నేడు నేత్ర వైద్యశిబిరం
నిర్మల్చైన్గేట్: హైదరాబాద్కు చెందిన గ్లోబ ల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పెన్షనర్ల సంఘ భవనంలో నేత్ర వైద్యశిబిరం నిర్వహించనున్నట్లు పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంసీ లింగన్న ఓ ప్రకటనలో తెలిపారు. పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్యులు పరీక్షించి అవసరమైనవారికి ఉచి తంగా ఆపరేషన్లు చేయనున్నట్లు తెలిపారు.
నేటి నుంచి కొత్త ఉపాధ్యాయులకు శిక్షణ
నిర్మల్ రూరల్: డీఎస్సీ–2024 ద్వారా నియమితులైన ఉపాధ్యాయులకు శుక్ర, శని, ఆదివారాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు డీఈవో రామారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎస్జీటీ ఉర్దూ మీడియం ఉపాధ్యాయులకు కస్బా హైస్కూల్, ఎస్జీటీ తెలుగు మీడియం ఉపాధ్యాయులకు గాజుల్పేటలోని పంచశీల్ బీఎడ్ కాలేజీలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment