ఏప్రిల్ 1 నుంచి సన్న బియ్యం
నిర్మల్చైన్గేట్: ఏప్రిల్ 1 నుంచి ప్రజలకు సన్న బియ్యం పంపిణీ చేయాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) కిశోర్కుమార్ అధికారులను ఆదేశించారు. రేషన్ దుకాణాలలో సన్నబియ్యం సరఫరా అంశంపై రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి సన్నబియ్యం పంపిణీ చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దొడ్డు బియ్యం పంపిణీ చేయవద్దని స్పష్టం చేశారు. సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలన్నారు. వేసవి నేపథ్యంలో రేషన్ దుకాణాల వద్ద మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రజలుకు ఎండ నుంచి రక్షణ కల్పించేలా తగిన ఏర్పాట్లను చేయాలని సూచించారు. సమావేశంలో సివిల్ సప్లయ్ డీఎం వేణుగోపాల్, డీఎస్వో కిరణ్కుమార్, రేషన్ డీలర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.