
డాక్టర్ చంద్రికకు ఎక్స్లెన్స్ అవార్డు
నిర్మల్టౌన్: రాష్ట్రస్థాయిలో గైనకాలజీ, ఇన్ఫ ర్టిలిటీ విభాగంలో జిల్లా కేంద్రంలోని దేవీబాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు చెందిన డాక్టర్ చంద్రిక అవినాష్కు ఎక్స్లెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును హైదరాబాద్లో మెదక్ ఎంపీ రఘునందన్రావు, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద శనివారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రిక మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. తనను ఆదరిస్తున్న పేషెంట్లకు, హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.