జైనథ్: 44వ నంబరు జాతీయ రహదారిపై గల మాండగాడ బస్స్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులో పన్నాల భారతి అనే మహిళ మెడలోంచి 3 తులాల గొలుసు చోరీకి యత్నించిన మండలంలోని పిప్పర్వాడకు చెందిన డిడాకర్ శ్యాంసుందర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన పన్నాల భారతి మహారాష్ట్రలోని చిన అర్లి గ్రామానికి వెళ్లి సోమవారం రాత్రి ఆర్టీసీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యింది. మండలంలోని మాండగాడ బస్ స్టాప్ వద్ద బస్సు ఆగడంతో ఆమె వెనక ఉన్న శ్యాంసుందర్ మెడలోంచి మంగళ సూత్రం లాక్కొని పరిగెత్తాడు. గమనించిన తోటి ప్రయాణికులు, స్థానికులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. చైన్ను స్వాధీనం చేసుకొని మంగళవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్టీసీ బస్సులో చైన్ స్నాచింగ్
Published Wed, May 22 2024 3:40 AM
Advertisement
Advertisement
తప్పక చదవండి
- ఔటర్ రింగ్ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి
- హైదరాబాద్లో భారీ వర్షం
- దేశవ్యాప్తంగా మరో 400 శాఖలు: ఎస్బీఐ
- World Cup Semis Race: టీమిండియాకు కూడా ఈజీ కాదు..!
- శంషాబాద్లో మరోసారి చిరుత కలకలం!
- బిగ్ బాస్ షో.. చూడడానికే అసహ్యంగా ఉందన్న మాజీ కంటెస్టెంట్!
- నా అనుమతి లేకుండానే ఆ ఫోటోలు లీక్ చేశారు: కస్తూరి
- పెళ్లి చేసుకున్న విజయ్ మాల్యా కుమారుడు.. ఫోటో వైరల్
- ముగ్గురు పిల్లలను కంటే రుణమాఫీ..! ఎక్కడంటే..
- అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్.. బంగారం వడ్డించారు!
Advertisement