గొంతుకోసి వ్యక్తి దారుణ హత్య! | - | Sakshi
Sakshi News home page

గొంతుకోసి వ్యక్తి దారుణ హత్య!

Published Sat, Jan 6 2024 12:44 AM | Last Updated on Sat, Jan 6 2024 8:29 AM

- - Sakshi

మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు, సయాజీ (ఫైల్‌)

నిజామాబాద్‌: గొంతుకోసి ఓ వ్యక్తిని హతమార్చిన ఘటన నిజామాబాద్‌రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మల్కాపూర్‌ తండా శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంద్రాపూర్‌కు చెందిన గరుధాకర్‌ సయాజి(30) మృతదేహాన్ని శుక్రవారం మల్కాపూర్‌ తండా శివారులోని అడవిలో కనిపించింది. ఘటనా స్థలాన్ని అడిషనల్‌ డీసీపీ పరిశీలించి గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌లతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు చేయించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.

ఇవి చ‌ద‌వండి: భార్యపై దారుణంగా ప్ర‌వ‌ర్తించిన భ‌ర్త‌..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement