సిలిండర్ రూ.703కే పొందవచ్చు. అంతేకాకుండా ఉజ్వల యోజన కింద అదనంగా 75 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ పథకం కింద లబ్ధి పొందేవారి సంఖ్య 10.34 కోట్లకు చేరుకోనుంది. ఎన్నికలతో సంబంధం లేదు: మంత్రి ప్రజలకు ఉపశమనం కలి్పంచడానికే వంట గ్యాస్ సిలిండర్ ధర తగ్గించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ నిర్ణయానికి ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఇది ఓనం, రక్షాబంధన్ పండుగల సందర్భంగా మహిళలకు మోదీ ప్రభుత్వం ఇస్తున్న కానుక అని వివరించారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా చేపట్టిన చర్యల్లో భాగంగానే గ్యాస్ ధరను తగ్గించినట్లు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రజల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి, అంకితభావానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేసింది. నిత్యావసరాలు సరసమైన ధరలకే ప్రజలకు అందాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొంది. సోదరీమణులకు ఉపశమనం: మోదీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 చొప్పున కేంద్ర ప్రభుత్వం తగ్గించడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా వెలువడిన ఈ నిర్ణయం కుటుంబాల్లో సంతోషాన్ని పెంచుతుందని చెప్పారు. అక్కాచెల్లెమ్మలకు మరింత ఉపశమనం లభిస్తుందని వెల్లడించారు. తన సోదరీమణులంతా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. ఎన్నికల వ్యూహమే!? రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందడానికే వంట గ్యాస్ సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించినట్లు ప్రచారం సాగుతోంది. వంట గ్యాస్తోపాటు నిత్యావసరాల ధరల పెరుగుదలను కాంగ్రెస్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. కాంగ్రెస్ పాలిత రాజస్తాన్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్, తెలంగాణలో అధికారంలోకి వస్తే రూ.500కు సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తోంది. కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఇలాంటి హామీతో కాంగ్రెస్ విజయం సాధించింది. అందుకే కాంగ్రెస్ ప్రచార ఎత్తుగడలను తిప్పికొట్టి జనాన్ని తమవైపు తిప్పుకోవాలన్న వ్యూహంలో భాగంగానే సిలిండర్ ధరను మోదీ సర్కారు భారీగా తగ్గించినట్లు సమాచారం. ఈ తగ్గింపు వల్ల చమురు సంస్థలపై పడే భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది. -
కారు కొంటే ఉచితంగా శ్రీలంక టూర్.. ఆసియా కప్ మ్యాచ్లు చూసే అవకాశం!
ప్రముఖ జర్మన్ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ తమ కార్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. కంపెనీకి చెందిన కార్లపై భారీ డిస్కౌంట్లతో పాటు ఉచితంగా శ్రీలంక వెళ్లి ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లు చూసే అవకాశాన్ని కూడా పొందవచ్చని వోక్స్వ్యాగన్ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. భారీ డిస్కౌంట్లు వోక్స్వ్యాగన్ తైగూన్ మోడల్ కారు కొనాలనుకునేవారికి ఏకంగా రూ.1.60 లక్షల వరకు తగ్గింపును అందిస్తున్నట్లు కంపెనీ వెబ్ సైట్ లో వెల్లడించింది. ఇందులో రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.60,000 ఎక్స్చేంజ్ బోనస్. అయితే ఈ ఆఫర్ 1.5 లీటర్ వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే వోక్స్వ్యాగన్ వర్చుస్ మోడల్ కార్లపై కూడా తగ్గింపును అందుబాటులో ఉంచింది. ఈ మోడల్ కార్లకు గరిష్ఠంగా రూ.1.40 లక్షల తగ్గింపును పొందవచ్చని స్పష్టం చేసింది. ఇందులోనూ రూ. లక్ష క్యాష్ డిస్కౌంట్ కాగా రూ.40,000 ఎక్స్చేంజ్ బోనస్ ఉంటుందని పేర్కొంది. తైగూన్ లాగే ఇది కూడా 1.5 లీటర్ వేరియంట్కే వర్తిస్తుంది. శ్రీలంక టూర్ వోక్స్వ్యాగన్ తమ తైగూన్, వర్చుస్ మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లతోపాటు ఉచితంగా శ్రీలంక వెళ్లే అవకాశాన్ని కూడా గెలుచుకోవచ్చని ప్రకటించింది. ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్న వోక్స్వ్యాగన్ ఆగస్ట్ 10 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ మధ్య తమ కార్లు కొలుగోలు చేసిన కస్టమర్లు ఉచితంగా శ్రీలంక వెళ్లి అక్కడ జరిగే ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్లను వీక్షించే అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది. డిస్కౌంట్లు, ఇతర ఆఫర్ల గురించి పూర్తి వివరాల కోసం దగ్గరలోని డీలర్ను సంప్రదించవచ్చు. -
ఫ్యాన్స్కు గుడ్న్యూస్: మహీంద్ర థార్పై బంపర్ ఆఫర్
భారత్ మార్కెట్లో మహీంద్రాకు చెందిన మహీంద్రా థార్ ఎస్యూవీ కున్న ఆదరణ, క్రేజే వేరు. మరోవైపు హీంద్రా థార్ ఎలక్ట్రిక్ కాన్సెప్ట్ ఆగస్ట్ 15న విడుదల కానుంది. ఆవిష్కరణకు ముందు మహీంద్రా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. థార్ వెహికల్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మహీంద్రా థార్ ఈవీ ఆవిష్కరణకు ముందు, 3-డోర్ల మహీంద్రా థార్ గరిష్టంగా రూ. 20,000 ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. తాజా నివేదికల ప్రకారం దేశవ్యాప్తంగా కొన్ని మహీంద్రా షోరూమ్లు కొత్త థార్పై రూ. 20,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నాయి.పెట్రోల్, డీజిల్ మహీంద్రా థార్ 4x4 వేరియంట్లపై ఆఫర్ లభిస్తోంది. థార్ 4x4 2.2-లీటర్ డీజిల్ ఇంజన్ ,2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్స్లో ఉంది. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్కు బంపర్ ఆఫర్) కాగా మహీంద్రా థార్ ధరలను కంపెనీ ఇటీవల భారతదేశంలో రూ. 1.05 లక్షల వరకు పెంచేసింది. ప్రజాదరణ పొందిన మహీంద్రా థార్ 4WD వెర్షన్ ఇప్పుడు రూ. 13.49 లక్షల నుండి రూ. 16.77 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ RWD మహీంద్రా థార్ చౌకైన వేరియంట్ ఇప్పుడు రూ. 55,000 ఎక్కువ. LX డీజిల్-మాన్యువల్ హార్డ్-టాప్ రియర్-వీల్ డ్రైవ్ వేరియంట్ ధర రూ. 1.05 లక్షలు పెరిగింది. ఆగస్ట్ 15న దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో థార్ ఎలక్ట్రిక్ వెహికల్ కాన్సెప్ట్ను వెల్లడించేందుకు మహీంద్రా సిద్ధంగా ఉంది. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో) -
ఎలక్ట్రిక్ బైక్ కొనాలనుకుంటున్నారా? ఈ-కామర్స్ సైట్లో భారీ డిస్కౌంట్!
REVOLT RV400 electric bike sale on Amazon: కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీ కోసం భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ రెవోల్ట్ మోటర్స్ అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్లో ఈ కంపెనీ ఎలక్ట్రిక్ బైక్పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెజాన్లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. ఈ సేల్లో భాగంగా రెవోల్ట్ ఆర్వీ 400 బైక్పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఈ బైక్ వాస్తవ ధర రూ.1.54 లక్షలు. అయితే ఈ ఈ-కామర్స్ సైట్లో నేరుగా రూ. 15 వేల డిస్కౌంట్తో రూ.1.39 లక్షలకు లిస్ట్ చేసింది. దీంతోపాటు బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4,500 వరకు డిస్కౌంట్ వస్తుంది. ఎస్బీఐ కార్డు ద్వారా వచ్చే తగ్గింపు, నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ను కలుపుకొంటే మొత్తంగా రూ. 30 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎంఐలో ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ఏకంగా రూ. 10,500 వరకు వడ్డీ డిస్కౌంట్ పొందొచ్చు. మూడు నెలలు, ఆరు నెలలు, తొమ్మిది నెలలు, ఏడాది వరకు టెన్యూర్తో నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. మీరు ఎంచుకునే టెన్యూర్ ఆధారంగా ఈఎంఐ మారుతుంది. రెవోల్ట్ 400 ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. 4.5 గంటల్లో బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. -
విమాన ప్రయాణికులకు శుభవార్త
-
లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు! గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ షురూ..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా స్మార్ట్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అద్భుతమైన డిస్కౌంట్ డీల్స్, ఆఫర్లను అందిస్తోంది అమెజాన్. మీరు అమెజాన్ ప్రైమ్ మెంబర్ అయితే ఈ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా షావోమీ, ఒప్పో, శాంసంగ్ వంటి బ్రాండ్ల లేటెస్ట్ స్మార్ట్ఫోన్లను తక్కువ ధరకు ఇప్పుడే కొనుక్కోవచ్చు. ప్రైమ్ సబ్స్క్రైబర్లు కానివారు మాత్రం అర్ధరాత్రి వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ఇదీ చదవండి ➤ మరో చవక మొబైల్.. అతితక్కువ ధరకే సరికొత్త స్మార్ట్ఫోన్ విడుదల అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్లపై అందుబాటులోకి వచ్చిన బెస్ట్ డీల్స్లో కొన్నింటి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం.. ఐఫోన్ 14 (iPhone 14) అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 విక్రయానికి ముందు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా ఐఫోన్ 14 రూ. 67,499లకే అందుబాటులోకి వచ్చింది. యాపిల్ ఏ15 బయోనిక్ చిప్తో కూడిన ఈ ఫోన్ కార్ క్రాష్ డిటెక్షన్, ఎమర్జెన్సీ శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్లతో ఉన్న ఈ స్మార్ట్ఫోన్ గత ఏడాది భారత్లో రూ. 79,900 ధరతో లాంచ్ అయింది. దీంతోపాటు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎంపికచేసిన మోడల్స్కు ఎక్స్ఛేంజ్ ఆఫర్లో భారీ డిస్కౌంట్ పొందవచ్చు. ఇదీ చదవండి ➤ Expensive TV: వామ్మో రూ. 1.15 కోట్లు.. మార్కెట్లోకి అత్యంత ఖరీదైన టీవీ షావోమీ 12 ప్రో 5జీ (Xiaomi 12 Pro 5G) Snapdragon 8 Gen 1 చిప్సెట్తో వచ్చే షావోమీ 12 ప్రో 5జీ ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్లో భాగంగా తగ్గింపు ధర రూ. 41,999లకే లభిస్తోంది. లాంచింగ్ సమయంలో దీని బేస్ మోడల్ ధర రూ.62,999 ఉండగా తర్వాత రూ.52,999లకు తగ్గింది. కొనుగోలుకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ. 1,250 తగ్గింపు ఉంటుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ ద్వారా గరిష్టంగా రూ.36,000 డిస్కౌంట్ లభించే ఆస్కారం ఉంది. ఐకూ 9 5జీ (iQoo 9 5G) ప్రైమ్ మెంబర్షిప్ కలిగి ఉంటే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2023 సేల్ సమయంలో ఐకూ 9 5జీ స్మార్ట్ఫోన్ని రూ.29,990లకే కొనుక్కోవచ్చు. భారతదేశంలో ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ. 42,990. ఈ హ్యాండ్సెట్ 5nm స్నాప్డ్రాగన్ 888+ చిప్సెట్పై పనిచేస్తుంది. 120 వాట్స్ వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. మీ ప్రస్తుత ఫోన్ని ఎక్సేంజ్కు ఇస్తే రూ. 26,650 వరకు తగ్గింపు లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం33 5జీ (Samsung Galaxy M33 5G) 6.6-అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే, Exynos 1280 చిప్సెట్, 5జీ కనెక్టివిటీతో వచ్చే ఈ మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ లాంచింగ్ ధర రూ.18,999. ఇది ఇప్పుడు ప్రైమ్ ఎర్లీ డీల్స్లో భాగంగా రూ.16,999లకే అందుబాటులో ఉంది. అదనంగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి రూ.1,000. పాత హ్యాండ్సెట్ ఎక్స్చేంజ్ ద్వారా రూ.16,100 వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. రెడ్మీ 12సీ (Redmi 12C) MediaTek Helio G85 ప్రాసెసర్, 6.72-అంగుళాల ఎల్సీడీ స్క్రీన్తో వచ్చే ఎంట్రీ లెవల్ రెడ్మీ 12సీ హ్యాండ్సెట్ని ప్రైమ్ ఎర్లీ డీల్స్ సమయంలో రూ.7,699లకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీని అసలు లాంచ్ ధర రూ. రూ.8,999. పాత హ్యాండ్సెట్ ఎక్స్ఛేంజ్ ద్వారా రూ.7,300 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. -
రూ. 26,399కే యాపిల్ ఐఫోన్14: ఎలా?
Apple iPhone 14 యాపిల్ ఐఫోన్ మరోసారి తగ్గింపు ధరలోఅందుబాటులోకివచ్చింది. ప్రస్తుతం యాపిల్ లైనప్లో చౌక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ 14. త్వరలోనే ఐఫోన్ 15ను లాంచ్ చేయనున్న తరుణంలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ షురూ కానున్న నేపథ్యంలో ఈ తగ్గింపు అందుబాటులోకి రావడం గమనార్హం. దాదాపు రూ. 43,600 వరకు తగ్గింపుతో రూ. 26,399కే ఐఫోన్ 14ను కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం అధికారిక స్టోర్లో రూ. 10,901 తగ్గింపుతో రూ. 68,999 వద్ద లిస్ట్ అయింది. దీనితో పాటు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ , డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 4000 తగ్గింపును పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్, ఇతర ఆఫర్లతో కలిపి ఫ్లిప్కార్ట్ సేల్ కంటే ముందుగా యాపిల్ ఐఫోన్ 14ని కేవలం 26,399 రూపాయలకే పొందవచ్చు. కాగా ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ఆగస్టు 4-9 వ తేదీవరకు కొనసాగనుంది. సేల్ ఫ్లిప్కార్ట్ ప్లస్ సభ్యుల కోసం రేపటి నుండే ప్రారంభం. కాగా యాపిల్ ఐఫోన్14 ప్లస్, ఐఫోన్ 14 ప్రొ, యాపిల్ 14 ప్రో మాక్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఫోన్ 15 ఈ ఏడాది సెప్టెంబర్ ప్రారంభంలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. (Today August 2nd gold price గుడ్ న్యూస్: దిగొస్తున్న పసిడి, వెండి ధరలు) -
ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్న వారికి షాక్! డిస్కౌంట్ డబ్బు వెనక్కి కట్టాలి?
సబ్సిడీల దుర్వినియోగం ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ (Electric Two wheeler) కంపెనీల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు కొన్నవారు ఆ వాహనాలపై తాము పొందిన డిస్కౌంట్ను ఆయా కంపెనీలకు వెనక్కి కట్టాల్సి రావచ్చు. ఫేమ్2 పథకం నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో సంస్థలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా సంస్థలు పొందిన సబ్సిడీ మొత్తం రూ. 469 కోట్లు తిరిగి కట్టాలని భారీ పరిశ్రమల శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కాగా తమకు సబ్సిడీలు రద్దు చేసిన నేపథ్యంలో తాము కస్టమర్లకు ఇచ్చిన డిస్కౌంట్లను వారి నుంచి వెనక్కి కోరే అవకాశాన్ని పరిశీలించాలని ఆ ఏడు ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ ప్రతిపాదనను తెలియజేస్తూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల సొసైటీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖకు తాజాగా ఓ లేఖ రాసింది. ఇదీ చదవండి ➤ GST on EV Charging: ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్పై జీఎస్టీ! పబ్లిక్ చార్జింగ్ స్టేషన్లలో వర్తింపు హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్ , ఆంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, అమో మొబిలిటీ, లోహియా ఆటో కంపెనీలు నిబంధనలను ఉల్లంఘించి ఆర్థిక ప్రోత్సాహకాలను పొందినట్లు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ జరిపిన విచారణలో వెల్లడైంది. దీంతో ఆయా కంపెనీలు పొందిన సబ్సిడీలను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇంపోర్టెడ్ పార్ట్స్ వినియోగం ఫేమ్2 పథకం నిబంధనల ప్రకారం.. మేడ్ ఇన్ ఇండియా కాంపోనెంట్లను ఉపయోగించి ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తే ప్రోత్సాహకాలు వర్తిస్తాయి. కానీ ఈ ఏడు సంస్థలు విదేశాల దిగుమతి చేసుకున్న విడి భాగాలను ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. చాలా ఈవీ కంపెనీలు ఈ ఎలక్ట్రిక్ వాహనాల దేశీయ తయారీని పెంచడానికి ఉద్దేశించిన దశల తయారీ ప్రణాళిక (PMP) నిబంధనలను పాటించకుండా సబ్సిడీలను క్లెయిమ్ చేస్తున్నారని ఆరోపిస్తూ అనామక ఈ-మెయిల్లు అందడంతో మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలను ప్రోత్సహించడానికి 2019లో రూ. 10,000 కోట్లతో ఫేమ్2 ((ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రారంభించిన ఫేమ్ పథకానికి కొనసాగింపు. -
అన్లిమిటెడ్ స్టోర్లలో 60% వరకు ఆఫర్లు
హైదరాబాద్: అరవింద్ లైఫ్స్టైల్ గ్రూప్ అనుబంధ సంస్థ అన్లిమిటెడ్ సోర్ట్ అన్ని రకాల బ్రాండెడ్ వస్త్రాలపై 60% వరకు ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఆగస్టు మూడో తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. అన్ని వయస్సుల వారికి సరిపడే సరికొత్త డిజైన్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. కొత్త డిజైన్లను కస్టమర్లు ఇష్టపడతారని, నాణ్యమైన ఉత్పత్తులు ఆకర్షిస్తాయని పేర్కొంది. -
హాట్ డీల్: రూ.12 వేలకే లేటెస్ట్ శాంసంగ్ స్మార్ట్ఫోన్!
తక్కువ ధరకు కొత్త బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే మీ కోసం ఓ అద్భుతమైన డీల్ ఉంది. ప్రముఖ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) స్మార్ట్ ఫోన్ అత్యధిక డిస్కౌంట్ లభిస్తోంది. ఆఫర్లు ఇవీ... ప్రముఖ ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్ శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 స్మార్ట్ ఫోన్పై 29 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఏడాది క్రితం లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ వాస్తవ ధర రూ.16,999 కాగా ఫ్లిప్కార్ట్లో రూ.11,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఎక్స్ఛేంజ్ ఆఫర్, బ్యాంకు డిస్కౌంట్లను ఉపయోగించుకుంటే మరింపు తగ్గింపు లభిస్తుంది. పాత ఫోన్లను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఏకంగా రూ.11,450 వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. యాక్సిస్ బ్యాంక్ కార్డును ఉపయోగించి కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్ బ్యాక్, అదే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డును వినియోగిస్తే 5 శాతం తగ్గింపు అదనంగా లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ఫీచర్స్ 6.6 అంగులాల డిస్ప్లే. ఆక్టాకోర్ శాంసంగ్ ఎక్సినోస్ 850 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ ట్రిపుల్ రియర్ కెమెరా, 50 ఎంపీ మెయిన్ సెన్సర్, 5 ఎంపీ అల్ట్రావైడ్ సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇదీ చదవండి: కొత్త కొత్తగా.. మోటో జీ32 స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్లు -
యాపిల్ ఎయిర్పాడ్స్ కొనాలంటే ఇప్పుడే కొనేయండి..రూ.20వేల డిస్కౌంట్!
ప్రముఖ ఈ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ యాపిల్ లవర్స్కు శుభవార్త చెప్పింది. యాపిల్ ఫస్ట్ జనరేషన్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్ను భారీ డిస్కౌంట్కే అందిస్తున్నట్లు తెలిపింది. యాపిల్ హెడ్ఫోన్స్ ధర ఎక్కువ ఇప్పుడా ప్రొడక్ట్లపై రూ.20,000 డిస్కౌంట్ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఎయిర్ పాడ్స్ ప్రో ధరని సైతం రూ.8,000 పైగా తగ్గిస్తుండగా.. వీటిపై బ్యాంక్ ఆఫర్లను అదనంగా పొందవచ్చు. యాపిల్ సంస్థ ఆన్లైన్ స్టోర్లో ఎయిర్పాడ్స్ మ్యాక్స్ను రూ.59,900కే విక్రయిస్తుంది. ఫ్లిప్కార్ట్ మాత్రం వాటి ధరను రూ.19,901 తగ్గించి రూ.39,999కే అమ్ముతుంది. అదనంగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై రూ.1250 డిస్కౌంట్,ఈఎంఐ సదుపాయం ఉంది. దీంతో ఫ్లిప్కార్ట్లో వాటి ధర రూ.38,749కి తగ్గుతుంది. అయితే, ఈ డీల్ పింక్ మోడల్ ఎయిర్పాడ్స్ మ్యాక్స్కు మాత్రమే వర్తిస్తుంది. గ్రీన్, సిల్వర్ కలర్ ధర రూ.44,999. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై రూ. 3,000 తగ్గింపు పొందవచ్చు. అంటే బ్యాంక్ ఆఫర్తో రూ.41,999కే సొంతం చేసుకోవచ్చు. భారీ తగ్గింపు యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోను ఫ్లిప్ కార్ట్ కేవలం రూ.16,990కే అమ్ముతుంది. వీటి మార్కెట్ ధర రూ. 24,900 గా ఉంది. యాపిల్ ఫస్ట్ జనరేషన్ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఫ్లిప్కార్ట్లో రూ. 7,910 డిస్కౌంట్ లభిస్తుండగా పైన పేర్కొన్న బ్యాంక్ ఆఫర్తో వాటి ధర రూ.15,740కి తగ్గుతుంది. 2వ తరం యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రో రెండవ తరం ఎయిర్పాడ్స్ ప్రోని యాపిల్.ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. వైర్లెస్ ఇయర్బడ్లు యాపిల్ అధికారిక వెబ్సైట్లో ధర రూ. 26,900 అందుబాటులో ఉన్నాయి. అయితే వినియోగదారులు ఎటువంటి బ్యాంక్ కార్డ్ని ఉపయోగించకుండా ఫ్లిప్కార్ట్ ద్వారా తగ్గింపు ధరతో రూ. 24,990కే పొందవచ్చు. -
ఇంత మంచి డిస్కౌంట్ మళ్ళీ రాదు.. హైలక్స్ కొనుగోలుపై బంపర్ ఆఫర్!
Toyota Hilux Discounts: భారతీయ మార్కెట్లో 'టయోటా' (Toyota) కార్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కంపెనీ ఇప్పుడు తన పికప్ ట్రక్కు 'హైలక్స్' (Hilux) మీద కనీవినీ ఎరుగని డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఇప్పటికే మంచి సంఖ్యలో అమ్ముడవుతున్న 'టయోటా హైలక్స్ పికప్' (Toyota Hilux Pickup) ట్రక్కు మీద కంపెనీ రూ. 6 లక్షల నుంచి రూ. 8 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో సంస్థ ఈ వెహికల్ బేస్ వేరియంట్ ధరలు రూ. 3.60 లక్షలు తగ్గించి, ఇతర వేరియట్ల ధరలను రూ. 1.35 లక్షల వరకు పెంచింది. కాగా ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. టయోటా హైలక్స్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి స్టాండర్డ్ ఎమ్టి, హై ఎమ్టి, హై ఏటీ. ఈ పికప్ ట్రక్కు ఇప్పటి వరకు 1300 యూనిట్లు అమ్ముడైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీని ధరలు రూ. 30.40 లక్షల నుంచి రూ. 37.90 లక్షల మధ్య ఉన్నాయి. (ఇదీ చదవండి: యమహా ఆర్ఎక్స్100 మళ్ళీ రానుందా? ఇదిగో క్లారిటీ!) ప్రస్తుతం దేశంలోని కొన్ని కంపెనీ డీలర్షిప్లు రూ. 6 లక్షల డిస్కౌంట్ అందిస్తున్నట్లు, ఢిల్లీ-ఎన్సిఆర్ ప్రాంతంలోని డీలర్షిప్లు రూ. 8 లక్షల వరకు తగ్గింపుని అందిస్తున్నట్లు సమాచారం. అయితే తగ్గింపులు ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉండే అధికారిక డీలర్షిప్లను సందర్శించి తెలుసుకోవచ్చు. (ఇదీ చదవండి: అదరగొట్టిన 'నెక్సాన్ ఈవీ'.. టాటా ఆంటే మినిమమ్ ఉంటది!) 2022 మార్చిలో ప్రారంభమైన ఈ హైలక్స్ అద్భుతమైన డిజైన్, ఫీచర్స్ కలిగి మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. దీని కోసం కంపెనీ ఇందులో 2.8 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ అమర్చింది. మాన్యువల్ వేరియంట్లలో 201 బిహెచ్పి, 420 ఎన్ఎమ్ టార్క్.. ఆటోమేటిక్ వేరియంట్లలో 500 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ అండ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కావున ఉత్తమ పనితీరుని అందిస్తుంది. -
షాపింగ్ లవర్స్కు అమెజాన్ బంపరాఫర్.. కేవలం రెండు రోజులే!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రత్యేక సేల్ను నిర్వహించేందుకు సిద్ధమైంది. కేవలం రెండ్రోజుల పాటు జరిగే ఈ సేల్లో కొనుగోలు దారులు వారికి కావాల్సిన వస్తువుల్ని డిస్కౌంట్ ధరలో పొందవచ్చని అమెజాన్ తెలిపింది. ఎక్స్క్లూజివ్గా స్మార్ట్ఫోన్స్,ల్యాప్ట్యాప్స్,ఎలక్ట్రానిక్స్,హోమ్అప్లయెన్సెస్పై అందిస్తుంది అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ తేదీ వివరాలు భారత్లో అమెజాన్ రెండు రోజుల పాటు ఈ సేల్ను నిర్వహించనుంది. జులై 12ఏమ్ నుంచి ప్రారంభమై..జులై 16 వరకు కొనసాగుతుంది.ప్రత్యేక అమ్మకాల్లో కొనుగోలు దారులు డిస్కౌంట్స్, సేవింగ్స్, కొత్తగా మార్కెట్లో విడుదలైన ప్రొడక్ట్లపై ఆఫర్లను సొంతం చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో బ్యాంక్ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్ డే సేల్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్/ డెబిట్ కార్డ్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్లపై 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు. అదే కార్డ్లపై ఈఎంఐ సౌకర్యం కూడా ఉంది. అదనంగా, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్పై 5 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మీకు ప్రయాణాలంటే ఇష్టమైతే..ట్రావెల్స్ బుకింగ్స్లో ఈ కార్డ్ వినియోగంతో అన్లిమిటెడ్ ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు బిల్లు చెల్లింపులు కూడా చేసుకోవచ్చు. వీటిపై 50 శాతం డిస్కౌంట్ వన్ప్లస్, ఐక్యూ, రియల్మీ నార్జో, శాంసంగ్, మోటరోలా,బోట్,సోనీ ఇలా 400 కంటే ఎక్కువ జాతీయ, అంతర్జాతీయ ఉత్పత్తులపై తగ్గింపును అందిస్తుంది. విక్రయ సమయంలో కొనుగోలుదారులు టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు మొదలైన వాటిపై తగ్గింపును పొందుతారు. అదనంగా, స్మార్ట్ స్పీకర్లు, స్మార్ట్ డిస్ప్లేలు, ఫైర్ టీవీ ఉత్పత్తులపై 55శాతం వరకు తగ్గింపు అందిస్తున్నట్లు అమెజాన్ ప్రకటించింది. చదవండి👉 ఎలాన్ మస్క్కు ఏమైంది? ఆ మందులు ఎందుకు వాడుతున్నట్లు? -
50% డిస్కౌంట్: అన్లిమిటెడ్ స్టోర్స్లో ‘రెడ్ అలర్ట్ సేల్’
న్యూఢిల్లీ: వివిధ ఉత్పత్తులపై అత్యుత్తమ రాయితీలు, ఆఫర్లతో ‘రెడ్ అలర్ట్ సేల్’ ప్రారంభించినట్లు అన్లిమిటెడ్ స్టోర్స్ ప్రకటించింది. అన్ని బ్రాండెడ్ వస్త్రాలపై 50% ఫ్లాట్ ఆఫర్ అందిస్తుంది. అలాగే రూ. 3 వేల షాపింగ్పై అంతే విలువైన ఉత్పత్తులను ఉచితంగా పొందవచ్చు. దేశవ్యాప్తంగా అన్ని అన్లిమిటెడ్ స్టోర్లలో ఈ ఆఫర్ జూలై రెండో తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కస్టమర్లంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కంపెనీ కోరింది. -
క్రోమా ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’.. స్మార్ట్ఫోన్లు, గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు
హైదరాబాద్: కొత్త విద్యా సంవత్సరం(2023–24) ప్రారంభం సందర్భంగా ఎలక్ట్రానిక్స్ రిటైలర్ క్రోమా.. ‘బ్యాక్ టు క్యాంపస్ సేల్’ పేరుతో గ్యాడ్జెట్లపై అద్భుతమైన ఆఫర్లు ప్రకటించింది. విద్యార్థులు, ఔత్సాహికుల భిన్న అవసరాలను తీర్చేందుకు హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, ల్యాప్ ట్యాప్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లు, స్మార్ట్వాచీలపై భారీ డిస్కౌంట్లు ఇస్తుంది. ఈ ఆఫర్లు పొందేందుకు సమీప క్రోమా స్టోర్టు లేదా ఆన్లైన్లో www.croma.com వెబ్సైట్ను సందర్శించవచ్చు. ల్యాప్టాప్లపై డీల్స్ నెలకు రూ. 1,412 కంటే తక్కువ ఈఎంఐతో 350కి పైగా ల్యాప్టాప్లు ఈ సేల్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటెల్ కోర్ ఐ3 ల్యాప్టాప్లు రూ. 32,990 నుంచే ప్రారంభమవుతాయి. రైజెన్ 3 ద్వారా ఆధారితమైన గేమింగ్ ల్యాప్టాప్లను రూ. 37,990 నుంచే కొనుగోలు చేయవచ్చు. వీటిలో మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్స్ ముందే ఇన్స్టాల్ చేసి ఉంటాయి. ఇక అన్ని యాపిల్ ఉత్పత్తులపైనా డీల్స్ ఉన్నాయి. టాబ్లెట్లు, స్మార్ట్ఫోన్లపై.. క్రోమా సేల్లో రూ.11,999తో టాబ్లెట్ను కొనుగోలు చేయవచ్చు. నెలకు కేవలం రూ. 1,337 ఈఎంఐతో స్మార్ట్ఫోన్లను సొంతం చేసుకోవచ్చు. క్రోమా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్లపై రూ. 8,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంపిక చేసిన స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై కేవలం రూ. 499లకే రూ.9,999 విలువైన కాలింగ్-ఎనేబుల్డ్ స్మార్ట్వాచ్ను పొందవచ్చు. -
మీరు స్టూడెంట్సా? యాపిల్ బంపరాఫర్.. భారీ డిస్కౌంట్లు, ఫ్రీగా ఎయిర్ పాడ్స్!
భారతీయ విద్యార్ధులకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ శుభవార్త చెప్పింది. వారి కోసం ప్రత్యేక సేల్ను అందుబాటులోకి తెచ్చింది. ‘బ్యాక్ టూ యూనివర్సిటీ 2023’ పేరుతో జూన్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరిగే ఈ సేల్లో విద్యార్ధులు కొనుగోలు చేసే ఐపాడ్, మ్యాక్బుక్స్,డెస్క్ ట్యాప్ కంప్యూటర్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు తెలిపింది. 11 అంగుళాల యాపిల్ ఐపాడ్ ప్రో, 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో, 24 అంగుళాల ఐపాడ్ పో’లు డిస్కౌంట్ ధరకే సొంతం చేసుకోవచ్చని పేర్కొంది. ఇక, ఈ సేల్లో కొనుగోలు చేసే ప్రొడక్ట్లపై ఉచితంగా ఎయిర్ పాడ్స్, యాపిల్ కేర్ ప్లస్ ప్లాన్స్ పై 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. బ్యాక్ టూ యూనివర్సిటీ సేల్లో విద్యార్ధులతో పాటు బోధన,బోధనేతర సిబ్బంది యాపిల్ ప్రొడక్ట్లను మార్కెట్ ధర కంటే తక్కువకే పొందవచ్చు. ప్రస్తుతం, కొనసాగుతున్న సేల్లో అర్హులైన కస్టమర్లు 11 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.96,900 ఉంటే రూ.76,900కే కొనుగోలు చేయొచ్చు. 12.9 అంగుళాల ఐపాడ్ ప్రో ధర రూ.1,12,900 ఉంటే రూ.1,02,900కే, రూ.59,900 ఐపాడ్ను రూ.54,900కే పొందవచ్చు. ఈ మూడు ఐపాడ్ మోడళ్లపై సెకండ్ జనరేషన్ యాపిల్ పెన్సిల్లు ఉచితంగా అందిస్తుంది. ఎం 1 పవర్డ్ 13 అంగుళాల మాక్ బుక్ ఎయిర్ను రూ. 89,900కే సొంతం చేసుకోవచ్చు. దీని అసలు లాంచ్ ధర రూ.99,900గా ఉంది. 13 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ 13 అసలు ధర రూ.1,29,900 కాగా రూ.1,04,900 కే విద్యార్ధులు కొనుగోలు చేయొచ్చు. సేల్లో 15 అంగుళాల మ్యాక్ బుక్ ఎయిర్ ధర రూ. 1,24,900, అసలు ధర రూ. 1,34,900 గా ఉంది. తాజా,ఆఫర్లు ధృవీకరించబడిన విద్యార్ధులకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. యూనివర్సిటీ విద్యార్థులు,ఇతర సిబ్బంది యాపిల్ అధికారిక వెబ్సైట్ను విజిట్ చేసి అర్హులో, కాదో తెలుసుకోవచ్చు. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
ఇక మెడ్ప్లస్ సొంత బ్రాండ్ మందులు.. 80 శాతం వరకు డిస్కౌంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధాల విక్రయంలో ఉన్న హైదరాబాద్ సంస్థ మెడ్ప్లస్ హెల్త్ సర్వీసెస్.. సొంత బ్రాండ్లో మందుల అమ్మకాల్లోకి ప్రవేశించింది. 50–80% డిస్కౌంట్తో వీటిని విక్రయిస్తున్నట్టు సంస్థ ఎండీ, సీఈవో గంగాడి మధుకర్ రెడ్డి తెలిపారు. కంపెనీ సీవోవో చెరుకుపల్లి భాస్కర్ రెడ్డి, చీఫ్ స్ట్రాటజిక్ ఆఫీసర్ చేతన్ దీక్షిత్తో కలిసి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. వివిధ చికిత్సలు, దీర్ఘకాలిక జబ్బులకువాడే 500లకుపైగా పేటెంట్యేతర ఔషధాలను మెడ్ప్లస్ బ్రాండ్లో ప్రవేశపెట్టినట్టు మధుకర్ చెప్పారు. జీఎంపీ, ఈయూ జీఎంపీ ధ్రువీకరణ పొందిన ప్లాంట్లలో మందులు తయారవుతున్నట్టు వివరించారు. ఏటా 1,000 స్టోర్లు.. ప్రతి ఏటా మెడ్ప్లస్ ఫార్మసీ విభాగంలో 1,000 రిటైల్ ఔట్లెట్లను తెరుస్తామని మధుకర్ రెడ్డి తెలిపారు. ‘వీటి ఏర్పాటుకు ఏటా సుమారు రూ.300 కోట్లు అవసరం అవుతాయి. ఏడు రాష్ట్రాల్లోని 552 నగరాలు, పట్టణాల్లో ప్రస్తుతం 3,822 స్టోర్లు ఉన్నా యి. ఈ ఏడాదే ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కేరళ రా ష్ట్రాల్లో అడుగుపెడుతున్నాం. 2022–23లో రూ. 4,550 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయం ఆర్జించాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 25% వృద్ధి ఆశిస్తున్నాం. డిస్కౌంట్ల వల్ల లాభాలపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదు’ అని వెల్లడించారు. సంస్థకు 22 వేల పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. -
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త.. హోటళ్లు అడ్వాన్స్ బుకింగ్ చేస్తే..
అమర్నాథ్ యాత్ర జూలై 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. యాత్రకు బయలుదేరే భక్తులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రయాణానికి అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్ అమర్నాథ్ యాత్రికులకు ఒక శుభవార్త తెలిపింది. అమర్నాథ్ యాత్రికులకు ప్రయాణ సమయాన ఇబ్బందులను దూరం చేస్తే వార్త ఇది. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగించనుంది. అమర్నాథ్ యాత్ర చేసేవారు ముందుగా హోటల్ బుక్ చేసుకుంటే వారికి భారీ రాయితీ లభించనుంది. ఈ విషయాన్ని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాంజ్ అసోసియేషన్(ఏజేహెచ్ఎల్ఏ) ఒక ప్రకటనలో తెలియజేసింది. జమ్ములో బసచేసే అమర్నాథ్ యాత్రికులు ఇక్కడి హోటల్స్ను ముందుగానే బుక్ చేసుకుంటే 30 శాతం రాయితీ అందించనున్నట్లు ఏజేహెచ్ఎల్ఏ ఆ ప్రకటనలో తెలియజేసింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పవన్గుప్తా మాట్లాడుతూ తాము సదుద్దేశంతో అమర్నాథ్ యాత్రికులలో ఇక్కడి హోటల్స్లో బసచేసేవారికి 30 శాతం రాయితీ అందజేస్తున్నట్లు తెలిపారు. తద్వారా అమర్నాథ్ యాత్రికులకు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుందన్నారు. జూలై 1 నుంచి అమర్నాథ్ యాత్ర ఎంతో పవిత్రంగా భావించే అమర్నాథ్ గుహ దక్షిణ కశ్మీర్లోని హిమాలయాల నడుమ, సమద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉంది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 62 రోజుల తీర్థయాత్ర రెండు మార్గాల గుండా సాగుతుంది. వాటిలో ఒకటి అనంత్నాగ్ జిల్లాలో 48 కిలోమీటర్ల పొడవున సాగుతుంది. మరొకటి బందర్బల్ జిల్లాలో 14 కిలోమీటర్ల పొడవున కొనసాగుతుంది. ఈ యాత్రలో పాల్గొనేవారు జూన్ 30 నాటికి జమ్మునకు చేరుకోవాల్సి ఉంటుంది. కాగా ఈసారి అమర్నాథ్ యాత్రకు భారీ సంఖ్యలో భక్తుల వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. చదవండి: ‘ఆది పురుష్’పై విమర్శల బాణం ఎక్కుపెట్టిన అఖిల భారత హిందూ మహాసభ! -
గుడ్ న్యూస్.. ఐఫోన్ లవర్స్కి ఇదే మంచి సమయం
Amazon Apple Sale Days: భారతదేశంలో ఐఫోన్కు ఉన్న క్రేజు అంతా .. ఇంతా.. కాదు. యువతరం మొత్తం ఐఫోన్ అంటే పడి సచ్చిపోతారు. అలాంటి వారి కోసం అమెజాన్ కొత్త యాపిల్ డేస్ సేల్స్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్లపై మీద భారీ తగ్గింపులను అందిస్తోంది. ఈ అవకాశం కేవలం వారం రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది. తక్కువ ధరకు ఐఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు జూన్ 17లోపు కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ దిగ్గజం బ్యాంకు కార్డుల మీద తగ్గింపులను అందించడం మాత్రమే కాకుండా.. ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఐఫోన్ 14 సిరీస్ మొబైల్స్ మీద అమెజాన్ అందించే ఆఫర్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. యాపిల్ సంస్థ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ను ప్రకటించిన సంగతి తెలిసిందే.. ఇందులో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉన్నాయి. ఐఫోన్ 14 (iPhone 14) దేశీయ మార్కెట్లో ఐఫోన్ 14 128జీబీ మోడల్ ధర రూ. 79,999. ఆఫర్ కింద 15 శాతం తగ్గింపుతో దీనిని రూ. 67,999 కే సొంతం చేసుకోవచ్చు. అదే సమయంలో 256 జీబీ వేరియంట్ని (రూ. 89,900) 13 శాతం తగ్గింపుతో రూ. 77,999కే.. 512 జీబీ వేరియంట్ ధర రూ. 1,09,900 కాగా 11 శాతం తగ్గింపుతో రూ. 97,999కి కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) యాపిల్ సేల్ డేస్ ఆఫర్ సమయంలో ఐఫోన్ 14 ప్లస్ కొనుగోలు చేయాలనుకునే వారు దీనిని రూ. 76,999కి కొనుగోలు చేయవచ్చు. మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి పెద్ద స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 89,900. ఆఫర్ సమయంలో 14 శాతం తగ్గింపు లభిస్తుంది. కావున ఇది రూ. 76,999కే లభిస్తుంది. ఇక 256GB వేరియంట్ ధర రూ. 99,900 కాగా.. అమెజాన్ ఆపిల్ డే సేల్ సమయంలో 13 శాతం తగ్గుదలతో రూ. 86,999కి లభిస్తుంది. (ఇదీ చదవండి: నెటిజన్లను భయపెడుతున్న ఆనంద్ మహీంద్రా ట్విటర్ వీడియో) ఐఫోన్ 14 ప్రో (iPhone 14 Pro) ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్తో సహా ఐఫోన్ 14 సిరీస్ హై-ఎండ్ మోడల్లు కూడా ప్రస్తుతం సుమారు 9 శాతం తగ్గింపు ధరతో అందుబాటులో ఉన్నాయి. 128జీబీ స్టోరేజ్ అండ్ 256జీబీ స్టోరేజ్ కలిగిన ఐఫోన్ 14 ప్రో అసలు ధరలు వరుసగా రూ. 1,29,900 & రూ. 1,39,900 కాగా.. ఆఫర్ కింద ఇవి రూ. 1,19,999 అండ్ రూ. 1,34,990 ధర వద్ద అందుబాటులో ఉంటాయి. (ఇదీ చదవండి: వేలంలో కోట్లు పలికిన చెక్కతో తయారైన కారు - దీని ప్రత్యేకత ఏమిటంటే?) ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ (iPhone 14 Pro Max) ఆపిల్ సెల్ డేస్ ఆఫర్ కింద ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ కొనాలనుకునే వారు సాధారణ ధరకంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. 14 ప్రో మ్యాక్స్ 128జీబీ ధర రూ. 1,39,900, అదే సమయంలో 256జీబీ వేరియంట్ ధర రూ. 1,49,900. ఆఫర్ కింద వీటిని వరుసగా రూ. 1,27,999 అండ్ రూ. 1,43,990 కే సొంతం చేసుకోవచ్చు. -ఎన్.కుమార్ -
టాటా కార్ల కొనుగోలుపై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్ - ఏ కారుపై ఎంతంటే?
Discounts: భారతీయ వాహన తయారీ దిగ్గజం 'టాటా మోటార్స్' (Tata Motors) దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లను విడుదల చేసి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. కాగా కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని కార్ల మీద అద్భుతమైన ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో టాటా టియాగో, టిగర్, ఆల్ట్రోజ్, హారియర్, సఫారీ వంటి కార్లు ఉన్నాయి. అయితే సంస్థ టాటా పంచ్ మరియు నెక్సాన్ కార్ల మీద ఎటువంటి తగ్గింపులను అందించడం లేదు. కాగా కంపెనీ ఏ కారు మీద ఎంత డిస్కౌంట్ అందిస్తోంది? ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా టియాగో (Tata Tiago) భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలు పొందుతున్న హ్యాచ్బ్యాక్స్ లో ఒకటైన టియాగో మీద కంపెనీ రూ. 43000 వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే ఇది మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తుంది. కావున వేరియంట్ని బట్టి డిస్కౌంట్ మారుతుంది. టియాగో పెట్రోల్ వేరియంట్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. ఇందులో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, రూ. 20000 వరకు కంజ్యుమర్ స్కీమ్ కింద తగ్గింపు లభిస్తుంది. ఇక CNG వేరియంట్ మీద 43000 తగ్గింపు లభించగా.. ఇందులో కంజ్యుమర్ స్కీమ్ కింద రూ. 30 వేలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ రూ. 10,000, రూ. 3000 కార్పొరేట్ డిస్కౌంట్ ఉంటుంది. దేశీయ మార్కెట్లో ఈ హ్యాచ్బ్యాక్ మారుతి స్విఫ్ట్, ఇగ్నీస్, గ్రాండ్ ఐ వంటి వాటికి ఇది ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. టాటా టిగోర్ (Tata Tigor) టాటా మోటార్స్ ఇప్పుడు టిగోర్ పెట్రోల్ మోడల్ మీద రూ. 33,000 తగ్గింపుని సిఎన్జీ మోడల్ మీద రూ. 48000 తగ్గింపుని ప్రకటించింది. ఈ రెండు మోడల్స్ మీద ఎక్స్చేంజ్ డిస్కౌంట్, కంజ్యుమర్ స్కీమ్ లభించే డిస్కౌంట్ మాత్రమే కాకుండా కార్పొరేట్ తగ్గింపులు కూడా లభిస్తాయి. (ఇదీ చదవండి: సగం జీతానికి పనిచేసిన 'నారాయణ మూర్తి' బిలీనియర్ ఎలా అయ్యాడంటే?) టాటా ఆల్ట్రోజ్ (Tata Altroz) టాటా ఆల్ట్రోజ్ మీద ఇప్పుడు రూ. 30000 వరకు బెనిఫీట్స్ లభిస్తున్నాయి. ఈ తగ్గింపులు కేవలం పెట్రోల్, డీజిల్ మోడల్స్కి మాత్రమే వర్తిస్తాయి. అయితే ఈ మధ్య కాలంలో విడుదలైన సిఎన్జీ మోడల్ మీద మాత్రం ఎటువంటి తగ్గింపులు లభించవు. పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25,000 తగ్గింపు, డీజిల్ మోడల్ మీద రూ. 30,000 తగ్గింపు లభిస్తుంది. (ఇదీ చదవండి: ట్రక్కులందు ఈ ట్రక్కు వేరయా.. దీని గురించి తెలిస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తది!) టాటా హారియర్ & సఫారి (Tata Harrier and Safari) టాటా హారియర్ & సఫారి కార్ల కొనుగోలుపైన రూ. 35000 వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు SUVల మీద రూ. 25,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో కార్పొరేట్ తగ్గింపు కింద రూ. 10,000 తగ్గింపు లభిస్తుంది. అయితే ఈ రెండు మోడల్స్ మీద ఎటువంటి కంజ్యుమర్ బెనిఫిట్స్ లభించవు. "డిస్కౌంట్లు నగరం నుంచి నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. కావున ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న డీలర్షిప్ సందర్శించండి.'' -
46 శాతం డిస్కౌంట్తో ప్రీమియం మొబైల్.. ఇలా చేస్తే మీ సొంతం!
Xiaomi 12 Pro: మార్కెట్లో అత్యంత ఖరీదైన స్మార్ట్ఫోన్ల జాబితాలో 'షావోమి 12 ప్రొ' (Xiaomi 12 Pro) ఒకటి. ఈ మొబైల్ ఇప్పుడు ఏకంగా 46 శాతం డిస్కౌంట్తో సరసమైన ధరకే లభిస్తుంది. ఈ లేటెస్ట్ మొబైల్ని అందుబాటు ధరకు ఎలా కొనాలి? ఎక్కడ కొనాలి? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో సేవింగ్స్ డేస్ సేల్స్లో భాగంగా షావోమి 12 ప్రొ మొబైల్ 46 శాతం తక్కువ ధరకే లభిస్తుంది. ఈ సేల్స్లో కేవలం ఈ మొబైల్ ఫోన్ మీద మాత్రమే కాకుండా.. ఇతర ప్రీమియం స్మార్ట్ఫోన్స్, బడ్జెట్ స్మార్ట్ఫోన్ల మీద కూడా ఆకర్షణీయమైన తగ్గింపు లభిస్తుంది. 8 జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ కలిగిన షావోమి 12 ప్రొ 5జీ ఫోన్ అసలు ధర రూ. 79999. అయితే డిస్కౌంట్ పొందిన తరువాత ఇది రూ. 42,499కే లభిస్తుంది. అంతే కాకుండా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కింద ఈ ధర మరింత తగ్గుతుంది. అన్ని ప్రీమియం ఫీచర్స్ కలిగిన ఈ మొబైల్ ఫోన్ 5జీ నెట్వర్క్ పొందుతుంది. అంతే కాకుండా ఇందులో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్ సెట్ అమర్చారు. 120 హెర్జ్స్ రిఫ్రెష్ రేటుతో 6.72 ఇంచెస్ అమొలెడ్ డిస్ప్లే, అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. (ఇదీ చదవండి: ఒక్క బిజినెస్.. వందల కోట్ల టర్నోవర్ - వినీత సింగ్ సక్సెస్ స్టోరీ!) షావోమి 12 ప్రొ కొనాలనుకునే వారు HDFC క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా మంచి కండిషన్లో ఉన్న మొబైల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటే ధర ఇంకా తగ్గుతుంది. దాదాపు రూ. 80వేల మొబైల్ సగం ధరకే కొనుగోలు చేయడానికి తప్పకుండా ఈ కండిషన్స్ పాటించాలి. -
ఈ మారుతి కార్లను ఇప్పుడే కోనేయండి.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదేమో!
Maruti Suzuki Discounts: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్ల తయారీ సంస్థ 'మారుతి సుజుకి' (Maruti Suzuki) ఇప్పుడు ఎంపిక చేసిన కొన్ని ఉత్పత్తుల మీద అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. కావున కొనుగోలుదారులు వీటి మునుపటి ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మారుతి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. ఈ కార్ల కొనుగోలుపైన కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్ మారుతి సుజుకి ఇగ్నిస్ కొనుగోలుపైన రూ. 64,000 వరకు బెనిఫీట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ మాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్లకు వర్తిస్తుంది. ఇందులో రూ. 35,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 4000 కార్పొరేట్ బెనిఫీట్స్ ఉన్నాయి. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్తో పనిచేస్తుంది. దీని ధర దేశీయ విఫణిలో రూ. 5.84 లక్షల నుంచి రూ. 8.16 లక్షల మధ్య ఉంది. మారుతి సుజుకి సియాజ్ సియాజ్ కొనుగోలుపైన రూ. 33,000 అదా చేసుకోవచ్చు. ఇది నెక్సా లైనప్లోని ప్రాధమిక మోడల్. కస్టమర్లు దీనిపైన రూ. 30,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్, రూ. 3,000 కార్పొరేట్ తగ్గింపుని పొందవచ్చు. అయితే దీని పైన క్యాష్ డిస్కౌంట్ అందుబాటులో లేదు. ఈ కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 105 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ధర మార్కెట్లో రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంది. (ఇదీ చదవండి: 27 ఏళ్ల తర్వాత ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు.. రిజిస్ట్రేషన్ ఇలా చేయండి) మారుతి సుజుకి బాలెనో దేశీయ మార్కెట్లో ఎక్కువమందికి ఇష్టమైన మోడల్, ఎక్కువ అమ్ముడవుతున్న బాలెనో కొనుగోలుపైన కూడా కొనుగోలుదారులు రూ. 35,000 బెనిఫీట్స్ పొందవచ్చు. డెల్టా మ్యాన్యువల్, ఆటోమేటిక్ వేరియంట్ల మీద రూ. 20,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందవచ్చు. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ పొందుతుంది. దీని ధర రూ. 6.61 లక్షల నుంచి రూ. 9.98 లక్షల మధ్య ఉంటుంది. (ఇదీ చదవండి: వేల కోట్లు వద్దనుకుని చిన్న అపార్ట్మెంట్లో రతన్ టాటా తమ్ముడు - ఎందుకిలా..) మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా ఈ ఆఫర్ స్టాక్ ఉన్నత వరకు మాత్రమే ఉంటుంది. కావున ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న స్థానిక డీలర్ను సంప్రదించవచ్చు. -
పెట్రోల్, డీజిల్పై డిస్కౌంట్.. ప్రభుత్వ బంకుల్లో కన్నా తక్కువ ధర
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్యూ) బంకుల కన్నా చౌకగా ప్రైవేట్ కంపెనీలు ఇంధనాలను విక్రయిస్తున్నాయి. జియో–బీపీ తర్వాత తాజాగా నయారా ఎనర్జీ ఈ జాబితాలోకి చేరింది. పీఎస్యూ బంకులతో పోలిస్తే రూ. 1 తక్కువకే తమ బంకుల్లో పెట్రోల్, డీజిల్ను విక్రయిస్తున్నట్లు వివరించింది. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో డిస్కౌంటు రేట్లకు విక్రయాలను జూన్ ఆఖరు వరకు కొనసాగించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా మొత్తం 86,925 పైచిలుకు పెట్రోల్ బంకులు ఉండగా.. నయారా ఎనర్జీకి 6,376 బంకులు (7 శాతం పైగా వాటా) ఉంది. జియో–బీపీ (రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ) తమ బంకుల్లో ప్రస్తుతం డీజిల్ను మాత్రమే పీఎస్యూ బంకుల కన్నా తక్కువకు విక్రయిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా ముడి చమురు రేట్లు తగ్గినప్పటికీ పీఎస్యూలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మాత్రం రేట్లను సవరించకుండా యథాప్రకారం కొనసాగిస్తున్నాయి. అయితే, జియో–బీపీ, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ సంస్థలు మాత్రం ఆ ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకే డిస్కౌంటుకు విక్రయిస్తున్నట్లు తెలిపాయి. ఇదీ చదవండి: Jio-bp premium diesel: జియో ప్రీమియం డీజిల్.. అన్నింటి కంటే తక్కువ ధరకే! -
అజియో ‘బిగ్బోల్డ్’ సేల్.. భారీ డిస్కౌంట్లతోపాటు బహుమతులు!
ముంబై: అజియో ‘బిగ్ బోల్డ్ సేల్’ (Ajio Big Bold Sale) పేరుతో ప్రత్యేక అమ్మకాల కార్యక్రమాన్ని చేపట్టింది. జూన్ 1 నుంచి మొదలు కానుంది. ఫ్యాషన్, లైఫ్ స్టయిల్, హోమ్, డెకార్, బ్యూటీ, జ్యువెలరీ, పర్సనల్ కేర్ ఉత్పత్తులపై మంచి డీల్స్ను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపులపై అదనంగా 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యేకమైన డీల్స్లో భాగంగా ఉత్పత్తులపై 50 నుంచి 90 శాతం వరకు తగ్గింపు ఇస్తున్నట్టు తెలిపింది. బిగ్బోల్డ్ సేల్లో అధిక కొనుగోళ్లు చేసిన కస్టమర్లకు ఐఫోన్ 14ప్రో, యాపిల్ మ్యాక్ బుక్ ఎయిర్, రూ.లక్ష విలువైన బంగారం, శామ్సంగ్ ఎస్23ను ఇస్తున్నట్టు పేర్కొంది. ముగ్గురు విజేతలు ఒక్కొక్కరు రూ.3 లక్షల విలువైన బంగారం గెలుచుకోవచ్చని ప్రకటించింది. -
మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కావాలా? తగ్గింపు ధరలో ఇదిగో బెస్ట్ ఆప్షన్!
సాక్షి, ముంబై: లావా అగ్ని-2 5జీ స్మార్ట్ఫోన్పై తగ్గింపుతో అందుబాటులో ఉంది. రూ. 2000 తగ్గింపుతో బుధవారం నుంచి దేశీయ మార్కెట్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మిడ్-రేంజ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్న వారికి లావా అగ్ని 2 5జీ బెస్ట్ అని చెప్పవచ్చు. ఈ రోజు (మే 24) నుండి ఈ స్మార్ట్ఫోన్ అమెజాన్లో అమ్మకానికి సిద్ధంగా ఉంది. (నైజిరియన్ చెఫ్ రికార్డ్: ఏకంగా 100 గంటలు వంట, ఎందుకో తెలుసా?) లావా అగ్ని 2 5జీ ఫీచర్లు 6.78-అంగుళాల FHD+ స్క్రీన్, మీడియా టెక్ సరికొత్త డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 16 ఎంపీ సెల్పీ కెమెరా 1.0-మైక్రాన్ (1 um) పిక్సెల్ సెన్సార్తో 50ఎంపీ క్వాడ్ కెమెరా 8 జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ 6W ఛార్జర్తో 4700mAh బ్యాటరీ ఫోన్ ధర రూ. 21,999 వద్దర ఆన్లైన్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రధాన క్రెడిట్ , డెబిట్ కార్డ్లపై రూ. 2,000 ఫ్లాట్ తగ్గింపుతో రూ. 19,999 లభించనుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. (‘నేనే కింగ్’: మాంగో అయినా లగ్జరీ వాచ్ అయినా...!) ఇదీ చదవండి: ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ‘గార్బేజ్ క్వీన్స్’ : వైరల్ ఫోటోలు -
విమాన ప్రయాణికులకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ ప్రయాణికులకు బంపరాఫర్ ప్రకటించింది. సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బెంగళూరు-గోవా, ముంబయి-గోవా నగరాల మధ్య ప్రయాణించే ప్యాసింజర్లకు రూ.1,818 ధరకే విమాన టికెట్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఈ ఆఫర్ సేల్ 23 మే 2023 నుంచి 28 మే 2023 వరకు అందుబాటులో ఉండనుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జులై 1, 2023 నుంచి మార్చ్ 30 ,2024 వరకు ఎప్పుడైనా ప్రయాణించవచ్చు. దీంతో పాటు 2023లో 18 ఏళ్లు వయసున్న ప్రయాణికులకు రూ.3,000 విలువైన ఉచిత ఫ్లైట్ వోచర్ను అందిస్తోన్నట్లు తెలిపింది. ఈ కూపన్ కోసం జూన్ 10 తేదీలోపు స్పైస్జెట్కు తమ వివరాలను ఈమెయిల్ చేయాలి. తర్వాత 10 జులై వరకు కూపన్ పంపుతారు. దాన్ని ఉపయోగించి 31 ఆగస్టులోపు టికెట్ బుక్ చేసుకుని 30 సెప్టెంబరులోపు ప్రయాణించాలి. అయితే, ఇందుకోసం కొన్ని షరతులు విధించింది. టికెట్ బుకింగ్ విలువ రూ.7,500 దాటిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పైస్జెట్ తెలిపింది. స్పైస్మ్యాక్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు 50 శాతం డిస్కౌంట్తోపాటు విమానంలో తమకు నచ్చిన సీటును కేవలం రూ. 18 చెల్లించి బుక్ చేసుకోవచ్చని తెలిపింది. Your destination: Savings! Celebrate our 18th anniversary with sky-high discounts. Book your tickets now at https://t.co/PykmFjGBqZ#flyspicejet #spicejet #18thAnniversary #SpiceJetAnniversary #sale #Travel #travelgram #Aviation #travelwithus #addspicetoyourtravel pic.twitter.com/2rjYDRXQ54 — SpiceJet (@flyspicejet) May 23, 2023 -
అదిరిపోయే క్రెడిట్ కార్డ్, భారీ డిస్కౌంట్లు.. ఉచితంగా రైల్వే సదుపాయాలు!
హైదరాబాద్: ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్పీసీఐ భాగస్వామ్యంతో బిజినెస్ క్యాష్ బ్యాక్ రూపే క్రెడిట్ కార్డ్ను విడుదల చేసింది. వ్యాపారస్తుల కోసం దీన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది. కార్డు ద్వారా కొనుగోళ్లపై 2 శాతం వరకు క్యాష్బ్యాక్, 48 రోజుల పాటు వడ్డీ లేని రుణ సదుపాయం, తక్షణ రుణ సదుపాయం ఈ కార్డులో భాగంగా ఉంటాయని ప్రకటించింది. అలాగే అగ్ని ప్రమాదాలు, దోపిడీలు, ఇళ్లు బద్ధలు కొట్టడం తదితర వాటికి కార్డులో భాగంగా బీమా కవరేజీ పొందొచ్చని ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తెలిపింది. ఎన్పీసీఐ సీఈవో దిలీప్ ఆస్బే సమక్షంలో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ, సీఈవో సంజయ్ అగర్వాల్ ఈ కార్డును ప్రారంభించారు. ఈ కార్డుపై లైఫ్స్టయిల్, ట్రావెల్ ప్రయోజనాలు కూడా ఉన్నట్టు బ్యాంక్ ప్రకటించింది. 300కు పైగా రెస్టారెంట్లలో 30% వరకు తగ్గింపు, ఏడాదికి 8 సార్లు రైల్వే లాంజ్లను ఉచితంగా వినియోగించుకునే సదుపాయం ఉంటుందని తెలిపింది. చదవండి👉 240 ఏళ్ల చరిత్రలో మ్యాన్ గ్రూప్ సంచలనం.. తొలిసారి మహిళా సీఈవో నియామకం! -
మారుతి కారు కొనాలా? ఇంతకంటే మంచి సమయం రాదు!
దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి ఈ నెలలో (2023 మే) ఎంపిక చేసిన నెక్సా లైనప్ మోడల్స్పై గొప్ప ఆఫర్స్ ప్రకటించింది. ఇందులో మారుతీ సుజుకి ఇగ్నిస్, సియాజ్, బాలెనో మోడల్స్ ఉన్నాయి. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి ఇగ్నిస్: మారుతి సుజుకి ఇప్పుడు ఇగ్నిస్ కొనుగోలుపై రూ. 47,000 తగ్గింపుని అందిస్తుంది. ఇందులో రూ. 25,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 15,000 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తాయి. అంతే కాకుండా ఇగ్నిస్ ఆటోమాటిక్ వేరియంట్స్ మీద రూ. 42,000 డిస్కౌంట్స్ లభిస్తుంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్ రూ. 20,000 వరకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ ఒకేలా ఉంటుంది. మారుతి సుజుకి సియాజ్: మారుతి సుజుకి సియాజ్ కొనుగోలుపైన ఇప్పుడు రూ. 35,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మ్యాన్యువల్, ఆటోమాటిక్ వేరియంట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్స్ఛేంజ్ అఫర్ కింద రూ. 25,000, కార్పొరేట్ డిస్కౌంట్ కింద రూ. 10,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. దీని ధర రూ. 9.30 లక్షల నుంచి రూ. 12.29 లక్షల మధ్య ఉంటుంది. మారుతి సుజుకి బాలెనొ: ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న మారుతి సుజుకి బాలెనొ కొనుగోలుపై కంపెనీ రూ. 20,000 బెనిఫీట్స్ అందిస్తుంది. ఇందులోని డెల్టా & జీటా వేరియంట్స్ మీద రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 10వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభిస్తుంది. అయితే CNG మోడల్స్ మీద ఎటువంటి ప్రయోజనాలు అందుబాటులో లేదు. కొనుగోలుదారులు దీనిని తప్పకుండా గమనించాలి. (ఇదీ చదవండి: చదివిన కాలేజీ ముందు పాలు అమ్మాడు.. ఇప్పుడు రూ. 800 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడిలా!) కంపెనీ అందిస్తున్న ఆఫర్స్, బెనిఫీట్స్ వంటి వాటిని గురించి ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలో ఉన్న మారుతి డీలర్షిప్ సందర్శించవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
ఐఫోన్14పై ఆఫర్లే ఆఫర్లు.. ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు మరో సంస్థలోనూ..
యాపిల్ ఐఫోన్14 (Apple iPhone 14)పై ఈ-కామర్స్ సంస్థలు వరుసకట్టి ఆఫర్లు ప్రకటించాయి. పోటీ పడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్సైట్లో ఐఫోన్14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. అయితే ఫ్లిప్కార్ట్, అమెజాన్తో పాటు విజయ్ సేల్స్ అనే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్పై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఐఫోన్ 14 కొనుక్కోవాలనుకుంటున్నవారికి ఇప్పుడే సరైన సమయం. ఇదీ చదవండి: Amazon Great Summer Sale: ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్.. ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు! ఫ్లిప్కార్ట్లో అత్యధిక డిస్కౌంట్ ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ 128జీబీ వేరియంట్ ఐఫోన్14పై అత్యధికంగా 12 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్పై ఐదు శాతం క్యాష్బ్యాక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్లపై రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఫ్లిప్కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్14 మీ సొంతం అవుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్ఫోన్కు కండీషన్ను బట్టీ గరిష్టంగా రూ.29,250 వరకు లభిస్తుంది. అమెజాన్ ఆఫర్లు ఐఫోన్14ని అమెజాన్ 10 శాతం తగ్గింపుతో రూ.71,999లకు విక్రయిస్తోంది. అలాగే వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్లపై రూ. 4,000 వరకు ఆఫర్లను కూడా అందిస్తోంది. అదనంగా ట్రేడ్-ఇన్ ఆఫర్ను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.19,700 వరకు తగ్గింపు ఉంటుంది. తద్వారా రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్14ను కొనుక్కోవచ్చు. విజయ్ సేల్స్లో యాపిల్ డేస్ అమెజాన్, ఫ్లిప్కార్ట్తోపాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్14పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో కొనసాగుతున్న యాపిల్ డేస్లో భాగంగా కేవలం రూ.70,999లకే ఈ ఫోన్ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్14పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపుతో పాటు హెచ్డీఎఫ్సీ కార్డ్లపై రూ.4,000 క్యాష్బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్లపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు వంటి ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది. ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్ట్యాగ్ వసూళ్ల రికార్డు