sarees
-
స్కూల్ చుట్టూ చీరలు.. సంగతేంటంటే?
అది ప్రభుత్వ పాఠశాల.. ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు, పందులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. రహదారికి ఆనుకుని ఉండటంతో దుమ్మూధూళి అధికంగా వస్తోంది. ప్రహరీ నిర్మాణానికి డబ్బులు లేక ఉపాధ్యాయులే పాఠశాల చుట్టూ చీరలు (Sarees) కట్టారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) మండలం జిల్లెలగడ్డ (Jilleligada) గ్రామ ప్రభుత్వ పాఠశాల దుస్థితి ఇది. దుమ్మూధూళి తరగతి గదులలోపలికి వచ్చి విద్యా బోధనకు ఇబ్బంది కలిగిస్తోందని ఉపాధ్యాయులు తెలిపారు. చేసేదిలేక చీరలను అడ్డుగా కట్టించామన్నారు. కలెక్టర్ స్పందించి ప్రహరీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. – హుస్నాబాద్ రూరల్ చక్కని ఉత్తీర్ణతకు చిరుతిండి.. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు టెన్త్ విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు. ఇందులో మిల్లెట్స్, పల్లీపట్టీలు, నువ్వుల పట్టీలు, మొలకలు, అరటిపండ్లు, ఉడికించిన పల్లీలు ఉంటున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపెల్లి జెడ్పీ హైసూ్కల్ పదో తరగతి విద్యార్థుల స్టడీఅవర్స్లో స్నాక్స్ అందిస్తూ, పిల్లల సందేహాలు నివృత్తి చేస్తూ.. హెచ్ఎం అన్నపూర్ణ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి రేషన్ కోసం... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలోని ఒక రేషన్ దుకాణాన్ని తెరవకముందే మధ్యాహ్నం 3 గంటల నుంచి లబ్ధిదారులు బారులు తీరారు. ఇందుకోసం వరుసలో సంచులు, బండరాళ్లను పెట్టి డీలర్ రాక కోసం నిరీక్షించడం కనిపించింది. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నిజామాబాద్ఎరువు కష్టాలు రైతులకే ఎరుక సరిపడా యూరియా నిల్వలు లేకపోవడంతో సహకార సంఘాల ఎదు ట రైతులు బారులు తీరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారిలా.. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లిఆశలు రాలిన చోట కొత్త చిగురుపంట రాని మామిడి చెట్లను కాండం వరకు కొట్టేసినా.. చిగురిస్తోంది. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రేగులచెలకలో ఏళ్ల క్రితం నాటిన మామిడి తోటలో చెట్లకు కాలం చెల్లింది. పంట రాకపోవడంతో రైతు చెట్లను కాండం వరకు కొట్టేసి అధికారుల సూచనలతో కొన్ని రసాయనాలు పూశాడు. దీంతో ఇటీవల మళ్లీ కాండం పక్క నుంచి కొత్తగా చిగుళ్లు వస్తుండడంతో.. రెండు, మూడేళ్ల తర్వాత పంట మొదలయ్యే అవకాశముందని ఆశిస్తున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సాక్షి, ఖమ్మంవిస్తృతంగా పొగాకు సాగుసూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలో కొందరు రైతులు పొగాకు పంట సాగుపై దృష్టి సారించారు. గతంలో ఒకరిద్దరు రైతులు సాగు చేయగా.. ప్రస్తుతం 50మందికి పైగానే ఈ పంటను సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులోని ఐటీసీ సంస్థ వారు రైతులకు నారు సరఫరా చేస్తున్నారు. రైతులు పంట పండించి ఆ కంపెనీకే దిగుబడిని విక్రయిస్తున్నారు. అర్వపల్లి మండలంలో సుమారు 300 ఎకరాల్లో పొగాకు పంట సాగవుతోంది. ఈ పంటకు కోతులు, అడవి పందుల బెడద లేదు.చదవండి: భద్రాద్రి సీతారామచంద్ర స్వామికి కాసుల పంట -
ఎనిమిది బడ్జెట్లు: ఎనిమిది రంగుల చీరలు
-
మగువల మనసు దోచే ‘జమదానీ’
చేయి తిరిగిన చేనేత కార్మికులు వారు.. వస్త్ర రంగంలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. వారు తయారు చేసే వ్రస్తాలు చిరకాలం గుర్తుండిపోతాయి. వివాహ, శుభకార్యాల్లో జమదానీ చీరను ధరించడానికి మగువలు విశేష ఆదరణ కనబరుస్తారు. చేనేత వ్రస్తాల తయారీలో జమదానీ చీరలకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. బంగ్లాదేశ్కు చెందిన ఈ అపురూప కళ ఈనాటిది కాదు..శతాబ్దాల నాటి చరిత్ర ఉంది. మొఘలు సామ్రాజ్య రాణులు, బ్రిటీష్ పాలకుల సతీమణిలు ధరించిన చీర ఇది. 5 దశబ్దాల క్రితమే రాష్ట్రపతి అవార్డు సొంతం చేసుకున్న చరిత్ర ఈ చీరకు ఉంది. ఈ చీరను పురాతన సాంస్కృతి సంపదగా యునెస్కో కూడా గుర్తించింది. దేశ, విదేశాల్లో కూడా జమదానీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో వందలాది మంది నేతన్నలు ఈ చీరలను తయారీ చేస్తున్నారు. ఈ జమదానీ చీరల తయారీలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేట చేనేత కార్మికులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ప్రత్యేకమైన ఆకర్షణలు, డిజైన్లతో మగువల మనసు దోచే జమదానీ చీరలు తయారు చేస్తుంటారు. కొత్త అందాలను తెచ్చే ఈ చీరలు వివాహాది శుభకార్యాల్లో తలుక్కుమంటుంటాయి. మన నేత కార్మికుల నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. రాష్ట్రంలో కాకినాడ జిల్లాలో పిఠాపురం, ఉప్పాడ, తూర్పుగోదావరి జిల్లాలో దొండపూడి వంటి ప్రాంతాల్లో కూడా జమదానీ చీరలు తయారు చేస్తున్నారు. – సాక్షి, అనకాపల్లిపేటకు పట్టం కట్టిన కోక.. అనకాపల్లి జిల్లాలో పాయకరావుపేటతో పాటు, కాకినాడ జిల్లా పిఠాపురం, ఉప్పాడ తదితర ప్రాంతాల్లో తయారయ్యే ఈ జమదానీ చీరలు జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందాయి. జమదానీ చీరల డిజైన్లతో కేంద్రం కూడా విడుదల చేసిందంటే ఈ చీరలకు ఉన్న ప్రత్యేకత ఎంటో తెలుస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట,నక్కపల్లి మండలంలో గోడిచర్లతో పాటు జిల్లావ్యాప్తంగా 1500 మంది వరకూ ఈ చేనేత కార్మికులు ఉన్నారు. కాకినాడ జిల్లాలో పిఠాపురం, ఉప్పాడలో 100 కుటుంబాలు, తూర్పు గోదావరి జిల్లాల్లో ద్వారపూడి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో 300 కుటుంబాలు నేతన్నలు ఆర్డర్లు వారీగా ఈ చీరలు నేస్తుంటారు. స్థానికంగా విక్రయించేందుకు నేత చీరలు, పంచెలు, తువాళ్లు, తక్కువ ధరలకు విక్రయించే చీరలు తయారు వేస్తూ చిన్న చిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని విక్రయిస్తుంటారు. పాయకరావుపేట, తుని పట్టణాల్లో ఉన్న వస్త్ర దుకాణాలకు తాము తయారు చేసిన వస్త్రాలను సరఫరా చేస్తుంటారు.బెంగుళూర్లో నూలు కొనుగోలు.. జమదానీ చీరలు తయారు చేయడానికి ముడిసరుకు (నూలు) బెంగళూరు నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కావడంతో కొంతమంది మాత్రమే ఈ చీరలను తయారు చేస్తున్నారు. పాయకరావుపేటకి చెందిన వ్యాపారి ముడిసరుకు కొనుగోలు చేసి తీసుకువచ్చి తనకు వచ్చిన ఆర్డర్ల మేరకు కొనుగోలుదారులు కోరిన, సూచించిన డిజైన్లు, మోడళ్లు ఆధారంగా ఇక్కడి కార్మికులతో జమదాని చీరలను తయారుచేయిస్తారు... ఒక్కో చీరకు ముగ్గురు కార్మికులు సాధారణంగా జమదానీ చీర తయారీలో ఒక్కో చీరను ముగ్గురు కార్మికుల అవసరం ఉంటుంది. చీర డిజైన్ను బట్టి తయారీకి అదనపు సమయం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒక చీర తయారీకి 15 రోజుల సమయం పడుతుంది. అదనపు డిజైన్లు కూడా యాడ్ చేయాలంటే మరో మూడు నాలుగు రోజులు అదనంగా పడుతుంది. ఉదాహరణకు పాయకరావుపేటలో ఉండే 500కు పైగా నేతన్నలు జమదానీ చీరలు నేస్తారు. ముడిసరుకు కొనుగోలు చేసే స్తోమత లేకపోవడంతో ఇక్కడి కార్మికులు కేవలం మజూరీ కోసమే పనిచేయాల్సి వస్తుంది. బెంగళూరు వెళ్లి ముడిసరుకు కొనుగోలు చేయడం, మార్కెటింగ్ చేయడం చాలా కష్టతరం కావడంతో కాంట్రాక్టరు ఇచి్చన మజూరీ తీసుకుని తమ వస్త్ర నైపుణ్యాన్ని మెరుగు పరుచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. జాందాని చీరల తయారీలో పట్టును ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ రకం చీరల తయారీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా లూజు అనేది రాకూడదు. అడ్డు నిలువు పట్టును ఉపయోగించాలి. దీంతో ఒక్కో చీర తయారీలో ముగ్గురు కార్మికుల అవసరం కూడా ఉంటుందని నేత కార్మికులు అంటున్నారు.ఆరు మెట్రోపాలిటన్ సిటీల నుంచి ఆర్డర్లు..ఇక్కడ తయారు చేయించిన జమదానీ చీరలను హైదరాబాద్, బెంగళూరు. చెన్నై, విశాఖపట్నం, ముంబై, కోల్కత వంటి మహానగరాల్లో ఉన్న పెద్ద వస్త్ర దుకాణాలకు విక్రయిస్తుంటారు. ముందుగానే ఆర్డర్లు ఇచ్చి జమదానీ చీరలు తయారు చేయస్తుంటారు. ఒక జమదానీ చీర తయారీకి డిజైన్ బట్టి రూ.3 వేల నుంచి రూ.5 వేల విలువ గల నూలు అవసరమవుతుంది. ఇద్దరు నేత కార్మికులు 15 రోజుల పాటు కప్పపడితే ఒక జమదాని చీర తయారవుతుంది. ఇలా నెలకు రెండు నుంచి మూడు చీరలు తయారు చేస్తారు. ఇక్కడ తయారయ్యే జమదానీ చీరల ఖరీదు కనిష్టంగా రూ.10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉంటుంది. ఇంటి వద్దే ఉంటూ నెలకు రెండు చీరలు తయారు చేస్తే మజారి కింద రూ.10 వేలు చెల్లిస్తారు. జమదానీ చీరలు తయారు చేయించి విక్రయించే వ్యక్తికి నూలు, మజారి ఖర్చు పోను చీర దగ్గర రూ.3 నుంచి రూ.5 వేలు మిగులుతుంది. ఇతని దగ్గర రూ.10వేలు పెట్టి కొనుగోలు చేసిన చీరను పెద్ద పెద్ద మాల్స్, షాపుల్లోను 504 శాతం లాభం వేసుకుని. రూ.15 వేలకు విక్రయిస్తుంటారని కాంట్రాక్టర్లు చెబుతున్నారు.గత ఐదేళ్లలో చేనేత రంగానికి స్వర్ణయుగం.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నేతన్నలకు పెట్టుబడి సాయం అందించారు. మగ్గం కలిగిన కుటుంబాలకు నెలకు రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం నేరుగా వారి ఖాతాల్లోనే వైఎస్ జగన్ ప్రభుత్వం జమ చేసింది. దీంతో కార్మికులు నేరుగా ముడిసరకు తామే కొనుగోలు చేసుకుని వ్రస్తాలు తయారు చేసి లాభాలు పొందేవారు. పెట్టుబడికి అప్పు చేసే పరిస్థితి లేక పోవడంతో గత ఐదేళ్లు చేనేత రంగానికి స్వర్ణయుగంగానే గడిచినా..ఇప్పుడు గడ్డుకాలమే.వివాహ, శుభకార్యాల్లో జమదానీ కోక..వివాహ, శుభకార్యాలకు ప్రత్యేకంగా ఆర్డర్లు పెట్టుకుంటారు. ఆర్డర్లు ఆధారంగా జమదానీ చీరలు తయారు చేస్తాం. పాయకరావుపేటలో చేయి తిరిగిన నేత కార్మికులు ఉన్నారు.పలు డిజైన్లతో పట్టు. జమదానీ చీరలు తయారీ చేయడంలో వీరు దిట్ట. ముడి సరుకు సొంతంగా కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో మజూరు కోసం వ్రస్తాలు తయారు చేస్తుంటారు. మార్కెటింగ్ సదుపాయం పెంచి..కాంట్రాక్టర్లు ఆర్డర్లు పెంచితే చీరలు తయారీ పెరుగుతుంది. హైదరాబాద్, బెంగుళూర్, ముంబై, కోల్కత, చైన్నై వంటి సిటీలకు ఎగుమతి చేస్తుంటాం. – వీరనాగేశ్వరరావు, చేనేత సొసైటీ మేనేజర్ -
ఆ చిత్రాలు జ్ఞాపకాల చీరలు..!
చిత్రకారులు కుంచెలతో చిత్రాలు గీస్తారు. సుచిత్రా మట్టాయ్ మాత్రం పాతకాలపు చీరలను ఉపయోగిస్తూ అందమైన చిత్రాలను రూపొందిస్తుంది. వాషింగ్టన్లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ ఉమెన్ ఇన్ ద ఆర్ట్స్లో పాతకాలపు చీరల నుంచి అల్లిన ప్రకృతి దృశ్యం ‘త్రూ ది ఫారెస్ట్, అక్రాస్ ది సీ, బ్యాక్ హోమ్ ఎగైన్‘... వంటి చిత్రాలను ప్రదర్శించింది. ఎరుపు, గులాబీ, నారింజ, గోధుమ రంగులు.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించేలా రూపొందించింది.ఇండో–కరేబియన్ సంతతికి చెందిన ఆర్టిస్ట్ సుచిత్రకు తమ చీరలను పంపేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. వారిలో విదేశాలలో నివసిస్తున్న ఇండియన్స్ కూడా ఉన్నారు. ఆమె తల్లి, సెకండ్హ్యాండ్ షాపుల నుండి చీరలను సేకరించి, లాస్ ఏంజిల్స్లో నివసిస్తున్న తన కుతురుకి పంపిస్తుంది. వాటిలో తమ స్నేహితులు, బంధువుల నుంచి సేకరించినవి కూడా ఉంటాయి. సుచిత్ర అభిమానులు కొందరు విలువైన, సున్నితమైన దారాలతో నేచిన వారి స్వంత వస్త్రాలను కూడా పంపుతారు. ‘సైలెంట్ రిట్రీట్‘ (2023) కోసం సుచిత్ర తన చీరలలో ఒకదానిని – క్లిష్టమైన నమూనాలతో, మిరుమిట్లు గొలిపే ఎంబ్రాయిడరీ టేప్స్ట్రీలో చేర్చింది.ఎంబ్రాయిడరీతో జత కలిపి51 ఏళ్ల సుచిత్రా మట్టాయ్ ఈ డిజైన్స్ రూపకల్పన గురించి మరింతగా వివరిస్తూ – ‘మా అమ్మ సుభద్ర మట్టాయ్ పూర్వీకులు ఒప్పంద కార్మికులుగా ఉత్తరప్రదేశ్ను విడిచిపెట్టి, దక్షిణ అమెరికా ఉత్తర తీరంలో ఉన్న గయానాలో చెరకు తోటలలో పనిచేసేవారు. ఆ కుటుంబ కథలను పెయింటింగ్లో వచ్చేలా ఫ్యాబ్రిక్ పీసెస్ను కలిపి డిజైన్ చేశాను. ‘సైలెంట్ రిట్రీట్‘తోపాటు ఇతర చిత్రాలలో టేప్స్ట్రీలలోని బొమ్మలలో రంగు వేయడానికి ఎంబ్రాయిడరీ ఫ్లాస్ను ఉపయోగించాను. పోస్టోరల్ యూరోపియన్ దృశ్యాలను పరిచయం చేసే ఈ ప్రక్రియను ‘బ్రౌన్ రీక్రియెట్‘గా చూశాను’ అని తెలియజేస్తుంది.అలంకారిక అంశాలుజనవరి 12 వరకు ప్రదర్శించే ఈ కళారూపాలలో చరిత్రాకాంశాలను కూడా పరిచయం చేస్తుంది. దొరికిన వస్త్రాలు సుచిత్ర చిత్రాలకు పునాదిగా పనిచేస్తాయి. తరచుగా అవి భారీ–ఉత్పత్తి కిట్లు లేదా ఇతర వాణిజ్య నమూనాల ఆధారంగా సూది, దారాలతో అలంకారిక అంశాలను చేతితో జోడిస్తుంది. ‘టైమ్ ట్రావెలర్స్‘లో పూసల అంచు, బంగారు తాడు వంటి కొన్ని అలంకార అంశాలను జోడించింది. మట్టై చిత్రకారిణిగా శిక్షణ పొదింది. అమ్మ, అమ్మమ్మల కథలను అర్ధమయ్యే విధంగా తెలియజేయడానికి వస్త్రాల వైపు మొగ్గు చూపింది. యునైటెడ్ స్టేట్స్లో సుచిత్ర మొట్టమొదటి సోలో మ్యూజియం ప్రదర్శనలలో ‘మిత్ ఫ్రమ్ మేటర్‘ ఒకటి. (చదవండి: 'టీ' సంస్కృతికి పుట్టినిల్లు ఆ దేశం..! ఇంట్రస్టింగ్ విషయాలివే..) -
ఎస్హెచ్జీ సభ్యులకు ఒకే డిజైన్ చీరలు
సాక్షి, హైదరాబాద్: మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్హెచ్జీ) సభ్యులుగా ఉన్న మహిళలకు ఒకే డిజైన్తో ఉండే చీరలు పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరులోగా విధి విధానాలు ఖరారు చేయా లని నిర్ణయించింది. చీరల పంపిణీ పథకాన్ని ఏ తరహాలో అమలు చేయాలనే అంశానికి సంబంధించి చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల సమీక్షించారు. మరో వారం రోజుల్లో సీఎం రేవంత్రెడ్డితో జరిగే భేటీలో పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత, చీరల పంపిణీ పథకం అమలుపై తుది నిర్ణయం తీసుకుంటారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్కార్డులో పేర్లు కలిగిన 18 ఏళ్లు పైబడిన యువతులు, మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసింది. అయితే రాష్ట్రంలో గ్రామీణ పేదరి క నిర్మూలన సంస్థ (సెర్ప్), మెప్మా పరిధిలోని 63 లక్షల మంది మహిళా సభ్యులకు ఈ చీరలు పంపిణీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అయితే స్వయం సహాయక సంఘా ల మహిళలకు పంపిణీ చేసేది బతుకమ్మ చీరలు కాదని, రాష్ట్రమంతటా ఒకే డిజైన్ కలిగిన చీరలను పంపిణీ చేస్తామని చేనేతశాఖ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వం పంపిణీ చేసిన బతుకమ్మ చీరల్లో నాణ్యత లేదని, సరఫరాలో కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈ నేపథ్యంలో పూర్తిగా స్థానికంగా ఉండే నేత కారి్మకులను భాగస్వాములను చేస్తూ నాణ్యత కలిగిన చీరలను ఉత్పత్తి చేసి పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఒక్కో మహిళకు ఒకటా.. రెండా..? స్వయం సహాయక సంఘాల మహిళలకు ఒక్కొక్కరికీ ఏటా ఎన్ని చీరలు పంపిణీ చేయాలనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఎస్హెచ్జీల్లో పెరిగే సభ్యు ల సంఖ్యను కూడా దృష్టిలో పెట్టుకొని ఏటా రెండేసి చీరల చొప్పున పంపిణీ చేస్తే 1.3 కోట్ల చీరలు అవసరమవుతాయని ప్రాథమికంగా లెక్కలు వేశా రు. ఒక్కో చీర తయారీకి అయ్యే ఖర్చు, ఏటా కేటాయించాల్సిన బడ్జెట్ తదితరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.ఈ చీరలను పండుగ సమయా ల్లో ఇవ్వాలా, ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఇవ్వా లా అకోణంలోనూ అధికారులు ఆలోచిస్తున్నారు. 2017లో బతుకమ్మ చీరల పథకం ప్రారంభంకాగా సగటున రూ.325 కోట్ల బడ్జెట్తో కోటి చీరలు పంపిణీ చేస్తూ వచ్చారు. గత ఏడాది 30 రకాల డిజైన్లు, 20 విభిన్న రంగుల్లో 240 వెరైటీల్లో చీరలను తయారు చేయించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) డిజైనర్లతో బతుకమ్మ చీరలు డిజైన్ చేయించారు. ఎస్హెచ్జీ మహిళలకు పంపిణీ చేసే చీరల డిజైన్లను కూడా నిఫ్ట్ డిజైనర్ల సూచనలు, సలహాల ఆధారంగా ఖరారు చేస్తారు. ప్రస్తుతం సొంతంగా ఎస్హెచ్జీల కొనుగోలు ప్రస్తుతం రాష్ట్రంలోని ఎస్హెచ్జీల మహిళలకు ప్రత్యేక యూనిఫారం లేకున్నా స్థానికంగా గ్రామ, మండల సమాఖ్యలు మూకుమ్మడిగా నిర్ణయించుకొని తమకు నచ్చిన డిజైన్ చీరలను యూనిఫారాలుగా ఎంచుకుంటున్నాయి. ఎస్హెచ్జీల సమావేశాలు, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఒకే డిజైన్ చీరలు ధరించి హాజరవుతున్నారు. గ్రామ, మండల సమాఖ్య నిధుల నుంచి లేదా సొంతంగా తలాకొంత మొత్తం పోగు చేసి వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వమే పంపిణీ చేయాలని భావిస్తున్న నేపథ్యంలో ఒకటి లేదా రెండు డిజైన్లను ఎంపిక చేసి చీరల తయారీకి ఆర్డర్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటి వరకు ప్రాథమికంగా పది డిజైన్లను సిద్ధం చేసిన చేనేత విభాగం త్వరలో సీఎంతో జరిగే భేటీలో ఒకటి రెండు డిజైన్లను ఖరారు చేసే అవకాశముంది. -
కంజీవరం-వెండి సీక్విన్ చీరలలో ఊర్మిళ స్టన్నింగ్ లుక్స్..!(ఫొటోలు)
-
‘రెట్రో’ చీరలతో లెహంగా.. సారా అలీఖాన్ స్టన్నింగ్ లుక్..!
ప్రముఖులు, సెలబ్రిటీలు ట్రెండ్కి తగ్గట్టు లగ్జరీయస్ దుస్తులు ధరిస్తారు. ముఖ్యంగా ప్రముఖ బ్రాండెడ్ దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచానికి ఐకానిక్గా ఉంటుంది వారి డ్రెస్సింగ్ స్టైల్. అలాంటిది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ మాత్రం ఫ్యాషన్కే సరికొత్త అర్థం ఇచ్చే డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఈ ముద్దుగుమ్మ దుస్తుల వేస్ట్కి అడ్డుకట్ట వేసేలా పర్యావరణ హిత ఫ్యాషన్ శైలిని తీసుకొచ్చింది. ఇంతకీ ఆమె ఎలాంటి ఫ్యాబ్రిక్ డ్రెస్ ధరించింది అనే కదా సందేహం..!అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలో ఓ రేంజ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో బాలీవుడ్ అగ్ర తారలంతా పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సారా ప్రత్యేకమైన దుస్తులను ఎంచుకుంది. డిజైనర్ మయ్యూర్ గిరోత్రా కోచర్ రూపొందించిన అందమైన లెహెంగాలో ఈ బుట్టబొమ్మ మెరిసింది. అయితే ఈ లెహంగాని డిజైనర్ 50, 60ల నాటి పాత చీరలను రీసైక్లింగ్ చేసి రూపొందిచారు. చూడటానికి ఈ లెహంగా వివిధ రంగుల చీరల కలయికతో అందంగా ఉంది. ఈ లెహంగాలో సారా స్టన్నింగ్ లుక్ చూపురులను తిప్పుకోని విధంగా ఆకర్షణీయంగా కనిపించింది. చెప్పాలంటే సారా ఎంచుకున్న డిజైనర్ వేర్ దుస్తుల వేస్ట్ని అరికట్టేలే ఫ్యాషన్ ట్రెండ్ని సరికొత్త విధంగా సెట్ చెయ్యొచ్చు అని ప్రేరణ కలిగించేలా ఉంది ఆమె మెస్మరైజ్ లుక్. ఈ మిక్స్డ్ కలర్ లెహంగాకి సారా పర్పుల్ కలర్ బ్లౌజ్ని జత చేసింది. ఈ బ్లౌజ్కి డోరీ టైస్ , గోల్డ్ బ్రోకెడ్ ఎంబ్రాయిడరీ, గొట్టా పట్టీ బార్డర్లు ఉన్నాయి. అలాగే ఈ లెహంగాకి మ్యాచ్ అయ్యేలా రాగి కలర్తో కలగలసిన బంగారు టిష్యు సిల్క్ దుప్పట గ్రాడ్ లుక్ని తెచ్చిపెట్టింది. అందుకు తగ్గట్టు మంచి ఐషాడో, మిరుమెట్లుగొలిపే ఐలైనర్, న్యూడ్ లిప్షేడ్తో చాలా సింపుల్ మేకప్లో మెరిసింది. హెయిర్ని కూడా టై చేసి వదిలేసింది. అంతేగాదు తన లెహంగాకి మ్యాచింగ్ అయ్యేలా తలలో ఊదారంగు పూలను ధరించింది. అలాగే చెవులకు జుమ్మీలు, మెడకు పోల్కీ చోకర్ నెక్లస్తో గ్రాండ్గా కనిపించింది సారా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Mayyur Girotra Official (@mayyurgirotracouture) (చదవండి: కివీ కర్రీ..శ్రీలంక ఫేమస్ రెసిపీ..!) -
తక్కువ బడ్జెట్లో బెటర్లుక్.. హుందాగా... కంఫర్ట్గా!
‘‘జాబ్, స్కూల్కి వెళ్లే ఇద్దరు పిల్లలు, ఫ్యామిలీతో టైమ్ అసలు సరిపోదు. అయితే మనకోసం మనం కొంచెం టైమ్ అయినా ఉండేలా చూసుకోవాలి అనుకుంటాను. నలుగురిలోకి వెళ్లినప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి, అదే విధంగా నా బడ్జెట్ ప్రకారం డ్రెస్సింగ్ ఉండేలా ఎంపిక చేసుకుంటాను.వేడుకలకు, ప్రత్యేక రోజుల్లో రెడీ అవడానికి ప్రతీ ఒక్కరూ తమదైన ప్టైటల్ని డ్రెస్సింగ్లో చూపుతుంటారు. హైదరాబాద్ ఎల్.బినగర్లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగిని చందనామారం తన డ్రెస్సింగ్ గురించీ, వార్డ్రోబ్ విషయాలను ఈ విధంగా షేర్ చేసుకున్నారు. హుందాగా...ఆఫీస్కి వెళ్లేటప్పుడు డిగ్నిఫైడ్గానూ, కంఫర్ట్గానూ ఉండేలా చూసుకుంటాను. అందుకు కుర్తీలు, జీన్స్ ఉంటాయి. వీటిలోనే మిక్స్ అండ్ మ్యాచ్కి ట్రై చేస్తుంటాను.డిజైనర్ శారీస్..రిసెప్షన్ వంటి వేడుకలకు డిజైనర్ శారీస్ను ఎంచుకుంటాను. జనరల్గా మార్కెట్లో వస్తున్న ట్రెండ్స్ను కూడా ఫాలో అవుతుంటాను. వీటిలో నాకు ఎలాంటి ఔట్ఫిట్ అయితే బాగుంటుందో చెక్ చేస్తుంటాను. స్టిచింగ్కు సంబంధించినప్పుడు ఇన్స్టా పేజీలు కూడా చూస్తుంటాను. అలాంటి డిజైన్స్ చేయమని బొటిక్స్లో చెబుతుంటాను. శారీకి తగినట్టు బ్లౌజ్ సెట్ చే యడానికి డిజైనర్ హెల్ప్ తీసుకుంటాను.తక్కువ బడ్జెట్లో బెటర్లుక్..పెళ్లి, ఇంట్లో పండగలు వంటి సందర్భాలలో మనదైన సంప్రదాయ కట్టునే ఇష్టపడతాను. దీనికోసం ఎక్కడైనా శారీస్ కలెక్షన్ గురించి కూడా తెలుసుకుంటాను. కొన్నిచోట్ల నచ్చినా బడ్జెట్ మించి ఉంటే తీసుకోను. అయితే, అవే మోడల్స్లో మరో చోట ఒకటికి బదులు రెండు చీరలు వచ్చేలా ఎంపిక చేసుకోవడం గురించి ఆలోచిస్తుంటాను. తక్కువ బడ్జెట్లో మంచి డ్రెస్సింగ్ ఉండేలా చూసుకుంటాను. సాధారణంగా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న చీరలు, డ్రెస్సులు వేసుకుంటే నలుగురిలో వెళ్లినప్పుడు మన అప్పిరియన్స్ బాగుంటుంది అనుకుంటారు. కానీ, తక్కువ బడ్జెట్లో బెటర్గా కనిపించేలా ΄్లాన్ చేసుకోవడం మంచిది’’ అని వివరిస్తున్నారు ఈ ఉద్యోగిని.నోట్: మీరూ మీ వార్డ్రోబ్ లేదా మీ అమ్మాయి వార్డ్రోబ్ గురించి, డ్రెస్సింగ్ విషయంలో తీసుకుంటున్న విశేషాల గురించి ఫొటోలతో సహా ‘సాక్షి’ ΄ాఠకులతో పంచుకోవచ్చు. బాగున్న వాటిని మై వార్డ్రోబ్ శీర్షికన ప్రచురిస్తాం. మా చిరునామా: మై వార్డ్రోబ్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ –34. sakshifamily3@gmail.com -
శారీ షో రూమ్ లో తళుక్కుమన్న ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ (ఫొటోలు)
-
కసావు చీరలో నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..తయారీకే ఏకంగా..!
నీతా అంబానీ నాటి సంప్రదాయ చీరల మేళవింపుతో సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ని తీసుకొచ్చింది. చేతి వృత్తుల వారిని పోత్సహించేలా కనుమరుగవుతున్న నాటి గొప్ప కళా నైపుణ్యాన్ని అందరికీ సుపరిచయ చేస్తున్నారు నీతా. ఇటీవల చిన్న కుమారుడు అనంత్ రాధికల వివాహంలో సైతం వారి ధరించే ప్రతి డిజైనర్ వేర్ చేతితో రూపొందించిన ఎంబ్రాయిడరీ డిజైన్ హైలెట్గా నిలిచింది. రాజస్థాన్, కాశీ పట్టణాల్లో ఉన్న పురాతన హస్తకళలను స్ఫురణకు తెచ్చేలా చేశారు. అయితే మరోసారి నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(ఎన్ఎంఏసీసీ)లో జరిగిన ఈవెంట్లో కేరళ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా కసావు చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరను కేరళలోని ప్రతిభావంతులైన కళాకారులు ఏకంగా 20 రోజుల పాటు రూపొందించారు. ఇందులో టిష్యూ పల్లు, మెరూన్ మీనా కరి బుట్టా, అద్భతమైన తొమ్మిది అంగుళాల బంగారు అంచు మృదువైన షీన్లు ఉన్నాయి. తెలుపు బంగారు రంగులో ఉన్న ఈ కసావు చీర చరిత్ర చాలా లోతైనది. బహుళ వర్ణ ఛాయచిత్రాలు, బోల్ట్ నమునాలతో చిక్కటి కాటన్ చీరల్లా మెత్తగా ఉంటాయి.కేరళ కసవు చీరల ప్రత్యేకత..ఇవి చూసేందుకు సరళమైన క్లాసీగా ఉండే కసవు చీర జరీ, ఒక రకమైన బంగారు దారంతో విలక్షణంగా ఉంటుంది. బలరామపురుం, చెందమంగళం, కుతంపుల్లి వంటి నిర్థిష్ట భౌగోళిక సముహాల నుంచి ఉద్భవించిన ఈ చీరలు కేరళ గొప్ప చేనేత వారసత్వంలో భాగంగా ఉన్నాయి. ప్రాథమిక డిజైన్ల నుంచి దాదాపు మూడు నుంచి 5 రోజుల వరకు పట్టే విస్తృతమైన మోటిఫ్లు చేతితో నేయబడి ఉంటాయి. బంగారు దారంతో చుట్టూ బోర్డర్ డిజైన్ చేసి ఉంటుంది. సరసమైన కాటన్ రకాల నుంచి వివిధ రకాల చీరలను ఉత్పత్తి చేస్తారు. వీటి ధర రూ. 1.5 లక్షల నుంచి మొదలై అత్యంత ఖరీదైన ధర పలికే చీరలు కూడా ఉంటాయి. చూసేందుకు సాదాసీదా తెల్లని వస్త్రంలా ఉన్నా బార్డర్ మందం, రంగు అనేవి సందర్భానుసారం డిజైన్ చేసిన చీరలు ఉంటాయి. ఉత్సవానికి సంబంధించిన చీరలు మందమైన బంగారు అంచుతో ఎంట్రాక్టివ్గా ఉంటాయి. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online)(చదవండి: అనంత్ అంబానీ బూండీ జాకెట్..రియల్ గోల్డ్తో ఏకంగా 110 గంటలు..!) -
ఇదీ.. శారీనే! కొంచెం స్టయిల్ మారిందంతే!!
సౌకర్యంగా ఉండే ఫ్యాషనబుల్ డ్రెస్సుల కోసం నవతరం ఎప్పుడూ వెతుకుతుంటుంది. అలాగని సంప్రదాయాన్ని వదిలిపెట్టదు. ఈ విషయాలపై స్పష్టత ఉన్న డిజైనర్లు చీరను ఎన్ని హంగులుగా తీర్చిదిద్దుతున్నారో చూడాల్సిందే! డ్రెస్ను పోలి ఉండేలా.. శారీ అనిపించేలా ఇండోవెస్ట్రన్ లుక్తో ఆకట్టుకునేలా యంగ్స్టర్స్ ఆలోచనలకు తగినట్టుగా డిజైన్ చేస్తున్నారు.అన్ని రకాల ఫ్యాబ్రిక్..కాటన్, సిల్క్, చందేరీ... ఏ ఫ్యాబ్రిక్ శారీ అయినా ఈ డిజైన్కు వాడచ్చు. పల్లూను కుర్తా స్టైల్లో ధరించి, నడుము భాగంలో బెల్ట్ సెట్ చేస్తే మరో శారీ స్టైల్ మీ సొంతం అవుతుంది.ఖఫ్తాన్ శారీ..ఈ డిజైన్ శారీ లాంగ్ గౌన్ను తలపిస్తుంది. శారీ గౌన్లా కనిపిస్తుంది. ప్లెయిన్ శారీకి కుచ్చులు సెట్ చేసి, పల్లూ భాగాన్ని మాత్రం ఖఫ్తాన్ స్టైల్లో డిజైన్ చేయాలి. నెక్ భాగాన్ని కూడా పల్లూ డిజైన్లో వచ్చేలా సెట్ చేయాలి.ఆభరణాల అమరిక..హెయిర్స్టైల్ మోడల్స్ లేదా ఆభరణాల ఎంపిక ఈ స్టైల్ డ్రెస్కు అంతగా అవసరం లేదు. శారీనే న్యూ లుక్తో ఆకట్టుకుంటుంది కాబట్టి ఇతరత్రా అలంకరణా సింపుల్గా ఉంటేనే చూడముచ్చటగా ఉంటుంది.సౌకర్యంగా..భుజం మీదుగా తీసే కొంగు భాగంలో డిజైన్ను బట్టి హ్యాండ్ స్టైల్ను అమర్చుకోవచ్చు. ఇది సౌకర్యంగానూ, స్టైల్గానూ కనిపిస్తుంది.ఎంబ్రాయిడరీ..పల్లూ మధ్య భాగంలో ఖఫ్తాన్కి మెడ నుంచి ఎంబ్రాయిడరీ వర్క్తో ప్లెయిన్ శారీని కూడా మెరిపించవచ్చు. -
మా చేతిలో ఉన్న పనికి.. సాంకేతిక పరిజ్ఞానం తోడైంది..!
‘‘ఇంట్లో మగ్గం ఉంది, చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది. నా గ్రామం నుంచి విదేశాలతో అనుసంధానం కావడానికి ఇవి చాలు. నేను నేసిన చీరను ఈ కామర్స్ వేదికల ద్వారా నేనే మార్కెట్ చేసుకోగలుగుతున్నాను. నా చేతుల్లో తయారైన చీరను ధరించే వారి చేతికి చేర్చే సాంకేతిక మార్గాలను నేర్చుకున్నాను. వందల మంది మహిళలం సంఘటితమయ్యాం. మాలోని నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాం. మేము గౌరవప్రదమైన ఉపాధిని పొందుతున్నాం’’ అంటోంది తమిళనాడుకు చెందిన ముత్తులక్ష్మి. ఆమె మాటలు అక్షరసత్యాలు.వైవిధ్యతే ఉపాధి..భాషలు, వస్త్రధారణ, ఆహారపు అలవాట్లలో మాత్రమే కాదు మనదేశంలో ఉన్న వైవిధ్యత... కళలు, కళాత్మకతల్లోనూ ఉంది. దాదాపుగా ప్రతి ఇంట్లోనూ ఆ కళాత్మకత ఉంటుంది. స్థానికంగా లభించే వస్తువులతో మహిళల చేతిలో రూపుదిద్దుకునే అనేక వస్తువులు ఇప్పుడు వారికి ఉపాధిమార్గాలవుతున్నాయి. దేశంలో దాదాపుగా ఏడు కోట్ల మంది చేతిలో కళ ఉంది. ఆ చేతుల్లో అందమైన హస్తకళాకృతులు తయారవుతున్నాయి. అందులో సగానికి పైగా మహిళలే.ఒకప్పుడు ఆ పని తమకు ఉపాధినిస్తుందని, గుర్తింపును తెస్తుందని తెలియదు వాళ్లకు. తెలిసినా సరే, మధ్య దళారుల దోపిడీకి గురవుతూ అరకొరగా లభించే రుసుముతోనే సంతృప్తి చెందేవాళ్లు. ఇప్పుడు మహిళలు చురుగ్గా ఉన్నారు. తమ ఉత్పత్తులను మార్కెట్లోకి ప్రవేశ పెట్టే మాధ్యమాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. హస్తకళాకృతులు తయారు చేసే కుటుంబాల్లోని మగవారు మెరుగైన ఉపాధి కోసం ఆ వృత్తులను వదిలేస్తున్న తరుణంలో ఆ ఇళ్లలోని మహిళలు తమ వారసత్వ కళను కొనసాగిస్తూ తమకంటూ ప్రత్యేకమైన గౌరవాన్ని, అదే స్థాయిలో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు.ముత్తులక్ష్మి ఇంట్లో పవర్లూమ్ ఉంది. ఆ మరమగ్గం మీద ఆమె నెలకు పది చీరలను నేయగలుగుతోంది. తమిళనాడులోని అరుపోకోటాయ్ బ్లాక్ చేనేత చీరలకు ప్రసిద్ధి. అక్కడ నేసే చీరలను కూడా అదే పేరుతో అరుప్పుకోటాయ్ చీరలుగానే పిలుస్తారు. ఆమె నేసిన చీరలను ఫొటో తీసి తానే స్వsయంగా అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తుంది. ఉత్పత్తిదారులకు– వినియోగదారులకు మధ్య మరో వ్యక్తి అవసరం లేదని, సాంకేతికతను ఒంటపట్టించుకోవడానికి పెద్ద చదువులు అక్కరలేదని నిరూపిస్తోంది. సాధికారత సాధించాం!‘‘ఒక్కో ప్రాంతంలోని మహిళల్లో ఒక్కో కళ ఉంటుంది. మా దగ్గర మహిళలు చేనేతతోపాటు తాటి, కొబ్బరి ఆకులతో బుట్టలు అల్లుతారు. కర్ణాటక, రాయచూర్ వాళ్లు అందమైన దండలు, ఊలు, క్రోషియో వైర్తో ఇంటి అలంకరణ వస్తువులు అల్లుతారు. గుజరాత్, దహోద్ వాళ్లు ముత్యాల ఆభరణాలతోపాటు వెదురుతో రకరకాల వస్తువులు తయారు చేయడంలో నిష్ణాతులు.వాళ్లందరికీ డిజిటల్ లిటరసీ, ఫైనాన్షియల్ లిటరసీ, ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్తోపాటు ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కల్పిస్తే అద్భుతాలు చేయగలరని నమ్మాను. అది నిజమైంది కూడా. ఇప్పుడు మొత్తం తొమ్మిది వందల మందిమి నాస్కామ్ నిర్వహించిన పదిరోజుల నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సొంతంగా అన్ని పనులూ చక్కబెట్టుకోగలుగుతున్నాం. మహిళా సాధికారత సాధనకు మా చేతిలో ఉన్న పని, సాంకేతిక పరిజ్ఞానం తోడైంది’’ అన్నది ముత్తులక్ష్మి. -
కొంగే.. సింగారమాయెనా!
వస్త్రాలంకరణలో ప్రతీ అంశం అందంగా రూపుకట్టాల్సిందే అనే ఆలోచనల్లో నుంచి పుట్టుకు వచ్చిందే కొంగు డిజైన్. చీరకట్టులో కుచ్చిళ్లకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో పల్లూ డిజైనింగ్కీ అంతే ప్రత్యేకత ఉంటుంది. దారాల అల్లికలైనా.. అద్దాల అమరిక అయినా పూసల పనితనమైనా, ప్రింట్ల మెరుపు అయినా కొంగు కొత్తగా సింగారించుకుని వేడుకలలో బంగారంలా మెరిసి΄ోతుంది.రంగు రంగుల ఫ్యాబ్రిక్చీరలోని రంగులతోపోటీ పడుతూ ఉండేలా ఫ్యాబ్రిక్తో చేసిన టాజిల్స్ కొంగుకు ప్రధాన ఆకర్షణగా మారుతుంది.దారపు పోగులతో..ఊలు, సిల్క్, జరీ దారాలతో అల్లిన టాజిల్స్ కాటన్ చీరలకూ, పట్టు చీరల కొంగులకు ప్రత్యేక అందాన్ని తీసుకువస్తున్నాయి.పూసల కొంగు..చీర రంగు కాంబినేషన్లో పూసలతో కొంగును డిజైన్ చేస్తే ఆ ప్రత్యేకత గురించి చెప్పడానికి మాటలు చాలవు. అలా డిజైనర్లు తమదైన సృజనకు మెరుగుపెడుతున్నారు. వాటిని ధరించిన వారు వేడుకలలో హైలైట్గా నిలుస్తున్నారు.గవ్వలు, అద్దాలుగిరిజన అలంకరణను ఆధునికపు హంగుగా మార్చడానికి గవ్వలు, అద్దాలు, ఊలు దారాల డిజైన్లను కొంగుకు అందంగా సింగారిస్తున్నారు. ఇవి ఎక్కువగా కాటన్ శారీస్ అలంకరణలో చూడవచ్చు. క్యాజవల్ వేర్గా నప్పే చీరలు ఈ డిజైన్ వల్ల ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి.కుచ్చుల కొంగుచందేరీ, నెటెడ్ మెటీరియల్తో చీరకు జత చేసిన కొంగు కుచ్చుల అమరికతో వెస్ట్రన్ ΄ార్టీ వేర్గా అలరిస్తుంది. అమ్మాయిలను అమితంగా ఈ తరహా డిజైన్స్ ఆకట్టుకుంటున్నాయి.రెడీమేడ్..సాదా సీదాగా కనిపించే చీర కొంగు డిజైన్ను మార్చాలనుకుంటే మార్కెట్లో రెడీమేడ్ పల్లూ డిజైన్స్ లభిస్తున్నాయి. హ్యాండ్ ఎంబ్రాయిడరీ, మగ్గం వర్క్, పూసలు, దారాల అల్లికలతో ఉన్న పల్లూ డిజైన్స్ని తెచ్చి చిన్న కుట్టుతో కొంగును కొత్తగా మెరిపించవచ్చు.ఇవి చదవండి: ‘దేశీ థ్రిల్’ మ్యూజిక్ బ్యాండ్లోని ఈ ముగ్గురి పాట.. వావ్ అనాల్సిందే..! -
విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, నేర్పించింది ఆమె!
విమాన సిబ్బందిలో మహిళలు పనిచేయాలంటే కచ్చితంగా స్కర్టులు, కోట్లు ధరించాల్సిందే. అందులోనూ లండన్లో అయితే కచ్చితంగా ఆ ఆహార్యంలోనే ఉండాల్సిందే. భారతీయ మహిళలైనా ఆ రూల్స్ పాటించక తపని రోజులవి. కానీ ఓ మహిళ ఆ ఎయిర్ ఇండియా రూల్స్నే తిరగరాసింది. చీరకట్టుతోనే పనిచేస్తామని తెగేసి చెప్పడమే గాక ఉద్యమం చేసి మరీ తను అనుకున్నది సాధించుకుంది. ఎయిర్ ఇండియాలో పనిచేసే ప్రతి సిబ్బంది చీరకట్టకునేలా చేసింది. అంతేగాదు రాజకీయాల్లోకి రావడానికి మహిళలు భయపడుతున్న రోజుల్లోనే ఆమె రాజకీయాల్లోకి వచ్చి తన గళం వినిపిస్తూ అంచెలంచెలుగా పైకొస్తూ.. మంచి రాజకీయవేత్తగా పేరు తెచ్చుకున్నారు. ఆమె నేటితరానికి, భవిష్యత్తుతరాలకు స్ఫూర్తిగా నిలిచే గొప్ప వ్యక్తి. ఎవరీమె అంటే.. ఆమె పేరు బృందా కారత్. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సరిగ్గా రెండు నెలలకు పుట్టారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే ఆమె అదే ఏడాది అక్టోబర్ 17న కోల్కతాలో జన్మించారు. తండ్రి సూరజ్ లాల్ దాస్ పాకిస్తాన్లోని లాహోర్ నుంచి వలస వచ్చారు. తల్లి ఒషుకోనా మిత్ర బెంగాలి. వీళ్లది ప్రేమ పెళ్లి. పెద్దలు వ్యతిరేకించి మరీ ఓషుకోనా సూరజ్ని పెళ్లి చేసుకున్నారు. బృందాకు ఒక సోదరుడు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఐదేళ్ల వయసులో బృందా తన తల్లి ఒషుకోనా మిత్రను కోల్పోయినా తండ్రి తన పిల్లల్ని చాలా స్వేచ్ఛాయుత వాతావరణంలో పెంచారు. ఎన్.డి.టీవీ వ్యవస్థాపక ఎడిటర్ ప్రణయ్ రాయ్ని పెళ్లాడిన రాధిక ఆమె చెల్లెలే. బృందా ప్రాథమిక విద్య డెహ్రాడూన్లోని వెల్హామ్ బాలికల పాఠశాలలో పూర్తి చేశారు. ఆమె 16 ఏళ్ల వయస్సులో మిరిండా హౌస్లోని దర్హి విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న కళాశాల నుంచి బీఏ పట్టా తీసుకున్నారు. అప్పుడే ఆమె తండ్రి సూరజ్ లాల్ దాస్ తన కుమార్తె బందాను పిలిచి నేను చదువు చెప్పించా. ఇక నువ్వు నీ కాళ్ళపై నిలబడాలని సూచించారు. దీంతో ఆమె 1967లో లండన్ వెళ్లి ఎయిర్ ఇండియాలో చేరారు. అయితే లండన్లోని ఎయిర్ ఇండియా విమానయాన సంస్థలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా స్కర్ట్ లు వేసుకోవాల్సిందే తప్ప చీరె కట్టును అనుమతించరు. అందుకు ససేమిరా అని బృందాకారత్ తెగేసి చెప్పడం జరిగింది. ఆ టైంలో లండన్ హీత్రూ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్. ఆయన కూడా ఏమాత్రం తగ్గేదే లే అంటూ చీర ధరించేందుకు అనమితించమని చెప్పేశారు. అయితే తాము సమ్మే చేస్తామని నిర్భయంగా చెప్పింది బృందాకారత్. చేస్కోండి! అని ఆయన కూడా తీసిపడేసినట్లుగా అన్నారు. దీంతో ఆమె చీరే కట్టుకుంటాం అనే డిమాండ్తో నిరవధికంగా మూడు రోజు సమ్మే చేసి మరీ ఎయిర్ ఇండియా మెడలు వంచింది బృందా. దెబ్బకి ఆ ఎయిర్ ఇండియా మేనేజర్ అలాన్ దిగి రావడమే గాక మీరే విజయం సాధించారు, పైగా ఎయిర్ ఇండియాలో ప్రతి ఒక్కరూ చీరకట్టుకునేలా చేశారు అన్నారట. కానీ బృందాకారత్ ఆ మాటలకు పొంగిపోలేదు. ఈ విజయం తనదేనని ఒప్పుకోలేదు. "సారీ, గెలిచింది నేను కాదు. శారీ జాతీయవాదం" అని చెప్పి ఎయిర్ ఇండియా అధికారిని షాక్కి గురయ్యేలా చేసిందట. ఆమె తన వ్యక్తిగత విజయాన్ని జాతీయ వాదంతో పోల్చి చెప్పడమేగాక ఈ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి బదులు అందరికీ వర్తింపజేసేలా మాట్లాడినందుకు...ఆమెను అభినందించకుండా ఉండలేక పోయారు ఆయన. అంతేగాదు అలా ఎయిర్ ఇండియాకు సెలక్ట్ అయిన బ్రిటిష్ యువతులందరికీ చీరకట్టుకోవడం నేర్పించారు బృందాకారత్. అలా ఆమె అక్కడ కొంతకాలం పనిచేసి ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత సీపీఎం అనుబంధ సంఘాలలో పని చేశారు. మహిళలు రాజకీయాల్లోకి రాని రోజుల్లో వామపక్ష రాజకీయాల వైపుకి వెళ్లారు. అరుదైన కమ్యూనిస్టు రాజకీయ వేత్తగా ఎదిగారు. నుదుట పెద్ద బొట్టు, ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని వర్చసు ఉన్న బృందా అనర్ఘళంగా హిందీ, ఇంగ్లీషు, మళయాళం, బెంగాలీ, కొన్ని తెలుగు పదాలు మాట్లాడగలరు. దేశంలో ఫెమినిస్ట్ ఉద్యమానికి ఊపిరులు వారిలో బృందా కారత్ ఒకరు. పశ్చిమ బెంగాల్ నుంచి సీపీఎం తరఫున రాజ్యసభకు 2005 నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2005లో సీపీఐ (ఎం) పొలిట్బ్యూరోకు ఎన్నికైన తొలి మహిళ బృందా కారత్. అంతేగాదు ఆమె సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ భార్య. ఇక బృందా కారత్ 1975 నాటి ఎమర్జెన్సీ మొదలు కమ్యూనిస్టు ఉద్యమం ఉజ్వలంగా సాగిన1985 వరకు తన జ్ఞాపకాలను, ఇతర వ్యాసాలను కలిపి ఓ పుస్తక రూపంలో తీసుకువచ్చారు. “యాన్ ఎడ్యుకేషన్ ఫర్ రీటా” పేరిట ఈ పుస్తకాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల్లో పాల్గొనే నేటితరం యువత తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలు ఇందులో ఉన్నాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం లాంటివే. కనువిప్పు కలిగించేవే. పదేళ్ళ చరిత్రను కళ్లకు కట్టారు. తన 50 ఏళ్ల రాజకీయ జీవితంలోని పదేళ్ల కాలాన్ని గుర్తుపెట్టుకుని క్రమం తప్పకుండా రాయడమంటే మామూలు విషయం కాదు.పైగా ఈ పుస్తకంలో బ్లాక్ అండ్ వైట్ టీవీల కాలం నుంచి మొదలు పెట్టి ఢిల్లీ గల్లీలలో జరిగిన పోరాటాలను, కష్టకాలంలో జరిగిన చర్చల్ని, నాయకుల తీరు తెన్నులన్నింటిని చక్కగా వివరించారు. అయితే అందులో ఉన్న రీటీ ఎవరో కాదు బృందాయే అని పుస్తకం చదివిన తర్వాత గానీ తెలియదు. అయితే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండాలపి పోరాడిన ఆమె ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగానే ఉన్నారు. ఇక తానెందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదని ప్రశ్నిస్తే మాత్రం బృందా..తన వయసు 70 దాటిందని, ఈ వయసులో పరిగెత్తడం సమంజసం కాదని చెబుతుంటారామె. నేటి పరిస్థితులన్ని మార్చాలంటే యువతీ యువకులే నడుం కట్టాలని చెబుతుంటారు. ఈ ఎన్నికల్లోనైనా మరింత మంది మహిళలు రాజకీయాల్లోకి వస్తారనే ఆశతో చూస్తున్నారామె. (చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!) -
చీరలు కొన్న వాటిలానే ఉండాలంటే ఇలా చేయండి!
చీరలు వాడుతున్న కొద్దీ కొన్నప్పుడూ ఉన్నట్టు కనపించవు. కలర్ తగ్గిపోయి కట్టుకున్న నలిగిపోతున్నట్లు ఉంటుంది. కొత్త ఉన్నంత షైన్గా కనిపించదు. దీంతో ఈ షాపు మంచిది, అది మంచిది అంటూ షాపులు మార్చుతుంటాం. ఎన్ని చోట్లకు తిరిగి కొన్నా అదే తీరులో చీరలు ఉంటాయి. అలా కాకుండా చీరలు కొన్న ప్పుడే ఏ రేంజ్లో మెరుస్తూ కనిపిస్తున్నాయో అలానే ఉండాలంటే కొన్న చిట్కాలు పాటిస్తే చాలు ఎప్పటికీ కొన్న వాటిలానే ఉంటాయి. ఇక్కడ చీరలు మెయింటైయిన్ చేయడమపైనే ట్రిక్ అంతా దాగి ఉంది. ఆ ట్రిక్ ఏంటంటే.. ముందుగా చీరలను ఎలా పడితే అలా మడతలు పెట్టొద్దు. అలాగే మడత పెట్టి ఎక్కువ రోజులు ఉంచొద్దు. ఇలా చేస్తే రంగు మారుతుంది. పైగా చీన ముడతలు ముడతలుగా అయిపోతుంది. ముడతలు పడకుండ మధ్యలో ఒకసారి తీసి తిరిగి మడతపెట్టాలి. వాటిని వెలుతురు పడని ప్రదేశాల్లోనే పెట్టాలి. చీరను ఉతికేటప్పుడూ కూడా జాగ్రత్త పాటించాలి. చీరలు అన్నింటిని ఒకే విధంగా ఉతికితే త్వరగా పాడవుతాయి. వాషింగ్ మిషన్ లో చీరలన్నింటిని ఉతక్కూడదు. కొన్నింటిని మినహాయించాలి. ఎందుకంటే? కొన్ని వాషింగ్ మిషన్లో ఉంటే కలర్ దిగిపోయే అవకాశం చీర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి చీరలను చేత్తో నానబెట్టకుండా ఉతుక్కోవడం మంచిది. ఇంకొన్ని చీరలను ఉతక్కుండా డ్రైక్లీనింగ్కు ఇవ్వాలి. అలాగే కొన్ని లైట్ వైట్ చీరలను కొనేటప్పుడే ఎలా ఉతకాలి ఏంటన్నది అడిగి తెలసుకోవాలి. అలాగే ఐరన్ చేయడం వల్ల చీరలకు మంచి లుక్ వస్తుంది కాబట్టి ఐరన్ తప్పనిసరి. ఎక్కువ వేడి మీద అసలు ఐరన్ చేయొద్దు. ఇలా చేస్తే తొందరగా పాడవుతాయి. సిల్క్, పట్టు చీరలు ఐరన్ చేసేటప్పుడు కాటన్ క్లాత్ వేసి ఐరన్ చేస్తే ఫ్యాబ్రిక్ దెబ్బతినకుండా ఉంటుంది కాబట్టి ఈ చిట్కాను తప్పక గుర్తించుకోవాలి ఎంత మంచిగా మెయింటెన్ చేసినా కూడా చీరలపై మరకలు, మడతలు అలాగే ఉంటాయి. దీంతో ఎలా పడితే అలా కాకుండా.. మరకను మాత్రమే క్లీన్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత వెనిగర్, నిమ్మరసం, సబ్బుతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని చీరలకు వర్క్ మరికొన్ని చీరలకు స్టోన్స్, ముత్యాలు ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని విడివిడిగా ఉతకాలి. చీర నాణ్యతను బట్టి ఉతకే విధానంలో మార్పులు చేయాలి. లేదంటే అంత కష్టబడి డబ్బులు పెట్టి మరీ చేయించుకున్న వర్క్ పాడయ్యే పోయే ప్రమాదం ఉంటుంది. (చదవండి: ప్రపంచంలోనే బెస్ట్ డెజర్ట్గా భారతీయ స్వీట్! ఎన్నో స్థానంలో నిలిచిందంటే..) -
మన సంస్కృతికి చిహ్నం చీరకట్టు
ఖైరతాబాద్ (హైదరాబాద్): చీరకట్టు అంటే భారతదేశ సంప్రదాయం, సంస్కృతికి చిహ్నం అని...చీర అంటే సంతోషం, గౌరవానికి చిరునామా అని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన ‘శారీ వాకథాన్’లో గవర్నర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ సంస్కృతి మహోత్సవాలు– 2024 వేడుకల్లో భాగంగా మంగళవారం సాయంత్రం పీపుల్స్ ప్లాజా వేదికగా నిర్వహించిన శారీ వాకథాన్లో వందలాది మంది మహిళలు, విద్యార్థినులు చీరలు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, తాను విదేశాల్లో చదువుకునే సమయంలో ఎలాంటి స్టిచ్చింగ్ లేకుండా చీర ఎలా కడతారంటూ తన స్నేహితులు ఆశ్చర్యపోయేవారని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ, 75 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టసభలో పాసైన సందర్భంగా ప్రతి మహిళకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 33 శాతం రిజర్వేషన్ ఉపయోగించుకుని అసెంబ్లీ, పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్న మహిళలకు ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానన్నారు. అనంతరం బెలూన్స్ ఎగురవేసి శారీ వాకథాన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దర్శన జర్దోష్, పద్మశ్రీ ఆనంద శంకర్, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్తో పాటు పెద్దఎత్తున మహిళలు పాల్గొన్నారు. -
బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి సీతమ్మ స్పెషల్ చీరల్లో.. వాటి ప్రత్యేకత ఇదే!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 1న)వరుసగా ఆరవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ బడ్జెట్తో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు నిర్మలాసీతారామన్. అంతేగాదు వరుసగా ఐదు బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రుల జాబితాలో నిర్మలా సీతారామన్ కూడా చేరిపోవడమేగాక ఈ ఏడాది ప్రవేశపెడుతున్న ఆరో బడ్జెట్తో సరికొత్త రికార్డుని నెలకొల్పబోతున్నారు కూడా. ఇక సీతమ్మ బడ్జెట్ అనంగానే గుర్తొచ్చేది ఆమె చీరలే. ప్రతి ఏటా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఆమె ధరిస్తున్న చీరలదే ప్రత్యేక ఆకర్షణ అనే చెప్పాలి. ఈసారి 2024 బడ్జెట్ సందర్భంగానూ ఆమె ప్రత్యేక రంగు చీరలో వచ్చారు కూడా. అయితే ఇంతవరకు ఆమె ప్రతి ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎలాంటి చీరలు ధరించారు? వాటి విశేషాలేంటో చూద్దామా!. 2019లో.. 2019లో తొలిసారి ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఆ సమయంలో ఆమె గులాబీ రంగు, బంగారు అంచు మంగళ గిరి చీరను ధరించారు. అలాగే ఆ ఏడాదే సంప్రదాయ బ్రీఫ్ కేస్ స్థానంలో బహీ ఖాతాను ప్రవేశపెట్టి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు ఆర్థిక మంత్రి. ఈ బహీ ఖాతా కోసం ఎరుపు రంగు సిల్క్ క్లాత్తో బడ్జెట్ పేపర్లను చుట్టారు. 2020లో 2020 బడ్జెట్ సమర్పణ కోసం నిర్మలా సీతారామన్ పసుపు రంగు సిల్క్ చీరతో పార్లమెంట్కు వచ్చారు. నీలం రంగు అంచుతో పసుపు- బంగారు రంగు చీరను ధరించారు. పసుపును సంప్రదాయానికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. చాలా మంది ప్రత్యేక రోజుల్లో ఈ రంగు చీరలను ధరిస్తుంటారు. 2021 బడ్జెట్లో.. 2021 బడ్జెట్ రోజున ఆర్థిక మంత్రి తెలంగాణలోని పోచంపల్లికి చెందిన చీరను కట్టుకున్నారు. ఎరుపు- హాఫ్ వైట్ సమ్మేళనం అయిన ఇక్కత్ సిల్క్ పోచంపల్లి చీరను ధరించారు. ఈ చీరకు పల్లు ఇక్కత్ పాటర్స్తో సన్నటి గ్రీన్ బార్డర్ ఉంటుంది. సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరొందిన తెలంగాణలోని భూదాన్ పోచంపల్లిలో ఈ చీర తయారైంది. 2022 బడ్జెట్లో.. 2022 బడ్జెట్ సమర్పణ సందర్బంగా బ్రౌన్ కలర్ చీర ధరించి పార్లమెంట్ కు వచ్చారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఒడిశాలో ఈ చీరలు తయారవుతాయి. రస్ట్ బ్రౌన్ చీరకు మెరూన్ రంగు బార్డర్, సిర్వర్ కలర్ డిజైన్ ఉంది. బ్రౌన్ కలర్ రక్షణ, భద్రతలను సూచిస్తుంది. రెడ్ కలర్ పవర్ను సూచిస్తుంది. ఈ రెండింటి సమ్మేళనంతో ఉన్న చీరను ధరించి 2022 బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2023లో.. 2023లో ఐదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంగా నిర్మలా సీతారామన్.. ఎరుపు రంగు టెంపుల్ బార్డర్ చీర ధరించారు. దీని మీద ఎరుపు, నలుపు కలర్ జరీ బార్డర్, టెంపుల్ డిజైన్ ఉంది. ఈ చీరలు ముఖ్యంగా కాటన్ లేదా సిల్క్లో మాత్రమే లభిస్తాయి. ప్రత్యేక సందర్భాల్లో మహిళలు వీటిని కట్టుకునేందుకు ఇష్టపడుతుంటారు. మరోవైపు.. ఇదే ఏడాది బహీ ఖాతా స్థానంలో ఎరుపు రంగు డిజిటల్ టాబ్లెట్తో బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 2024లో.. ఈ ఏడాది ప్రవేశపెడుతున్న మధ్యంతర బడ్జెట్ సమర్పణ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్లూ కలర్ కాంతా వర్క్ టస్సార్ చీరను ధరించారు. ఈ చీర పశ్చిమ బెంగాల్లో తయారైంది. ఇక ఈ నీలం రంగు నీలం మంచి ఆరోగ్యానికి ప్రతీక. పైగా ఇది రక్షణకు, అధికారం, విశ్వాసం,మేధస్సు, ఐక్యత, స్థిరత్వలను సూచిస్తుంది. ఇక ఆర్థిక మంత్రి సీతమ్మకు చేనేత చీరలంటే మహా ఇష్టం. జనవరి 26న, నార్త్ బ్లాక్లో జరిగిన ప్రీ-బడ్జెట్ హల్వా వేడుకలో ఆమె ఆకుపచ్చ, పసుపు కంజీవరం చీరలో కనిపించింది. ప్రత్యేక సందర్భాల్లో ఆమె ఎక్కువగా సంబల్పురి, ఇకత్, కంజీవరం చీరలలో కనిపిస్తుంది. చాలా వరకు ఆమె నలుపు రంగుకు దూరంగా ఉంటారని సమాచారం. (చదవండి: నిర్మలమ్మ చీర ప్రత్యేకత ఇదే..) -
రిపబ్లిక్ డే వేడుకలు: ఆకట్టుకున్న 1900 చీరల ప్రదర్శన
న్యూఢిల్లీ: కర్తవ్యపథ్లో శుక్రవారం 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలల్లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా జరిగిన పరేడ్లో వీక్షకుల కోసం ఏర్పాటు చేసిన సీటింగ్ ఏరియా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న వీక్షకులను ఆకట్టుకుంది. సీటింగ్ ఏరియాలో సుమారు 1900 చీరలను ప్రదర్శించారు. ‘అనంత్ సూత్ర’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేకమైన చీరలను ప్రదర్శనకు పెట్టారు. Here’s a special look at the 'Anant sutra- The Endless Thread' textile installation at #KartavyaPath as a part of the 75th #RepublicDay celebrations!#CultureUnitesAll #AmritMahotsav #BharatKiNariinSaree #RepublicDay2024 pic.twitter.com/DoFQCJuFRm — Ministry of Culture (@MinOfCultureGoI) January 26, 2024 చెక్క ఫ్రేమ్స్కు రంగరంగు చీరలను అమర్చి ప్రదర్శించారు. దీంతో సీటింగ్ ఏరియాలో కూర్చన్న వీక్షకులను వాటిని చూసి సందడి చేశారు. ఇక.. ఆ చిరలను ఎక్కడ నేశారో? వాటి వెరైటీ ఎంటో? చీరల ఎంబ్రైడరీకి సంబంధించిన పలు విషయాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రతి చీరకు యూఆర్ కోడ్ను ఏర్పాటు చేయటం విశేసం. దీనికి సంబంధించిన వీడియోను మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తన ‘ఎక్స్’(ట్విటర్) ఖాతాలలో పోస్ట్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒకేసారి దేశంలో ఉన్న పలు వెరైటీ చీరలు చూడటం బాగుంది.. యూఆర్ కోడ్ ఐడియా సూపర్’ అని కామెంట్లు చేస్తున్నారు. -
Rhea Chakraborty Saree Photos: సారీలో కవ్విస్తూ, కాక పుట్టిస్తున్న ఈ బ్యూటీని చూశారా?
-
ఇక కాటన్స్తో ఆరంభం..
చలి ప్రభావం తగ్గుతూ ఎండ ప్రతాపం చూపడానికి రెడీ అవుతున్నట్టుగా ఉంది ప్రస్తుత వాతావరణం. మనం కూడా అందుకు రెడీగా ఉండకతప్పదు. ఈ రిపబ్లిక్ డే ని పురస్కరించుకొని ఫాస్ట్ ఫ్యాషన్ను వదిలేసి మనవైన దేశీయ కాటన్ దుస్తులతో వార్డ్రోబ్ను సిద్ధం చేసుకుంటే రాబోయే వేసవి రోజులను ఫ్యాషనబుల్గానూ.. హాయి హాయిగా, కులాసాగానూ గడిపేయచ్చు. సీజన్కి తగ్గట్టుగా మన డ్రెస్సింగ్ను కూడా మార్చుకుంటాం. అందులోనూ వేసవి కంఫర్ట్తో గడిపేయాలనుకుంటాం. కాటన్స్ అయితే డల్గా ఉంటాయి అనే మాటలు పక్కన పెట్టేసి మోడర్న్ లుక్స్తో ఆకట్టుకుంటున్న వాటిని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కడ ఉన్నా వైభవంగా వెలిగి΄ోవచ్చు. మనవైన చేనేతలు కాటన్ అనగానే మనకు ముందుగా ఖాదీ గుర్తుకు వస్తుంది. ఖాదీ చీరలు, షర్ట్లే కాదు ఇండో వెస్ట్రన్ స్టైల్స్ కూడా ఇందులో వస్తున్నాయి. దీనితో పాటు నారాయణ్పేట్, ఇక్కత్, గద్వాల.. వంటి చేనేతలు సంప్రదాయ వేడుకల సందర్భాల్లోనూ ధరించడానికి బాగుంటాయి. ఇండోవెస్ట్రన్ జంప్సూట్స్, ష్రగ్స్, గౌన్లు, లాంగ్ అండ్ షార్ట్ జాకెట్స్ డిజైన్స్ ఎన్నో ఇప్పుడు మనకు కాటన్ మెటీరియల్తో తయారైన డిజైన్స్ కనిపిస్తున్నాయి. క్యాజువల్ లేదా కాక్టెయిల్ పార్టీ ఏదైనా సందర్భానికి తగినట్టు వీటిని ఎంచుకోవచ్చు. ఆభరణాల ఊసు కాటన్ మెటీరియిరల్ పైగా వేసవి టైమ్ కాబట్టి ఉడెన్, టెర్రకోట జ్యువెలరీతో అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఎక్కువ అలంకరణ హంగామా లేకుండా సింపుల్ అండ్ ఎలిగేంట్ లుక్స్ అనిపించేలా రెడీ అవడానికి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయిపోవచ్చు. బ్లాక్ ప్రింట్ గౌన్స్ కాటన్పై వేసిన బ్లాక్ ప్రింట్ మెటీరియల్తో ఏ స్టైల్ డ్రెస్ అయినా డిజైన్ చేసుకోవచ్చు. ఇవి వేసుకోవడానికి సౌకర్యంగానే కాదు, ఎంతమందిలో ఉన్నా ప్రత్యేకంగానూ కనిపిస్తాయి. ఇవి చదవండి: అకృత్యాలకు అడ్డుకట్ట కార్నర్ మీటింగ్స్ -
వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ పోటీలో మెరిసిన మంగళగిరి చీర
-
ప్రమోషన్స్లో చీరకట్టులోనే కనిపిస్తున్న రష్మిక..అదే కారణమా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్ హీరోలకి మించిపోయే ఫాన్ ఫాలోయింగ్తో రష్మిక సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఎంతో పాపులారిటి దక్కించుకున్న ఈ బ్యూటీ ఛలో సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. తొలి సినిమాతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ ఆ తర్వాత వరుస హిట్స్తో వెనక్కి తిరిగి చూసుకోలేదు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా తెలుగులోనే కాదు ఇప్పుడు బాలీవుడ్లోను తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం ఆమె నటించిన లేటెస్ట్ మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక, రణబీర్ కపూర్ జంటగా నటించారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రమోషన్స్ జోరు పెంచారు మూవీ టీం. ఇందులో రష్మిక లేటెస్ట్ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నా మధ్య రష్మిక తన ఇన్స్టాలో.. శారీలో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ మీరంతా(అభిమానులను ఉద్దేశించి)నాకు చీరలపై ఉన్న ఇష్టాన్ని పెంచేశారు అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచి రష్మిక ఎక్కువగా చీరకట్టులోనే కనిపిస్తుంది. తాజాగా యానిమల్ ప్రమోషన్స్ అన్నింట్లో చీరల్లోనే మెస్మరైజ్ చేస్తుంది ఈ బ్యూటీ. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ ప్రెస్మీట్లో వైట్ శారీలో దేవకన్యలా మెరిసిపోయింది రష్మిక. 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) ఆర్గాంజా శారీలో అదరహో అనిపించే అందంతో మెరిసిపోయింది. మొన్నటికి మొన్న ఓ షోకు హాజరైన రష్మిక బ్లాక్ శారీలో తళుక్కుమంది. చూడటానికి చాలా సింపుల్గా కనిపించిన ఈ చీర ధర అక్షరాల 80వేల రూపాయలట. ఇక రీసెంట్గా ప్రముఖ డిజైనర్ అర్పితా ఖాన్ డిజైన్ చేసిన పింక్ చీరలోనూ వయ్యారాలు ఒలికించింది. ఫ్యాషన్ ప్రపంచంలో ఎప్పుడూ ముందుండే రష్మిక చీరకట్టులోనూ మరింత అందంగా కనిపిస్తోంది. దీంతో రష్మికకు-చీరలకు ఏందో లింక్ ఉన్నట్లుంది, త్వరలోనే రివీల్ చేస్తుందేమో చూడాల్సి ఉంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
మగువల మనసు దోచే చీరల ప్రదర్శన (ఫోటోలు)
-
‘వెంకటగిరి’ ఉత్పత్తులు అత్యద్భుతం
సైదాపురం/వెంకటగిరి రూరల్: వెంకటగిరి నేతన్నలు తయారు చేసిన పలు అద్భుతమైన డిజైన్లు అబ్బురపరుస్తున్నాయని ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధులు కితాబిచ్చారు. వెంకటగిరి చీరలు, చేనేత ఉత్పత్తులు, జరీ తదితర ఉత్పత్తులను మంగళవారం కేంద్ర బృందం పరిశీలించింది. ఓపెన్ ఇండియా ఒన్ ప్రొడెక్ట్ అవార్డులో భాగంగా 2023లో ప్రతిష్టాత్మకంగా జరిగే పోటీల్లో వెంకటగిరి చేనేత ఉత్పత్తులకు ప్రాధాన్యమిచ్చారు. ఈ మేరకు ఇన్వెస్ట్ ఇండియా టీమ్ కమిటీ ప్రతినిధి జగీష్ తివారిమిశ్రా, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డితో కలిసి వెంకటగిరిలో తయారు చేసే పలు చేనేత ఉత్పత్తులు, చీరలు, డిజైన్లను పరిశీలించారు. కేంద్ర బృందానికి వైఎస్సార్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్రెడ్డి స్వాగతం పలికారు. పట్టణంలోని సాలి కాలనీలోని టాటాట్రస్ట్ అంతరాన్ అందిస్తున్న సహకారం, నేతన్నల వృత్తిలో నైపుణ్యం వంటి అంశాలపై ఆరాతీశారు. బంగారుపేటలో రాష్ట్రపతి చేనేత అవార్డు గ్రహీతలు కూనా మల్లికార్జున్. గౌరవబత్తిన రమణయ్య నివాసాల వద్ద జందాని ట్రెడిషన్ రంగంలో తయారు చేసిన చీరలు, చీరలపై తెలుగు సంప్రదాయల కళ ఉట్టిపడేలా తయారు చేసిన డిజైన్లపై ఆరాతీశారు. వెంకటగిరి రాజా కాలంలో వెంకటగిరి జరీ చీరల ప్రత్యేకతపై వివరాలు తెలుసుకున్నారు. రాజరాజేశ్వరి చేనేత సహకారం సంఘాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వెంకటగిరిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి నక్కా వెంకటరమణయ్య అండ్ సన్స్ వద్దకు వెళ్లి తయారీ విక్రయానికి సిద్ధంగా ఉన్న పట్టు చీరలను పరిశీలించారు.అలాగే ప్రసిద్ధి చెందిన ఐఐహెచ్టీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ) కళాశాలను కేంద్ర బృందం ప్రతినిధి జిగీష తివారి మిశ్రా పరిశీలించారు. -
రంగులు మార్చే చీర!
సాక్షి, సిరిసిల్ల, హైదరాబాద్: చీరను కదిలిస్తే చాలు.. రంగులు మారతాయి.. బంగారు, వెండి పోగులు మెరిసిపోతాయి. వనితల దేహంపై మెరిసిపోతాయి. బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో పట్టు చీర నేశాడు సిరిసిల్లకు చెందిన నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్. నెల రోజులపాటు మగ్గంపై శ్రమించి ఈ చీరను నేశాడు. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండిపోగులతోపాటు పట్టు పోగులతో రూపొందించాడు. ఈ చీర పొడవు 6.30 మీటర్లు ఉండగా.. 48 అంగుళాల వెడల్పుతో 600 గ్రాముల బరువుంటుంది. ప్రముఖ వ్యాపారి దూరపూడి విష్ణు ఆర్డర్ మేరకు రూ.2.8 లక్షలు వెచ్చించి ఈ చీరను నేసినట్లు విజయ్కుమార్ తెలిపారు. ఈ చీరను మంత్రి కె.తారక రామారావు సోమవారం సెక్రటేరియట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత కళాకారుడు నల్ల విజయ్కుమార్ను మంత్రి అభినందించారు. -
‘జీ20 సదస్సు’కు సిద్దిపేట గొల్లభామ చీరలు
సిద్దిపేట జోన్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సిద్దిపేట గొల్లభామ చీరలను ప్రదర్శించే అవకాశం దక్కింది. వివిధ దేశాల ప్రధానులు, అ ధ్యక్షులు, ఇతర ముఖ్య ప్రతినిధులు హాజ రుకానున్న సదస్సు వేదిక వద్ద పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట గొల్లభామ చీరలను కూడా ప్రత్యేక స్టాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో సిద్దిపేట నేత న్నల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుం దని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇలా రూపుదిద్దుకుంది..: కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య.. ఒకరోజు తమ ఇంటి ముందునుంచి తలమీద పాలకుండ, చేతిలో పెరుగు గురిగి పట్టుకొని నడిచివెళుతున్న ఓ మహిళ నీడను చూసి.. వారిలో ‘గొల్ల భామ‘చీరల ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడ వుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను నేసేందుకు ప్రత్యేకమైన సాంచాను తయారు చేసుకున్నారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే.. ‘గొల్లభామ చీర’గా ప్రశస్తి పొందింది. పట్టు, కాటన్.. రెండు రకాల్లోనూ ఈ చీరలను నేస్తారు. చీర అంచుల్లో వయ్యారంగా నడిచే గొల్లభామ చిత్రం వచ్చేలా నేయడమే వీటి ప్రత్యేకత. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. ఒకప్పుడు గొల్లభామ చీర తయారీకి వారం నుంచి 10 రోజులు పట్టేది. ఇప్పుడు జాకార్డు మగ్గం వల్ల మూడు, నాలుగు రోజుల్లో గొల్లభామ చీర తయారు చేస్తున్నారు. మిగతా చీరలతో పోలిస్తే ఈ చీరలను నేయడం కష్టంతో కూడుకున్న పనిగా చెపుతారు. 2012లో ఈ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. -
అందాల భామ ఆలియా ధరించిన చీర ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
కెరీర్ కెరీరే.. వ్యక్తిగత జీవితం వ్యక్తిగత జీవితమే! దేనినీ దేనికోసం వదులుకోవడంలేదు నేటి నటీమణులు! అందుకే గ్లామర్ ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నా.. పెళ్లి.. పిల్లలు.. కుటుంబం విషయంలో కాంప్రమైజ్ కావడంలేదు. ఆ లిస్ట్లో చాలామందే ఉన్నా.. ఇక్కడ చెప్పుకుంటోంది మాత్రం బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ గురించి.. ఇక ఆమె తన గురించి చెబుతూ.. నా మనసు చెప్పిందే వింటాను. జీవితాన్ని మనం ప్లాన్ చేయలేం. జీవితమే మనకు ప్లాన్ ఇస్తుంది అని అంటోంది ఆలియా. ఈ సందర్భంగా గ్లామర్ ప్రపంచంలో ఒకఆమె క్రియేట్ చేసిన ఫ్యాషన్ ట్రెండ్ గురించి! ఆ ట్రెండ్లో పార్ట్నర్స్ అయిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. మనీష్ మల్హోత్రా.. డిజైనర్ మనీష్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్స్తో పాటు పలువురు సెలబ్రిటీలకూ దుస్తులు డిజైన్ చేస్తుంటాడాయన. బాలీవుడ్లో ఏ ఈవెంట్ జరిగినా మనీష్ మల్హోత్రా కాస్ట్యూమ్స్ ఉండాల్సిందే. ఫ్యాషన్ వరల్డ్కి బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఈ డిజైనర్.. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా సినీపరిశ్రమలోనూ తన స్థానం పదిలం చేసుకున్నాడు. అయితే అతని డిజైన్స్ని సామాన్యుడు అందుకోవాలంటే మాత్రం కాస్త కష్టమే. ఏది కొనాలన్నా ధర లక్షల్లోనే ఉంటుంది. ఆన్లైన్లోనూ లభ్యం. ఇంతకీ ఆలియా ధరించిన మల్హోత్రా డిజైనర్ చీర ధర రూ. 1,35000/- ఆమ్రపాలి జ్యూలరీ రాజీవ్ అరోరా, రాజేష్ అజ్మేరా అనే మిత్రులు.. రాజపుత్రుల నుంచి గిరిపుత్రుల వరకు వారి కళను, వారు ధరించే ఆభరణాలను ఆధునిక తరానికి చూపించాలనే ఉద్దేశంతో జైపూర్లో ‘ఆమ్రపాలి’ పేరుతో ఓ మ్యూజియమ్ను స్థాపించారు. దాని సందర్శనకు వచ్చిన చాలామంది ఆ అభరణాలను ధరించేందుకు ఆసక్తి చూపడంతో అచ్చు అలాంటి వాటినే తయారుచేస్తూ, విక్రయించడం మొదలుపెట్టారు. అలా ఆమ్రపాలి బ్రాండ్ మొదలైంది. డిజైన్ మాత్రమే యాంటిక్ కాబట్టి సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఒరిజినల్ యాంటిక్ పీస్ కావాలంటే మాత్రం వేలంపాటలో లక్షలు పెట్టాల్సిందే. ఆమ్రపాలికి ఆన్లైన్ మార్కెట్టూ విస్తృతమే. (చదవండి: స్టన్నింగ్ లుక్తో మెరిసిపోతున్న రకుల్ ధరించిన చీర ధర ఎంతంటే..) -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
ప్రత్యేకంగా కనిపించే ప్రింటెడ్ డ్రెస్సులు.. స్టైలింగ్ అదిరిపోద్ది
ఫ్లోరల్, మల్టీకలర్ ప్రింట్స్ ఏవైనా మనసుకు ఎప్పుడూ ఆహ్లాదాన్నిస్తాయి. ఫ్యాబ్రిక్ ఏదైనా చూడముచ్చటగా ఉంటాయి. సీజన్తో పనిలేకుండా పార్టీ ఏదైనా ఇండోవెస్ట్రన్ లుక్తో టాప్ టు బాటమ్ ఎవర్గ్రీన్ లుక్తో ప్రింటెడ్ ఆకట్టుకుంటున్నాయి. క్యాజువల్ వేర్గానూ కలర్ఫుల్ అనిపిస్తాయి.అందుకే, డిజైనర్లు ప్రింట్ కాన్సెప్ట్ను ఎప్పుడూ వినూత్నంగా మన ముందుకు తీసుకు వస్తుంటారు. వాటిలో కొన్ని డిజైన్స్ ఇవి. లెహంగా శారీ, లాంగ్ కోట్, ట్రౌజర్, శారీ గౌన్, కుర్తా పైజామా.. మల్టీ కలర్ ప్రింట్లతో టాప్ టు బాటమ్ ఒకే కలర్ కాంబినేషన్ను ఎంచుకుంటే ఈ థీమ్కు సరిగ్గా నప్పుతుంది. ఈ స్టయిల్కి ఇతర యాక్ససరీస్ కూడా అంతగా అవసరం ఉండదు. ప్రత్యేకంగా కనిపించే ఈ ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కడ ఉన్నా అంతే ప్రత్యేకతను చాటుతాయి. -
చీరకట్టు మారింది.. శారీకి క్రాప్టాప్తో కార్పోరేట్ లుక్
చీరకట్టు హుందాతనం మనకు సుపరిచితమే. సంప్రదాయ వేడుకలైతే డిజైనర్ బ్లౌజ్లే ఇప్పుడు హంగామ. క్యాజువల్ లుక్కి ప్లెయిన్ బ్లౌజ్తో మ్యాచింగ్ మార్పులెన్ని చేసినా శారీ డ్రేప్ సెల్యూట్ చేయిస్తుంది. క్యాజువల్గానూ, పార్టీవేర్గానూ మురిపించే శారీ టాప్స్తో ఇప్పుడు స్టైలిష్గా వెలిగిపోతోంది. చీరకట్టకు మ్యాచింగ్ బ్లవుజులు ధరించడం పాత ట్రెండ్. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత బ్లవుజుల డిజైన్ కూడా మారిపోయింది. వెరైటీ డిజైన్లలో చీరల ధరలను కూడా తలదన్నేలా బ్లవుజులను డిజైన్ చేయించుకుంటున్నారు. రోజుకో కొత్త డిజైన్తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్, ఓవర్కోట్, పెప్లమ్, లాంగ్ అండ్ షార్ట్ స్లీవ్స్, కాలర్నెక్, రౌండ్నెక్ డిజైన్స్తో ఈ శారీ టాప్స్ ఆధునికపు హంగుకు అద్దమయ్యాయి. కార్పోరేట్ లుక్కి క్లాసిక్ మార్కులు కొట్టేస్తూ కనువిందు చేస్తున్నాయి. కాటన్ శారీస్కు కరెక్ట్గా నప్పే ఈ టాప్స్ క్యాజువల్, కార్పొరేట్ లుక్తో ఆకట్టుకుంటున్నాయి. ఫ్రాక్ టైప్ టాప్ పెప్లమ్ బ్లౌజ్కి దగ్గర పోలిక ఉంటుంది. వదులుగా ఉండటం వల్ల సౌకర్యంగానూ ఉంటుంది. -
పట్టెడ అంచు చీర.. ఈ పేరు విన్నారా?
మనింట్లో ఓ తొంభై ఏళ్ల నానమ్మ కానీ అమ్మమ్మ కానీ ఉందా? ఉంటే ఆమెనడగండి ఓ మాట. వాళ్ల యువతరాన్ని ఆకట్టుకున్న చీరలేమిటి అని. ఎంతో ఉత్సాహంగా ఇప్పుడు మనం వినని ఎన్నో పేర్లు చెబుతారు. ఓ పది రకాల పేర్లు చెప్పి ‘ఇప్పుడా నేత ఎక్కడ వస్తోంది. వచ్చినా ఈ తరంలో ఆ చీరలెవరు కట్టుకుంటారు. నేయడమే మానేసినట్లున్నారు’ అని నిరుత్సాహంగా ముగిస్తారు. సరిగ్గా అలాంటి చీరలకు పూర్వ వైభవం తెస్తున్నారు కర్నాటకకు చెందిన హేమలత. హ్యాండ్లూమ్ లవర్స్ వార్డ్రోబ్లు రెండు వందల ఏళ్ల నాటి చేనేతలతో అలరారుతున్నాయి. ఎటు కట్టినా ఓకే! హేమలత... యూఎస్లోని కన్సాస్ యూనివర్సిటీలో ఉన్నతవిద్య పూర్తి చేశారు. ఆమెకు మన చేనేత కళలో దాగిన సమున్నత జ్ఞానం మీద దృష్టి పడింది. ఒకదానికి ఒకటి విభిన్నంగా దేనికది ఒక శాస్త్రబద్ధమైన గ్రంథంలాంటి చేనేతల మీద అధ్యయనం మొదలు పెట్టారామె. నిఫ్ట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ)లో ఇదే అంశం మీద పీహెచ్డీ చేస్తున్నారు. గిరిజనులు నివసించే ప్రదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. వారి నేత తీరును పరిశీలించారు. ఈ క్రమంలో హేమలతా జైన్ 85 ఏళ్ల దేవదాసిని కలిశారు. ఆమె దగ్గరున్న పట్టెడ అంచు చీర రెండు వందల ఏళ్ల నాటి చేనేత కళ. ఈ చీరకు రెండు కొంగులుంటాయి. చీరను రెండువైపులా కట్టుకోవచ్చు. రివర్సబుల్ శారీ అన్నమాట. పదవ శతాబ్దంలో గజేంద్రఘర్ జిల్లాలోని గ్రామాల్లోని చేనేతకారులు ఈ చీరలను నేసేవారు. అలాంటి చీరలిప్పుడు మార్కెట్లో లేవు. ఈ తరంలో ఎవరి దగ్గరా లేవు. ఆ చీరను చూపించి మరొక చీర తయారు చేయించాలంటే ఆ రకమైన నేత నేసే చేనేతకారులు కూడా లేరన్న మరో వాస్తవం తెలిసి వచ్చిందామెకు. అలాంటి అంతరించిపోతున్న డిజైన్లు 45 వరకు ఉన్నాయి. (చదవండి: ముఖ సౌందర్యంపై పెరుగుతున్న మోజు) -
చీరలు విసిరేసి.. కర్ణాటక మంత్రి ఇంటిపై దాడి
సాక్షి, బెంగళూరు: ఒకవైపు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న వేళ.. కన్నడనాట సిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. అయితే.. తాజాగా కర్ణాటక క్రీడాశాఖ మంత్రి కేసీ నారాయణగౌడ ఇంటిపైకి దళితులు ఆగ్రహంతో దూసుకొచ్చారు. గత రాత్రి మంత్రి అనుచరులుగా చెప్పుకుంటున్న కొందరు స్థానికంగా కొందరికి చీరలు పంపిణీ చేశారు. అయితే.. ఆ చీరలను ఈ ఉదయం మంత్రి ఇంటి ముందు విసిరేసిన దళితులు నిరసన తెలిపారు. ఆపై వాళ్లు మంత్రి నివాసంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. దాడి సమయంలో మంత్రి ఇంట్లోనే ఉన్నారా? లేదా? అనే సంగతిపై స్పష్టత కొరవడింది. ఆటో నడిపిన పీసీసీ చీఫ్.. మరిన్ని సిత్రాల కోసం క్లిక్ చేయండి -
Viral Video: చీరల కోసం జుట్టు పట్టుకుని కొట్టుకున్న మహిళలు
కర్ణాటక: తగ్గింపు ధరలకు చీరలు కొనే సమయంలో ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవడం జరిగింది. ఈ ఘటన బెంగళూరు మల్లేశ్వరం 8వ మెయిన్ రోడ్డులోని ఒక షాపులో జరిగింది. మైసూరు పట్టు చీరలను 35 శాతం తగ్గింపు ధరలతో అమ్ముతున్నట్లు బోర్డు పెట్టారు. ఆదివారం సెలవు కావటంతో పెద్దసంఖ్యలో మహిళలు క్యూ కట్టారు. ఒకే చీరను ఇద్దరు మహిళలు ఎంచుకున్నారు, చీరను వదులుకోవడానికి ఎవరూ ఒప్పుకోలేదు. దీంతో గొడవ మొదలై జడలు పట్టుకొని కొట్టున్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది. ఇతర మహిళలు ఇద్దరినీ విడిపించారు. Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0 — RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023 -
స్త్రీ శక్తి: లండన్ మ్యూజియానికి పింక్ శారీ!
ఎగరడానికి రెక్కలు సవరించిన కాలం అది. ‘పోనీలే’ అని రాజీపడే జీవులు సమరశంఖం కోసం గొంతు సవరించిన కాలం అది. ‘గులాబీ గ్యాంగ్’ అంటే పోరాట చరిత్ర. ఇప్పుడు ఆ చరిత్ర లండన్ మ్యూజియానికి చేరనుంది. ప్రపంచంలోని ప్రఖ్యాత మ్యూజియంలలో లండన్ ‘డిజైన్ మ్యూజియం’ ఒకటి. ప్రపంచ నలుమూలలకు సంబంధించి భిన్నమైన డిజైన్లకు ఇదో వేదిక. ఈ వేదికపై స్త్రీ శక్తిని ప్రతిఫలించే, ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీర సగర్వంగా రెపరెపలాడనుంది. 2006లో.. ఉత్తర్ప్రదేశ్లోని బాందా జిల్లాలో ఏ కొద్దిమందో మహిళలలో తప్ప ఎవరూ ప్రశాంతంగా లేరు. పట్టపగలు రోడ్డు మీదికి వెళ్లాలన్నా భయపడే రోజులు. మరోవైపు కట్నపు వేధింపులు, గృహహింస! అలాంటి సమయంలో ‘మనం ఏం చేయలేమా!’ అనే నిస్సహాయతలో నుంచి పుట్టుకు వచ్చిందే గులాబీ గ్యాంగ్! ‘నువ్వు నేను కాదు... మనం’ అనే నినాదంతో బృందంగా ముందుకు కదిలారు. పింక్ శారీని యూనిఫామ్గా చేసుకున్నారు. ఈ బృందానికి సంపత్పాల్దేవి నాయకత్వం వహించింది. పదుల సంఖ్యతో మొదలైన గులాబీ గ్యాంగ్లో ఇప్పుడు దేశవ్యాప్తంగా 11 లక్షల మంది సభ్యులు ఉన్నారు. తాజాగా... లండన్ ‘డిజైన్ మ్యూజియం’ క్యూరేటర్ ప్రియా ఖాన్చందాని నుంచి సంపత్పాల్దేవికి ఇమెయిల్ వచ్చింది. అందులో ఉన్న విషయం సంక్షిప్తంగా...‘ప్రియమైన గులాబీ గ్యాంగ్ సభ్యులకు, మీ ధైర్యసాహసాలకు సంబం«ధించిన వార్తలను ఎప్పటికప్పుడు చదువుతూనే ఉన్నాను. నాకు అవి ఎంతో ఉత్తేజాన్ని, బలాన్ని ఇస్తుంటాయి. మీ పోరాట స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే గులాబీ రంగు చీరను ఆఫ్బీట్ శారీ టైటిల్తో మ్యూజియంలో ప్రదర్శించాలనుకుంటున్నాం. ఈ అవకాశాన్ని గర్వంగా భావిస్తున్నాము’ ‘మా పోరాట స్ఫూర్తి విదేశీగడ్డపై అడుగు పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. మా సభ్యులలో ఒకరు ధరించిన చీరను పంపబోతున్నాం’ అంటుంది సంపత్పాల్దేవి. -
చీరకట్టులో బైక్పై వరల్డ్ టూర్
రమాబాయి లత్పతే 9 గజాల మహారాష్ట్ర నౌవారీ చీరలో40 దేశాలు బైక్ మీద చుట్టి రావడానికిమార్చి 8న గేట్ వే ఆఫ్ ఇండియా నుంచిబయలుదేరింది.365 రోజుల పాటు ప్రయాణం సాగించివచ్చే ఏడాది మార్చి 8కి ముంబై చేరనుంది.‘భారత్ కీ బేటీ’ ఏదైనా చేయగలదని నరేంద్ర మోడీ అన్న మాటలే తననీ సాహసయాత్రకు పురిగొల్పాయని చెబుతోంది. బైక్ యాత్రలు చేసిన మహిళలు చాలా మందే ఉన్నారు. కాని చీర మీద బైక్ నడుపుతూ ప్రపంచ దేశాలు చుట్టి రావాలనే కోరిక మాత్రం రమాబాయి లత్పతేకే వచ్చింది. పుణెకు చెందిన రమాబాయి అంట్రప్రెన్యూర్. కాని బైక్ మీద విహారాలు ఆమెకు ఇష్టం. ఆ విహారాల కోసమే ప్రత్యేకమైన బైక్ ఏర్పాటు చేసుకుంది. ఇటీవల ‘జి20’ సమ్మిట్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడి ‘భారతీయ స్త్రీలు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు’ అని చేసిన వ్యాఖ్య రమాబాయి లత్పతేను ఇన్స్పయిర్ చేసింది. ‘నా డిక్షనరీలో భయం అనే మాటకు విలువ లేదు. బాల్యం నుంచి నేను చాలా ధైర్యంగా నా జీవితంలో ముందుకు సాగాను. ఆ ధైర్యంతోనే ప్రపంచ యాత్ర చేయాలనిపించింది. అయితే ఆ యాత్రలో ఏ దేశంలో అడుగు పెట్టినా నేను ‘భారత్ కీ బేటీ’ అనిపించుకోవాలంటే మన సాంస్కృతిక చిహ్నమైన చీరలో ఉండటం అవసరం అని భావించాను. మహారాష్ట్ర స్త్రీలు ధరించే 9 గజాల నౌవారి చీర చాలా ప్రసిద్ధం. ఆ చీరలతోనే నా యాత్ర మొత్తం చేస్తాను’ అంది రమాబాయి లత్పతే. మొదలైన యాత్ర సాధారణ జనం, మీడియా ఉత్సుకతతో చూస్తుండగా ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా నుంచి మార్చి 8న రమాబాయి లత్పతే యాత్ర మొదలైంది. ఈ యాత్ర గురించి, అందునా మహరాష్ట్ర సంస్కృతి ప్రాముఖ్యం ఉండటం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఆమె యాత్రను ప్రోత్సహిస్తూ శుభాకాంక్షలు తెలియచేశారు. ‘నా మొత్తం యాత్రకు కోటి రూపాయలు అవుతుంది. ఇందుకోసం నాకున్న నగలు, నా ఎస్.యు.వి అమ్మేశాను. కొంత లోటు ఏర్పడింది. నా యాత్రను ప్రోత్సహించేందుకు మనిషికి 1 రూపాయి చొప్పున చందా ఇవ్వాలని అప్పీలు చేశాను. అలా కొంత సాయం వచ్చింది. మంచి పని మొదలెడితే సాయం అదే అందుతుంది’ అంది రమాబాయి లత్పతే. కఠినమైన యాత్ర రమాబాయి లత్పతే మొత్తం 80 వేల కిలోమీటర్లు ఈ యాత్రలో తన బైక్ మీద తిరగనుంది. నలభై దేశాల వాతావరణాన్ని తట్టుకోవాలి. అతి శీతల, అత్యల్ప ఉష్ణోగ్రతలు భరించాలి. భద్రత ఒక సమస్య. అలాగే ఆహారం కూడా. ‘అయినా నేను వెనుకాడను’ అని బయలుదేరింది రమాబాయి. ముంబై నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నాక అక్కడి నుంచి విమానం ద్వారా ఆమె బైక్తో పాటుగా ఆస్ట్రేలియా చేరుకుంటుంది. ఆస్ట్రేలియాలో పెర్త్ నుంచి సిడ్నీ వరకు 1600 కిలోమీటర్లు బైక్ మీద ప్రయాణిస్తుంది. కాని ఆ దారిలో జనావాసాలు పెద్దగా ఉండవు. వాతావరణం కూడా కఠినంగా ఉంటుంది. దారి మధ్యలో ఆమె టెంట్ వేసుకుని విడిది చేయక తప్పదు. ఆ ఛాలెంజ్ను రమాబాయి పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా నుంచి ఆక్లాండ్ (న్యూజిలాండ్)కు, అక్కడి నుంచి శాంటియాగో (చిలీ), ఆ తర్వాత బొగోటా (కొలంబియా), ఆ తర్వాత అమెరికా అక్కడి నుంచి కెనడాలకు బైక్ మీదే ఆమె ప్రయాణం సాగుతుంది. ఆపై సముద్ర మార్గంలో బైక్ను లండన్కు చేరవేసి అక్కడి నుంచి తిరిగి బైక్ మీద పోలాండ్, రోమ్, ఫ్రాన్స్, స్పెయిన్, పోర్చుగల్, మొరాకో, టునీషియా, జోర్డాన్... ఇలా ప్రయాణించి మళ్లీ సముద్రం మీదుగా సౌదీ చేరుకుని ఆ ఎడారి దేశాలన్నీ చుట్టి గుజరాత్లో ప్రవేశించి వచ్చే ఏడాది మార్చి 8కి గేట్ వే ఆఫ్ ఇండియా చేరుకుంటుంది. ఈ మొత్తం యాత్రలో మిగిలిన దేశాలతోపాటు జి 20 నుంచి 12 దేశాలు ఉంటాయి. ప్రయాణాలు చేయండి ‘స్త్రీలు నాలుగు గోడల మధ్య ఉండటం వల్ల ప్రపంచం ఏమీ తెలియదు. ప్రయాణాలకు భయపడాల్సింది లేదు. వీలైనన్ని ప్రయాణాలు చేసి లోకం ఎంత విశాలమో తెలుసుకోండి’ అంటోంది రమాబాయి. -
బతుకమ్మ చీరలు @ రూ.330 కోట్లు
సిరిసిల్ల: రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్లను తెలంగాణ పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ఖరారు చేసింది. 21 రంగుల్లో 25 డిజైన్లలో బతుక మ్మ చీరలను ఆర్డర్ చేసింది. రాష్ట్రంలోని కోటి మందికి బతుకమ్మ పండగ కానుకగా ప్రభుత్వం చీరలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ పండుగకు చీరలను సారెగా అందిస్తున్నారు. గతంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెక్సో) ద్వారా ఈ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. ఈసారి తెలంగాణ పవర్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ద్వారా ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలోని 139 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్)లకు 3.70 కోట్ల మీటర్ల బట్టను (64.03 లక్షల చీరలు), 126 చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎస్ఐ)కు 1.84 కోట్ల మీటర్ల బట్టను (31.87 లక్షల చీరలు) ఆర్డర్లు ఇచ్చారు. జాకెట్ పీసుల కోసం మరో 68 లక్షల మీటర్ల బట్టను సిరిసిల్ల శివారు టెక్స్టైల్ పార్క్లోని ఆధునిక మగ్గాలకు ఇచ్చారు. మొత్తంగా 6.22 కోట్ల మీటర్ల బట్టను బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది నిర్ణయించారు. చీరలకు ఉత్పత్తి రవాణా, ప్రాసెసింగ్ ఇతర ఖర్చులకు మొత్తం రూ.330 కోట్లు కేటాయించారు. సెపె్టంబరు నెలాఖరులోగా ఈ చీరలను సిరిసిల్ల నేతన్నలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మగ్గాల సంఖ్య ఆధారంగా ఆర్డర్లు ఇస్తాం సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాము. 21 రంగుల్లో 25 డిజైన్లలో చీరలను ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశాము. మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లలోని మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తిదారులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తాం. గడువులోగా చీరలను ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది. – సాగర్, జౌళిశాఖ, ఏడీ -
జరీ అంచు ఆభరణం
సంప్రదాయ వేడుకలలో జరీ అంచు చీరల రెపరెపలు మనకు పరిచయమే. పువ్వులు, హంసలు, గోపురపు డిౖజైన్లతో అవి అందంగా ఆకట్టుకుంటాయి. వాటిని అంచు వరకే ఎందుకు పరిమితం చేయాలనే ఆలోచనతో ఆభరణంగా రూపుకడుతున్నారు డిజైనర్లు. పాత చీరెల అంచులైనా కొత్తగా మార్కెట్లో లభించే జరీ బార్డర్స్ అయినా ఇలా మనసుదోచేలా మురిపిస్తున్నాయి. సంప్రదాయ వేడుకలు వేడుకకు తగినట్టు డ్రెస్ ఎంపిక ఉంటుంది. దానికి మ్యాచింగ్గా ఈ జరీ మాలలు మరింత అందాన్ని తీసుకువస్తున్నాయి. ఫ్యాబ్రిక్ రోలర్ నూలు దారాలను ఉండగా చేసి, వాటికి కట్ చేసుకున్న బార్డర్ని అతికించి, కావల్సిన పరిమాణంలో ఫ్యాబ్రిక్ బీడ్స్ను తయారు చేసుకోవచ్చు. లాకెట్స్తో ప్రత్యేకం ముగ్గు, గోపురం, దేవతా మూర్తుల లాకెట్స్ని ఈ జరీ అంచు చెయిన్స్కు జత చేయచ్చు. లేదంటే, బార్డర్ ఫ్యాబ్రిక్నే లాకెట్లా తయారు చేసి, వేసుకోవచ్చు. బీడ్స్తో జత కట్టి రంగు రంగుల పూసలను ఎంపిక చేసుకొని, వాటితో జరీ బాల్స్ను జత చేసి దండగా సిద్ధంగా చేసుకోవచ్చు. గాజుల అందం రంగు వెలసిన వెడల్పాటి గాజులను వాడకుండా పక్కన పడేయటం ఇళ్లలో సాధారణంగా జరుగుతుంటుంది. వాటితో జరీ అంచును ఇలా అందంగా తయారుచేసుకోవచ్చు. 1.పాత సిల్క్ , జరీ అంచు ఉన్న చీరను ఎంపిక చేసుకోవాలి. జరీ అంచు బాగుంటే, దానిని చీర నుంచి కట్ చేసుకోవాలి. 2. ఎంపిక చేసుకున్న గాజుకు కట్ చేసిన జరీ అంచును చుట్టి, అన్నివైపులా గ్లూతో అతికించాలి. 3. ఎక్కడా జరీ పోగులు బయటకు రాకుండా సరి చూసుకోవాలి. 4. పూర్తిగా గాజు తయారీ పూర్తయ్యాక ఫ్యాబ్రిక్ చివర్లు కూడా బయటకు కనిపించకుండా అతికించాలి. 5. రెండు రకాల గాజు మోడల్స్ తయారు చేసుకొని, కాంబినేషన్గా ధరించవచ్చు. -
స్నేహితుడి పెళ్లిలో చీరకట్టుతో మెరిసిన అమెరికన్స్.. ఎంత సక్కగున్నారో!
సాధారణంగా ఎవరైనా పెళ్లికి వెళ్తే ఏం చేస్తారు.. మంచిగా తయారయ్యి గిఫ్ట్లు, డబ్బులు కానుకలుగా తీసుకెళ్తారు. పెళ్లయ్యాక భోజనం చేసి వచ్చేస్తారు. కానీ ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారింది. చాలా వరకు పెళ్లిల్లో బంధువులు, స్నేహితులు సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు. వధూవరులతో ఫ్రెండ్స్ చేసే అల్లరి పనులు, సర్ప్రైజ్లు భలే ఫన్నీగా ఉంటాయి. తాజాగా ఓ ఇద్దరు యువకులు తమ బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. పెళ్లి భారతీయ యువకుడిదే అయినా జరిగింది ఇక్కడ కాదు అమెరికాలో.. అయితే అతన్ని సర్ప్రైజ్ చేసింది అమెరికా దోస్తులు కావడం విశేషం. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇండియాకు చెందిన ఓ యువకుడు చికాగోలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. పంచెకట్టులో ముస్తాబైన వరుడు తన స్నేహితుల కోసం ఎదురుస్తున్నాడు. ఇంతలో తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు అమరికన్ యువకులు అచ్చమైన భారత మహిళలుగా చీర కట్టుకొని అటుగా వస్తుంటారు. చక్కగా చీరలు కట్టుకొని ముఖానికి బొట్టు పెట్టుకొని.. ఇద్దరు కలిసి రోడ్డుపై వయ్యారంగా సిగ్గుపడుతూ నడుస్తూ వచ్చారు. దోస్తుల కోసం ఎదురు చూస్తున్న వరుడు వారు అలా చీరలో స్టైల్గా వస్తుండటం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. గాల్లో తేలిపోయి పడిపడి నవ్వుతుంటాడు. స్నేహితులు సైతం వరుడిని ఆనందంతో చిరునవ్వు చిందిస్తారు. చివరికి ముగ్గురు ఒకరినొకరు హత్తుకొని తమ స్నేహానికి గుర్తుగా ఓఫోటో ఫోజు ఇచ్చారు. ఇదంతా వధువు పక్కకు ఉండి వారిని గమనిస్తూ మురిసిపోవడంపై మరింత హెలైట్గా నిలిచింది. చదవండి: విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ.. చికాగోకు చెందిన ఓ వెడ్డింగ్ఫోటోగ్రాఫ్ ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ఇందులో భారతీయ సంప్రదాయమైన చీరను కట్టడంలో యువకులకు ఓ మహిళ సాయం చేసింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్నేహితుడి సంప్రదాయాన్ని గౌరవించి యువకులు తీసుకున్న నిర్ణయం నెటిజన్ల మనసులను హత్తుకుంటుంది. నిజమైన స్నేహితులు వీళ్లు అంటూ యువకులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప‘రాయి దేశం వాళ్లు అయిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఎంతో విలువిచ్చారో, ఎంత ముద్దుగా చీరలు కట్టుకున్నారో.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు’ అంటూ కొనియాడుతున్నారు. View this post on Instagram A post shared by Chicago Wedding Videographers (@paraagonfilms) -
వేలానికి శ్రీదేవి చీరలు, ఆ డబ్బుతో ఏం చేయబోతున్నారంటే..
అతిలోక సుందరి, దివంగ నటి శ్రీదేవి చీరలను వేలం వేస్తున్నారు. ఆమె నటించిన ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేసేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. కాగా తనదైన అందం, నటనతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఆమె. 1980లో హీరోయిన్గా రాణించిన ఆమె పెళ్లి అనంతరం 1997లో నటనకు విరామం చెప్పారు.ఆ తర్వాత 2012లో ఇంగ్లిష్-వింగ్లిష్ చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా అక్టోబర్ 10న పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. చదవండి: ట్రెండింగ్లో బాయ్కాట్ ఆదిపురుష్.. ‘బాలీవుడ్ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తోంది’ ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు డైరెక్టర్ గౌరీ షిండే ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ 10వ వార్షికోత్సవం నిర్వహించడంతోపాటు, ఇంగ్లిష్ వింగ్లిష్లో శ్రీదేవి ధరించిన చీరలను వేలం వేయాలని అనుకుంటున్నట్టు గౌరీ షిండే ప్రకటించారు. వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని బాలికల విద్య కోసం పనిచేసే స్వచ్ఛంద సంస్థకు ఇవ్వనున్నారు. ఈ విషయాలను దర్శకురాలు గౌరీ షిండే ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఇంగ్లిష్ వింగ్లిష్లో సగటు ఇల్లాలిగా, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని పాత్రలో శ్రీదేవి నటించి మెప్పించారు. అమెరికా వెళ్లిన ఆమె ఇంగ్లిష్ రాక అక్కడ ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఆ తర్వాత ఇంగ్లిష్లో ఎంతటి ప్రావీణ్యం పొందారనేదే కథ. చదవండి: దీపావళికి ఓటీటీలో ‘బింబిసార’ మూవీ, రిలీజ్ డేట్ ఇదే! -
సిరి పట్టు చీర ‘న్యూ’జిలాండ్కి వెళ్లింది
సాక్షి, హైదరాబాద్/ సిరిసిల్ల: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలతో ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు నేడు వినూత్నమైన ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించే స్థితికి చేరుకున్నారని రాష్ట్ర ఐటీ, జౌళి శాఖ మంత్రి కె. తారక రామారావు చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని నేతన్నలు తయారు చేసిన ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్ పట్టు చీరలను న్యూజిలాండ్లో ఆ దేశ కమ్యూనిటీ, వాలంటరీ సెక్టర్ మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ ఆవిష్కరించారు. జూమ్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ వీడియో సందేశం ఇచ్చారు. ‘రాజన్న సిరిపట్టు’ చీరలను ఆవిష్కరించిన న్యూజిలాండ్ మంత్రికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్ఐ, బ్రాండ్ తెలంగాణ ఫౌండర్, ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్కు రూపకల్పన చేసిన సునీత విజయ్ తదితరులను అభినందించారు. సిరిసిల్లకు చెందిన హరిప్రసాద్ లాంటి నైపుణ్యం కలిగిన నేతన్నలు వినూత్న ఉత్పత్తులను తయారు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. సిరిసిల్ల నేతన్నలు బతుకమ్మ చీరలతో పాటు అగ్గిపెట్టెలో ఇమిడే చీర, వివిధ కళాకృతులు, వివిధ పేర్లతో రూపొందించిన వినూత్నమైన చీరలను నేస్తున్నట్లు పేర్కొన్నారు. ‘రాజన్న సిరిపట్టు’కు మంచి భవిష్యత్తు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. అందుకు అవసరమైన అన్నిరకాల సహాయ సహకారాలను ప్రభుత్వం నుంచి అందిస్తామని తెలిపారు. పట్టు చీరలు ఇష్టం: వ్యక్తిగతంగా తనకు పట్టు చీరలు ఎంతో ఇష్టమని, బతుకమ్మ సంబురాల కోసం ప్రవాసీలు తనను ఆహ్వానించిన ప్రతిసారీ వాటినే ధరిస్తానని ప్రియాంక రాధాకృష్ణన్ వెల్లడించారు. ‘రాజన్న సిరిపట్టు’ పట్టు చీరలను తన చేతుల మీదుగా ప్రా రంభించడం అత్యంత సంతోషాన్నిస్తోందని చెప్పారు. ఈ చీరలకు ప్రవాసీ మహి ళల నుంచి మంచి స్పందన లభిస్తోందని సునీత విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా 35 మంది ప్రవాసీ భారతీయులు సిరిసిల్ల ఉత్పత్తులను ధరించి ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. -
Fashion: సింపుల్ లుక్ను ‘రిచ్’గా మార్చేయగల వెల్వెట్ లాంగ్ జాకెట్!
వేడుకలో గ్రాండ్గా వెలిగిపోవాలన్నా సింపుల్ డ్రెస్ను రిచ్గా మార్చేయాలన్నా ఒకే ఒక టెక్నిక్... వెల్వెట్ లాంగ్ జాకెట్! ఎంబ్రాయిడరీ జిలుగులతో మెరిసే కళను సొంతం చేసుకున్న వెల్వెట్ జాకెట్ శారీ, సల్వార్, లెహంగాలకు కాంబినేషన్గా ఇట్టే అమరిపోతుంది. చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. రిసెప్షన్, బర్త్డే, గెట్ టు గెదర్ వేడుకలలో ఎప్పుడూ ఒకే తరహా సంప్రదాయ లుక్లో కనిపించాలన్నా బోర్ అనిపిస్తుంటుంది. రొటీన్కు బ్రేక్ వేయాలంటే ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ లాంగ్ జాకెట్ లేదా కోటును ఎంచుకుంటే చాలు. ముఖ్యంగా సాయంకాలాలు జరిగే పార్టీలో వెల్వెట్ మెరుపు మరింత అందాన్ని ఇస్తుంది. బ్లాక్, పర్పుల్, బ్లూ, గ్రీన్ కలర్ వెల్వెట్ కోట్లు విలాసానికి అసలు సిసలు చిరునామాగా నిలుస్తాయి. విడిగా వెల్వెట్ క్లాత్ తీసుకొని, ఎవరికి వారు సొంతంగా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే, మార్కెట్లో రెడీమేడ్గా లభించే లాంగ్ వెల్వెట్ జాకెట్స్ను ఎంచుకోవచ్చు. రాజరికపు హంగులను తీసుకురావడానికి వెల్వెట్ జాకెట్ సరైన ఎంపిక అవుతుంది. సేమ్ లేదా కాంట్రాస్ట్ కలర్ జాకెట్స్ కూడా ధరించవచ్చు. ఈ లాంగ్ జాకెట్స్ ప్రత్యేక ఆకర్షణతో ఉంటాయి కనుక ఆభరణాల విషయంలో అంతగా హంగామా అవసరం ఉండదు. చెవులకు వెడల్పాటి, లాంగ్ హ్యాంగింగ్స్ ఎంచుకుంటే చాలు. ఫ్యాషన్ జ్యువెల్రీ కన్నా స్టోన్ జ్యువెలరీ ఈ డ్రెసింగ్కి సరైన ఎంపిక. సంప్రదాయ కేశాలంకరణ కూడా ఈ తరహా డ్రెస్సింగ్కి అనువైనదిగా ఉండదు. ఇండోవెస్ట్రన్ స్టైల్లో శిరోజాల అలంకరణ బాగుంటుంది. చదవండి: Rini Mehta- Pitara: అక్క ఎంబీఏ, తమ్ముడు లా వదిలేసి.. పాత చీరలతో బ్యాగులు తయారు చేస్తూ.. Monsoon- Wardrobe Ideas: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్! -
షిఫాన్ రాణి
ధరించే దుస్తుల నుంచి అలంకరించుకునే ఆభరణాల వరకు అన్నీ భారీగానే ఉంటాయి మహారాణులకు. మహారాణులంటే ఇలాగే ఉండితీరాలి అన్నట్టుగా ఉంటారు వారు. ఈ సంప్రదాయ ఆహార్యం ఓ మహారాణికి బాగా విసుగు పుట్టించింది. దీంతో ఆమె సాదాసీదా, బరువులేని వస్త్రాలు ధరించాలను కుంది. భారీగా కాకుండా సిల్క్తో తయారయ్యే షిఫాన్ చీరను కట్టుకుని పంతొమ్మిదో శతాబ్దం ప్రారంభంలో ఇండియాలో బాగా పాపులర్ అయ్యి, షిఫాన్ ట్రెండ్ సెట్టర్గా నిలిచారు ఆ రాణీగారు. అప్పటినుంచి ఇప్పటికీ షిఫాన్ చీరలు మగువల మనసులు దోస్తూనే ఉన్నాయి. స్టైల్గానేగాక, ఎంతో సౌకర్యంగా ఉండే షిఫాన్ చీరలను ప్రపంచానికి పరిచయం చేసింది రాణి ఇందిరాదేవి. అప్పటి బరోడా రాష్ట్ర యువరాణి. కూచ్బెహర్ మహారాజా జితేంద్ర నారాయణ్ను వివాహం చేసుకున్న ఇందిరా దేవి ధరించే దుస్తులు చూపరులను అమితంగా ఆకర్షించేవి. ఎప్పుడూ భారీగా ఉండే చీరలు, నగలు ధరించే ఇందిరకు వాటిమీద మొహం మెత్తేసింది. తేలికగా ఉండే చీరలను ధరించాలనుకుంది. ఎక్కువగా యూరప్లో పర్యటించే ఆమె ఎంతో ఖరీదైన షిఫాన్ వస్త్రాన్ని ఫ్రాన్స్ నుంచి తెప్పించుకుని ఆరుగజాల చీరను రాజవంశానికి తగ్గట్టుగా కళాకారులతో డిజైన్ చేయించి మరీ ధరించింది. అది ఆమెకు బాగా నప్పడంతోపాటు కట్టుకుంటే చాలా సౌకర్యంగా ఉండడంతో.. అప్పటి నుంచి షిఫాన్ చీరలనే ధరించేది. ఇలా షిఫాన్ చీరలను ఇందిర ఇండియాకు పరిచయం చేసింది. తల్లికి తగ్గ వారసురాలిగా.. ఇందిర కూతురు జైపూర్ మహారాణి గాయత్రి దేవి కూడా అమ్మ షిఫాన్ చీరకట్టును అనుసరించింది. తల్లి ధరించినట్టుగానే షిఫాన్ చీర, నవరత్నాల నెక్లెస్, బాబ్డ్హెయిర్తో ప్రతి కార్యక్రమంలో పాల్గొనేది. షిఫాన్ చీరకట్టుతో అందంగా ఉండడంతో ప్రపంచంలోని పదిమంది అందమైన మహిళల్లో గాయత్రి దేవి ఒకరుగా నిలిచినట్లు 1960లో ఓ మ్యాగజీన్ పేర్కొంది. ఇందిరా, గాయత్రి షిఫాన్ చీరలు మహిళలను అమితంగా ఆకట్టుకోవడంతో.. అన్ని తరగతుల వారు వీటిని ధరించడం మొదలు పెట్టారు. అలా దేశవ్యాప్తంగా షిఫాన్ పాపులర్ అయ్యింది. బ్రిటన్ మహారాణి తల్లి నుంచి ప్రిన్సెస్ డయానా వరకు అందరూ షిఫాన్ను వాడినవారే. వారి గౌనులు షిఫాన్తో తయారు చేయించుకుని అనేక కార్యక్రమాల్లో మెరిసిపోయేవారు. మహారాణుల నుంచి సామాన్యులు మెచ్చిన షిఫాన్ను సిల్క్ నుంచి రూపొందించేవారు. అప్పట్లో దీనిని సంపద, ప్రతిష్టకు గౌరవసూచికగా భావించేవారు. తర్వాత నైలాన్, సింథటిక్ ఫైబర్ అందుబాటులోకి రావడంతో పాలిస్టర్ షిఫాన్ అందుబాటులోకి వచ్చి ధరకూడా తగ్గింది. ఇప్పటికీ ఫ్రెంచ్లో తయారయ్యే షిఫాన్ ధర లక్షల్లోనే ఉంటుంది. ఒకరి విభిన్న ఆలోచనకు ప్రతిరూపమే నేటి షిఫాన్ చీరలు. ట్రెండ్ సెట్టర్లు కావాలంటే గుంపులో గోవిందా అనకుండా..వందమందిలో ఉన్నా ఒక్కరిలా నిలిచేలా సరికొత్తగా ఆలోచించాలి. -
పుష్పకు తగ్గని క్రేజ్.. అల్లు అర్జున్, రష్మిక ఫోటోలతో చీరలు
దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే . పుష్ప క్యారెక్టర్లోని బన్నీ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. సినిమాలోని డైలాగులు, పాటలు అన్నీ సూపర్హిట్గా నిలిచాయి. దీంతో పుష్ప క్యారెక్టర్ను అనుకరిస్తూ ప్రపంచం నలుమూలల నుంచి సినీ, క్రికెట్ సెలబ్రిటీలు ప్రత్యేక వీడియోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. సినిమా పేరుతో చిప్స్ ప్యాకెట్స్ కూడా వచ్చాయి. తాజాగా పుష్ప సినిమా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. విభిన్న రకాల దుస్తులను తయారు చేయంలో సూరత్ ప్రసిద్ధి చెందిన విషయం. అక్కడ చరణ్జీత్ క్లాత్ మార్కెట్ ప్రస్తుతం ఈ క్లాత్ మార్కెట్ పుష్ప సినిమా పోస్టర్లతో చీరలు రూపొందించింది. పుష్ప సినిమా పాపులర్ అవ్వడంతో ఈ సినిమాతో ప్రత్యేకంగా చీరలు రూపొందించాలని ఈ కంపెనీ యజమాని చరణ్పాల్ సింగ్కు ఆలోచన వచ్చింది. దీంతో ఆలోచనను ఆచరణలో పెట్టి కొన్ని చీరలను తయారు చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్టుచేశాడు. చదవండి: ‘కచ్చా బాదం’ పాటకు అర్హ డ్యాన్స్, వీడియో షేర్ చేసి మురిసిపోయిన బన్నీ ఇంకేముంది ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా వస్త్ర వ్యాపారుల నుంచి భారీ డిమాండ్లు రావడం ప్రారంభమైంది. ఈ విషయంపై చరణపాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాల నుంచి తన 'పుష్ప' చీరల కోసం ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. పుష్ప వచ్చి రెండు నెలలు దగ్గర పడుతున్న ఈ సినిమాకున్న క్రేజ్ తగ్గడం లేదని వీటన్నింటిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. -
అంగన్వాడీలకు చేనేత చీరలు
సాక్షి, హైదరాబాద్: చేనేత పరిశ్రమను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా చేనేత చీరలు పంపిణీ చేశారు. హైదరాబాద్లోని కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కమిషనర్ దివ్యా దేవరాజన్ పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది టీచర్లు, ఆయాలకు ఈ చీరలు పంపిణీ చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఉద్యోగుల గౌరవాన్ని పెంచేలా చేనేత వస్త్రాలు ఇవ్వడంతో పాటు అంగన్వాడీ కేంద్రాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా అంగన్వాడీ ఉద్యోగులకు మూడు పర్యాయాలు వేతనాలు పెంచి, 30శాతం వేతన సవరణ చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ విభాగంపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్ అన్నారు. ట్రాన్స్జెండర్లు తయారు చేసిన జనపనార బ్యాగులను కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు. -
పాయకరావుపేటలో తళుక్కు.. జమధాని సొగసు
పువ్వు వంటి పడుసు.. నవ్వుతూ సింగారిస్తే.. ఏచీరకు ఎంతందము ఎదురొచ్చెనో తెలియక సిక్కొచ్చి పడ్డాదిలే.. సిన్ని రామసిలక.. అంటూ బంగారిమామ పాటలా.. ఈ చీరల సొగసు చూస్తే పాడాలనిపిస్తుంది.. ఎవరికైనా..! తళుక్కుమనే జమధాని చీరల తయారీలోప్రసిద్ధి పొందిన పాయకరావుపేట చేనేతకార్మికుల కళాత్మకత చూపరులను కట్టిపడేస్తుంది.. పాయకరావుపేట: జమధాని చీరల తయారీ రోజురోజుకీ కొంగొత్త అందాలను సంతరించుకుంటుంది. పట్టణంలో సుమారు 300 కుటుంబాలు చీరల తయారీలో ప్రావీణ్యం పొంది ఉన్నారు. సుమారు 110 చీరలు తయారు చేసే మగ్గాలు ఉన్నాయి. పాయకరావుపేట జమధాని చీరలకు మార్కెట్లో ప్రత్యేక స్థానం ఉందని పలువురు వ్యాపారులు చెబుతున్నారు. 1994 నుంచి ఇక్కడ జమధాని చీరలు తయారు చేస్తున్నారు. ఇదీ ప్రత్యేకత.. ఆల్ ఓవర్, బోర్డర్ డిజైన్, పల్లా బుట్టా అనే ప్రధాన రకాల జమధాని చీరలు తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత. పూర్తి డిజైన్తో ఖరీదైన చీరలు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. అంచులతో, ఆల్ఓవర్ డిజైన్ చీరలు ఎంతో ఆకట్టుకుంటాయి. చీరకు పది రోజులు... మగ్గానికి ముగ్గురు చొప్పున చీరను తయారు చేయడం ప్రారంభిస్తే పూర్తికావడానికి సుమారు 10 రోజులు పడుతుంది. అదే విధంగా నెలకు కేవలం 300 వరకు ఇక్కడ ప్రత్యేకమైన చీరలను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన చీరలను హైదరాబాద్, ముంభై, ఢిల్లీ, విశాఖపట్నం, శ్రీకాకుళం, బెంగుళూరు, చెన్నైకి ఎగుమతి చేస్తుంటారు. సుమారుగా రూ.3500 నుంచి రూ. 7000 వరకు ఖరీదు గల చీరలు ఇక్కడ నుంచి ఎగుమతి అగుతున్నాయి. తయారీ, మార్కెటింగ్ ఇలా జమధాని చీరల తయారీకి ముడి సరకు విజయవాడ నుంచి వస్తుంది. నేషనల్ డెవలప్మొంట్ కార్పొరేషన్ సరఫరా చేస్తుంది. మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని తయారీదారులు కోరుతున్నారు. ప్రస్తుతం తయారు చేస్తున్న చీరలు మార్కెట్లో అమ్మకాలు సాగించుకోవలసి వస్తుంది. పాయకరావుపేటలో తయారైన జమధాని చీరలు ఢిల్లీ, బెంగలూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పెద్ద పెద్ద షాపులకు వెళ్తున్నాయి. పట్టు, ముడి నూలు రేటు పెరగడం కారణంగా అధిక సంఖ్యలో చీరలు తయారు జరగడం లేదు. నెలకు చేనేత కార్మికురాలు ఆరు చీరలు తయారు చేస్తారు. నెలకు రూ.6 వేలు వరకు మజూరి వస్తుంది. రూ.3 వేల నుంచి రూ. 25 వేలు వరకు ధరల్లో చీరలు తయారు చేస్తున్నారు. ప్రతి నెలా 100 చీరలు వరకు ఇక్కడ నుంచి ఆర్డర్ల మేరకు దుకాణాలకు పంపించడం జరుగుతుంది. చీరల తయారీకి ఆప్కో ద్వారా రాయితీలు కల్పించలేదు. ఆప్కో సంస్థ ద్వారా రాయితీలు, ముడి సరకు సరఫరా చేస్తే ఎక్కువగా చీరలు తయారీకి, ఎగుమతులకు అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పట్టు, నూలు రేటు పెరిగింది జమధాని చీరల తయారీకి అవసరమైన పట్టు, నూలు రేటు పెరిగింది. ఆప్కో సరఫరా చేయడం లేదు. ఎగుమతులు కూడా తగ్గాయి. తయారీ దారులు ఉన్నారు. ముడి సరుకు సరఫరా జరగడం లేదు. కరోనా కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. –రొబ్బి సుబ్రమణ్యం, జమధాని చీరల టెక్నికల్ మాస్టర్, పాయకరావుపేట ముడి సరుకు ఇస్తే మేలు చీరలు తయారు చేస్తున్నప్పటికీ గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల సరిపడా ఆదాయం లేదు. ముడి సరకు సరఫరా చేస్తే చీరలు పెద్ద మొత్తంలో తయారు చేసే వీలుంది. ఇక్కడ చీరల తయారీ దారులు ఎక్కువగానే ఉన్నారు. ముడి సరుకు సరఫరా కాక ఉపాధి కరువైంది. –అల్లంక భ్రమరాంబ, చీర తయారు చేసే మహిళ -
చీరకట్టు ‘ప్రియుడు’.. ఇది ఏ ఫ్యాషనో తెలుసా?
ఇటలీ: గతంలో వేషధారణకు ఒక ప్రత్యేకతే ఉండేది. ఆడ మగ అనే తారతమ్యం లేకుండా ఇప్పటి వరకు మగవాళ్లు వేసుకునే బట్టలను ఆడవాళ్లు వేసుకున్నారు. కానీ ఆడవాళ్లు ధరించే వాటిని మగవాళ్లు ఎప్పుడూ వేసుకోలేదు. కానీ ఇటీవల కాలంలో ఆడవాళ్ల వేషధారణను మగవాళ్లు ధరించటం ఒక ఫ్యాషన్గా మారింది. అయితే హ్యారీ స్టైల్స్, రణవీర్ సింగ్ మరియు కే-పాప్ బ్యాండ్ బీటీఎస్ వంటి స్టార్లు సైతం ఈ ఫ్యాషన్ ప్రస్తావన ముందుకు తీసుకు వచ్చారు గానీ ఆచరణ సాధ్యం కాలేదు. (చదవండి: హృదయాన్ని కదిలించే "స్వీట్ రిక్వస్ట్") అయితే ఈ ఫ్యాషన్ని ఆండ్రోజినస్ ఫ్యాషన్గా పిలుస్తారు. అంతేకాదు కొల్కతాకు చెందిన వ్యక్తి ఈ ఫ్యాషన్ అనుకరించేలా ఇంటర్నెట్లో ఒక విప్లవాన్ని తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురుచేస్తున్నారు. ఏంటి ఇందంతా అని అనుకోకండి. అసలు విషయం ఏంటంటే కోల్కతాకు చెందిన పుష్పక్ సేన్ ఎరుపు రంగు చీర, నలుపు కళ్ల జోడు ధరించి పాతకాలంలో మాదిరిగా కూడా ఒక గొడుగు వెంట తెచుకుని ఫ్యాషన్ రాజధానులుగా పేరుగాంచిన వీధులో తిరుగుతాడు. అయితే ఈ విధంగా సేన్ ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ హబ్లలో ఒకటైన మిలన్ వీధుల్లో ఫోటోషూట్లకి ఫోజు ఇస్తాడు. అంతేకాదు సేన్ ఇటలీలోని ఫ్లోరెన్స్లో ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ విద్యార్థి కావడం విశేషం. ఈ మేరకు సేన్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలతో పాటుగా "చీరలో ఉన్న మనిషిని ఎవరు తమతో పాటు తీసుకువెళ్లరు. ప్రపంచంలోని ప్రధాన ఫ్యాషన్ రాజధానులలో ఒకటైన వీధుల్లో ఎవరు నడుస్తున్నారో ఊహించండి?" అంటూ క్యాప్షన్ని జోడించి మరీ పోస్ట్ చేస్తాడు. దీంతో ఈ ఫోటో కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు నెటిన్లు సేన్ని ఎంత అద్భతంగా కనిపిస్తున్నాడో అంటూ తెగ మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. (చదవండి: కూరగాయల దండతో అసెంబ్లీకి) -
‘చీర’స్మరణీయం నైపుణ్యత.. నాణ్యత కలబోత ‘జాంధానీ’ చీర
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలో చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు.. సృష్టిస్తున్నారు.. వీరి చేతిలో రూపుదిద్దుకుంటున్న జాంధానీ చీరలు వారి కళాత్మకతకు మచ్చుతునకలుగా నిలుస్తున్నాయి. తక్కువ కాలంలోనే విశేష ఖ్యాతిని ఆర్జిస్తున్నాయి. గతంలో పేటెంట్ హక్కు పొందిన ఉప్పాడ జాంధానీ.. ఇండియన్ హ్యాండ్లూమ్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. జాంధానీ చీరల డిజైన్లతో పోస్టల్ కవర్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం దీని విశిష్టతను చాటుతోంది. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందుతోంది. ఏటా కోట్ల రూపాయల మేర క్రయవిక్రయాలు జరుగుతున్నాయంటే ఇక్కడి చేనేత కార్మికుల కళానైపుణ్యం అర్థం చేసుకోవచ్చు. రెండువైపులా ఒకేవిధంగా కనిపించే ఈ చీరలకు రానురానూ గిరాకీ పెరుగుతోంది. కొత్తపల్లి మండలంలో గతంలో 50 వరకూ ఉండే మగ్గాలు ఇప్పుడు సుమారు 500కు చేరుకున్నాయి. కులంతో సంబంధం లేకుండా అందరూ వీటి తయారీలో పాలుపంచుకుంటున్నారు. తాటిపర్తి, అమలాపురం, కోనసీమ ప్రాంతాల్లోనూ ఈ చీరల నేత తయారీ ఊపందుకుంది. అంతా చే‘నేత’తోనే.. పాతికేళ్లుగా నేత పని చేస్తున్నాను. ఎంత సృజనాత్మకమైనదైనా చేతి నైపుణ్యత ద్వారానే నేస్తాం. జాంధానీకి వెండి కోటింగ్ ఉంటుంది. దీనిలో తల వెంట్రుక మందంలో ఎరుపు రంగు పట్టుదారం ఉంటుంది. నాణ్యతగల జరీ దారంలో ముడుచుకుపోయేగుణం కలిగి ఉంటుంది. దృఢంగా నేయాల్సి ఉంది. అడ్డు, నిలువు పట్టు దారాలనే ఉపయోగిస్తాం. చీర నేయడానికి ముగ్గురి నుంచి నలుగురు అవసరమవుతారు. డిజైన్ను బట్టి 20 నుంచి 40 రోజుల వరకూ సమయం పడుతుంది. - మీసాల నాగేశ్వరరావు, నేత కార్మికుడు, కొత్తపల్లి కుటుంబమంతా కష్టపడితేనే.. చిన్నప్పటి నుంచీ నేత పని చేస్తున్నా. డిజైన్లలో చాలా మార్పులు వస్తున్నాయి. గిరాకీకి దీటుగా ఉత్పత్తి పెరుగుతోంది. రోజూ గతంలో ఒకటి రెండు చీర్లకంటే ఎక్కువ తయారయ్యేవి కావు. ప్రస్తుతం 50 నుంచి వంద వరకూ తయారు చేస్తున్నారు. ఎక్కడ చూసిన జాంధానీ చీరల మగ్గాలే కనిపిస్తున్నాయి. వీటి తయారీకి ఆసక్తి చూపుతున్నారు. కుటుంబమంతా కష్టపడితేనే అందమైన నాణ్యతైన చీర తయారవుతుంది. - దున్న మురళీకృష్ణ, నేత కార్మికుడు, కుతుకుడుమిల్లి ఏకాగ్రతతో పని చేయాలి జాంధానీ చీరల తయారీకి ఇంటిల్లి పాదీ పని చేయాల్సిందే. వంట, ఇంటి పనులు పూర్తి చేసుకుంటూనే నేస్తుంటాను. చీరకున్న బుటాలు, డిజై న్లు రెండువైపులా ఒకేలా కనిపిస్తాయి. డిజైన్ ప్రింట్ చేశారా అన్నట్టుగా ఉంటుంది. చాలా ఏకాగ్రతతో పనిచేయాలి. - చింతా నాగేశ్వరి, నేత కార్మికురాలు, కొత్తపల్లి ఆన్లైన్ విక్రయాలకు అవకాశం జాంధానీ చీరల డిజైన్లతో పోస్టల్ కవర్ విడుదల కానుండడంతో చేనేతకు అరుదైన ఘనత దక్కుతోంది. కాలానుగుణంగా వ్యాపారాలను విస్తరించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం వల్ల చేనేత రంగం అభివృద్ది చెందుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ ఉన్నా దళారులు ఎక్కువగా ఉన్నారు. కారి్మకులే నేరుగా ఆన్లైన్లో విక్రయాలు జరుపుకొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. - రాజాపంతుల నాగేశ్వరరావు, ఏపీ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సభ్యుడు, మూలపేట -
Designer Sarees: జీవన సౌందర్యం
కళకు జీవనశైలి తోడైతే అది ఎప్పుడూ సజీవంగా ఆకట్టుకుంటూనే ఉంటుంది. దుస్తులపై ముద్రణ అనేది ఈ నాటిది కాదు. కానీ, హస్తకళా నైపుణ్యంతో ఒక థీమ్ డిజైన్ తీసుకురావడం ఎప్పుడూ ప్రత్యేకతను చాటుతుంది. అలా ఇండియన్ ట్రక్ ఆర్ట్ నుంచి ప్రేరణ పొందిన డిజైన్స్ ఇవి. చీర అంటే తనకెంత ఇష్టమో విద్యాబాలన్ శారీ కలెక్షన్ చూస్తుంటే అర్థమవుతుంది. ఏ ఈవెంట్కైనా చీరకట్టుతో కనిపించే విద్యాబాలన్ తన సినిమా టైటిల్కు తగినట్టుగా ఆ చీర డిజైన్ ఉండాలనుకుంటారు. ఇటీవల ఆమె నటించిన ‘షేర్నీ’ సినిమా ప్రమోషన్లో భాగంగా ఐష్ర్ ఇలస్ట్రేషన్స్ స్టూడియో వారి హార్న్ ఓకే ప్లీజ్ సేకరణ నుంచి తీసుకున్న శారీలో మెరిశారు విద్యాబాలన్. చీర కొంగుపై పులి ముఖం, ముడివేసిన కేశాలంకరణ, చెవి రింగులతో విద్యా లుక్ నిజంగానే పులిలా గంభీరంగా కనిపిస్తుంది. మన రోడ్లమీద ట్రక్స్ చూస్తే వాటి మీద రాసి ఉన్న అక్షరాలు, ప్రింట్లు ఆకర్షిస్తుంటాయి. అవి చాలా సాదా సీదాగా అనిపించినా ఆ ట్రక్స్కే ఆ డిజైన్స్ సొంతం అనిపిస్తాయి. ఆకర్షణీయమైన రంగుల్లో కనిపించే ఆ డిజైన్స్ని ఒడిసిపట్టుకొని, వాటిని చీరలు, దుపట్టాల మీదకు తీసుకువస్తే ఎలా ఉంటాయో చేసిన ప్రయత్నమే ఈ ‘హార్న్ ఓకే ప్లీజ్.’ సేంద్రీయ మస్లిన్ ఫ్యాబ్రిక్ను ఎంచుకుని, బయోడిగ్రేడబుల్ రంగులతో ఇండియన్ ట్రక్ ఆర్ట్ నుండి ప్రేరణ పొందిన 9 ప్రింట్లతో ఐశ్వర్యా రవిచంద్రన్ చేతిలో రూపుదిద్దుకున్న చిత్రకళ ఇది. ఐశ్వర్యా రవిచంద్రన్ ఇలస్ట్రేటర్, ఫ్యాషన్ డిజైనర్ కూడా. వినూత్నమైన కళకు సంప్రదాయ సొబగులు అద్ది శారీస్, జాకెట్స్, షర్ట్స్, జ్యువెలరీని కూడా రూపొందిస్తున్నారు. ఈ ప్రత్యేక కలెక్షన్ను ఆర్గానిక్ మెటీరియల్పై సంప్రదాయ రంగుల కళను తీసుకొచ్చి దేనికది స్పెషల్గా రూపొందించిన చీరలు, దుపట్టాలు ప్రత్యేకతను చాటుతున్నాయి. -
Vidhi Collections: ఈ క్లాత్లో అస్సలు గంజి ఉండదు!
న్యాయవాదులు న్యాయం గురించి ఆలోచిస్తారు. న్యాయవాదుల గురించి కేరళ కసవు చేనేత ఆలోచించింది. ‘విధి’ కలెక్షన్ పేరుతో కొంగొత్త ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన చీరలను వారి ముందుంచింది. ‘కసవు’ అనేది కేరళలో ధరించే సంప్రదాయ హాఫ్వైట్ ఫ్యాబ్రిక్. ఇది అక్కడి స్థానిక చేనేతకారుల చేతుల్లో రూపుద్దుకుంటుంది. కసవు చీరలు కేరళ సంప్రదాయ పండగ సీజన్లలో ముఖ్యంగా ఏప్రిల్–ఆగస్టు నెలలో విరివిగా కొనుగోళ్లు జరుగుతాయి. ఓనమ్ పండగకు మహిళలు తప్పక కసవు సంప్రదాయ చీరను ధరిస్తారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల లాక్డౌన్ విధింపులతో పండగలు, వేడుకలు లేవు. అంతకుముందు ఏడాది వరదల కారణంగా నేత కార్మికులు ఘోరమైన నష్టాలను చవిచూశారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడానికి ఈ కొత్త మోనోక్రామ్ చీరలు వినూత్నంగా రూపొందించారు. అయితే, ‘ప్రజలు వీటినే కొనాలని మేం కోరుకోవడం లేదు. మేం సమకాలీన ఉత్పత్తులను సృష్టించాలి, మా హస్తకళ ప్రావీణ్యం తెలియాలనే వీటిని రూపకల్పన చేశాం’ అని సేవ్ ది లూమ్ వ్యవస్థాపకుడు రమేష్ మీనన్ ఈ సందర్భంగా వివరిస్తారు. వీరి ఆలోచనా విధానం నుంచే ‘విధి’ అనే నూతన డిజైన్ కసవు నేతలో పుట్టుకొచ్చింది. సౌకర్యానికే ప్రథమ స్థానం న్యాయవాదుల వేషధారణ గురించి 18వ శతాబ్దం నుండి ఆలోచించనేలేదు. బ్రిటీష్ కోర్టుల నుంచి ప్రేరణ పొందిన ఈ యూనిఫాం చీరలు, సల్వార్ కుర్తాలు నలుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉంటాయి. ప్రత్యేక కాలర్ గల జాకెట్, ఫార్మల్ గౌన్ అదనంగా మహిళలకు నిర్ణయించారు. అంతేకాదు, మరికొన్ని ముఖ్యమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నామని వివరిస్తారు మీనన్. ‘మన దేశంలో న్యాయస్థానాలు వేడి వాతావరణంలో ఉంటాయి. న్యాయవాదులు రోజుకు 12 నుండి 14 గంటలపాటు పనిలో ఉంటారు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. వారు తమ రెగ్యులర్ వేర్ని మెయింటెయిన్ చేయడానికి సమయం ఉండదు. కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు గౌన్లను శుభ్రపరుచుకోవడానికి మాత్రమే కాస్త అవకాశం లభిస్తుంది. కసవు నేతలో నాణ్యమైన పత్తి ఉంటుంది. ఈ క్లాత్లో అస్సలు గంజి ఉండదు. దీంతో పనిలో ఉండేవారికి ఈ చీరలు చాలా సౌలభ్యంగా ఉంటాయి. ఈ చేనేతకు ముష్రూ పట్టు నుండి ప్రేరణ పొందాం. మొఘల్ రాచకుటుంబీకుల కోసం అభివృద్ధి చేసిన ఫ్యాబ్రిక్గా దీనిని చెప్పవచ్చు. బట్ట ఎంతో మృదువుగా ఉంటుంది’ అని వివరిస్తారు. న్యాయవాది అన్నా చాందీ పుట్టిన రోజు సందర్భంగా ‘విధి’ క్లాత్ను లాంచ్ చేశారు. ఈ కొత్త చీరల కలెక్షన్ను యువ మహిళా న్యాయవాదులు ధరించి అందమైన, అత్యద్భుతమైన, సౌకర్యవంతమైన ఈ చీరల్లో కొత్తగా మెరిసిపోయారు. ఈ చీరలను న్యాయవాదులే కాదు దేశ మహిళలందరూ ధరించి, హుందాతనాన్ని మూటగట్టుకోవచ్చు. ముఖ్యంగా వర్కింగ్ వేర్గా ఈ ‘విధి’ సరికొత్త శారీస్ పేరొందుతాయి అని చెప్పచ్చు. -
చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ ఉంది?
చేనేత చీరలు, డ్రెస్సులు ఏ సీజన్కైనా వన్నె తెస్తాయి. సౌకర్యంతో పాటు కళను కూడా కళ్ల ముందు కట్టిపడేస్తాయి. అందుకే, చేనేత చీరలకు ఎప్పుడూ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. హైదరాబాద్లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ హేమంత్శ్రీ లాక్డౌన్ తర్వాత చేసిన చేనేత డిజైన్స్ గురించి ఇలా వివరించారు. లాక్డౌన్లో చేసిన డిజైన్స్కి మార్కెట్ ఎలా ఉంది? సోషల్ మీడియాలో కొత్త కొత్త డిజైన్స్ గురించి వెతికే వారి శాతం పెరిగింది. ఇంటి నుంచే ఆర్డర్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ వర్క్ మాకు చాలా ఈజీ గానూ, ఛాలెంజింగ్గానూ ఉంటుంది. యంగ్స్టర్స్ పెరిగారు. వారిని దృష్టిలో పెట్టుకునే జర్కిన్స్, ఓవర్ కోట్స్ మీద ప్రింట్స్..వంటివి చేశాను. లాక్డౌన్ తర్వాత స్పెషల్గా చేసిన కృషి? లాక్డౌన్ తర్వాత చేనేతకారుల దగ్గరకు వెళ్లాను. లాక్డౌన్ కారణంగా వాళ్లదగ్గర చాలా స్టాక్ ఉండిపోయింది. నారాయణ్పేట, ఇక్కత్, పోచంపల్లి, గుజరాతీ పటోల శారీస్.. చేనేతకారులను విడివిడిగా కలిశాను. వాళ్ల దగ్గర నుంచి మెటీరియల్ తీసుకొని, రీ డిజైనింగ్ చేశాను. దీంతో పాటు వాళ్ల అమ్మాయలనే మోడల్స్గా తీసుకున్నాను. ఫొటో షూట్కి మినిమిమ్ 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక డిజైనర్ను, మోడల్ను పెట్టి స్టైలిష్గా ఫొటోలు తీయించడం అనేది వారికి కష్టం. ఇప్పుడీ ప్రయోగం వల్ల చేనేతలకు మంచి మార్కెట్ అవుతోంది. అమ్మాయిలకీ మోడలింగ్ అవకాశాలు వస్తున్నాయి. చేనేత చీరలకు ప్రాముఖ్యత, కళ మరింత స్పష్టంగా రావడానికి బ్యాక్గ్రౌండ్ యాంబియన్స్ పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. బ్యాక్ గ్రౌండ్ యాంటిక్ లుక్కి వస్తు సేకరణ? ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పనే. పందిరిమంచాలు, తంజావూర్ పెయింటింగ్స్, అల్మారాలు, టేబుళ్లు, బ్రాస్ ఫ్లవర్వేజ్లు.. ఒకటేమిటి యాంటిక్ లుక్ రావడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తువులను సేకరించాను. చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ తీసుకురావడానికి చేసిన ప్రయత్నిమిది. చేనేత చీరల్లో ప్రస్తుతం వేటికి డిమాండ్ బాగుంది? చేనేతలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, ఈసారి గుజరాత్ పటోలాకి వరల్డ్ వైడ్ మార్కెట్ బాగుంది. నార్త్ ఇండియా వారినీ ఈ డిజైన్స్ బాగా ఆకట్టుకున్నాయి. నారాయణ్పేట్, గద్వాల, కలంకారీ, పోచంపల్లి.. శారీస్కూ మంచి రెస్పాన్స్ వచ్చింది. చేనేతలతో కాకుండా ఇతరత్రా చేస్తున్న డిజైన్స్? సోషల్ మీడియాలో యువత ఎక్కువ టైమ్ కేటాయిస్తుంది. లాక్డౌన్ తర్వాత కొత్త కొత్త ఫ్యాషన్లు ఏవి పుట్టుకొస్తున్నాయనేదానిమీద సెర్చింగ్ పెరిగింది. అందుకని పార్టీవేర్ తగ్గించి, క్యాజువల్స్కి డిజైన్ చేయాలనుకుంటున్నాను. ఈ సందర్భంగా లెనిన్ క్లాత్తో స్ట్రీట్ డిజైన్స్ చేస్తున్నాను. ఇందుకు కొంతమంది టీనేజర్స్ని కలుస్తున్నాను. కరోనా కారణంగా వీళ్లు ఇంట్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. కంఫర్ట్వేర్ కావాలనుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్గంజ మెటీరియల్తో డిజైన్స్ చేయాలనుకుంటున్నాను. ఇవి కూడా యంగ్స్టర్స్ కోసమే చేయాలన్నది నా ప్లాన్. -హేమంత్శ్రీ, ఫ్యాషన్ డిజైనర్ -
చందేరీ సిల్క్ డిజైన్స్.. లైట్ అండ్ బ్రైట్
చూస్తే చూపు తిప్పుకోనివ్వనంత బ్రైట్నెస్ కట్టుకుంటే లైట్ వెయిట్నెస్ అదే, చందేరీ చమక్కు. చందేరీకి అంచుగా బెనారస్ సిల్క్ జత చేరినా.. గద్వాల పట్టు కలిసి నడిచినా ముచ్చటైన డిజైన్గా మెరిసిపోతోంది. సంప్రదాయ డ్రెస్ డిజైన్స్కి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తారు భార్గవి కూనమ్. హైదరాబాదీ డిజైనర్ భార్గవి వివిధ రకాల చేనేతలతో అందమైన దుస్తులను రూపొందిస్తారు. వివాహ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణ తెచ్చే డిజైన్స్కు పేరెన్నిక గన్న డిజైనర్ చందేరీ సిల్క్తో చేసిన డిజైన్స్ ఇవి. లైట్.. బ్రైట్ కాంబినేషన్లో రూపొందించిన ఈ డిజైన్స్ గురించి మరింత వివరంగా... టచందేరీ సిల్క్ డ్రెస్సులు, శారీస్ ఇప్పుడు ఏ విధంగా ట్రెండ్లో ఉన్నాయి? మన దేశీయ చేనేతలు ఎప్పుడూ ట్రెండ్లో ఉంటాయి. వాటిలో చందేరీకి ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. కోరా సిల్క్ మిక్సింగ్తో చందేరీ సిల్క్ను నేస్తారు. కలర్స్ బ్రైట్గా, స్పేషల్గా ఉంటాయి. చిన్న బుటీ, అంచులు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. చేనేతకారులను కలిసి, మాదైన ప్రత్యేక డిజైన్స్ చెప్పి ఈ చీరలను నేయిస్తాం. దీని వల్ల ఏ చీర అయినా, ఫ్యాబ్రిక్ అయినా మరో రెప్లికా అంటూ ఉండదు. మీరు చేసిన కాంబినేషన్స్? చందేరీ లెహంగాలను రూపొందిస్తే ఏవైనా రెండు, మూడు కాంబినేషన్ ఫ్యాబ్రిక్ను ఎంచుకుంటాను. బెనారస్, గద్వాల, కంచిపట్టు అంచులు ఉంటాయి. వీటి వల్ల లెహంగా లుక్ గ్రాండ్గా మారిపోతుంది. వీటికి సింపుల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినవి, ప్లెయిన్ బ్లౌజ్లు, గ్రాండ్గా అనిపించే పట్టు దుపట్టాలను కాంబినేషన్గా ఉపయోగిస్తాం. చందేరీ సిల్క్ దుస్తులు ఏ సీజన్కి బాగుంటాయి? ఏ సీజన్కైనా బ్రైట్నెస్ తెస్తాయి ఇవి. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ కావడంతో రాబోయే వివాహ వేడకలకు, వేసవి కాలానికి సౌకర్యంగా, మరింత బాగుంటాయి. | ఎవరెవరికి.. ఏ వయసు వారికి చందేరీ ఫ్యాబ్రిక్ దుస్తులు, చీరలు బాగుంటాయి? అన్ని వయసుల వారికి చందేరీ నప్పుతుంది. అయితే, బ్లౌజ్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. టీనేజ్, యంగేజ్ వారికి చందేరీ ఫ్యాబ్రిక్తో ఆకర్షణీయమైన దుస్తులను రూపొందింవచ్చు. వీటిని ఏ కాంబినేషన్లో ధరిస్తే ఆకర్షణీయంగా కనిపిస్తారు? లెహంగా లేదా శారీ బ్రైట్ కలర్ ఎంచుకుంటే బ్లౌజ్ ప్లెయిన్గా ఉండాలి. కొంచెం ఇండోవెస్ట్రన్ టచ్ కూడా దీనికి ఇవ్వచ్చు. స్లీవ్లెస్ బ్లౌజ్లతో ఆ ప్రయోగం చేయవచ్చు. అయితే, సందర్భం, వేడుకను బట్టి ఇక్కడ ఇచ్చిన డిజైన్స్ను ఎంచుకోవచ్చు. -
ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తూ పట్టుబడ్డ టీడీపీ నాయకులు
-
బెంగాల్లో ‘చీరలు కొందాం’ కార్యక్రమం
పస్తులలో ఉన్న బడుగు చేనేత కార్మికులను లాక్డౌన్ నష్టాల నుంచి కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం వారి నుంచి తానే చీరలు కొంటోంది. చీరలు కొనమని ప్రజలకూ పిలుపునిస్తోంది. లాక్డౌన్ వల్ల బెంగాల్లో చీరలు నేసే దాదాపు అరు లక్షల మంది కార్మికులు కష్టాల్లో, పస్తుల్లో పడ్డారు. లాక్డౌన్ తర్వాత కూడా ప్రజలకు బట్టలు కొనే మూడ్ లేకపోవడం వల్ల, ఇతర ఆర్థిక కారణాల వల్ల తగిన స్థాయిలో కొనుగోళ్లు సాగడం లేదు. సొసైటీల మద్దతు ఉన్న పైస్థాయి కార్మికుల పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా సొంత రెక్కల మీద ఆధారపడిన బడుగు కార్మికులు పూర్తిగా కష్టాల్లో ఉన్నారు. వీరిని కాపాడేందుకు బెంగాల్ ప్రభుత్వం ‘చీరలు కొందాం’ కార్యక్రమానికి నడుం బిగించింది. ముఖ్యంగా బడుగు చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్న తూర్పు బుద్వాన్, నాడియా జిల్లాల్లో నేరుగా కార్మికుల నుంచే చీరలు కొన్ని వెంటనే డబ్బు చెల్లిస్తోంది. దీని వల్ల దాదాపు 10 వేల మంది కార్మికులు ఊపిరి పీల్చుకోనున్నారు. బెంగాల్ చేనేత సహకార సంస్థకు ‘తనూజా’ పేరుతో ఔట్లెట్ బ్రాంచీలు ఉన్నాయి. రాష్ట్రంలో 70, దేశంలో మరో ముప్పై ఇవి ఉన్నాయి. కార్మికుల నుంచి నేరుగా కొన్న చీరలు వీటి ద్వారా అమ్ముతారు. బెంగాల్లో అనే ఏముంది దేశంలో అన్ని చోట్లా చేనేత కార్మికులు ఇబ్బందుల్లో ఉన్నారు. వీరి కోసమైనా ఈ సీజన్లో సురక్షితమైన జాగ్రత్తలు పాటిస్తూ చీరలు కొనాల్సిన అవసరం ఉంది. లేదా ఆన్లైన్లో అయినా షాపింగ్ చేయాల్సిన అవసరం ఉంది. అందంగా ముస్తబవ్వాల్సిన రోజులు ముందు ముందు తప్పక ఉన్నాయి. రేపటి ముస్తాబు కోసం ఇవాళ చీర కొని సాయపడటం మంచిదే కదా. -
అంతర్జాతీయ విపణిలో వెంకటగిరి జరీ
వెంకటగిరి.. చేనేత జరీ చీరలను చూస్తే మగువల మనస్సులు పురివిప్పుతాయి. మేను పులికించిపోతోంది. సంప్రదాయం, ఆధునీకత కలబోతల వర్ణ రంజితమైన చేనేతల అద్భుత కళాఖండాలు అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి జరీ చీరలు దేశీయంగా మార్కెట్లో ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి. సాంకేతికతను అందిపుచ్చుకోలేకపోవడం, సరైన మార్కెటింగ్ లేకపోవడంతో ఈ రంగం దశాబ్దాల కాలంగా చతికిల పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో స్థానికంగా గుర్తింపు పొందిన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం లభించనుంది. ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకానికి వెంకటగిరి జరీ చీరలు ఎంపికయ్యాయి. సాక్షి, వెంకటగిరి: వెంకటగిరి జరీ, పట్టు చీరలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. జిల్లాలోనే కాకుండా దేశీయంగా పలు రాష్ట్రాల్లోని బ్రాండెడ్ షోరూమ్స్లకు ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున చీరల ఎగుమతులు జరుగుతున్నాయి. స్థానికంగానూ ఏటా రూ.కోట్ల రిటైల్ వ్యాపారం జరుగుతోంది. వెండి జరీ, ఆఫ్ఫైన్ జరీతో వివిధ రకాల డిజైన్లతో ఇక్కడ చీరలు నేస్తున్నారు. ఎంతో నైపుణ్యంతో చీరను నేయడంతో మన రాష్ట్రంలోనే కాకుండా కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో వెంకటగిరి చీరలకు భలే డిమాండ్ ఉంది. విదేశీ మహిళలు సైతం వెంకటగిరి చీరలపై మోజు పెంచుకుంటున్నారు. ఆధునిక డిజైన్లతో చీరలను నేస్తుండడంతో వెంకటగిరి చీరలు మహిళల మనస్సును దోచుకుంటున్నాయి. వెంకటగిరి చీరల్లో జిందానీ వర్క్కు మంచి డిమాండ్ ఉంది. రెండు వైపులా ఒకే డిజైన్ కనబడడం జాందనీ వర్క్ ప్రత్యేకత. చీరల తయారీలో ఇటువంటి నైపుణ్యత మరెక్కడా కనపడదు. విశిష్ట మహిళలకు వెంకటగిరి చీరలను బహుమతిగా ఇవ్వడం ప్రస్తుతం ట్రెండ్గా మారింది. మార్కెట్ సౌకర్యం విస్తృతం మగువలకు అందాన్నిచ్చే వెంకటగిరి జరీ చీరలకు 150 ఏళ్లకుపైగా చరిత్ర ఉంది. జిల్లా, రాష్ట్రీయంగానే కాక దేశీయంగానూ మార్కెట్లో వెంకటగిరి చీరలకు డిమాండ్ ఉండడంతో ఏటా రూ.150 కోట్ల మేర వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్కు సౌకర్యం లభిస్తే విక్రయాలు పెరిగి, రెట్టింపు ఉత్పత్తి సాధ్యమవుతుందని స్థానిక మాస్టర్ వీవర్లు, నేత కార్మికుల అంచనా. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ నేతన నేస్తం’ పథకం అమలు చేసి ఇప్పటికే రెండు దఫాలుగా ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల వంతున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్నారు. చేనేతకు మరింత లాభాసాటిగా ఉండాలనే లక్ష్యంతో ఆ రంగంలోని యువతను ప్రోత్సహించి, ఎగుమతిదారులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. అంతర్జాతీయ మార్కెట్లో వెంకటగిరి చీరల విక్రయానికి ప్రతిష్టాత్మకమైన గుర్తింపు కల్పించింది. స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ వసతికి మార్గం సుగమం చేసేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ‘ఒక జిల్లా.. ఒక ఉత్పత్తి పథకం’ ద్వారా జిల్లా నుంచి వెంకటగిరి జరీ చీరలను ఎంపిక చేశారు. చేనేత కార్మికులున్న అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత చీరలు, గుంటూరు జిల్లా మంగళగిరి నేత కార్మికులు తయారు చేసే చీరలు, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ జిందానీ చీరలను సైతం ఈ పథకం పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కసరత్తు పూర్తి చేశారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆయా ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) ఇవ్వనుంది. -
ఒంటిపై చీరలు తీసి ప్రాణాలు కాపాడారు
చెన్నై: కరోనా భయంతో ఇంటి మనిషినే పరాయిగా చూస్తోన్న ఈ రోజుల్లో ఓ ముగ్గురు మహిళలు యువకుల ప్రాణాలు కాపాడి వారి పాలిట దేవతలుగా నిలిచారు. నీళ్లలో కొట్టుకుపోతున్న యువకులను కాపాడేందుకు ఒంటిపై ఉన్న చీరలను అందించి అమ్మగా మారి వారికి పునర్జన్మ ఇచ్చారు. తమిళనాడులో ఆగస్టు 6న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భారీ వర్షాల కారణంగా పెరంబళూర్ జిల్లాలోని కొట్టారై డ్యామ్ నీటి మట్టం పెరిగింది. శిరువాచూర్ గ్రామానికి చెందిన 12 మంది యువకులు ఆ డ్యామ్కు సమీపంలోనే క్రికెట్ ఆడుకునేందుకు వెళ్లారు. (కస్టడీ డెత్ కేసు: కరోనాతో ఎస్ఎస్ఐ మృతి) అనంతరం వారు ఆ డ్యామ్లో స్నానాలు చేసేందుకు వెళ్లగా అక్కడున్న ముగ్గురు మహిళలు వారిని హెచ్చరించారు. ఇంతలో నలుగురు కుర్రాళ్లు ప్రమాదవశాత్తూ డ్యామ్లో పడిపోయారు. దీంతో వారిని రక్షించేందుకు ప్రయత్నించగా.. అక్కడ తాడు వంటివి కనిపించలేదు. మరోవైపు వాళ్లు నీళ్లలో మునిగిపోతుండటంతో ఇక క్షణం కూడా ఆలస్యం చేయకుండా మహిళలు వారి ఒంటిపై ఉన్న చీరలను తీసి డ్యామ్లో ఉన్న కుర్రాళ్లకు అందేలా చేశారు. దీంతో ఇద్దరి కుర్రాళ్ల ప్రాణాలు కాపాడగలిగారు. కానీ దురదృష్టం వల్ల మరో ఇద్దరు జలసమాధి అయ్యారు. ప్రమాదం నుంచి బయటపడిన ఇద్దరిని కార్తిక్, సెంతిల్వెలన్గా, మరణించిన వారిని పవిత్రన్, రంజిత్లుగా గుర్తించారు. (పైత్యం ఎక్కువైతే ఇలాంటివే జరుగుతాయి) -
వైరల్ : చీరలు కట్టుకుని కాలేజీకి అబ్బాయిలు
పుణే : పుణేలోని పెర్గూసన్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థులు వారి కాలేజీలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలో చీరలు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. ప్రస్తుతం వారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లింగ సమానత్వం గురించి ఒక సందేశాన్ని చెప్పడానికే ఈ వేషధారణను ఎంచుకొన్నామని ఆ విద్యార్థులు చెబుతున్నారు.వివరాల్లోకి వెళితే.. పెర్గూసన్ కాలేజీలో ప్రతీ సంవత్సరం నిర్వహించే వార్షిక వేడుకల్లో ఏదో ఒక థీమ్ను ఎంచుకొని విద్యార్థులు ఆ వస్త్రధారణలో వస్తుంటారు. అయితే ఈ ఏడాది 'టై అండ్ శారీ డే' పేరుతో థీమ్ను ఎంచుకొని కాలేజీ యాజమాన్యం వేడుకలను నిర్వహించింది. కాలేజీలోని విద్యార్థులందరు వారికి నచ్చిన వస్త్రధారణలో వచ్చారు. అయితే అదే కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్న ఆకాశ్ పవార్, సుమిత్ హోన్వాడజ్కర్, రుషికేష్ సనాప్లు మాత్రం కాస్త భిన్నంగా ఆలోచించి చీరలు ధరించి ఆడవాళ్లలాగా తయారై కాలేజీకి వచ్చారు. అయితే వారి వేషధారణను చూసి మొదట అందరూ నవ్వుకున్న అసలు విషయం తెలిసిన తర్వాత వారితో ఫోటోలు దిగేందుకు ఎగబడడం విశేషం. ఇదే విషయమై వారి ముగ్గురిని కదిలించగా.. ఆకాశ్ పవార్ స్పందిస్తూ.. 'ఆడవారు చీరలు, సల్వార్, కుర్తాలు ధరించాలని, మగవారు షర్ట్, ప్యాంట్ మాత్రమే వేసుకోవాలని ఎవరు ఎక్కడా చెప్పలేదు. అందుకే ఈసారి వినూత్నంగా ప్రయత్నించాలనే చీరలు కట్టుకొని వెళ్లాం. అంతేకాదు లింగ సమానత్వం గురించి చెప్పాలని అనుకున్నామని' పేర్కొన్నాడు. (ఆరు పదుల వయసులో.. ఆకట్టుకునే డ్యాన్స్..!) 'నేను చీరను ధరించేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. చీర కట్టుకునే సమయంలో ప్రతీసారి అది జారిపడుతుండడంతో ఇక లాభం లేదనుకొని మా స్నేహితురాలు శ్రద్దా సాయం తీసుకున్నాం. ఆమె మాకు చీర ఎలా కట్టుకోవాలో చూపించినప్పుడు అది ఎంత కష్టమైనదో తెలిసింది. అంతేకాదు ఆడవాళ్లు మేకప్కు ఎందుకంత సమయం తీసుకుంటారో నాకు ఇప్పుడర్థమయింది' అంటూ సుమిత్ చెప్పుకొచ్చాడు. 'చీరను ధరించి నడిచేటప్పుడు మాకు చాలా కష్టంగా అనిపించింది. మా ఫ్రెండ్ శ్రద్దాకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆమె మాకు సహాయం చేయకుంటే ఇలా రెడీ అయ్యేవాళ్లం కాదని' రుషికేష్ వెల్లడించాడు. అయితే వీరు చేసిన సాహసానికి కాలేజీ యాజమాన్యం వీరిని ప్రశంసించింది. లింగ వివక్ష లేకుండా అందరూ సమానమేనని వీరిచ్చిన సందేశానికి కాలేజీ యాజమాన్యంతో పాటు విద్యార్థులు, చూసిన ప్రతీ ఒక్కరు వారిని మెచ్చుకుంటున్నారు. (వైరల్: పిల్లికి కుర్చీ అందించిన పెద్దాయన) -
శారీ స్పీక్
భారతీయ మహిళల సంప్రదాయ కట్టు అయిన చీర ప్రత్యేకతను సోషల్ మీడియాలో చాటుతూ.. ఆ నేతను బతికించుకోవడానికి ఉత్సవాలూ నిర్వహిస్తోంది ‘శారీ స్పీక్’ గ్రూప్! మొన్న శనివారం హైదరాబాద్ లోని కర్మ శాంగ్రిల్లాలో జరిగిన ఫెస్టివల్ సందర్భంగా ‘శారీ స్పీక్’’ గురించి... శారీ స్పీక్ అనేది ఫేస్బుక్లో ఒక పేజీ. లక్షా పాతిక వేల మంది మహిళలు సభ్యులుగా ఉన్న సోషల్ మీడియా గ్రూప్! చీరకట్టు మీద ఉన్న ప్రేమతో మూడేళ్ల కిందట వినీ టండన్ అనే మహిళ ఈ గ్రూప్ను ప్రారంభించారు. మారిన జీవన శైలి దృష్ట్యా సౌకర్యం కోసం వస్త్రధారణ కూడా మారింది. దాంతో ప్రత్యేక సందర్భాలకే పరిమితమైపోయింది చీర. ఈ సంప్రదాయ కట్టుకు, దానితో కలబోసి ఉన్న నేతకూ పునర్వైభవం తెప్పించి, నేత కార్మికులకూ ఎంతో కొంత సహాయపడ్డానికి ‘శారీ స్పీక్’ గ్రూప్ను మొదలుపెట్టారు వినీ టండన్. ఆరంభించిన అనతికాలంలోనే సభ్యుల సంఖ్య లక్షకు చేరింది. పద్దెనిమిదేళ్లు నిండిన వాళ్లనుంచి అరవై ఏళ్లు పైబడ్డ వాళ్ల దాకా, దేశీ మహిళలతోపాటు విదేశీ వనితలూ ఇందులో సభ్యులుగా ఉన్నారు. హైదరాబాద్ ‘శారీ స్పీక్’ ఉత్సవంలో పాల్గొన్న సభ్యులు వీళ్లంతా చీర నేత, కట్టుతీరుతో పాటు తమ ప్రాంతపు జీవన విధానం, సంస్కృతీ సంప్రదాయల గురించి ఫేస్బుక్లోని ఈ శారీ స్పీక్ పేజీలో రాస్తుంటారు... ఆ చీరతో ఉన్న తమ ఫొటోను జతచేసి మరీ. ‘‘దీని వల్ల ఆ నేతే కాదు, ఆ ప్రాంతం గురించీ, దాని ప్రత్యేకత గురించీ ఇతర సభ్యులకు తెలుస్తుంది. కల్చరల్ ఎక్స్ఛేంజ్ జరుగుతుంది. భిన్న సంస్కృతి, సంప్రదాయాల మీద గౌరవం పెరుగుతుంది. ఐక్యతా ఏర్పడుతుంది. అయితే ఈ గ్రూప్లో చీరల అమ్మకాలు, కొనుగోళ్లుండవు’’ అని చెప్తారు శారీ స్పీక్ సభ్యురాలు భాను ఇలపావులూరు. థీమ్స్తో ఫ్యాషన్ షో శారీ స్పీక్ కేవలం సోషల్ మీడియా గ్రూప్కే పరిమితం కాకుండా యేడాదికి రెండుసార్లు భిన్నమైన థీమ్స్తో సమావేశమూ అవుతోంది. దాన్నో పండగలా నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా వాళ్ల వాళ్ల నగరాల్లో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటారు. సంప్రదాయపు ఆటలు, పాటలు, ఫ్యాషన్ పరేడ్స్ ఉంటాయి. థీమ్స్ కూడా చాలా గమ్మత్తుగా పెట్టుకుంటారు. ఒకసారి 70, 80ల్లోని సినిమా నటీమణుల్లాగా చీర కట్టుకోవడం, ఇంకోసారి కంచి పట్టు చీరలో, ఒకసారి కాటన్ శారీస్లోనే రావడం... ఇలా రకరకాల థీమ్స్ ఉంటాయి. మొన్న శనివారం (14, డిసెంబర్) జరిగిన ఫెస్టివల్కు థీమ్... ఇతర రాష్ట్రాల చీరకట్టు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఈశాన్య రాష్ట్రాలు సంప్రదాయ చీరకట్టును థీమ్గా పెట్టారు. ఈ ఉత్సవాన్ని శ్రీకళా గణపతి, మధు గౌర్, రాహత్ ఖాన్ నిర్వహించారు. స్థానికంగా సరే... యేడాదికి ఒకసారి ‘గోవా’లోనూ శారీ స్పీక్ సంబరాలు జరుగుతుంటాయి. ఆ పండక్కి విదేశీ వనితలూ హాజరవుతారు. హైదరాబాద్ ‘శారీ స్పీక్’ నిర్వాహకులు మధు గౌర్, రాహత్ ఖాన్, భాను ఇ లపావులూరు, శ్రీకళా గణపతి -
కట్టు కళ్లు చెదిరేట్టు
ఈ రోజుల్లో చీర సంప్రదాయ వేడుకల డ్రెస్ మాత్రమే కాదు ఈ రోజుల్లో చీర అమ్మలు, బామ్మలకే పరిమితం కాదు అమ్మాయిల వినూత్న కట్టులో విరివిగా మెరిసే ఎవర్గ్రీన్ సబ్జెక్ట్ చీరతో ఇప్పుడిక స్టైల్గా ఆ‘కట్టు’కోవడంలోనే ఉంది అసలు సిసలు కిటుకు. 1 కుచ్చుల అంచులు వచ్చే చీరలు ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. ఈ కుచ్చుల వల్ల మరింత అందంగా కనిపిస్తారు. కాలేజీ అమ్మాయిలు, యువతులకు ఈ చీరలు బాగుంటాయి. 2 బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో ఉన్న కంచి కుప్పడం శారీ ఇది. పూర్తి సంప్రదాయ వేడుకలకు ఎంపిక చేసుకునే ఈ చీరను వెస్ట్రన్ లుక్లో కట్టుకోవచ్చు. లాంగ్ స్లీవ్స్ టీ షర్ట్ వేసుకొని, పెద్ద బెల్ట్ నడుముకు పెట్టుకొని ఇండోవెస్ట్రన్ లుక్లో రెడీ అవ్వచ్చు. 3 సీతాకోకచిలుకల ప్రింట్లు ఉన్న కాటన్ చీర ఇది. దీనిని అన్ని చీరల విధంగా కాకుండా మెడచుట్టూ పవిట కొంగు వచ్చేలా స్క్రార్ప్ స్టైల్లో కట్టుకోవచ్చు. వింటర్ సీజన్కి కూడా ఇది బాగుంటుంది. మోడ్రన్స్టైల్లో ఆకట్టుకుంటుంది. 4 గ్రీన్ లెనిన్ శారీని జెగ్గింగ్, లెగ్గింగ్ లేదా ప్యాంట్ మీధకు ధోతీ స్టైల్లో కట్టేయచ్చు. దీనికి బ్లౌజ్గా క్రాప్టాప్ వేసుకొని పైన బ్లేజర్ వేసుకోవచ్చు. ఈ లుక్ ఫార్మల్గానూ స్టైలిష్గానూ ఉంటుంది. 5 కుచ్చుల చీరకు కాంట్రాస్ట్ కలర్ బోట్ నెక్ బ్లౌజ్ ధరించి, నడుముకు సన్నని బెల్ట్ ధరిస్తే స్టైలిష్గా మెరిసిపోతారు. 6 ఎరుపు–నలుపు కాంబినేషన్తో ముందే కుట్టి సిద్ధంగా ఉన్న రెడీ మేడ్ చీర ఇది. దీనిని ఒన్ మినట్ శారీ అని కూడా అంటారు. చీరకట్టుకోవడం రాకపోయినా, కాలేజీ అమ్మాయిలు వేగంగా, సులువుగా చీర లుక్లో మెరిసిపోవచ్చు. నవ్యశ్రీ మండవ ఫ్యాషన్ డిజైనర్ స్టైల్ అప్ విత్ సృష్టి, హైదరాబాద్ navyasrigoud30 @gmail.com -
చిత్రమైన చీర
సాధారణంగా డిజైనర్లు సృష్టించిన దుస్తుల కలెక్షన్ చూడాలంటే బొటిక్స్కు వెళ్లాలి. లేదా ఫ్యాషన్ షో, ఎక్స్పోల్లోనో చూడాలి. కానీ ఆ‘కట్టుకునే’ అపురూప చిత్రాల చీరలు చూడాలంటే మాత్రం మ్యూజియమ్స్కి వెళ్లాల్సిందే. అంత మాత్రాన అవి ఎప్పటివో చరిత్ర తాలూకు అవశేషాలు కావు.. నేటి మన సిటీ డిజైనర్ఆవిష్కరించిన అద్భుతాలు. సాక్షి, సిటీబ్యూరో: చిత్రలేఖనంలో ప్రవేశమున్నవారికి మాత్రమే కాదు.. కళలపై కాసింత అవగాహన ఉన్నవారికి కూడా రాజా రవివర్మ అంటే పరిచయం అక్కర్లేని పేరు. రాజవంశీకుడిగానే కాదు తన చిత్రలేఖనా ప్రతిభతోనూ చరిత్ర కెక్కిన రవివర్మ చిత్రాలు మనదేశపు కళా సంపద. అలాంటి చిత్ర సంపదను ఆధునిక ఫ్యాషన్లకు ఆలంబనగా మార్చారు నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షా. ప్రస్తుతం ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్ (ఎన్జీఎంఏ)లో ఆయన తన చిత్రాల చీరలను ప్రదర్శిస్తున్నారు. అసాధ్యం నుంచి అద్భుతం ‘రవివర్మవి సహజమైన రంగులతో తీర్చిదిద్దిన అద్భుత చిత్రాలు. అవి రంగుల, భావాలు, వివరాల గల గొప్ప సమ్మేళనం. అంతగా వెలుగులోకి రాని రవివర్మ గీచిన అద్భుత పెయింటింగ్స్లో మహిళలు, దేవతలు, కథలు.. ఇలా మూడు విభాగాలుగా విభజించి 30 పెయింటింగ్స్ను ఎంచుకున్నాం. ఆరు నెలల కాలాన్ని పూర్తిగా పరిశోధనకే కేటాయించాం. తొలుత వీటి గురించి మాస్టర్ వీవర్స్తో చర్చించినప్పుడు వారు ఇది సాధ్యమా అన్నట్టు అనుమానం వ్యక్తపరిచారు. దీనికి తగ్గట్టే ఖాదీలో నేచురల్ డైలను ఉపయోగించి ఈ చీరలు నేయాల్సి ఉండడం కూడా మరో సవాలు. తొలి రెండు చీరల ప్రయోగం విఫలమైన తర్వాత మూడో చీరకు సక్సెస్ అయ్యాం. ప్రతి పెయింటింగ్కు ఒక కలర్ చార్ట్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ చిత్రాల మీద ఉన్న అచ్చమైన రంగులను తలపించేందుకు మేం 600 షేడ్స్ సృష్టించాం’ అంటూ గౌరంగ్ తన కష్టాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రదర్శన ఎప్పటి నుంచో తన చీరలను మ్యూజియమ్స్లో చూడాలని అనుకుంటున్నానని, రెండేళ్ల పాటు సాగిన ఈ ప్రాజెక్ట్ తన కల సాకారం చేసిందని గౌరంగ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చీరలపై చిత్రాలను సృష్టించేందుకు ఒక్కో చీరకు 3 నెలలు పడితే మరో చీరకు 10 నెలలు కూడా పట్టిందని వివరించారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న ఈ ‘చిత్ర’మైన చీర ప్రదర్శన నవంబర్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. తర్వాత ఢిల్లీకి చేరనుంది. అలా అలా ఈ చీరలను నగరంతో సహా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శించాక వీటిని ఆన్లైన్ ద్వారా వేలం వేయాలని గౌరంగ్ భావిస్తున్నారు. సిటీ ఆర్టిస్ట్తో మొదలు.. ప్రాచుర్యం పొందిన చిత్రాలను చీరలపై కొలువుదీర్చడం అనే ప్రక్రియలో గౌరంగ్కు తొలి స్ఫూర్తిని అందించింది కూడా నగరానికి చెందిన ప్రముఖ చిత్రకారుడే కావడం విశేషం. ‘2013లో సిటీకి చెందిన లక్ష్మణ్ ఏలె పెయింటింగ్స్ను చూసినప్పుడు చాలాబాగా నచ్చాయి. దాంతో ఆయన వేసిన ఆరు చిత్రాలను నా చీరల కలెక్షన్లో పునఃసృష్టించాను. ఆ చీరల ప్రదర్శనకు వచ్చినవారిలో ఒకరైన లావినా ఒక చీర కొనుగోలు చేయడంతో పాటు అప్పటి నుంచి ఆమె నాతో కలిసి ఓ గొప్ప ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తి చూపేవారు. బెంగళూరులోని రాజా రవివర్మ హెరిటేజ్ ఫౌండేషన్ ప్రతినిధులను నాకు పరిచయం చేయడంతో మూడేళ్ల తర్వాత ఆమె ఆలోచన కార్యరూపం దాల్చింది’ అంటూ గౌరంగ్ చెప్పారు. అలా సిటికి చెందిన ప్రముఖ చిత్రకారుడు లక్ష్మణ్ ఏలె చిత్రాలను తన చీరల మీద ప్రతిష్టించడం ద్వారా సరికొత్త చిత్ర ట్రెండ్కి శ్రీకారం చుట్టిన గౌరంగ్ షా.. రాజా రవివర్మ చిత్రాలను ఒక్కో చీర పల్లూపై కొలువుదీర్చారు. గాంధీ జయంతి, రవివర్మ వర్ధంతి రెండూ అక్టోబరు 2నే కావడంతో ‘ఖాదీ ఏ కాన్వాస్’ పేరుతో ప్రదర్శనకి తెర తీశారు. -
దీపావళికి పట్టు జార్జెట్టు
ఇది మెరిసే పండగ.మగువలూ మెరిసే పండగ. వాకిలిలో దీపాలు వెలుగుతాయి. వాకిలి లోపల గృహిణి కళ కళకళలాడుతుంది. ఈ దీపావళికి కొత్త డిజైన్ని ట్రై చేయండి. జార్జెట్ చీరకు పట్టు అంచును జతచేయండి. ఆ కట్టుతో ఆకట్టుకోండి. అందరికీ సూటబుల్ బెనారస్ పట్టు మంచి కాంతిమంతమైన రంగులతో, డిజైన్తో ఇట్టే ఆకట్టుకుంటుంది. పండగలకు, పెళ్లిళ్లకు బెనారస్ పట్టు చీరలను ఎంపిక చేసుకోవడం తెలిసిందే. అలాగే జార్జెట్ చీరలను అమ్మాయిలు ఇష్టపడుతుంటారు. ఈ రెంటినీ ఇష్టపడేలా కాంబినేషన్ చీరను డిజైన్ చేశాం. సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకు కొత్త కళ తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే ఈ జార్జెట్ బెనారస్ పట్టుల కాంబినేషన్. టీనేజర్ల దగ్గర నుంచి అన్ని వయసుల వారూ వీటిని కట్టుకోవచ్చు. వేడుకలలో బ్రైట్గా వెలిగిపోవచ్చు. ►హెవీగా కాకుండా బెనారస్ను అంచు, బుటీలుగా తీసుకున్నారు. ►పాతకాలం అంటే నలభై యాభై ఏళ్ల క్రితం అమ్మలకు ఇలాంటి బ్రైట్ డిజైన్ ఉన్నకలర్ కాంబినేషన్ చీరలు ఉండేవి. ఆ డిజైన్ వచ్చేలా వీటిని డిజైన్ చేశారు. ►ఈ చీరలకు ఎలాంటి బ్లౌజ్ వేసినా బాగా నప్పుతుంది. అంటే చీర రంగులోనే ఉండే సెల్ఫ్ బ్లౌజ్ అయినా, ఏ డిజైనర్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు. ►ఈ చీరలన్నింటికీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసిన వెల్వెట్ బ్లౌజ్లను వాడారు. ►కేశాలంకరణ, ఆభరణాలు సింపుల్గా ఉన్నా కాస్త హెవీగా ఉన్నా ఈ చీరలకు నప్పుతుంది. -
బెలూన్లు స్టిచింగ్
బామ్మ చీర అయినా నేటి భామకు అమితంగా నచ్చుతుంది ఎందుకంటే.. ఇలా బెలూన్స్ స్లీవ్స్తో చీరకట్టుకు సరికొత్త భాష్యం చెప్పవచ్చు. ఏ వేడుక అయినా వైవిధ్యంగా వెలిగిపోవచ్చు. చీర కట్టుకు కీలకమైన కీ రోల్ బ్లౌజ్దే. ఆరుగజాల చీర అందం సరైన ఫిటింగ్తో ఉండే బ్లౌజ్తోనే తెలుస్తుంది. ‘సింపుల్గా ఉన్నామా, స్టైలిష్గా ఉన్నామా, హుందాగా కనిపిస్తున్నామా..’ అని ఎదుటివారికి తెలిసేలా చేసేది బ్లౌజ్ డిజైనే. అందుకే అతివలు బ్లౌజ్ ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.ఏ వేడుకకైనా పట్టుచీర కట్టడం ఇప్పుడు ట్రెండ్లో ఉంది. అలాగని నిన్నటి తరం వారిలా కాకుండా పట్టుకు డిఫరెంట్ కాంబినేషన్తో స్టైలిష్ బ్లౌజ్ ధరించి చూపులను కట్టడి చేస్తున్నారు. ఇతరత్రా ఎంబ్రాయిడరీ వర్క్ హంగులేవీ లేకుండా కేవలం బెల్ స్లీవ్స్తో బోల్డ్ లుక్స్ని లాగేస్తున్న ఈ బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి. బాలీవుడ్ టు టాలీవుడ్ ఇటు యంగ్ గర్ల్స్ నుంచి అందమైన అతివల వరకు ఈ బ్లౌజ్లను ధరించి గ్రేస్గా వెలిగిపోతున్నారు. ►సంప్రదాయ పండగలు, వివాహ వేడుకలకూ ఈ స్టైల్ నప్పుతుంది ►ఇండోవెస్ట్రన్ స్టైల్ ప్రత్యేక పార్టీలలోనూ గ్రేట్ లుక్స్ని కొల్లగొడుతుంది ►కంజీవరం, బెనారస్.. పట్టు ఏదైనా ప్లెయిన్ బెలూన్ స్లీవ్స్ బ్లౌజ సరైన ఎంపిక అవుతుంది. ►బెనారస్, కంచి పట్టు చీరలు మోటిఫ్స్తో లుక్ గ్రాండ్గా ఉంటాయి. దీని మీదకు అదే రంగు బ్లౌజ్ ధరిస్తే లుక్లో పెద్ద మార్పు ఉండదు. అదే కాంట్రాస్ట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్కి స్లీవ్స్లో భిన్నమైన ప్యాటర్న్ తీసుకుంటే లుక్ స్టైలిష్గా కనిపిస్తుంది. – శైలేష్ సింఘానియా, ఫ్యాషన్ డిజైనర్ -
చీరకట్టుతో అలరించిన దురదర్శన్ వ్యాఖ్యాత..!
దూరదర్శన్ చానల్లో ప్రత్యేకమైన శైలితో శ్రోతలకు వార్తలు వినిపించిన అలనాటి న్యూస్రీడర్ సల్మా సుల్తాన్ ఓ ఫ్యాషన్ షో లో ర్యాంప్పై మెరిశారు. 72 ఏళ్ల వయసులోనూ ఆమె తన చీరకట్టుతో షోలో పాల్గొని అందర్ని అలరించారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓ ఫ్యాషన్ షోలో సుల్తాన్ భారతీయ సంస్కృతిని, చీరలకు ఉన్న సాంప్రదాయ విలువలను ప్రతిబింబిచే విధంగా చీరుకట్టుతో ర్యాంప్పై నడిచారు. చీరకట్టు గొప్పతనాన్ని మహిళలకు తెలియజేయానే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. సల్మా సుల్తాన్ తాను చీరలు ధరించడానికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా సల్మా సుల్తాన్ మాట్లాడుతూ.. ‘ఈ ఫ్యాషన్ షో చాలా ఆనందం కలిగించింది. చీరకట్టుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ‘చీరలు ధరించడానికి ఎటువంటి ఇబ్బంది, అసౌకర్యం ఉండదని నమ్ముతాను. చీరలు ధరించడానికి మహిళలకు ధైర్యం, విశ్వాసం ఉండాలి. చీరలపైన అమితమైన విశ్వాసం, ఇష్టం ఉంటే.. ఏ వేషాధారణలో ఉన్నా మహిళలకు ఎటువంటి సమస్యలు తలెత్తవు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ షోవన నారాయణ్తో పాటు ‘ఫ్యాషన్ లైఫ్ స్టైల్’ మేగజైన్ ప్రముఖులు హాజరయ్యారు. కాగా సుల్తాన్ మూడు దశాబ్దాల పాటు దురదర్శన్లో వ్యాఖ్యాతగా పనిచేశారు. జర్నలిస్టు, వ్యాఖ్యాతగా సుపరిచితమైన ఆమె 1997 వరకూ పని చేశారు. డీడీలో పని చేసినప్పుడు ఆమె ప్రత్యేకమైన శైలిలో వార్తలను చదివి అందరిని ఆకర్షించేవారు. ఎడమ చెవి కింద జుట్టులో గులాబీతో సాంప్రదాయమైన చీరకట్టుతో వార్తలు చదువుతూ అందరిని ఆకట్టుకునే వారు. ఆమె తన చీరను మెడ, భుజాల చుట్టూ ఆధునిక పద్ధతిలో కప్పుకొని సాంప్రదాయకంగా కనిపించేవారు. వ్యక్తిగత శైలిని ప్రదర్శించిన మొదటి వార్తా వ్యాఖ్యాతల్లో సుల్తాన్ ఒకరు. సల్మా చీరకట్టు, ప్రత్యేకమైన శైలిని చాలా కాలం కొత్త న్యూస్రీడర్లు అనుకరించారు. -
డిస్నీ బ్యూటీ
మిక్కీమౌజ్, డోరెమాన్,టామ్ అండ్ జెర్రీ..డిస్నీ వరల్డ్ అంటేపిల్లలకు చెప్పలేనంత ఇష్టం.ఆ బొమ్మలున్న డ్రెస్సులు కూడాఅంతే ప్రత్యేకతను చూపుతున్నాయి.టీవీ కార్టూన్ షోలలో కనిపించే ఈ బొమ్మలకు ఓఅరుదైన గుర్తింపు కలిపిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.కామిక్ బొమ్మల ప్రింట్లున్న చీరలుఅమ్మలే కాదు అమ్మాయిలూఇష్టపడి ఎంచుకుంటున్నారు.పార్టీలో ప్రత్యేకతనుచాటుతున్నారు. పువ్వుల రింగులు వేడుక ఏదైనా డ్రెస్ సెలక్షన్ తర్వాత ఆభరణాలు సింగారం మీదనే దృష్టి పెడతారు అతివలు. గ్రాండ్గా కనులకువిందు చేసే ఆభరణాల కోసం ఎంతమొత్తమైనా వెచ్చించడానికి సిద్ధంగా ఉంటారు. అయితే, ప్రస్తుత కాలం వేరు. పార్టీకి తగ్గట్టు డ్రెస్ ఉండాలి. ఆ డ్రెస్ మరింత అందంగా కనిపించడానికి తగిన ఆభరణాలు ఉండాలి. అందుకు ఈ పువ్వుల డిజైన్లు ఉన్న రింగులు ప్రత్యేక సింగారాన్ని తీసుకువస్తున్నాయి. సింపుల్గానూ, గ్రేస్గా ఉండే ఈ పువ్వుల డిజైన్ రింగులు సిల్వర్, స్టీల్ మెటల్తో తయరుచేసినవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వందరూపాయల నుంచి లభించే ఈ డిజైనర్ రింగ్స్తో వేడుకలో మరింత ఆహ్లాదంగా, బ్యూటిఫుల్గా వెలిగిపోవచ్చు. ఇండియన్ డిజైనర్ సత్యపౌల్ సిల్క్ పై చేసే ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. సిల్క్, షిఫాన్, క్రేప్ చీరల మీద కామిక్ డిజైన్స్ను ప్రింట్లుగా వేసి ఓ ప్రత్యేకతను తీసుకువచ్చారు. ఆ డిజైన్స్ను పోలిన కామిక్ వరల్డ్ ప్రింటెడ్ శారీస్ గెట్ టు గెదర్ పార్టీలో ప్రత్యేకతను చాటుతున్నాయి. -
మహానగరంలో చీరల చోరీమణులు
-
పెయింట్ పట్టు
చీరకు ప్రాణం వస్తే అది రవివర్మ చిత్రం!చీరపై చిత్రాన్ని గీస్తే అది రవివర్మకే విచిత్రం! స్త్రీని, ప్రకృతిని కలిపి అలా గీసినఈ హ్యాడ్ పెయింట్..ప్లెయిన్ పట్టు చీరలు పెళ్లిళ్లలో.. ఫంక్షన్లలో..రిసెప్షన్.. సంగీత్..ఇంకా కాక్టైల్ పార్టీలలో మీకు తెలియకుండానేమీ చేత క్యాట్వాక్ చేయిస్తాయి.మిమ్మల్ని స్పెషల్ గెస్ట్గానిలబెడతాయి. చీరే కాన్వాస్ స్పెషల్గా కనిపించాలంటే అందరూ ఎంచుకునేవి, ట్రెండ్లో ఉన్నవి, రెగ్యులర్ మార్కెట్లో ఉన్నవి పక్కన పెట్టేయాలి. ‘కళ’కు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది. ఒకే ఒక పీస్ ఉంటుంది. ఇప్పటి వరకు మనం కాటన్, ఆర్గంజా చీరల మీద ఫ్యాబ్రిక్ పెయింట్ చూశాం. అలాంటి చీరలు కట్టుకున్నాం. అదే తరహాలో పూర్తి ప్లెయిన్ పట్టు చీరను ఎంచుకొని దాని మీద చేత్తో పెయింట్ వేయడంతో ఇలా సరికొత్తగా ఆకట్టుకునేలా రెడీ అయ్యాయి. పక్షులు, లతలు, పువ్వులు.. ఇలా అభిరుచిని బట్టి వేసుకున్న లేదా వేయించిన పెయింటింగ్ శారీని కట్టుకుంటే వందమందిలో ఉన్నా ప్రత్యేకంగా కనిపిస్తారు. ప్యూర్ ప్లెయిన్ పట్టు చీరలు నాలుగైదు వేల రూపాయల్లో లభిస్తాయి. వీటిపై చేసిన హ్యాండ్ పెయింటింగ్ని బట్టి ధర వేలల్లో ఉంటుంది ►ప్రింట్ హెవీగా ఉన్నప్పుడు బ్లౌజ్ ప్లెయిన్గా ఉండాలి. కొంత డిజైన్ కావాలనుకుంటే లేస్ ఫ్యాబ్రిక్ని ఎంచుకోవచ్చు ►చీర ప్రత్యేకత తగ్గకూడదు కాబట్టి ఇలాంటి స్పెషల్ వేర్కి బంగారు ఆభరణాలు పూసల హారాలను ఎంచుకోవాలి. వాటిలో ముత్యాలు, కెంపులు, పచ్చలు.. వంటి బీడ్స్ హారాలు తీసుకోవాలి ►చేతులకు గాజులు కాకుండా ఒక చేతికి బ్రేస్లెట్, మరో చేతికి మంచి వాచీ ధరించాలి. మోడ్రన్ క్లచ్ చేత్తో పట్టుకోవాలి ►కేశాలంకరణకు వస్తే జుట్టును ముడివేయకుండా వదిలేయాలి. లేదంటే, ప్రెంచ్ ప్లాట్ వంటి పాశ్చాత్య హెయిర్స్టైల్స్ను మరింత స్టైలిష్గా కనిపిస్తారు ►ఫ్రింట్ని హైలైట్ చేయాలనుకుంటే మిగతా మన అలంకరణ అంతా సింపుల్గా ఉండాలి మేకప్తో సహా! -
అనంతపురం జిల్లాలో దివాకర్ ట్రావెల్స్లో చీరల తరలింపు పట్టివేత
-
కళ్యాణ కళ
పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది పట్టు కళ వేడుకలలో ధగధగలాడటానికిసరికొత్తగా ముస్తాబు అవుతోంది.నవతరం లుక్లో వచ్చిన మార్పుకుఆధునికత అద్దం పడుతోంది.ఇండోవెస్ట్రన్ స్టైల్ బ్లౌజ్లకు సంప్రదాయ పట్టు జత చేరి రెట్రో కళతో వెలిగిపోతోంది. ►షోల్డర్ డౌన్, స్లీవ్లెస్ డిజైనర్ బ్లౌజ్లతో కంచిపట్టు చీరలకు మోడ్రన్ కళ తీసుకురావచ్చు. అంతేకాదు బామ్మలకాలం నాటి శారీస్తోనూ వేడుకలో ఆకట్టుకునే కట్టును ఈ తరం ఎంచుకుంటోందనడానికి ఈ మోడల్ సిసలైన ఉదాహరణ. ►కంచిపట్టు చీరకు ప్లెయిన్ బ్లౌజ్తోనూ డిఫరెంట్ లుక్ తీసుకురావచ్చు. బ్యాక్ హైనెక్, ఫ్రంట్ డీప్ నెక్ ఉన్న ప్లెయిన్ బ్లౌజ్కి కాంట్రాస్ట్ నెటెడ్ కుచ్చులు జత చేస్తే ఇండోవెస్ట్రన్ లుక్ వచ్చేస్తుంది. ►‘గ్రే కలర్ చీరలు వేడుకలో డల్గా ఉంటాయి’ అని సందేహించేవారికి గ్రేస్ లుక్తో చూపులను కట్టడి చేస్తున్నాయి ఈ చీరలు. నెటెడ్ బుట్ట చేతుల డిజైనర్ బ్లౌజ్ ఈ శారీకి అసలైన ఎన్నిక. మెడకు నిండుదనాన్ని తెచ్చే వెడాల్పిటి నెక్లెస్, పొడవాటి హారాలు అదనపు అలంకరణ. ►రెట్రోలుక్ ప్రతి వేడుకకూ ఎవర్గ్రీన్ అలంకరణ అవుతుంది ఈ రోజుల్లో. దానికి కొద్దిపాటి మెళకువలతో చీరలకు కొత్త సింగారాలను అద్దవచ్చు. రౌండ్ క్లోజ్డ్ నెక్, కుచ్చుల చేతులున్న బ్లౌజ్లు పట్టు చీరల అందాన్ని రెట్టింపు చేస్తాయి. -
కర్ణాటక వారి కేరళ చీర!
బంగారు జరీ అంచు.. కోరా చీర.. ఓనం శారీస్ అని కూడా అంటారు. కేరళ అనగానే కొబ్బరితోటలతోపాటు గుర్తొచ్చే కాస్ట్యూమ్. నిజానికి ఇది కేరళ నేత కాదు. కర్ణాటకకు చెందిన చేనేతకారుల కళ. దేశ వాసుల మనసు దోచుకున్న నేత. దీన్ని అక్కడ కసావు చీర అంటారు. శతాబ్దాల నుంచి కేరళకు చిరునామాగా ఉన్న ఈ వస్త్రవిశేషం.. రాజా రవివర్మ చిత్రాల్లోనూ సింగారించుకుంది. దేవుడి భూమిలో కన్నడ నేత కేరళలోని తిరువిల్వామల పంచాయతీ పరిధిలో ఉన్న కుథంపల్లీలో కసావు చీరలను నేస్తారు. త్రిస్సూర్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఊరు. దాదాపు 300 చేనేత కుటుంబాలు ఈ చీరలను నేస్తాయి. వీళ్లంతా కన్నడిగులే. 500 ఏళ్ల కిందట బెంగళూరు, మైసూరు నుంచి వచ్చి స్థిరపడ్డ దేవల అనే రుషి వంశస్తులు. కుథంపల్లిలో వీళ్లను దేవల కులస్తులుగా పరిగణిస్తారు. కాటన్ చీరలను నేయడంలో సుప్రసిద్ధులు. ఈ కుటుంబాలకు చెందిన ఇంకొంతమంది తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఓడిశా లాంటి ప్రాంతాల్లో కూడా ఉన్నారు. వీళ్లను ఆయాప్రాంతాల్లో దేరాస్ అని పిలుస్తారట. మాతృభాష కన్నడ అయినా.. వందల ఏళ్ల నుంచి మలయాళ నేల మీద ఉండడం వల్ల కన్నడ, మలయాళం, తమిళం మూడింటి మిశ్రమాన్ని మాట్లాడుతుంటారు. వీరి భాషకు లిపి లేదు. వీళ్ల ఆచార వ్యవహారాలు కూడా భిన్నంగా ఉంటాయి. వేరే కమ్యూనిటీ వాళ్లను పెళ్లి చేసుకోరు. దేవల సమూహంలోనే సంబంధాలను ఖాయం చేసుకుంటారు. ఒక వేళ ఎవరైనా అలా బయటి వాళ్లను పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబాన్ని వెలేస్తారు. ఆస్తులు, హక్కులు,పెళ్లిళ్లు, విడాకులు వంటివాటికి సంబంధించి న్యాయ తీర్పుల కోసం కుల పంచాయితీని అనుసరిస్తారు. కర్ణాటకలో ఉన్న చౌడేశ్వరీ దేవి వీళ్ల దేవత. ఆ దేవినే కుథంపల్లిలో సౌదేశ్వరీఅమ్మ అంటారు. ఆ దేవతకు ఆ ఊళ్లో అదే పేరుతో గుడి కూడా ఉంది. అమావాస్య, పౌర్ణమి రోజుల్లో నేత పని ముట్టుకోరు. మహావిష్ణువు తన నాభిలోంచి పత్తి గింజలను తీసి దేవల కులస్తులకు ఇచ్చింది అమావాస్య నాడే అనే నమ్మకంతో ఉంటారు కాబట్టి ఆ రోజుల్లో పని ముట్టుకోరట వీళ్లు. దేశ వ్యాప్తంగా ఉన్న 5 లక్షల 66 వేల దేవల వంశ జనాభాలో.. మెజారిటీ, అంటే ఏడువందల కుటుంబాలు కర్ణాటకలో నివసిస్తున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా? అయిదు వందల ఏళ్ల కిందట .. కొచ్చి రాజవంశంలోని స్త్రీల కోసం బంగారు జరీ బార్డర్తో చీరలు నేసే వాళ్ల కోసం అన్వేషణ మొదలుపెట్టాడు మహారాజు. ప్రత్యేకించి బంగారు జరీ ఎందుకంటే.. అప్పటి రాజవంశ వనితలు బంగారాన్ని నగలుగానే కాకుండా కట్టు, బొట్టులో కూడా వాడేవారట. అలా కోరా రంగు, బంగారు జరీతో రాయల్ లేడీస్కి చీరలు నేసే వాళ్ల వేటలో పడ్డ కొచ్చి మహారాజుకు బెంగళూరు, మైసూరులో ఉంటున్న దేవల కులస్తుల చేనేత కళ గురించి తెలిసింది. వెంటనే ఆ కుటుంబాలను పిలిపించి.. వాళ్లకు బస ఏర్పాటు చేసి చీరల నేతను అప్పజెప్పాడు. ఆ కుటుంబాలు అలా కుథంపల్లిలో స్థిరపడ్డారు. రాజకుటుంబీకులకే ప్రత్యేకమైన ఆ నేత.. కాలక్రమేణ కేరళంతటికీ వ్యాపించి ఆ రాష్ట్రానికే చిహ్నంగా మారింది. ప్రాచుర్యంలో దేశమంతటా పరుచుకుంది. ఈ చీరకున్న ప్రత్యేకతల వల్ల 2011, సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ఈ ఊరికి ‘‘కుథంపల్లి శారీ’’పేరుతో భౌగోళిక గుర్తింపును ఇచ్చింది. కుథంపల్లిలో యేడాదికి 60 వేల చీరలను నేస్తారు. ఒక్కో చేనేత కార్మికుడు రెండువందల చీరలను నేస్తారు. ప్రస్తుతం ఈ చీరల ధరలు పద్దెనిమిది వందల రూపాయల నుంచి పన్నెండువేల రూపాయల వరకూ ఉన్నాయి. పెళ్లి చీరలైతే యాభైవేల రూపాయల నుంచి ఆ పైనే ఉంటాయి. అన్నింట్లో సంప్రదాయ పద్ధతులనే పాటిస్తున్నా.. మార్కెటింగ్లో మాత్రం ఆధునికతను ఆహ్వానిస్తున్నారు దేవల్ కులస్తులు. ఆన్లైన్ మార్కెటింగ్లోకి అడుగుపెట్టి అమెజాన్ ద్వారా ఈ చీరలను సేల్కి పెడ్తున్నారు. ఇదీ కసావు శారీస్ కథ! (కసావు నేత (పక్కన కసావు చీర) ) -
రూ.14కే ఆడపడుచులకు చీరలు
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): ద్వారకానగర్లోని ఏఎన్ఆర్ షాపింగ్మాల్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆఫర్లు ప్రకటించారు. రూ.14కే ఆడపడుచులకు చీరలు అందిస్తున్నామని, ఈనెల 6వ తేదీన మొదలైన ఆఫర్లు 19వ తేదీ వరకు కొనసాగుతాయని సంస్థ డైరెక్టర్ తేజ తెలిపారు. రూ.499 ఆపై కొనుగోలుపై ఈ ఆఫర్ వర్తిస్తుందన్నారు. జైపూర్ వర్క్శారీ రూ.648కే అందజేయడమే కాకుండా వెండి నాణెం కూడా అందజేస్తున్నారు. పట్టుచీర రూ.1995కి అందజేస్తూ వెండి కుంకుమ భరిణ ఉచితంగా ఇస్తున్నారు. వర్క్శారీలు, లాంగ్ ఫ్రాక్స్ (ఫ్యాన్సీ), లేడీస్ సల్వార్స్పైనా ఫ్లాట్ 72 శాతం, కిడ్స్ సల్వార్స్/గాగ్రాస్పై 50 శాతం డిస్కౌంట్ సదుపాయం వుందని తెలిపారు. సూటింగ్, షర్టింగ్లపై 30, 40, 50 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. -
3 రూపాయలకే చీర.. పోటెత్తిన మహిళలు
సాక్షి, వరంగల్ : కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ తెలుసా? ఆ షాపింగ్ మాల్లో కేవలం 3 రూపాయిలకే ఒక చీర ఇస్తున్నారంట. వరంగల్, ఆ చుట్టుపక్కల ఆడవాళ్లంతా ప్రస్తుతం చెప్పుకునే ముచ్చట ఇదే. ముచ్చటతో ఆపారా ఏమిటి? చకాచకా రెడీ అయిపోయి, షాపింగ్ మాల్కు పరిగెత్తారు. ఇలా వరంగల్, ఆ చుట్టుపక్కల గ్రామాల ఆడవాళ్లందరూ కాసం పుల్లయ్య షాపింగ్ మాల్లోనే. దీంతో షాపింగ్ మాల్ ఒక్కసారిగా మహిళలతో కిక్కిరిసిపోయింది. 3 రూపాయల చీరను సొంతం చేసుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున్న పోటెత్తారు. దీంతో కాసం పుల్లయ్య షాపింగ్ మాల్లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏంట్రా బాబు ఇంతమంది ఆడవాళ్లా!! అని నోర్లు వెళ్లబెట్టిన షాపింగ్ మాల్ సిబ్బంది, పరిస్థితిని అదుపు చేయలేక పోలీసులకు ఫోన్ చేశారు. షాపింగ్ మాల్ను మూసివేశారు. కానీ అప్పటికే పరిస్థితి అంతా చేదాటిపోయింది. ఆఫర్లు ప్రకటించి, షాపింగ్ మాల్ మూసివేయడంపై మహిళలు తిరగబడ్డారు. ఏం చేయాలో పాలుపోలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు. కాగా, 3 రూపాయలకే చీర అంటూ కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ పెద్ద ఎత్తునే ప్రచారం చేసింది. సెప్టెంబర్ 24,25,26 తేదీల్లో ఈ సేల్ను నిర్వహించబోతున్నట్టు పేర్కొంది. తన మూడవ వార్షికోత్సవం సందర్భంగా రూ.3కే చీర ఇస్తోంది. ఇవే కాకుండా ఇంకా మరెన్నో ఆశ్చర్యపరిచే అద్భుతమైన ఆఫర్లను కాసం పుల్లయ్య షాపింగ్ మాల్ ప్రకటించింది. లెగ్గింగ్, నైటీస్, టీ-షర్ట్లను కూడా 3 రూపాయలకే అందిస్తామంటూ తెగ ప్రచారం చేసింది. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం రూ.1.00 గంటల వరకు ఈ ఆఫర్లను మహిళల ముంగిట ఉంచింది. ప్రతి రూ.999 విలువ గల వస్త్రాల కొనుగోలుపై చుడీదార్స్, డ్రస్ మెటీరియల్, లెహంగాస్,కుర్తీస్ను ఆఫర్ చేస్తుంది. ఇన్ని చౌకైన ఆఫర్లుంటే మహిళలేమన్నా చూస్తూ ఊరుకుంటారా? ఠక్కువ వెళ్లి తమకు కావాల్సినవన్నీ కొనుక్కు వచ్చేరు. అక్కడ కూడా ఇదే జరిగింది. కానీ చివరికి పరిస్థితిని అదుపు చేయలేక షాపింగ్ మాల్నే మూసేసే దశకు వచ్చింది. -
వరాల పట్టు
వరమహాలక్ష్మికి ఇంపైన పట్టుశ్రీ మహాలక్ష్మికి సొంపైన పట్టుకమలాయతాక్షికి కోమలమైన పట్టు శ్రావణలక్ష్మికి సొగసైన పట్టుఏ పట్టు కట్టినా కోరినన్ని వరాలు ఆ ఇంట కురిసినట్టే! లైట్ వెయిట్ రంగుల హంగులు, పువ్వుల డిజైన్లు లేదంటే ప్లెయిన్గా అలరించే ప్రత్యేకత లైట్వెయిట్ పట్టు చీరల ప్రత్యేకత. వీటికి మోడర్న్ టచ్ ఇవ్వాలంటే ప్లెయిన్, కాంట్రాస్ట్ బ్లౌజ్ లేదంటే స్లీవ్లెస్ బ్లౌజ్ సరైన ఎంపిక అవుతంది. ఈ తరం మగువ కోరుకునే కాంబినేషన్ కట్టు. ఇది. పొడవాటి గౌన్కూ జోడీ దుపట్టా పట్టు పండగ వేళ పసుపు, పచ్చ, ఎరుపు కాంతిమంతమైన రంగులు ముంగిళ్లను కళకళలాడేలా చేస్తాయి. అందుకే ఆ హంగులు నింపుకున్న పట్టు డ్రెస్సులు పండగ అందాన్ని Ðð య్యింతలు చేస్తాయి. పొడవాటి పటోలా గౌన్ మీదకు పట్టు దుపట్టా ఓ ప్రధాన ఆకర్షణ. లెహంగాతో పట్టు జత కట్టు ప్లెయిన్ కుచ్చుల లెహంగా మీదకు పట్టు ఓణీ ధరిస్తే ఓ కళ. లేదంటే ప్లెయిన్ పట్టు లెహంగా మీద ఎంబ్రాయిడరీ చేస్తే మరో ఆకర్షణీయమైన కళ. అనార్కలీకి తోడు పటోలా పట్టు ప్లెయిన్ లాంగ్ అనార్కలీకి మెరుపు తీసుకురావాలంటే పువ్వుల ప్రింట్లు ఉన్న పట్టు దుపట్టా లేదంటే ఇక్కత్, పటోలా పట్టును ఎంపికచేసుకుంటే ప్రత్యేకంగా కనిపిస్తారు. పట్టు చీర మగ్గం వర్క్ పెద్దంచు అవీ యాంటిక్ లుక్తో ఆకట్టుకునే పట్టు చీరలు ఇప్పటి ట్రెండ్. వీటికి డిజైనర్ బ్లౌజ్ను జత చేర్చితే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. పండగ వేళ పట్టు ఎప్పుడూ ఎవర్గ్రీన్ కాన్సెప్టే. శ్రావణ మాసాన వరలక్ష్మీ వ్రతాలు, నోములు, పెళ్ళిళ్లు, గృహప్రవేశాలు.. ప్రతీది సంబరమే! ప్రతీది సంప్రదాయమే. పువ్వులు–పండ్లు, మామిడితోరణాలు, పసుపు–కుంకుమలతో పాటు పట్టు ఆభరణమై ఎన్నో విధాల జత కట్టచ్చు. పట్టు చీర కడితే చాలు అనుకునే రోజులు కావివి. పట్టును దేనితో జత కట్టవచ్చు అని ఆలోచించే రోజులు. అందుకు డిజైనర్లు సైతం తమ పనితనానికి మెరుగులు పెడుతుంటారు. పట్టును ఎలా ధరించినా కళ ఉట్టిపడుతుంది. కుర్తా, అనార్కలీ, పొడవాటి గౌను మీద పట్టు దుపట్టా, లెహెంగా మీదకు పట్టు ఓణీ జత చేసినా చాలు పండగ కళ వెయ్యింతలు అవుతుంది. - నిర్వహణ ఎన్.ఆర్. -
శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్..
-
శ్రీదేవిలో మనకి తెలియని మరో కోణం ..
సినీ ప్రపంచాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచుతూ అతిలోక సుందరి శ్రీదేవి నింగికేగారు. మొన్నటి వరకు శ్రీదేవి ఓ గొప్పనటిగా మాత్రమే మనందరికి తెలుసు. దాదాపు మూడు తరాల అభిమానులకు తనవైపుకు తిప్పుకున్న శ్రీదేవిలో మనకి తెలియని మరో టాలెంట్ ఉంది. పెయింటింగ్ అంటే ఆమెకు చాలా ఇష్టమట. గత ఐదేళ్ళుగా ఎవరికి తెలియకుండా పెయింటింగ్స్ వేస్తుందట. సినీ కేరీర్ వల్ల ఆ టాలెంట్ను శ్రీదేవి ఎప్పుడూ బయపెట్టలేదు. తీరిక దొరికినప్పుడల్లా శ్రీదేవి పెయింటింగ్లు వేసి నచ్చిన వాళ్ళకి బహుమతిగా ఇస్తారట. ఇటీవల తన మరిది కూతురు సోనమ్ కపూర్కి అద్భుతమైన పెయింటింగ్ వేసి ఇచ్చిందట శ్రీదేవి. ఆ పెయింటింగ్ ను చూసి ఫుల్ ఖుష్ అయిన సోనమ్ ఆ మరుపురాని జ్ఞపకాన్ని తన రూమ్లో దాచుకుందట. మరోవైపు సల్మాన్ ఖాన్, డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి సెలబ్రిటీలకు కూడా తన పెయింటింగ్స్ బహుమతులుగా ఇచ్చినట్టు తెలుస్తోంది. శ్రీదేవికి తన ఇద్దరు కుమార్తెలు అంటే ప్రాణం..అందుకేనేమో ఆమె పెయింటింగ్స్లో జాన్వి, ఖుషీలవి కూడా ఉన్నాయట. అదేవిదంగా మైకేల్ జాక్సన్ను ఎంతో ఇష్టపడే శ్రీదేవి ఆయన పెయింటింగ్ను గీశారు. కాగా, శ్రీదేవి పెయింటిగ్స్తో ఓ అంతర్జాతీయ ఎగ్జిబిషన్ సంస్థ ఛారిటి నిమిత్తం దుబాయ్లో ఓ షో ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేసిందని కూడా వార్తలు వెలువడ్డాయి. శ్రీదేవి గీసిన సోనమ్ పెయింటింగ్ ప్రయాణాలంటే ఇష్టం శ్రీదేవికి ప్రయాణాలంటే చాలా ఇష్టం. తీరిక దొరికనప్పుడల్లా భర్త బోనీ, పిల్లలతో కలిసి తరచూ విదేశీ పర్యటనకు వెళతామని ఆమె ఓ ఇంటర్వూలో తెలిపారు. రోమ్, ఇటలీ నగరాలు బాగా నచ్చుతాయని తెలిపింది. లేతరంగు చీరలను ఇష్టపడే శ్రీదేవి.. చీర ఎలా కట్టుకోవాలో వాళ్ల అమ్మ దగ్గర నేర్చుకుందట. సంగీతం వింటూ పనులు చేసుకునే శ్రీదేవి తెలుగు, హిందీ, తమిళ పాటను ఎక్కువగా వింటుంది. అదే విధంగా దేవుడిపైనా శ్రీదేవికి నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని ప్రారంభించే ముందు పూజ చేయడం అమెకు అలవాటు. మైకేల్ జాక్సన్ పెయింటింగ్ -
లవ్లీ బ్రెయిడ్
ఇది ‘లవ్లీ్ల బ్రెయిడ్’ హెయిర్ స్టయిల్. ఇది చూడటానికి అందంగా, కొత్తగా ఉంటూ... చూపరులను ఇట్టే ఆకర్షిస్తుంది. దీన్ని వేసుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు. అలాగే దీనికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఈ హెయిర్ స్టయిల్ స్కర్ట్స్, జీన్స్, శారీస్ మీదకు భలేగా నప్పుతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా అన్నిరకాల పార్టీలకు అందరూ వేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం, వెంటనే కింద ఇచ్చిన స్టెప్స్ను ఫాలో అవుతూ ప్రయత్నించండి. ►ముందుగా జుత్తునంతా చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. హెయిర్స్ప్రే చేసుకొని దువ్వుకుంటే జుత్తు మృదువుగా మారుతుంది. తర్వాత జుత్తు మొత్తానికీ కలిపి ఓ బ్యాండ్ పెట్టుకోవాలి. ►ఇప్పుడు పోనీలో నుంచి కొంత జుత్తును చేతుల్లోకి తీసుకోవాలి. ►తర్వాత ఆ జుత్తును కాస్తంత వదులుగా పట్టుకొని, బ్యాండ్ చుట్టూ చుట్టుకోవాలి. ►అలా చుట్టుకున్న జుత్తు చివర్లు బయటికి రాకుండా స్లైడ్స్ పెట్టుకోవాలి. అప్పుడు ఫొటోలో కనిపిస్తున్నట్టుగా మీ జడ ఉంటుంది. ►కింద మిగిలిన జుత్తును మరోసారి దువ్వుకొని పూర్తిగా పైకి తీసుకెళ్లాలి. అలాగే బ్యాండ్ను కాస్తంత గ్యాప్ వచ్చేలా లాగి పట్టుకోవాలి. ►ఇప్పుడు ఆ జుత్తును పైనున్న బ్యాండ్లో నుంచి బయటికి తీయాలి. ►అలా బయటికి తీసిన జుత్తును రెండు భాగాలుగా చేసుకోవాలి. ►ఆ రెండు భాగాల జుత్తుతో రెండు ముళ్లు వేయాలి. ఆపైన చివర్లు కనిపించకుండా స్లైడ్స్ పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, ఎంతో అందమైన హెయిర్ స్టయిల్ మీ సొంతమవుతుంది. సిల్కీ అండ్ షైనీ రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యానికి హెయిర్ మొత్తం పాడైపోతుందని బాధపడుతున్నారా? ఆయిల్స్, షాంపూస్, కండీషనర్స్ మార్చి మార్చి విసిగిపోయారా? అయితే ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: కొబ్బరి పాలు – 4 టీ స్పూన్స్ ఆలివ్ ఆయిల్ – 2 టీ స్పూన్స్, నిమ్మరసం – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో కొబ్బరి పాలు, ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తరువాత నిమ్మరసం కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు హెయిర్ చిక్కులు లేకుండా దువ్వుకుని, కుదుళ్లకు పట్టేలా మొత్తం హెయిర్కు ఆ మిశ్రమాన్ని అప్లై చేసుకుని, ఓ 30 నిమిషాల తరువాత తలస్నానం చెయ్యాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. -
సిరిసిల్ల నేతన్నలకు.. సం‘క్రాంతి’!
సిరిసిల్ల నేతన్నలకు కొత్త ఆర్డర్లు వస్తున్నాయి. తమిళనాడులో పొంగల్ (సంకాంత్రి) కోసం సిరిసిల్లలో చీరలు తయారు అవుతున్నాయి. తమిళనాడు ప్రభుత్వం భారీగా పంచెలు, చీరలు ఆర్డర్ ఇవ్వడంతో సిరిసిల్ల నేతన్నలకు ఉపాధి లభిస్తున్నది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండగకు 52 లక్షల చీరలను సిరిసిల్లలో తయారు చేయించింది. దీంతో మెరుగైన ఉపాధి నేతన్నలకు లభించింది. కొత్తగా తమిళనాడు చీరల ఆర్డర్లు రావడంతో సిరిసిల్ల నేత కార్మికుల ఉపాధికి కొత్త బాటలు పడుతున్నాయి. – సిరిసిల్ల నుంచి మల్లికార్జున్ తమిళనాడులో 1.72 కోట్ల పంచెలు, మరో 1.73 కోట్ల చీరలు అవసరం ఉండడంతో అక్కడ ఆ మేరకు ఒకే సారి ఉత్పత్తి సాధ్యం కాకపోవడంతో అక్కడి ఏజెంట్ల దృష్టి సిరిసిల్లపై పడింది. దీంతో ఇక్కడ భారీగా ఆర్డర్లు ఇస్తూ.. చీరలు, పంచెలు ఉత్పత్తి చేయిస్తున్నారు. ఒక్కో మగ్గం నిత్యం 70 మీటర్లు ఉత్పత్తి చేస్తుండగా రోజుకు లక్షా నలభైవేల మీటర్ల చీరల వస్త్రం ఉత్పత్తి అవు తోంది. ఈ పని మూడు నెలలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో 78 వేల మరమగ్గాలుండగా.. సిరిసిల్లలోనే 34 వేలు ఉన్నాయి. ఇందులో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, ఏడు వేల మరమగ్గాలపై కాటన్ (ముతక) రకం వస్త్రం ఉత్పత్తి అవుతుంది. నిత్యం ఐదు లక్షల మీటర్ల వస్త్రం సిరిసిల్లలో ఉత్పత్తి అవుతుండగా.. ఈ మేరకు వినియోగం లేక ధర లభించడం లేదు. మరోవైపు షోలాపూర్, బీవండి, ఇచ్చంఖరేంజ్ లాంటి ప్రాంతాల నుంచి పోటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సిరిసిల్ల నేతన్నలు ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉన్న మరమగ్గాలపై కాటన్ చీరలు, తువ్వాల, ధోవతులు, కర్చీఫ్లు, లుంగీలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్లతో నేతన్నలకు మంచి ఉపాధి లభించింది. ఓనం.. ఓ మంచి గిరాకీ సిరిసిల్లలో రెండు వేల మరమగ్గాలపై చీరలు, పంచెలు ఉత్పత్తి అవుతున్నాయి. తమిళనాడుకు అవసరమైన చీరలు, పంచెలను ఉత్పత్తి చేసే శక్తి సిరిసిల్ల నేతన్నలకు ఉంది. దీంతో మరమగ్గాలపై భారీ ఎత్తున చీరలు, పంచెలు ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో తయారైన చీరలు, ధోవతులను కేరళకూ ఎగుమతి చేస్తున్నారు. అక్కడ కూడా ఓనం పండగ సందర్భంగా సిరిసిల్ల చీరలను, పంచెలను వినియోగించేందుకు సామాన్యులు ఇష్టపడడంతో కేరళలోని బహిరంగ మార్కెట్కు సిరిసిల్ల వస్త్రాలు ఎగుమతి అవుతున్నాయి. సిరిసిల్లకు పండగ శోభ.. తమిళనాడులో ఏటా సంక్రాంతి (పొంగల్)కు పేదలకు ప్రభుత్వం వస్త్రాలను అందజేస్తుంది. మహిళలకు చీరలు, పురుషులకు పంచెలు ఇస్తారు. ఐదేళ్లుగా సిరిసిల్లలో ఉత్పత్తి అవుతున్న చీరలు తమిళనాడుకు ఎగుమతి అవుతుండగా.. ఈ ఏడాది మూడు లక్షల చీరలు, మరో మూడు లక్షల పంచెలకు కొత్తగా తమిళనాడు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. దీంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి మెరుగైంది. సిరిసిల్లలో డిసెంబరు 31 వరకు తమిళనాడు చీరలు ఉత్పత్తి కానున్నాయి. పండగకు మూడు నెలల ముందే ఆర్డర్లు రావడంతో మరమగ్గాలపై వేగంగా చీరలు, ధోవతులు, పంచెలను ఉత్పత్తి చేస్తున్నారు. పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తే మీటర్కు రూ.1.80 పైసలు లభిస్తుండగా, అదే చీర ఉత్పత్తి చేస్తే మీటర్కు రూ.4.70 చెల్లిస్తున్నారు. చీర పొడవు 5.50 మీటర్లు ఉండగా.. రూ.25 చెల్లిస్తున్నారు. -
బతుకమ్మ చీరలపై మహిళల అసంతృప్తి
-
బతుకమ్మ చీరల విలువ రూ.200 కోట్లు
పంపిణీపై కలెక్టర్లతో సీఎస్ సమీక్ష సాక్షి, హైదరాబాద్: గ్రామం యూనిట్గా బతుకమ్మ కానుక కింద పేద మహిళలకు చీరలను పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్ తెలిపారు. వీటికోసం రూ.200 కోట్ల వ్యయం కానున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై శనివారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆహార భద్రత కార్డులో నమోదైన 18 ఏళ్లు నిండిన మహిళలందరికీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఫొటో గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 1న నవీకరించిన ఆహార భద్రత కార్డుల జాబితా ప్రకారం పంపిణీ ఉంటుందన్నారు. మున్సిపాలిటీల పరిధిలో మున్సిపల్ కమిషనర్లు , ఇతర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఈ పంపిణీకి బాధ్యత వహిస్తారన్నారు. సెప్టెంబర్ 15కల్లా జిల్లా పాయింట్లకు చీరలను చేరవేస్తారన్నారు. వాటిని గ్రామాల్లోని గోడౌన్లకు 17లోగా పంపాలన్నారు. గ్రామ స్థాయిలో జిల్లా కలెక్టర్లు నియమించిన ప్రభుత్వ ఉద్యోగులు పంపిణీ చేస్తామన్నారు. పంపిణీ పూర్తి పారదర్శకంగా ఉండాలని సూచించారు. కలెక్టర్లు బతుకమ్మ చీరల పంపిణీ ప్రణాళికను వారం రోజుల లోపల రూపొందించాలని ఆదేశించారు. సిబ్బందికి పంపిణీ విషయంలో శిక్షణ కూడా ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో జీహెచ్ఎంసీ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. -
మహిళలకు బతుకమ్మ కానుక
- 1,04,57,610 మందికి చేనేత చీరలు - సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో పంపిణీ - కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ అందజేత - దీనితో చేనేత కార్మికులకు చేయూత - ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన సాక్షి, హైదరాబాద్: బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో ని 18 ఏళ్లు నిండిన పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వనున్నట్లు ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రకటించారు. రాష్ట్రంలోని 1,04,57,610 మందికి సెప్టెంబర్ 18, 19, 20 తేదీలలో ఈ చీరలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడిం చారు. కుల, మతాలకు అతీతంగా పేద మహిళలందరికీ చీరలు పంచనున్నట్లు తెలిపారు. పవర్ లూమ్, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం వారు నేసిన చీరలనే కొనుగోలు చేసి పంపిణీకి సిద్ధం చేస్తున్నామన్నారు. పేద మహిళలందరికీ చీరలందించే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. చీరల పంపిణీ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించా ల్సిందిగా కలెక్టర్లను ఆదేశించారు. బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేసే కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. ‘‘తెలంగాణ ప్రజలంతా కులమతాలకతీతంగా బతుకమ్మ, దసరా పండుగలను జరుపుకుంటారు. బతుకమ్మ రాష్ట్ర పండుగ. తెలంగాణ ప్రజల జీవితాలతో ముడిపడిన పండు గ. కుటుంబ బంధాలకు ఈ పండుగ ప్రతీక. ప్రతీ ఆడపడుచు తన సొంతిం టికి వెళ్లి ఆనందంగా జరుపుకునే వేడుక. ఈ పండుగను ప్రజలంతా మరింత సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో పేద మహిళలందరికీ చీరలను కానుకగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు, క్రిస్మస్ సందర్భంగా క్రై స్తవులకు దుస్తులు పంపిణీ చేశాం. కానీ బతుక మ్మ చీరలను మాత్రం రాష్ట్రంలోని హిం దూ, ముస్లిం, క్రైస్తవులతో పాటు అన్ని కులాలు, అన్ని మతాల పేద మహిళలం దరికీ పంపిణీ చేయాలని నిర్ణయిం చాం’’అని సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా పంపిణీ చేసే చీరల నాణ్యతను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. చీరలను పంపిణీ చేసే విధానంపై అధికారులతో మాట్లాడి షెడ్యూల్ ఖరారు చేశారు. చేనేత కార్మికుల కోసమే ‘‘మరమగ్గాలు, చేనేత మగ్గాలను ఆధారం చేసుకుని బతికే కార్మికుల పరిస్థితి దారుణంగా ఉంది. పనిలేక కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేం దుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అందుకే ఈ చీరలను వారినుంచే కొనుగోలు చేస్తున్నది. దీనివల్ల కార్మికు లకు ఉపాధి దొరుకుతుంది. పనికి హామీ లభిస్తున్నది. బతుకుకు భరోసా ఏర్పడుతున్నది. చీరల పంపిణీ వల్ల మహిళల పండుగ సంబురం రెట్టింపు అవడంతో పాటు నేత కార్మికులు ఉపాధి పొంది సంతృప్తి పడుతున్నారు. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరమగ్గాలను ఆధునీకరించే పని వేగంగా పూర్తి చేస్తున్నాం. నూలు, రసా యనాలను 50 శాతం సబ్సిడీపై అంది స్తున్నం. దీని ద్వారా నేత కార్మికులకు లాభం జరుగుతుంది’’ అని ముఖ్య మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు లేఖ రాయాలని మంత్రి కేటీఆర్ను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో పౌరస రఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శ న్రెడ్డి, ఎండీ సీవీ ఆనంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, హ్యాం డ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డైరెక్టర్ శైలజా రామయ్యర్, తదితరులు పాల్గొన్నారు. చీరల తయారీకి ఆర్డర్ రాష్ట్రంలో కోటీ 4లక్షల పైగా ఉన్న పేద మహిళలకు పంపిణీ చేయడానికి అంతే సంఖ్యలో చీరలు తయా రు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చా రు. ఉత్పత్తి కేంద్రాల నుంచి చీరలు సెప్టెంబర్ 2వ వారంలో జిల్లా కేం ద్రాలకు చేరుకుంటాయి. జిల్లా కేంద్రం నుంచి గ్రామాలకు చీరలను పంపుతారు. రేషన్ షాపుల వారీగా సెప్టెంబర్ 18, 19, 20 తేదీల్లో ప్రత్యే కంగా ఏర్పాటు చేసే కేంద్రాల్లో మహి ళలకు చీరలు పంపిణీ చేస్తారు. సదరు మహి ళ పంపిణీ కేంద్రానికి రాలేని పరిస్థితి ఉంటే ఆమె భర్తకానీ, తల్లి గాని, తండ్రిగానీ తీసుకుపోవచ్చు. ఆధార్ కార్డు గానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ, మరేదైనా ఫోటో గుర్తింపు కానీ చూపించాల్సి ఉంటుంది. -
ముస్లిం మహిళలకు చీరల పంపిణీ
హిందూపురం అర్బన్ : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని శనివారం స్థానిక ఆల్హిలాల్ స్కూల్మైదానంలో వైఎస్సార్సీపీ హిందూపురం సమన్వయకర్త నవీన్నిశ్చల్ పేదముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి పార్టీ ‘ఎ’ బ్లాక్ కన్వీనర్ ఈర్షద్ అహ్మద్ అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా నవీన్నిశ్చల్ మాట్లాడుతూ ఎన్నికల్లో నిలిచిన ప్రతిసారి ముస్లింలు తనపై ప్రేమానురాగాలు చూపిస్తురన్నారు. అందుకు వారిపై అభిమానపాత్రుడుగా ఉంటానన్నారు. ఇదే రీతిలో ఇతర మతాల వారు కూడా ఎంతో ఆదరిస్తున్నారని, కష్టంలో సహాయపడిన వారిని మరిచిపోతే మానవత్వం అనిపించుకోదన్నారు. అనంతరం మతపెద్దలు జమియామసీదు మాజీ ముత్తవల్లిలు కరీం, బాషా మాట్లాడుతూ నవీన్నిశ్చల్ ముస్లింలపై ఎంతో ప్రేమానురాగాలు చూపుతున్నారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధానకార్యదర్శి ప్రశాంత్గౌడ్, కౌన్సిల్ ఫ్లోర్లీడర్ శివ, మహిళ కన్వీనర్ నాగమణి ప్రసంగించారు. అనంతరం ముస్లిం మహిళలంకు చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ముస్లిం మతపెద్దలు, మైనార్టీలు నవీన్నిశ్చల్ను ఘనంగా సన్మానించారు. -
చీరలండోయ్.. బాహుబలి చీరలు
సూరత్: సూరత్లో బాహుబలి–2 చీరలు రూపొందిస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ చీరలను అన్ని మార్కెట్లలో ముఖ్యంగా దక్షిణభారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చేందుకు కృషి చేస్తున్నారు. వస్త్ర నగరమైన సూరత్ మిలెనేనియం టెక్స్టైల్ మార్కెట్లొని శ్రీజీ హొల్ సేల్ శారీస్ వ్యాపారి కమ్లేష్భాయి వినూత్నమైన ఆలొచనతొ బాహుబలీ–2 చిత్రంలోని ఫొటోలతో ఈ చీరలను డిజిటల్ ప్రింటింగ్ చేయించారు. ఇషాన్ డిజిటల్ ప్రిటింగ్ కంపెనీలొని డిజైనర్ హితేష్ ప్రజాపతి రూపొందించిన బాహుబలి డిజైన్లు ఆకర్షనీయమైన రంగుల్లో ఉన్నాయి. ముఖ్యంగా హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క శెట్టిల ఫొటోలతోపాటు పలు సన్నివేశాలతో డిజైన్చేశారు. ఇప్పటి వరకు 20 వేల చీరలను తెలంగాణ, ఆంద్ర«ప్రదేశ్, తమిళనాడు మొదలగు ప్రాంతాల్లోని వివిధ మార్కెట్లకు పంపించామని తొందర్లోనే మార్కెట్లో లభించనున్నట్టు కమలేష్భాయి చెప్పారు.